బెట్టింగులకు ఆకర్షితులై యువత మోసపోవద్దు.

బెట్టింగులకు ఆకర్షితులై యువత మోసపోవద్దు

 

****మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్

*****మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బెట్టింగ్స్ కు ఆకర్షతులై డబ్బులు నష్టపోయి జీవితాలను సర్వం నాశనం చేసుకోవద్దని మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు. ఐపిఎల్ క్రికెట్ సీజన్ ప్రారంబమైన నేపథ్యంలో. మండలంలోని యువతకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ. తల్లిదండ్రులు, తమ కష్టార్జితాన్ని కన్న బిడ్డలు, బెట్టింగుల రూపంలో. డబ్బులను దోపిడీ దొంగలపాలు చేసి చివరకు తమ ప్రాణాలను తీసుకుంటున్నారని. పిల్లల్లో ఏదైనా మార్పులు గమనించినట్లయితే తల్లిదండ్రులు, పెద్దలు, వెంటనే తగిన చర్యలు తీసుకొని బెట్టింగులకు పాల్పడకుండా వారి ప్రవర్తనలో మార్పు తేవడానికి ప్రయత్నం చేసి వారిని సరియైన దారిలోకి తేవాలని అన్నారు. బెట్టింగులకు పాల్పడే వారిపైనా ప్రత్యేక నిఘా ఉంచామని బెట్టింగులకు పాల్పడి కోలుకొని విదంగా ఆస్థి నష్టం జరిగి చివరికి ఆత్మహత్య చేసుకుని మీ కుటుంబాలను రోడ్డున పడేయద్దని ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే మాకు సమాచారం ఇవ్వాలని మొగుళ్లపల్లి ఎస్సై బి అశోక్ మండల ప్రజలను కోరారు.

నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా.!

నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సంజయ్ కుమార్

2025 – 26 బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొడిదేల సంజయ్ కుమార్ 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.2025 – 26 సంవత్సరానికి గాను నర్సంపేట కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.ఈ నేపథ్యంలో బార్ అసోసియేషన్ నర్సంపేట 2025 – 26 ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుని ఎన్నికల్లో
ఆర్ లక్ష్మీ నారాయణకు 13 ఓట్లు రాగా కొడిదేల సంజయ్ కుమార్ 22 ఓట్లు వచ్చి 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.అలాగే ఉపాధ్యక్షుని ఎన్నికలో నారగోని రమేష్ కు 15 ఓట్లు రాగా కొంగరీ రాజు 20 ఓట్లు పోలై 5 ఓట్ల తేడాతో ఉపాధ్యక్షునిగా గెలుపొందారు.ప్రధాన కార్యదర్శి ఎన్నికలో దొంతి సాంబయ్యకు11 ఓట్లు రాగా మోటురి రవి 24 ఓట్లతో 13 ఓట్ల భారీ మెజారిటీతో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు.మొత్తం బార్ అసోసియేషన్ లో 39 ఓట్లు ఉండగా 35 మంది ఓట్లు వినియోగించుకున్నారు.ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల్లో నూతన అధ్యక్షుడుగా కోడిదేల సంజయ్ కుమార్, ఉపాధ్యక్షుడుగా కొంగరి రాజు,ప్రధాన కార్యదర్శిగా మోటురి రవి ఎన్నికైనట్లు అదికారులు తెలిపారు.

2025 – 2026 జనరల్ బాడి..

2025 – 2026 జనరల్ బాడి కమిటీలో
అధ్యక్షుడు కొడిడేలా సంజయ్ కుమార్,ఉపాధ్యక్షుడు కొంగరి రాజు,
ప్రధాన కార్యదర్శి మోటురి రవి,
సహాయ కార్యదర్శి కాంసాని అశోక్,
కోశాధికారి దాస్యం రంగనాథస్వామి,
ఈ.సి మెంబర్లుగా బొడ్డుపెల్లి అజయ్,
లావుద్య తిరుమాల్ చౌహాన్,ఎం.ప్రభాకర్,ఎం.ఎం కృష్ణలు ఎన్నిక జరిగినట్లు ఎన్నికల అధికారులు కొమ్ము రమేష్ యాదవ్,పుట్టపాక రవి తెలిపారు.

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక.

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం(టీఆర్పీఎస్ ) మండల కార్యవర్గాన్ని గురువారం మండల కేంద్రంలోని చేనేత సహకార సొసైటీలో ఎన్ను కున్నారు.

