యువ జ్యోతి ఆధ్వర్యంలో టీబి వరల్డ్ డే కార్యక్రమం,,,,
టిబి వ్యాధి రాకుండా నివారణ కు వివరించిన హెల్త్ ఆఫీసర్ భరత్ కుమార్,,,,
సిద్దిపేట ఎన్వైకే సహకారంతో విజయవంతంగా కార్యక్రమం,,,,
రామాయంపేట మార్చి 24 నేటి ధాత్రి (మెదక్)
ప్రపంచంలో టీ బి వ్యాధితో అనేకమంది గతం లో మరణించడం జరిగిందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ప్రత్యేకమైన వ్యాక్సిన్ తయారుచేసి మందులతో టీబీ వ్యాధిని చాలా వరకు నివారించడం జరిగిందని రామాయంపేట మండల పి హెచ్ ఎస్ హెల్త్ ఆఫీసర్ భరత్ అన్నారు అయినా కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కరోనా లాంటి వ్యాధులు రావడానికి టీబిలాంటి వ్యాధులు ఉండడం కూడా ప్రాణాంతక వ్యాధులకు గురవుతారని అన్నారు ముఖ్యంగా తంబాకు పొగాకు సిగరెట్టు గుట్కా పాన్ మసాలా లాంటి వాటితోనే కాకుండా దుమ్ముదులి వాతావరణ కాలుష్యంలో జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల ఈ వ్యాధి ఒకరు నుండి మరొకరికి సోగుతుందని అందుకే
TB disease
ఈ వ్యాధిని పూర్తిగా నివారించిన తగు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులకు ధూమపానం పాన్ మసాలా గుట్కా లాంటి వాడుకున్న నివారించుకోవాలని ఇతవు ఈ పలికారు ఈ కార్యక్రమంలో యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ కోఆర్డినేటర్ సత్యనారాయణ హాస్టల్ మరియు పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సిద్దిపేట వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సత్యనారాయణ తెలిపారు
మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి బీజేపీ మత చాందసవాద రాజకీయాలను మానుకోవాలి…ఏఏం సి చైర్మన్ నరుకుడు వెంకటయ్య `మతం అంటే నమ్మకం విశ్వాసం… మతం అంటే రాజకీయం కాదు బీజేపీ నాయకులు గుర్తేరుగాలి `బతుకమ్మ పట్టుకున్నాడు బోనాల పండుగలలో బోనమెత్తిన నాయకుడు మా ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు `అన్ని మతాచారాలను, మత విశ్వాసాలు గౌరవించే నాయకుడు ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు `మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే కుటిల బుద్ది బీజేపీ నాయకులు మానుకోవాలి `జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేది కాంగ్రెస్ పార్టీ నిధానం `లౌకిక వాదం, బావసారుప్యత కాంగ్రెస్ పార్టీ విధానం : కాంగ్రెస్ నాయకులు
వర్ధన్నపేట,నేటిధాత్రి:
నియోజక వర్గ కేంద్రములో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏద్దు సత్యం,వర్ధన్నపేట ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ , కోతపెల్లి గ్రామ మాజీ సర్పంచ్ కమ్మాగొని ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోషాల వెంకన్న గౌడ్ లు విలేఖర్లతో మాట్లాడుతూ.గతములో వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజు గుళ్ళు కడితే బిచ్చా గాల్లు అవుతారు, బడులు కడితే విద్యావంతులు అవుతారని మాట్లాడిన మాటలను బీజేపీ నాయకులు వక్రీకరించి రాజకీయ రంగును పులుముతున్నారు మన శాసన సభ్యులు కేఆర్ నాగరాజు డా: బీ అర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా అంబేద్కర్ హైడాలోజిలో మాట్లాడడం జరగింది.కేఆర్ నాగరాజు మాట్లాడిన మాటలు డా: అంబేద్కర్ చెప్పినవే . ఓ. ఏస్.నేడు ఈ దేశములో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలు స్వేచ్చా గా జీవిస్తూ ఐఏఎస్,ఐపీఎస్,డాక్టర్లు,లాయర్లు,ఇంజనీర్లు, పొలిటీషియన్లు అయ్యారు అవుతున్నారాంటె, డా:బీ.అర్ అంబేద్కర్ చలవే. మి లాగా నిత్యం మతం ,బజనలు చేసుకుంటూ పోతే మా వర్గాలు ఈ దేశములో జీవించే స్థానమే లేదు. ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ని జవహర్ లాల్ నెహ్రూ క్యాబినెట్లో న్యాయ శాఖ మంత్రి నీ చేసి గౌర వించింది . మి లాగా (బీజేపీ) గుళ్ళు, గోపురాలు, బజనలు,కీర్తనలు నమ్ముకుంటు,చేసుకుంటూ పోతే ఎస్సీ, ఎస్టీ లు వంద సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా మో,నేటి వరకు అలానే ఉండే వాళ్ళము. నేడు ఈ దేశములో బీజేపీ పార్టీ మతం పేరుతో రాజకీయం చేయకుండా ,లౌకిక ప్రజాస్వామ్య లోకి రాండి.135 సంవత్సరాల నుండి మొదులుకొని నేటి వరకు ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ,నిమ్న ,అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తూ వస్తుంది.నేడు కూడా కాంగ్రెస్ పార్టీ జై బాపు,జై బిమ్,జై సంవిధాన్ నినాదంతో బ్రహ్మ నడంగ ముందుకు వెళుతున్నా ము.భవిష్యత్ ఎన్నికలలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలుస్తోంది. గురువింద గింజ లాగా మాటలు మాట్లాడి మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.
రామాయంపేట మండల వ్యాప్తంగా వెలుగు సిఏ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు ప్రాజెక్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిఏలు మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నేపథ్యంలో తెల్లవారుజామునుండే సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సీఏలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమని సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సమస్యల కోసం పోరాటం చేస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు
రామాయంపేట మండల వ్యాప్తంగా వెలుగు సిఏ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు ప్రాజెక్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిఏలు మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నేపథ్యంలో తెల్లవారుజామునుండే సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సీఏలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమని సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సమస్యల కోసం పోరాటం చేస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు
వేలం పాటలో అంగడిని దక్కించుకున్న మాజీ సర్పంచ్ బట్టు శ్రీను
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
మంగళవారం కేసముద్రం మున్సిపాలిటీ నందు అంగడి( సంత) బహిరంగ వేలం పాట పురపాలక సంఘ కార్యాలయం నందు కేసముద్రం మున్సిపల్ కమిషనర్ కె, ప్రసన్న రాణి ఆదేశాల మేరకు ఆర్ ఓ, ఎల్. కుమార్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం నందు వేలం పాట నిర్వహించడం జరిగింది.ఇట్టి వేలం పాటలో 6గురు పాటదారులు పాల్గొనగా వేలం పాటలో అత్యధిక రేటు పాడిన కేసముద్రం మాజీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్, రూ :21,15,000/-లకు దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సింగని. ప్రభాకర్, బిల్ కలెక్టర్లు రాము, సంతోష్ సిబ్బంది పాలుగోన్నారు.
ముప్పిరెడ్డిపల్లి లో విజయవంతమైన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం…
300 మందికి పైగా రోగులకు పరీక్షలు….
రామయంపేట మార్చి 25 నేటి ధాత్రి (మెదక్)
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ, వి ఎస్ టి ఇండస్ట్రీస్ తూప్రాన్ వారి సహకారంతో… మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోనీ గ్రామ పంచాయతీ భవనంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ ఉచిత ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.. తూప్రాన్ వి ఎస్ టి సీనియర్ మేనేజర్ కిషోర్ కుమార్, కంపెనీ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపికృష్ణ ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులతో కలిసి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం తాము రెడ్ క్రాస్ సంస్థతో కలిసి కంపెనీ పరంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామనీ వారు తెలియజేశారు..
