ఆస్తి పన్ను వడ్డీ పై తొంభై శాతం రాయితీ…
మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోనీ ఇండ్లపై, ఇంటి స్థలాల పై ఆస్థి పన్ను బకాయి ఉన్నట్లేతే ఈ నెల 31 లోపున చెల్లిస్తే వడ్డీపై 90% రాయితీని పొందుతారని మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయి ఉన్నవాళ్లకి గత సంవత్సరపు పెండింగ్ ఆస్తి పన్ను, ప్రస్తుత ఆస్థీ పన్ను ను ఈనెల 31 లోపు చెల్లించినట్లయితే వడ్డీ పై 90% రాయితీని కల్పించిందని , ఓటిఎస్ స్కీం ద్వార ఆస్తీ పన్ను బకాయి చెల్లించవచ్చని కమీషనర్ తెలిపారు.
ఆస్తి పన్ను బకాయి ఉంటే 2019 తెలంగాణ పురపాలక చట్టం లోని సెక్షన్ 87 ప్రకారం ఆస్తులను జప్తు చేసేందుకు వీలుంటుందని తెలిపారు. పుర ప్రజలందరూ గమనించి ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లయితే వెంటనే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.