మండల అధ్యక్షుడి గా సామలమధుసూదన్ ఇటీవల ఎన్నిక కాగా, గౌరవ అధ్యక్షులుగా వావిలాల వేణుగోపాల్ ప్రసాద్, కందగట్ల ప్రకాష్, ఉపాధ్యక్షులుగా బాసని చంద్రమౌళి, గుర్రం అశోక్, ప్రధాన కార్యదర్శి సామల రవీందర్, కోశాధికా రిగా రంగు శ్రీధర్, సహాయ కార్యదర్శులు బడుగు రవీందర్, బాసని సదాశివుడు, కార్యనిర్వాహకులు బాసని నాగభూషణం, సోషల్ మీడియా ఇంచార్జిలు బడుగు అశోక్, దాసి శ్రావణ్ కుమార్, ముఖ్య సలహాదారులు పల్నాటి జలేందర్, బాసని లక్ష్మీ నారాయణ, బూర ఈశ్వరయ్య, సామల మల్లయ్య, బాసని కుమార స్వామిలు ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు రాష్ట్రనాయకుడు బాసని చంద్ర ప్రకాష్ వెల్లడించారు.

ఈ సందర్భంగా చంద్రప్రకాశ్ పాటు పలువురు నూతన కార్యవ ర్గానికి శుభాకాంక్షలు తెలిపి, గ్రామాలలో సంఘసభ్యత్వా లు చేయించాలని సభ్యత్వ పుస్తకాలను గ్రామ కమిటీలకు అందజేశారు. పద్మశాలి సంఘం సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.

కార్మికుల హక్కులను కొల్లగొడుతున్న కార్పోరేట్ శక్తులు.

కార్మికుల హక్కులను కొల్లగొడుతున్న కార్పోరేట్ శక్తులు

మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం కావాలి

ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు

శ్రీరాంపూర్,(మంచిర్యాల(నేటి ధాత్రి:

 

దేశ వ్యాప్తంగా కార్మిక వర్గానికి హక్కులను లేకుండా కార్పొరేట్ శక్తులు కొల్లగొడుతున్నాయని,కార్మిక చట్టాల సవరణలో భాగంగా బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ వారికి వత్తాసు పలుకుతూ కార్మిక లోకానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు అన్నారు.గురువారం శ్రీరాంపూర్ లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా సివిల్ సప్లై, హమాలి యూనియన్ల సమావేశం లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా విభజించడానికి వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏప్రిల్ 1 నుండి వాటి అమలును నిరసిస్తూ వెంటనే ఆపాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు,ఉపాధ్యక్షులు మిట్టపల్లి పౌలు,సివిల్ సప్లై హమాలీ కార్మికులు పానుగంటి సత్యనారాయణ,తిప్పని సత్తయ్య,పోరాండ్ల సంపత్,నరేష్,రాజన్న, మామిడి చంద్రయ్య  పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగ పరుచుకోవాలి.

రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగ పరుచుకోవాలి

నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:*

 

రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హత గల ప్రతీ ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవాలని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.దుగ్గొండి మండల గిర్నిబావి గ్రామంలో గల జిఆర్బీ ఫంక్షన్ హాల్లో జరిగిన రాజీవ్ యువ వికాస పథకం సమావేశం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు అధ్యక్షతన జరిగింది.

ముఖ్య అతిథిగా నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు.

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ల కార్పొరేషన్ ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కోట్లతో ఈ పథకాన్ని తీసుకురావడం హర్షణీయమని వెల్లడించారు.

మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు,మండల యూత్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ మాట్లాడుతూ దుగ్గొండి మండల యువతీ,యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోడానికి దరకాస్తులు చేసుకోవాల్సిందిగా శ్రీనివాస్ రెడ్డి కోరారు.

GRB function hall

ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధన్జ్యానాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నరసింగరావు ,తాజా మాజీ సర్పంచులు క్లస్టర్ ఇంఛార్జ్ లు ఇంగోలి రాజేశ్వర్ రావు,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఏడేల్లి శ్రీనివాస్ రెడ్డి ,గోగుల ప్రకాశ్ రెడ్డి,నర్సంపేట బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొమ్మినేని భరత్,బ్లాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుకినే నాగరాజు,గ్రామ పార్టీ అధ్యక్షులు పెండ్లి వెంకటేశ్వర్లు,రొట్టె రమేష్,వివిధ గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు పాల్గొన్నారు.

అప్లై చేసుకున్న అర్హులు.