Medical health camp
గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.. రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్య శిబిరంలను నిర్వహిస్తూ పేదలకు సేవలు అందించడం పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన ప్రత్యేక వైద్య బృందం గ్రామానికి చేరుకొని ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించింది.. అంతేకాకుండా రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్య బృందంలో ఐశ్వర్యా రెడ్డి, రోనిత్ రెడ్డి, డాక్టర్ తేజస్వారి, కే అమూల్య రెడ్డి, శ్రేయ సింగ్,రమాదేవి, షాదిన్ మహాదీన్, లిఖిత, సుమానియాతో పాటు పనులు డాక్టర్లు ఉన్నారు. ఈ వైద్య పరీక్షల్లో సుమారు 300 వందల మందికి పైగా రోగులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దంత పరీక్షలు, నరాలకు సంబంధించిన కీళ్ల నొప్పులు, దగ్గు ,దమ్ము రోగులను డాక్టర్ల బృందం పరిశీలించిoది.. ఈ కార్యక్రమం లో మనోహరాబాద్ ఎంపీడీవో కృష్ణమూర్తి,మెదక్ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర సభ్యులు సింగం శ్రీనివాసరావు, కార్యదర్శి టి.సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, కోశాధికారి డి.జి.శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పి.దామోదర్ రావు,దేమేయాదగిరి, మద్దెల సత్యనారాయణ, మద్దెల రమేష్, వంగరి కైలాసం,సభ్యులు తోట శ్రీనివాస్ గుప్తా,వి. సతీష్ రావు తో పాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.
ప్రమాదంలో గాయపడిన ఎస్టిపిపి కాంట్రాక్టు కార్మికుడికి చేయూత
ఈడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో 66 వేల చెక్కు అందజేత
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టిపిపి అధికారులు, ఉద్యోగులు గత జనవరి నెల 31 న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎస్టిపిపి కాంట్రాక్టు కార్మికుడు మరియు క్రికెట్ ఆటగాడు అయిన గడ్డం శివ సాయి కి వైద్య ఖర్చుల నిమిత్తం 66 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
శివ సాయి ఒక కాంట్రాక్టు కార్మికుడుగా మాత్రమే కాదు మంచి క్రికెట్ ఆటగాడిగా ఎస్టిపిపిలో గుర్తింపు గల వ్యక్తి అతడికి ఈ విధంగా ప్రమాదం జరిగిందని తెలియగానే క్రికెట్ చీఫ్ కోఆర్డినేటర్ పంతులా(డిజిఎం) కోఆర్డినేటర్లు పి. వి. బ్రహ్మం (డిజిఎం)మరియు పులి సురేష్ (సేఫ్టీ ఆఫీసర్ )చొరవ తీసుకోని క్రీడాకారులు మరియు ఉద్యోగులు నుండి ఈ మొత్తాన్ని సేకరించడం జరిగింది.
ఎస్టిపిపి లోని పరిపాలనా భవనంలో జరిగిన కార్యక్రమంలో ఎస్టీపిపి ఇన్చార్జ్ ఈడి కే.శ్రీనివాసులు చేతుల మీదుగా 66,000/- వేల రూపాయల చెక్కుని కాంట్రాక్ట్ కార్మికుడు శివ సాయి కి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఈడి కే.శ్రీనివాసులు మాట్లాడుతూ ఏ వ్యక్తి జీవితంలోనైనా ప్రమాదం అనేది ఆ వ్యక్తికి మరియు ఆ కుటుంబానికి చాలా బాధాకలిగించే విషయమని అన్నారు.
మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల రాబోయే ప్రమాదాన్ని అరికట్టవచ్చని తెలిపారు.ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.
అలాగే ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మరియు కారు నడిపెటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.
