ఐకెపి సెంటర్లు మహిళలకు కేటాయించి.

ఐకెపి సెంటర్లు మహిళలకు కేటాయించి కొట్టించడమే నా మహిళల అభివృద్ధి

డి.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో ఉన్న బుర్రకాయల గూడెం ఐకెపి సెంటర్ వద్ద జరిగిన గొడవల్లో మాజీ ఎంపీటీసీ సాగర్ తన అనుచరులు ముగ్గురు మహిళలపై దాడి చేసిన విషయం అందరికీ తెలిసినదే. దాడిలో గాయపడిన ఆకుల రేణుక వాళ్ళ ఇంటికి వెళ్లి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి,మండల అధ్యక్షులు కుర్రి స్వామినాదన్ పరామర్శించడం జరిగింది.
ఈ గొడవకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుని అధికార పార్టీ అండదండలతోని చట్టం అంటే భయం లేకుండా తనపై కేసు ఉన్నదనే విషయం తెలిసి కూడా మహిళలపై విచక్షణ రైతంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార పార్టీ ధాన్యం కల్లాలను మహిళలకు కేటాయించి కొట్టించడమేన మహిళళ అభివృద్ధి అంటే ఇట్టి విషయాన్ని అధికారులు ఇంతవరకు పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగింది మాకు పార్టీలు కాదు ప్రజలే ముఖ్యం కనుక అన్యాయం జరిగిన వారి పక్షాన న్యాయం జరిగేంత వరకు ధర్మసమాజ్ పార్టీ తోడుగా ఉంటుంది ఇప్పటికైనా అధికారులు, అధికారంలో ఉన్న నాయకులు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తగు న్యాయం జరగని ఎడల బాధితులతో కలసి ధర్నా రాస్తారోకల తో న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలియజేయడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే వారికే పార్టీ పదవులు.

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే వారికే పార్టీ పదవులు

గ్రామ స్థాయి నుండి బ్లాక్ స్థాయి వరకు నూతన కమిటీలు

కేసముద్రం నేటిదాత్రి:

కేసముద్రం మండల కేంద్రంలో లక్ష్మీ సాయి గార్డెన్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో సంస్థాగత నిర్మాణం సన్నహక విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ అబ్జర్వర్ పోట్ల నాగేశ్వర్ రావు,టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,అబ్జర్వర్ కూచన రవళి రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా పోట్ల నాగేశ్వర్ రావు,రవళి రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలపడాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని,అర్హులైన నాయకులకు ఖచ్చితంగా పదవులు వస్తాయ అన్నారు.నాయకత్వం అందరికీ అవకాశం ఇస్తుందని,క్షేత్ర స్థాయిలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతును పెంచాలన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించేందుకు మన అందరము కలిసికట్టుగా పని చేయాలి అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి,పిసిసి మెంబర్ దస్రు నాయక్,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,డిసిసి వైస్ ప్రెసిడెంట్ అంబటి మహేందర్ రెడ్డి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న,మాజీ జడ్పీటీసీ కదిరే సురేందర్,పోలేపాక నాగరాజు,మార్కెట్ డైరెక్టర్ ఎండీ ఆయూబ్ ఖాన్,మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫీ ఖాన్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు వెంకన్న,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోలేపెల్లి మహేందర్,కార్యకర్తలు,మండల నాయకులు,జిల్లా నాయకులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version