— అప్లై చేసుకున్న అర్హులు
ధ్రువపత్రాల స్వీకారణ

నిజాంపేట:నేటి ధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారు ఫారం ను అందిఇవ్వాలని ఎంపీడీవో రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలంలో గల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువత నూతన అప్లై చేసుకున్న దరఖాస్తు ఫామ్ తో సహా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువీపత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, జిరాక్స్లు కార్యాలయంలో అందివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ నర్సింలు, బాలయ్య, వినయ్ తదితరులు పాల్గొన్నారు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై.!

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పై సమగ్రహ విచారణ చేయాలి.

సీబీఐ విచారణకు డిమాండ్.

తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్.

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:

 

తిరుపతి జీవకోన షెకినా చర్చి నందు తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మాట్లాడుతూ ఆంధ్రా తెలంగాణా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన క్రైస్తవ సువార్తికుడు ప్రవీణ్ పగడాల గత 25 వ తేది తన బైక్ మీద రాజమండ్రి నుండి వెళుతూ దివాన్ చెరువు దగ్గర ప్రమాదం సంభవించి మరణించారన్న సంగతి విన్న క్రైస్తవ సమాజం తీవ్ర నిరాశకు గురియై శోక సంద్రంలో మునిగిపోయారు.

అయినా గొప్ప బైబిల్ పండితుడు. పేదలకు తమ సొంత ఖర్చులుతో సహాయం చేస్తు, అనేక మంది అనాధులకు తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించారు.

అయితే ఆయన మరణించిన విధానం చూడగా అది ప్రమాదం కాదు హత్య జరియుండవచ్చుననని అక్కడ ఆక్సిడెంట్ జరిగిన స్థలాన్ని పరిశీలించగా అనుమానం వ్యక్తమైంది.

క్రైస్తవ సమాజమంతా ఎలుగెత్తి నిరసన చేయగా పోలీసులు శాఖా వారు అనుమానాస్పద మరణముగా కేసు నమోదు చేసుకొని క్రైస్తవ నాయకుల సమక్షంలో పోస్ట్ మార్టం చేసారు.

పోస్ట్ మార్టం అయిన తరువాత ఎస్పీ,హోం మంత్రి, ముఖ్యమంత్రి అనుమానాస్పద మృతిగా పరిగణిస్తూ డిపార్ట్మెంట్ కమిటీ వేసి తీవ్ర విచారణ చేసి న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది.

అయితే తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ డిమాండ్ చేస్తు ఏదో విచారణ మాటలతో పరిమితం కాకుండా నిజం నిగ్గుతేల్చి క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సెక్రటరీ జైపాల్ మాట్లాడుతూ క్రైస్తవ సమాజం మంచి వ్యక్తిని కోల్పోయామని బాధను వ్యక్తం చేసారు.

బీఎస్పీ పార్టీ నాయకులు వెంకట్ ప్రవీణ్ పగడాలా మరణం సందేహాలు ఉన్నాయని సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

ఈ విలేకరుల సమావేశంలో పాస్టర్.సగేయు, అజరయ్య,దిలీప్ కుమార్,పీటర్, పీరారెడ్డి, జెర్నియా, తిమోతి దేవర్ జాన్ తదితరులు పాల్గొన్నారు.

DCRB నలివేల లక్ష్మణ్ ముదిరాజ్’కి ఘన సన్మానం.

డి.సి.ఆర్.బి. నలివేల లక్ష్మణ్ ముదిరాజ్’కి ఘన సన్మానం

నేటిధాత్రి :హన్మకొండ

 

రామగుండం కమిషనరేట్ ఏ.ఎస్సై’గా విధులు నిర్వహించి, బదిలీ’పై ములుగు జిల్లా’ కు నూతనంగా విచ్చేసిన నలివేల లక్ష్మణ్’ ముదిరాజ్’ కు మెపా జిల్లా కార్యాలయానికి ఆహ్వానించి, ముదిరాజ్’ల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని ఇచ్చి, శాలువా’తో ఘనంగా సన్మానించడం చేశారు అనంతరం
మెపా జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి బదిలీ పై ములుగు జిల్లా కు విచ్చేసిన ఉద్యోగులందరని మెపా ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుందని, జాతి బిడ్డలు ఎక్కడ ఉన్నా ఒకరికొకరు మర్యాదపూర్వకంగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం జాతి ఐక్యత’కు నిదర్శనం అని తెలిపారు.
డి.సి.ఆర్.బి. నలివేల లక్ష్మణ్’ముదిరాజ్ మాట్లాడుతూ సన్మానం చేసినా మెపా టీమ్ కి, ముదిరాజ్ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కార్యదర్శి సింగారపు రామకృష్ణ ముదిరాజ్, మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, మెపా జిల్లా గౌరవ అధ్యక్షుడు బండి రాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన హౌసింగ్ పీడీ.