ఉద్యోగులు సహాయం చేయడంలో ఎస్టిపిపి ఉద్యోగులు ముందుంటారని, విరాళాల ద్వారా తగు ఆర్థిక సహాయం అందించి బాధితులకి మనోధైర్యాన్ని కల్పిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ కోఆర్డినేటర్ డి. పంతులా(డిజిఎం), ఏ ఐ టి యు సి పిట్ సెక్రటరీ సత్యనారాయణ, ఏజిఎం (సివిల్)కె.ఎస్.ఎన్. ప్రసాద్, ఏజిఎం (ఫైనాన్స్)మురళీధర్,డీజీఎం(పర్సనల్)అజ్మీరా తుకారాం, డీజీఎం పి. వి. బ్రహ్మం,పులి సురేష్ (సేఫ్టీ ఆఫీసర్ )ఇతర అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణి
ఎస్సీ సేల్ మండల అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్
నేటి ధాత్రి మొగుళ్ళపల్లి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్నబియ్యం పంపిణీకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సేల్ మండల అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ. నిరుపేదలకు చెందాల్సిన రేషన్ షాపులోని దొడ్డు బియ్యం అక్రమార్కులు రాష్ట్రాలు దాటించి సొమ్ము చేసుకున్నారని పేదల నోటికి చెందాల్సిన అన్నం దొంగల పాలవుతుందని భావించి. ఎలాగైనా నిరుపేదలకు న్యాయం చేయాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యమంత్రితో పాటు పౌర సరఫరాల మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సన్న బియ్యం పంపిణి చేస్తేనే బియ్యం దొంగలకు అడ్డుకట్ట వేయచ్చని చర్చించి సన్న బియ్యం. ప్రజలకు పంపిణి చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు నిరుపేదల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందుకు అనుగుణంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి ప్రజా ప్రభుత్వం సన్నా హాలు చేస్తోందని. ఇందులో భాగంగా పౌర సరఫరాల శా ఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,సొంత నియోజకవర్గ మైన హుజూర్ నగర్లో ఈ పథకాన్ని ఉగాది పండుగ పర్వదిననా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పౌర సమాచార శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం మా నిరుపేదలకు ఆనందంగా ఉన్నదనీ సన్న బియ్యం పంపిణి చేసి నిజమైన పెదలపార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిరూపించిందని రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదిలో. రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం. ప్రభుత్వ కృషికి నిదర్శనమని. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులకు, నియోజకవర్గ ఎమ్మెల్యే కు ఓనపాకాల ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు సీజ్ చేశామన్న మైనింగ్ అధికారులు,,,,,
అక్రమ ఇసుక డంపు చేస్తే కఠిన చర్యలు తప్పవు మైనింగ్ అధికారి మధు కుమార్,,,,,
ఇసుక కుప్పలను పంచనామ చేసిన మండల ఆర్ ఐ గౌస్ మొయినుద్దీన్,,,,,
రామాయంపేట మార్చి 24 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట పట్టణ పరిధిలో ఇసుకను డంపు చేసి అమ్ముతున్న ఇసుక డంప్యాడ్లపై మంగళవారం మెదక్ జిల్లా మైనింగ్ అధికారులు దాడి చేసి అక్రమ ఇసుక కుప్పలను సీజ్ చేసినట్లు జిల్లా మైనింగ్ అధికారి ఏదీ అసిస్టెంట్ మైనింగ్ అధికారి జువాలజిస్ట్.మధు కుమార్ తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామాయంపేటలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని ప్రజావాణిలో తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఇసుక డంపులపై దాడి చేయగా నాలుగు డప్పుల్లో మూడు డప్పుల వద్ద అక్రమ ఇసుక లభించింది అన్నారు నాలుగో డబ్బు వద్ద ఎలాంటి ఇసుక గొప్పలు లేవని ఆయన తెలిపారు ఈ ఇసుక డంపులను రామాయంపేట మండల ఆర్ ఐ గౌస్ మైనది పంచనామ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనింగ్ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు
హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం
మంచిర్యాల,నేటి ధాత్రి:
హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని మంగళవారం రోజున నిర్వహించడం జరిగింది.అలాగే ఆలయంలో భక్తులు మరియు హనుమాన్ మాలాధారణ స్వాములు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరియు మానేరు రచయిత సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు.
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )
సిరిసిల్ల జిల్లాలోని భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో మరియు మానేరు రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో సిరిసిల్ల సిరివెలుగులు డా, నలిమెల భాస్కర్ మరియు జూకంటి జగన్నాథం సమాలోచన రెండు రోజుల జాతీయ సాహిత్య సదస్సు..
