ఘనంగా రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీచిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని
అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార ఐటి రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్భాందవుడు యువతకు 18 ఏళ్ళకే ఓటు హక్కును కల్పిస్తూ యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేలా చేసిన సంస్కరణ కర్త రాజీవ్ గాంధీ అని అన్నారు..
భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు, పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకులు, దేశ సౌభ్రాతృత్వం కాపాడటం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయులు, నవ భారత నిర్మాత, భారతరత్న దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ
ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలనాధ్యక్షులు, భారత రత్న, మాజీ ప్రధాని . రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా మహానీయుడికి ఘనంగా నివాళులు ఆర్పిస్తూ,రాజీవ్ గాంధీ ప్రతి పేద వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అని తెలిపారు .
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాయకులు పోలేబోయిన తిరుపతయ్య , మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు మండల నాయకులు ఎర్ర సురేష్ , పోలేబోయిన రుక్నారావు , బరపటి వెంకన్న , జట్ల సత్యం , కరకపల్లి నాగేష్ , దంచనాల రాజేంద్రప్రసాద్ , సుర సంతోష్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..