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన హౌసింగ్ పీడీ

నిజాంపేట: నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పనులను మంగళవారం హౌసింగ్ పిడి మాణిక్యం పరిశీలించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించి మాట్లాడారు.. గ్రామంలో క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో రాజిరెడ్డి, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి లు ఉన్నారు.

అస్తవ్యస్తంగా సంగం(కె) ప్రాథమిక పాఠశాల.

అస్తవ్యస్తంగా సంగం(కె) ప్రాథమిక పాఠశాల

◆ శిథిలావస్థలో మరుగుదొడ్లు,
◆ మూత్రశాలలు నిరుపయోగంగా వాటర్ ట్యాంక్ పాఠశాలలో లోపించిన పారిశుధ్యం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఝరా సంగం మండలంలోని సంగం (కె) గ్రామంలో గల ప్రాథ మిక పాఠశాల అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు చేపడుతున్నప్పటికీ ఈ పాఠశాల రూప రేఖలు మార్చలేకపోయాయి. ఈ పాఠశాల ఆవరణలో ఉన్న మరు గుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థలో ఉండటంతో విద్యా ర్థులు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ శిథిలాలతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్న వాటిని తొలగించడం లేదు. అలాగే నీటి సరఫరా కోసం ఏర్పాటు
చేసిన వాటర్ ట్యాంక్ రంధ్రాలు పడి నిరుపయోగంగా మారింది. ఈ పాఠశాల చుట్టూ పూర్తిస్థాయిలో కాంపౌండ్ వాల్ లేనందున పశువులు లోపలికి వచ్చే అవకాశం ఉంది. పాఠశాల భవనానికి అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయాయి. రంగులు వెలిసిపోయి భవనం కళ హీనంగా కనిపిస్తుంది. పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం నెలకొని పారి శుద్ధ్యం లోపించింది. ఈ పాఠశాలలో ఇంకా పలు సమ స్యలు నెలకొనడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యాభివృద్ధికై పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని విద్యార్థినీ, విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.

నిమ్స్ పనులను వేగవంతం చేయాలి.!

నిమ్స్ పనులను వేగవంతం చేయాలి అసెంబ్లీ ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం లో గతం లో ఏర్పడి నిమ్స్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని నేడు అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని కోరిన *గౌరవ శాసనసభ్యులు శ్రీ కోనింటి మాణిక్ రావు ….
గతం లో (2011 వ సంవత్సరం లో ) ఏర్పాటైన నిమ్స్ ప్రాజెక్ట్ లోని కంపెనీలకు సంబంధించి పనులు ప్రారంభించిన ఎటువంటి పనులు ముందుకు సాగడం లేదు అని *కావున ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి , పనులను త్వరగా పూర్తి చేయాలని దీని ద్వారా జహీరాబాద్ నియోజవర్గ ప్రజలకు ఉపాధి కలుగుతుంది అని కోరారు..
అలాగే జహీరాబాద్ నియోజవర్గం లోని బాలికల ఉర్దూ మీడియం కళాశాలలో లెక్చరర్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు అని వెంటనే ప్రభుత్వ లెక్చరర్లు ను నియమించాలని నియోజకవర్గ విద్యార్థినిల భవిషత్తును కాపాడాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు..

హేమాహేమీలు పోటీకి సిద్ధమా.!

హేమాహేమీలు పోటీకి సిద్ధమా!

సర్పంచ్ ఎన్నికల్లో గట్టి పోటీ

శాయంపేట నేటిధాత్రి:

 

రాజకీయ నాయకులు ప్రజాసేవకై ఆసక్తి ఉన్నవారు దృష్టి పంచాయతీ ఎన్నికలపై పడింది కార్యదర్శి పాలన ద్వారా గ్రామ పరిపాలన జరుగుతుంది ప్రజా ప్రతినిధు లకు ఎన్నుకునేందుకు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉంది ఈ విషయంలో గ్రామాల్లో పోటీ చేసేందుకు రాజకీయ నాయకు లు ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు సర్పంచ్ ఈసారి నిలబడడానికి ఆసక్తి ఎక్కు వగా చూపుతున్నారు. ఇంకా ఎవరెవరు నిలబడడానికి ఆసక్తి చెబుతున్నారు తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండల కేంద్రంలో ఇప్పటికే పలువురు పేర్లు వినబడుతున్నాయి. వారిలో ఎవరికీ చాన్స్ లభిస్తుందని సీక్రెట్ గా పలువురు ఆశావాహులు సర్వే చేసుకుంటున్నారు. మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ప్రజల్లో తన పట్ల ఏ విధంగా ఉందో సర్వేలు చేసుకుని, తన పట్ల అభిప్రాయం ఏ విధంగా ఏవిధంగా ఉందో తెలుసుకుం టున్నారు. పైగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని నమ్మకంతో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఖర్చు అయితే పర్వాలేదు కానీ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం భారీ మెజార్టీతో గెలువాలని రాజకీయ నాయకులు చూస్తున్నారు ఇంకొందరు అయితే ఏమాయమీలు సైతం ఏమాత్రం భయపడకుండా ముందుకు కదులుతున్నారు ఇప్పటికే కొందరు గ్రామాల్లో మంచి పేరు కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నారు

