ఆరోగ్యాన్ని ఎప్పటికప్పు డు పరీక్షించుకోవాలి-ఎస్కే గౌస్.

ఆరోగ్యాన్ని ఎప్పటికప్పు డు పరీక్షించుకోవాలి – ఎస్కే గౌస్

ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం పరుచుకో వాలి

డాక్టర్ షఫీ కార్డియాలోజిస్ట్ ఎండి సర్జన్

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామం ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మెడికవర్ శరత్ ఐవిజన్ సంయుక్తంగా గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన అనంతరం ఎస్కే గౌస్ మాట్లా డుతూ రైతులు శారీరకంగా మానసికంగా అనేక పని ఒత్తిడి వల్ల అనారోగ్యానికి గురైనటు వంటి సందర్భాల్లో ఎన్నో కలు గుతున్నాయి మీరు ఆరోగ్యా న్ని పరిరక్షించడం కొరకై ప్రజ్వల్ రైతు ఉత్పత్తుల సంఘం ఇలాంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాలలో ఏర్పాటుచేసి ఆరోగ్య పరిరక్షణ కొరకై రైతులు ఆరోగ్య పరిరక్షణ కొరకై పాటు పడుతుందని అన్నారు.ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్విని యోగం చేసుకోవాలని సూచిం చారు. బుధవారం రోజు మెడికవర్ శరత్ ఐ విజన్ సహకారంతో గ్రామంలో 135 మందికి పరీక్షించగా ఇందులో 35 మందికి కంటి పరీక్షలు ఉచితంగా చేయునట్లు తెలిపారు అదేవిధంగా ఈసీజీ ద్వారా 45 మంది పరీక్షించు కోవడం జరిగింది.ఇంతటి సహాయ సహకారాలు అందిం చిన మెడికవర్ హాస్పిటల్ శరత్ ఐవిజన్ హాస్పిటల్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో నవయుగ పాలకవర్గ సభ్యులు కర్ర ఆదిరెడ్డి గ్రామ కార్యదర్శి కిరణ్ మెడి కవర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ ఎండి సర్జన్ , డాక్టర్ షఫీ, జనరల్ సర్జన్ డాక్టర్ జిన్నత్ రెడ్డి ,ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుమంత్ ,పియు మేనేజర్ గుడమాల మానస చౌదరి, గ్రామ క్షేత్ర కార్యకర్తలు రవిచంద్ర, పోతు సునీల్,వంశీ , ప్రశాంత్  పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version