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య రవికుమార్ జాస్తి,అగ్రహారం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ టి.శంకర్, డాక్టర్ నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, మరియు ఎస్.ఆర్.ఆర్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలవకుంట రామకృష్ణ, టి.టి.సి.జి.టి.ఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్, కాడూరు సురేందర్ రెడ్డి, దక్షిణ ప్రాంత ఆఫీసర్ ఇంచార్జ్ ఎన్బిటి డాక్టర్ పత్తిపాక మోహన్, సదస్సు కన్వీనర్ కటుకం శారద, రచయిత అన్నవరం దేవేందర్ , మరియు మానేరు రచయితల సంఘం అధ్యక్షులు టీవీ నారాయణ, కార్యనిర్వాహ అధ్యక్షులు ఎలుగొండ రవి, మానేరు రచయితల సంఘం సభ్యులు బూర దేవానందం,ఆడెపు లక్ష్మణ్, చిటికెన కిరణ్ కుమార్, జి.శ్రీమతి,అనిత మాడూరి, దూడం గణేష్, రొండి అర్జున్, మల్యాల దీపిక, ఈడపు సౌమ్య, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని ఐకెపి వివోఏ రమేష్,లింగన్న,పద్మ,వినోద, కొమురయ్య,గట్టయ్య లను ముందస్తుగా అరెస్టు చేసి మంగళవారం జైపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20,000 వేల రూపాయల జీతంతో పాటు ఇన్సూరెన్స్,ఉద్యోగం భద్రత, డ్రెస్ కోడ్ వంటి అనేక డిమాండ్లను కచ్చితంగా తీర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది.కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్న ఎన్నికల మేనిఫెస్టోలో ఏర్పర్చిన ఏ ఒక్క హామిని కూడా తీర్చలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాదులోని సెర్ఫ్ కార్యాలయంలో మంగళవారం నిరసన చేపట్టే కార్యక్రమాన్ని అడ్డుకోవడం తమకు తగదని అన్నారు.
బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకేదేశం ఒకే ఎన్నిక అవగాహన కార్యక్రమం
పరకాల నేటిధాత్రి
ఒకేదేశం ఒకేఎన్నిక పై అవగాహన కార్యక్రమం బిజెపి భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బిజెపి కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్.సిరంగి సంతోష్ కుమార్ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశానికి చాలా మేలు జరుగుతుందని పలుమార్లు ఎన్నికలు నిర్వహించడంతో దేశంపై ఆర్థిక భాగం పడడంతో పాటు సమయం వృధా అవుతుందని అన్నారు వాటిని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం తేవడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.తరచూ ఎన్నికలు రావడం వలన ఎన్నికల కోడ్ ఉండడంతో ఆయా రాష్ట్రాల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుంది గతంలో జమిలి ఎన్నికలు అనేవి 1952 నుంచే ఎన్నికలు జరిగినవి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలను మార్చి రాష్ట్రపతి పాలన పెట్టడం తద్వారా దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే దేశం ఒకే ఎన్నిక ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ పి జయంతి లాల్,బిజెపి నాయకులు మార్త రాజభద్రయ్య,చందుపట్ల రాజేందర్ రెడ్డి,బెజ్జంకి పూర్ణ చారి,కుక్కల విజయకుమార్, మార్త బిక్షపతి,సంగా పురుషోత్తం,దంచనాల సత్యనారాయణ,మారేడుగొండ భాస్కరాచారి,ఆకుల రాంబాబు,బూత్ అధ్యక్షులు మరాఠి నరసింగరావు,ముత్యాల దేవేందర్,సంఘ నరేష్, ఉడుత చిరంజీవి,బీరం రాజిరెడ్డి,గాజుల రంజిత్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్, లా కాలేజ్ మంజూరుతో విద్యారంగం మరింత అభివృద్ధి..
విద్యా రంగంలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మక కార్యక్రమాలు..
దేశంలోనే అత్యుత్తమ
గుర్తింపు తెస్తున్న ముఖ్యమంత్రి
శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీ, హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, నేటిధాత్రి:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంలో చేపడుతున్న విప్లవాత్మక మార్పులతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాబోయే కాలంలో ఎడ్యుకేషనల్ హబ్ గా మారబోతున్నదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీ, హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇందుకోసం ప్రత్యేకంగా కృషి చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మంగళవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ కి లా కాలేజ్, హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళాశాలలు ప్రకటించారని, మూడు నెలల లోపే వాటిని మంజూరు చేస్తూ హామీని నిలబెట్టుకోవడం చారిత్రాత్మకమన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కరీంనగర్ జిల్లాలో విద్యారంగం కుంటుపడిందని తెలిపారు.
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ మంజూరు చేయలేదని మండిపడ్డారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం గతంలో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ కు మెడికల్ కళాశాల మంజూరు చేశారని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటులో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలకపాత్ర పోషించారని తెలిపారు.
బిఆర్ఎస్ పాలకులు గత పదేళ్ల కాలంలో విద్యారంగాన్ని బ్రష్టు పట్టించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ అభివృద్ధికి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపడుతున్నారని రాజేందర్ రావు తెలిపారు.