గట్టి పోటీ తప్పదా!
ఇదివరకు ఎన్నడి లేని విధంగా ప్రతి ఒక్కరు పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ,బిజెపి పార్టీలకు తలనొప్పి తప్పదన్న భావన ఆయా పార్టీల నేతల్లో వ్యక్తం అవుతుంది పార్టీలకు అతీతం గా జరిగే ఎన్నికలు ఎప్పుడైనా పరోక్షంగా మద్దతు ఎవరికి ఉంటుందోనన్న టెన్షన్ మాత్రం ఆయా పార్టీల నేతల్లో నెలకొంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాదులు సంఖ్య ఎక్కువగా ఉండటం ఈసారి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థులకు నిలబెట్టడంలో పార్టీ అనుకున్నది ఆ పార్టీ నుంచి పోటీ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది ఇప్పటికి పలువురు ఆశావా దులు ఆయా పార్టీల పెద్దలను కలుస్తూ తమ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పార్టీ మద్దతు తన వారికి వచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు అధిష్టానం పెద్దల సైతం ఎవరు వచ్చినా కాదనకుండా అందరికీ అభయమిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులపై చాలా నుంచి పోటీకి సిద్ధమవు తున్నారు రాజకీయంలో ఉంటే ఏదైనా సాధించవచ్చునున్న నమ్మకంతో కొందరు డబ్బు సంపాదనతో పాటు పరపతి పెరుగుతుందని మరికొందరు బ్రహ్మ పడుతున్నారు వ్యవస్థను ఎంతో కొంత మార్చడం కోసమైనా రాజకీయం అవసరమైన ఉద్దేశంతో పలువురు సర్పంచులు నిలబడుతు న్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ నిబంధన ఎత్తివేత

సర్పంచ్ గా పోటీచేసే ఆశా వాహులకు శుభవార్త

స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ముగ్గురు బిడ్డలు ఉంటే అనర్హులు అవుతారని ప్రధానమైన నిబంధన ఉండేది కానీ సర్పంచ్ గా పోటీ చేసే ఆశావాహులకు నుంచి వినతులు పెద్ద ఎత్తున రావడంతో ఈ నిబంధనకు రేవంత్ అధ్యక్షన జరిగిన కేబినెట్ భేటీలో వెసులుబాటు కల్పించారు ఈ మేరకు సర్పంచ్ గా పోటీ చేయాలను కునే ఆశావాహులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిసిందే ఇదివరకు సర్పంచ్ పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు ఎక్కువగా ఉండకూడదని నిబంధన ఉండేది కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ నిబంధనను తొలగిస్తూ ముగ్గురు లేదా ఆపై ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అర్హులు అవుతారని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముగ్గురు పిల్లలు ఉండే సర్పంచ్ గా పోటీ చేయడానికి రేవంత్ ప్రభుత్వం ఊరట కల్పించింది.

పాదయాత్రను విజయవంతం చేయాలి.

పాదయాత్రను విజయవంతం చేయాలి

గంగాధర ప్రజా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం

గంగాధర నేటిధాత్రి :

 

