అస్తవ్యస్తంగా సంగం(కె) ప్రాథమిక పాఠశాల.

అస్తవ్యస్తంగా సంగం(కె) ప్రాథమిక పాఠశాల

◆ శిథిలావస్థలో మరుగుదొడ్లు,
◆ మూత్రశాలలు నిరుపయోగంగా వాటర్ ట్యాంక్ పాఠశాలలో లోపించిన పారిశుధ్యం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఝరా సంగం మండలంలోని సంగం (కె) గ్రామంలో గల ప్రాథ మిక పాఠశాల అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు చేపడుతున్నప్పటికీ ఈ పాఠశాల రూప రేఖలు మార్చలేకపోయాయి. ఈ పాఠశాల ఆవరణలో ఉన్న మరు గుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థలో ఉండటంతో విద్యా ర్థులు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ శిథిలాలతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్న వాటిని తొలగించడం లేదు. అలాగే నీటి సరఫరా కోసం ఏర్పాటు
చేసిన వాటర్ ట్యాంక్ రంధ్రాలు పడి నిరుపయోగంగా మారింది. ఈ పాఠశాల చుట్టూ పూర్తిస్థాయిలో కాంపౌండ్ వాల్ లేనందున పశువులు లోపలికి వచ్చే అవకాశం ఉంది. పాఠశాల భవనానికి అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయాయి. రంగులు వెలిసిపోయి భవనం కళ హీనంగా కనిపిస్తుంది. పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం నెలకొని పారి శుద్ధ్యం లోపించింది. ఈ పాఠశాలలో ఇంకా పలు సమ స్యలు నెలకొనడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యాభివృద్ధికై పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని విద్యార్థినీ, విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version