ప్రతి ఏటా ప్రభుత్వం బడ్జెట్లో విద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు.
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ప్రభుత్వం విద్య శాఖకు ఈ 23,108 కోట్ల రూపాయలు కేటాయిం చిందని రాజేందర్ రావు పేర్కొన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ దూరదృష్టితో అర్ధ శతాబ్దానికి పూర్వం చెప్పిన ఈ మాటలు నేటికీ మన సమాజానికి వర్తిస్తాయనీ, అందులో భాగంగానే యువతకు శాస్త్ర- సాంకేతిక నైపుణ్యతను పెంపొందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని హైదరాబాదులో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.
డా.బి.ఆర్.అంబేద్కర్ కలలు కన్న విద్యావ్యవస్థను తయారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.
దీనికోసమే రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11, 600 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
ప్రతి నియోజక వర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని తెలిపారు.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హుస్నాబాద్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, ఈసీఈ బ్రాంచులను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.
ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి రూ.44.12 కోట్లు కేటాయించగా అందులో రూ.29.12 కోట్లు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు.
శాతావాహన వర్సిటీలో ఏర్పాటు చేయనున్న లా కాలేజీలో మూడేళ్ల కోర్సు, రెండేళ్ల కోర్సు(మేధో సంపత్తి చట్టం)లో అడ్మిషన్లను ఇవ్వనున్నారని తెలిపారు. ఈకాలేజీ నిర్మాణానికి మొత్తం రూ.22.96 కోట్లు కేటాయించగా..
అందులో ప్రస్తుతం ఐదు కోట్లు మంజూరు చేశారనీ, మొత్తంగా రూ.67.08 కోట్లను ప్రభుత్వం ఈ రెండు కాలేజీలకు కేటాయించనుందని రాజేందర్రావు పేర్కొన్నారు.
లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇందుకోసం ప్రత్యేకంగా కృషి చేసిన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కల్వకుర్తిలోని కైలాసగిరి పై వెలసిన పడమటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతనమైన దేవాలయాలు మన హిందూ యొక్క ప్రఖ్యాతిని చాటుతాయని వాటిని ప్రతి ఒక్క హిందువు పైనే ఆధారపడి ఉంటాయని అందుకుగాను తన వంతు సహాయం చేస్తానని చెప్పడం జరిగినది హిందూ ఐక్యత పౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆయనను సన్మానించడం జరిగినది. అనంతరం సికేఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన 5000 మందికి 50 కంపెనీలతో మేళా నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని తన యొక్క లక్ష్యంగా చెప్పడం జరిగినది. ఇందులో భాగంగా శ్రీను, శేఖర్ రెడ్డి, మల్లేష్, మహేష్, పాండు, శశాంక్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
ఆన్లైన్ మరియు ఐపిఏల్ బెట్టింగ్ తో జీవితాలు నాశనం చేసుకోవద్దు.
చందుర్తి సిఐ జి. వెంకటేశ్వర్లు
చందుర్తి, నేటిధాత్రి:
క్రికెట్ బెట్టింగ్ లు చేసి డబ్బులు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులకు లోనై ఎలాంటి అనర్థాలకు పాల్పడవద్దని చందుర్తి సిఐ జి. వెంకటేశ్వర్లు యువతకు పిలుపునిచ్చారు. స్థానిక ఠాణా లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ధనాధన్ ఆటగా పేరొందిన ఐపియల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యువత గెలుపు ఓటములు పై పందాలు కాయవద్దని అన్నారు. అలాంటి వాటికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో తేలికగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువకులు ఆన్ లైన్ బెట్టింగులు, క్రికెట్ బెట్టింగ్ లు చేస్తూ నష్టపోయి వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ జీతాలను అర్థాంతరంగా చాలించడమే కాకుండా తల్లి దండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారని అన్నారు.ఐసీసీ నిర్వహించేది క్రికెట్ ఆటే కానీ బెట్టింగ్ తిమింగలాలకు అది ఫక్తు వ్యాపారం. పెద్దచేప రూపంలో చిన్న చేపలను మింగే ఆట. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఐపియల్ సీజన్ నడుస్తున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలని వారి ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే తక్షణమే స్పందించండి.అంటిపెట్టుకుని ఉండండి.లేదంటే డబ్బు తోపాటు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఎవరు తీర్చలేని లోటవుతుంధని తెలిపారు.ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే పోలీసువారికి సమాచారం ఇవ్వాలని సిఐ G. వెంకటేశ్వర్లు కోరారు.