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలనలో ప్రశ్నార్థకంగా మారిన రాజ్యాంగ పరిరక్షణ కోసం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ అన్నారు. గురువారం గంగాధర లోని కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా ఏడాది కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోని ప్రతి గడపను తడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లో ఏప్రిల్ నెల మొదటి వారంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొంటారని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాలు ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళ, ఎస్టి, యూత్ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, రామిడి రాజిరెడ్డి,సత్తు కనుకయ్య, కొల్లిపాక స్వామి, దోర్నాల శ్రీనివాసరెడ్డి, వేముల భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దికొండ మధు, పెంచాల చందు, గరికంటి కరుణాకర్, బొడ్డు మహేష్, ముచ్చ శంకరయ్య, దూలం వీరేశం గౌడ్, నాయకులు తాళ్ళ శ్రీనివాస్, రాచమల్ల భాస్కర్, గుజ్జుల బాపురెడ్డి, రేండ్ల శ్రీనివాస్, చిప్ప చక్రపాణి, గంగాధర సుదర్శన్, పోత్తూరి ప్రభాకర్, అంజయ్య, వేముల అంజి, ముద్దం నగేష్, ఆనంద్, సాయి గౌడ్, రాజేశం, మ్యాక వినోద్,కరిం, మంత్రి మహేందర్ ,కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఆస్తి పన్ను వడ్డీ పై తొంభై శాతం రాయితీ.

ఆస్తి పన్ను వడ్డీ పై తొంభై శాతం రాయితీ…

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోనీ ఇండ్లపై, ఇంటి స్థలాల పై ఆస్థి పన్ను బకాయి ఉన్నట్లేతే ఈ నెల 31 లోపున చెల్లిస్తే వడ్డీపై 90% రాయితీని పొందుతారని మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయి ఉన్నవాళ్లకి గత సంవత్సరపు పెండింగ్ ఆస్తి పన్ను, ప్రస్తుత ఆస్థీ పన్ను ను ఈనెల 31 లోపు చెల్లించినట్లయితే వడ్డీ పై 90% రాయితీని కల్పించిందని , ఓటిఎస్ స్కీం ద్వార ఆస్తీ పన్ను బకాయి చెల్లించవచ్చని కమీషనర్ తెలిపారు.

ఆస్తి పన్ను బకాయి ఉంటే 2019 తెలంగాణ పురపాలక చట్టం లోని సెక్షన్ 87 ప్రకారం ఆస్తులను జప్తు చేసేందుకు వీలుంటుందని తెలిపారు. పుర ప్రజలందరూ గమనించి ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లయితే వెంటనే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

మావోయిస్టు నేత సుధాకర్‌ కు ఘన నివాళులు.

మావోయిస్టు నేత సుధాకర్‌ కు ఘన నివాళులు
మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర జేబీజేబీజేఎస్‌ కో ఆర్డినేటర్‌ మాజీ పీసీసీ జనరల్‌ సెక్రటరీ నమిండ్ల శ్రీనివాస్‌

కాజిపేట(వరంగల్‌ జిల్లా),నేటిధాత్రి:

కాజిపేట్‌ మండల్‌ లోని తరాల లపెల్లి గ్రామం చెందిన అంకేశ్వరపు సారయ్య అలియాస్‌ సుదీర్‌ అసువులు బాసారు. గురువారం ఉదయం తరాలపల్లి లోని సారన్నా స్వగ్రమం తరాల పల్లి కీ అయన భాతిక కాయం చేరుకున్నది.

Secretary N Srinivas

తరాలపల్లి చేరుకొని సారన్నా భాతిక కాయం కు పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన నమిండ్ల శ్రీనివాస్‌ , మాజీ కార్పొరేటర్‌ తోట్ల రాజు యాదవ్‌. మాజీ సర్పంచ్‌ పుల్యాల యాదవ్‌ రెడ్డి . గ్రామ పార్టీ అధ్యక్షులు బషీర్‌ . వేల్పుగొండ చంద్రుడు ఎర్ర గణేష్‌ కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకుడు దుబ్బాక మోహన్‌ గౌడ్‌ డేవిడ్‌ జవాజి రమేష్‌ మనుపటి రాజు. ఇల్లందుల సంతోష్‌. రిపీక వినయ్‌.పోలేపక వినయ్‌.

ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి.

ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి

సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా

పాలకుర్తి నేటిధాత్రి

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం లో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని స్థానిక తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 16 నెలలు గడిచినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, కొత్త పెన్షన్లు, ఇండ్లు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడం వల్ల ఒకే కుటుంబంలో ముగ్గురు కాపురాలు చేసే పరిస్థితి ఏర్పడిందని వారన్నారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక సమస్యలైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ, వేసవికాలంలో త్రాగునీటి ఇబ్బంది ఏర్పడిందని రైతుల వరి పొలాలు ఎండిపోయాయని ఎండిన పంట పొలాలకు ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలన్నారు. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేసి రైతుల పంట పొలాలకు నీరు అందించాలని, లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు సోమసత్యం, మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, బెల్లి సంపత్, మూస్కు ఇంద్రారెడ్డి, నాయకులు నక్క రమేష్, వేల్పుల కొమురయ్య, సోమ నరసయ్య, ఒగ్గుల కొమురయ్య, ఎల్లయ్య, చెరి పెళ్లి కొమురయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు..

