హేమాహేమీలు పోటీకి సిద్ధమా.!

హేమాహేమీలు పోటీకి సిద్ధమా!

సర్పంచ్ ఎన్నికల్లో గట్టి పోటీ

శాయంపేట నేటిధాత్రి:

 

రాజకీయ నాయకులు ప్రజాసేవకై ఆసక్తి ఉన్నవారు దృష్టి పంచాయతీ ఎన్నికలపై పడింది కార్యదర్శి పాలన ద్వారా గ్రామ పరిపాలన జరుగుతుంది ప్రజా ప్రతినిధు లకు ఎన్నుకునేందుకు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉంది ఈ విషయంలో గ్రామాల్లో పోటీ చేసేందుకు రాజకీయ నాయకు లు ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు సర్పంచ్ ఈసారి నిలబడడానికి ఆసక్తి ఎక్కు వగా చూపుతున్నారు. ఇంకా ఎవరెవరు నిలబడడానికి ఆసక్తి చెబుతున్నారు తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండల కేంద్రంలో ఇప్పటికే పలువురు పేర్లు వినబడుతున్నాయి. వారిలో ఎవరికీ చాన్స్ లభిస్తుందని సీక్రెట్ గా పలువురు ఆశావాహులు సర్వే చేసుకుంటున్నారు. మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ప్రజల్లో తన పట్ల ఏ విధంగా ఉందో సర్వేలు చేసుకుని, తన పట్ల అభిప్రాయం ఏ విధంగా ఏవిధంగా ఉందో తెలుసుకుం టున్నారు. పైగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని నమ్మకంతో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఖర్చు అయితే పర్వాలేదు కానీ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం భారీ మెజార్టీతో గెలువాలని రాజకీయ నాయకులు చూస్తున్నారు ఇంకొందరు అయితే ఏమాయమీలు సైతం ఏమాత్రం భయపడకుండా ముందుకు కదులుతున్నారు ఇప్పటికే కొందరు గ్రామాల్లో మంచి పేరు కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నారు

గట్టి పోటీ తప్పదా!
ఇదివరకు ఎన్నడి లేని విధంగా ప్రతి ఒక్కరు పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ,బిజెపి పార్టీలకు తలనొప్పి తప్పదన్న భావన ఆయా పార్టీల నేతల్లో వ్యక్తం అవుతుంది పార్టీలకు అతీతం గా జరిగే ఎన్నికలు ఎప్పుడైనా పరోక్షంగా మద్దతు ఎవరికి ఉంటుందోనన్న టెన్షన్ మాత్రం ఆయా పార్టీల నేతల్లో నెలకొంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాదులు సంఖ్య ఎక్కువగా ఉండటం ఈసారి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థులకు నిలబెట్టడంలో పార్టీ అనుకున్నది ఆ పార్టీ నుంచి పోటీ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది ఇప్పటికి పలువురు ఆశావా దులు ఆయా పార్టీల పెద్దలను కలుస్తూ తమ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పార్టీ మద్దతు తన వారికి వచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు అధిష్టానం పెద్దల సైతం ఎవరు వచ్చినా కాదనకుండా అందరికీ అభయమిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులపై చాలా నుంచి పోటీకి సిద్ధమవు తున్నారు రాజకీయంలో ఉంటే ఏదైనా సాధించవచ్చునున్న నమ్మకంతో కొందరు డబ్బు సంపాదనతో పాటు పరపతి పెరుగుతుందని మరికొందరు బ్రహ్మ పడుతున్నారు వ్యవస్థను ఎంతో కొంత మార్చడం కోసమైనా రాజకీయం అవసరమైన ఉద్దేశంతో పలువురు సర్పంచులు నిలబడుతు న్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ నిబంధన ఎత్తివేత

సర్పంచ్ గా పోటీచేసే ఆశా వాహులకు శుభవార్త

స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ముగ్గురు బిడ్డలు ఉంటే అనర్హులు అవుతారని ప్రధానమైన నిబంధన ఉండేది కానీ సర్పంచ్ గా పోటీ చేసే ఆశావాహులకు నుంచి వినతులు పెద్ద ఎత్తున రావడంతో ఈ నిబంధనకు రేవంత్ అధ్యక్షన జరిగిన కేబినెట్ భేటీలో వెసులుబాటు కల్పించారు ఈ మేరకు సర్పంచ్ గా పోటీ చేయాలను కునే ఆశావాహులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిసిందే ఇదివరకు సర్పంచ్ పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు ఎక్కువగా ఉండకూడదని నిబంధన ఉండేది కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ నిబంధనను తొలగిస్తూ ముగ్గురు లేదా ఆపై ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అర్హులు అవుతారని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముగ్గురు పిల్లలు ఉండే సర్పంచ్ గా పోటీ చేయడానికి రేవంత్ ప్రభుత్వం ఊరట కల్పించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version