తెలంగాణ రాష్టంలో విద్యార్థి నిరుద్యోగ యువత మద్దతుతో గెలిచినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రనీకి విద్యాశాఖ మంత్రినీ కేటాయించకపోవడం చాలా బాధాకరం అని మంద నరేష్ అన్నారు విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి రాష్ట్రములో ఒక్క విద్యాశాఖ మంత్రి నీ కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయ్యింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రములో ప్రతిపక్షములో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి వస్తే విద్యార్థి నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తాము అని హామీ ఇవ్వడంతో విద్యార్థి నిరుద్యోగ యువత మొత్తం కాంగ్రెస్ పార్టీనీ నమ్మి ఓట్లు వేయడంతో తెలంగాణా రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యార్థులకు న్యాయం చేయడంలో విఫలం అయ్యిందని మంద నరేష్ అన్నారు ఇప్పటి వరకు రాష్ట్రములో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయ్యిందని అన్నారు విద్యారంగానికి తీవ్రంగా అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకె దక్కుతుందని అన్నారు.
రైతుల ఆధ్వర్యంలో మేమంటోస్ అందజేసి ధన్యవాదాలు తెలిపిన రైతులు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల రైతులు చిన్న లింగాపూర్. గ్రామ మాజీ ఎంపీటీసీ భైరీ వేణి రాముఆధ్వర్యంలో జిల్లా అధికారులకు గుర్తుగా మెమొంటోస్ అందజేసి ధన్యవాదాలు తెలిపిన తంగళ్ళపల్లి మండల గ్రామాల రైతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని ఎంతగానో బాధపడ్డామని అధికారుల కృషి చురువతో పంటలు ఎండిపోకుండా కాపాడిన ఆఫీసర్లకు అభినందనలు తెలిపిన అన్నదాతలు వారి కృషితో .LM.4.LM.5. కే నాలి ద్వారా తంగళ్ళపల్లి మండలంలో కొన్ని గ్రామాలకు సాగునీరు అందించి పొలాలు ఎండిపోకుండా చూసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ మన గ్రామా రైతులు అభినందనలు తెలిపారు ఈ oదుకు సహకరించినందుకు జిల్లా కలెక్టర్ గారికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రత్యేకకృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్న లింగాపూర్ దాచారం నరసింహులపల్లి.గ్రామ రైతులు మండల రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి…..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి అధికారి రజిత మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలపైఅన్ని ప్రోగ్రాంలో పై రివ్యూ చేసి ఆరోగ్య మహిళ క్లినిక్ పై సంబంధించి హాస్పిటల్ కి వచ్చే రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారికి ఎటువంటి అసౌకర్యాలు కాకుండా చూడాలని రిజిస్టర్ను పరిశీలించి అన్ని ప్రోగ్రాములపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హార తీశారు ఇట్టి సందర్శనలు జిల్లా వైద్య శాఖ అధికారి ఎస్ రజిత తంగళ్ళపల్లి వైద్యాధికారి డాక్టర్ అఫీజ హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
ఒకే దేశం ఒకే ఎన్నిక పై ప్రచారం చేసిన తంగళ్ళపల్లి మండల కన్వీనర్….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ మహిళలకు.. ఒకే దేశం ఒకే ఎన్నిక విధి విధానాల గురించి. చెబుతూ వాటిపై ఆహ్వాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో జరిగే ఎన్నికలపై ఉపాధి హామీ కూలీలకు ఓకే దేశం ఓకే ఎన్నికల గురించి చర్చించి వారికి అవగాహన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల కన్వీనర్ రెడ్డిమల్ల సుఖేందర్. మండల ఉపాధ్యక్షులు బక్క శెట్టి రాజు. మండల సహాయ కార్యదర్శి రెడ్డిమల్ల ఆశీర్వాదం. గ్రామ అధ్యక్షులు బొజ్జ తిరుపతి ఎరుపుల మహేష్ పొన్నం నిఖిల్ ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొనడం జరిగింది
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.