*తిరుపతిలో ఘనంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు..

 

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:

 

గురువారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో రుయా హాస్పిటల్ వద్ద మెగా అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు విచ్చేసి.మెగా అభిమానులతో కలిసి పేదలకు భోజన వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు. తండ్రికి, బాబాయికి తగ్గ తనయుడు రామ్ చరణ్ అని కొనియాడారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో.. నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, పగడాల మురళి, కిషోర్, సాయి, సుమన్ బాబు, రాజమోహన్, హేమకుమార్, రాజేష్ ఆచారి, సాయిదేవ్, రమేష్, సుధా, హేమంత్, వెంకటేష్, జానకిరామ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రావణ్, ముఖేష్, మరియు మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలి.

*స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలి.
వివక్ష వీడాలి:

*టీటీడీ పరిపాలన భవనం ముందు స్విమ్స్ కార్మికుల భారీ ధర్నాలో కందారపు మురళి డిమాండ్..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:

 

 

స్విమ్స్ కార్మికుల కు వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కారం చేయాలని బుధవారం ఉదయం స్విమ్స్ ఆసుపత్రి నుండి కార్మికులు ప్రదర్శనగా టీటీడీ పరిపాలన భవనం వద్దకు చేరుకుని అక్కడ మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు.

ధర్నా అనంతరం టీటీడీ జేఈవో వీర బ్రహ్మం కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా ధర్నా ను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ స్విమ్స్ ఆస్పత్రి ఏర్పడినప్పటి నుండి నేటి వరకు పనిచేస్తున్న కార్మికుల కు వేతనాలు పెంచటం లేదని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా, కార్మికుల జీవితాలు వారి తలరాతలు మాత్రం మారడం లేదని అన్నారు.

గతంలో స్విమ్స్ ఏర్పడినప్పుడు ఉద్యోగాల్లో వార్డు బాయులుగా చేరిన వీరిని శానిటేషన్ కార్మికులుగా పేరు మార్చడం వల్ల వీరికి శాపంగా మారిందని అధికారులు చేసిన తప్పులకు కార్మికులు బలవుతున్నారని అన్నారు.

పని భారం నుండి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని కార్మికులతో అన్ని పనులు చేయించడo, ఊడవటం మొదలు ఆపరేషన్ థియేటర్ ల్లో అన్ని పనులు వరకు వీరి దగ్గరే చేయిస్తూ తీవ్ర పనిభారం మోపుతున్నారని నిర్దిష్టమైన పనిని కేటాయించడం లేదని వీరికి నిర్దిష్టమైన పనిని కేటాయించాలని డిమాండ్ చేశారు.

గతంలో మూడుసార్లు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహించినాస్వయంగా డైరెక్టర్ చర్చల్లో పాల్గొని సమస్యలపై హామీ ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, టీటీడీ స్విమ్స్ సమన్వయంతో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు.

సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం,సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ స్విమ్స్ గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు టీటీడీలోకి విలీనం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని, వేతనాలు పెరుగుతాయని కార్మికులందరూ ఆశపడ్డారని దానికి భిన్నంగా ప్రభుత్వం నుండి టీటీడీలోకి విలీనం చేసిన తరువాత పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా వీరి పరిస్థితి అయిందని అన్నారు.

టీటీడీ స్విమ్స్ పై స్విమ్స్ టీటీడీ పై ఒకరి ఒకరు దాట వేసుకుంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని పరిష్కారం చేయడం లేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక శాఖకు, టీటీడీ ఈవో కు లేఖలు పంపినా పరిష్కారం కాలేదని టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, ఎప్పటికైనా టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పట్ల సానుకూలంగా వ్యవహరించి పరిష్కారం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు.

సానుకూలంగా స్పందించిన జేఈవో వెంటనే ఈ సమస్యల పట్ల చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిమ్స్ కార్మికుల యూనియన్ కార్యదర్శి రవి అధ్యక్షులు సూరి కోశాధికారి మారి ముత్తు నాయకులు గోపి వేలు వెంకటేష్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

రంజాన్ తోఫా పంపిణీ చేసిన సతీష్.

