రైతులకు అనుగుణంగా ధాన్య కొనుగోలు కేంద్రాలు.

రైతులకు అనుగుణంగా ధాన్య కొనుగోలు కేంద్రాలు పనిచేయాలి.

వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి.

నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

ప్రభుత్వ నిబంధన ప్రకారం వడ్ల కొనుగోలను ప్రభుత్వ నిబంధన ప్రకారం కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల యజమానులు వ్యవహరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు బుధవారం మండలంలోని మేడపల్లి, రాంపూర్, ఆసరవెల్లి, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న సభ్యులకు తగు సూచనలు చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాల మేరకు రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి సహకరించాలని అదేవిధంగా ఎలాంటి అవినీతి పాల్పడకుండా రైతు పక్షాన నిలబడి రైతులకు సహకరించాలని కొనుగోలు కేంద్రాల యజమాను లను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఏ కౌసల్య దేవి, తాసిల్దార్ ముప్పు కృష్ణ, అధికారులు, స్థానిక నాయకులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తదితరు లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version