రంజాన్ తోఫా పంపిణీ చేసిన సతీష్

సిపిఐ 25వ వార్డు ఇంచార్జ్ క్యాతరాజు సతీష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని రంజాన్ పర్వదినసందర్భంగా కారల్ మార్క్స్ కాలనీలో 25వ వార్డులో ముస్లిం సోదరులకు సిపిఐ 25వ వార్డ్ ఇంచార్జ్ క్యాతరాజు సతీష్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా (పండుగ సామాను) అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ముస్లింల అత్యంత ప్రసిద్ధమైన పండుగ రంజాన్ అని ఈ రంజాన్ సందర్భంగా నెల అంతా ఉపవాసాలు ఉండి పవిత్రంగా దేవుని ఆరాధించే గొప్పనైన పండుగని కొనియాడారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు రంజాన్ రోజున హిందువులందరిని పిలిచి పండుగ చేసుకుంటారని హిందువులు ముస్లింలు ఐక్యమత్యంగా కలిసి ఉండడానికి ఈ పండుగ ఒక ప్రతిక అని అన్నారు కార్మాస్ కాలనీలో 25 వ వార్డ్ లో దాదాపు 20 కుటుంబాలకు 450 విలువైన సామాగ్రిని అందివ్వడం జరిగిందన్నారు కాలనీలో ఉండే ముస్లింలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారన్నారు
భారత కమ్యూనిస్టు పార్టీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందుంటుందని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ 25వ వార్డు సహాయ కార్యదర్శి యాకుబ్ పాషా, సాబీర్ భాష, కసరబోయిన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

తిరుపతి పార్లమెంటు రహదారి సమస్యలకి.

*తిరుపతి పార్లమెంటు రహదారి సమస్యలకి పరిష్కారం చూపండి..

*కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తిరుపతి ఎంపీ గురుమూర్తి బేటీ..

*త్వరలోనే తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభం..

*కేంద్ర మంత్రి
గడ్కరీ హామీ..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:

 

తిరుపతి పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారులకు సంబందించిన సమస్యలు, ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖా మాత్యులు నితిన్ గడ్కరీతో బేటీ అయ్యారు.

ఈ సందర్బంగా నాయుడుపేట, తూర్పు కనుపూరు జాతీయ రహదారి -71లో ప్యాకేజ్ 4, వరగలి క్రాస్, తూర్పు కనుపూరు జాతీయ రహదారి-516 డబ్ల్యూ ప్యాకేజ్ 2లో సర్వీస్ రోడ్లు, వెహికల్ అండర్ పాస్ లు మంజూరు చేసి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీ కోరారు.

ఈ రహదారుల్లో రూపొందించిన అండర్ పాస్ ల డిజైన్ కారణంగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

రైతుల పొలాలలో రహదారులు నిర్మిస్తున్నందున వారికి కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని మంత్రిని కోరారు.

రైతులు ప్రదానంగా రహదారికి ఒక వైపు నుంచి మరో వైపుకు తమ వ్యవసాయ ఉత్పత్తులను తరలిచేందుకు, వ్యవసాయ సామగ్రిని తీసుకెళ్లేందుకు అనువుగా సర్వీస్ రోడ్లు, వెహికల్ అండర్ పాస్ లు అవసరం అని ఆయనకి వివరించారు.

ఆయా ప్రాంతాలలో రైతులు చేపట్టిన ఆంధోళన కార్యక్రమాల విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సర్వీసు రోడ్లు, అండర్ పాస్ లు కావాలని రైతులు అందించిన వినతి పత్రాలతోపాటుగా సమగ్రమైన వివరాలను ఆయనకు అందజేశారు.

ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ ఈ రహదారులకు సంబందించి మరోసారి పరిశీలన చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అదికారులను ఆదేశించారు.

తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరగా డిజైన్ లలో స్వల్ప మార్పుల కారణంగా ఆలస్యమైనదని త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చారని ఎంపీ తెలియజేశారు.

రేణిగుంట, నాయుడుపేట మధ్య జాతీయ రహదారిపై నుండి సర్వీసు రోడ్లకు ప్రవేశం లేదని, ప్రస్తుత డిజైన్ స్థానిక ప్రజలకు అసౌకర్యంగా ఉందని ఆయనకి వివరించారు.

అలాగే ఈ రహదారిపై శ్రీకాళహస్తి నుండి ముచ్చువోలు, వెంకటగిరిల రోడ్డును కలిపేందుకు యాక్సెస్ రోడ్డు, చావలి నుండి గుర్రపుతోట జంక్షన్ వరకు సర్వీస్ రోడ్డు విస్తరణ, చిల్లకూరు నుండి గుర్రపుతోట వరకు సర్వీస్ రోడ్డు విస్తరణ చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని అభ్యర్దించారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version