రైతులు దళారులను నమ్మి మోసపోకండి.

రైతులు దళారులను నమ్మి మోసపోకండి.

భూభారతి దరఖాస్తులను పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తాం..

తహసిల్దార్ ఇమామ్ బాబా.

చిట్యాల నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ బుదవారం రోజున నేటిదాత్రి ప్రతినిధితో మాట్లాడుతూ చిట్యాల మండలంలోని 16 రెవెన్యూ గ్రామాలలో ఈనెల 3 తారీఖు నుండి 20వ తారీకు వరకు రెవిన్య సదస్సులు నిర్వహించడం జరిగిందని ఈ రెవెన్యూ గ్రామంలోని రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను దరఖాస్తు రూపంలో వారి ఊరిలో జరిగిన రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అధికారులకు ఇవ్వడం జరిగింది, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సర్వే చేసి అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని అన్నారు, అలాగే కొందరు దళారులు భూములను పట్టా చేయిస్తామని నమ్మబలుకుతున్నారని తమ దృష్టికి వచ్చింది అని వారిని నమ్మి మోసపోవద్దని ఏదైనా భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే తహసిల్దార్ కార్యాలయంలో నేరుగా నన్ను సంప్రదించి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరినారు, అలాగే ఇప్పటివరకు జరిగిన రెవెన్యూ సదస్సులలో 16 గ్రామాల నుండి దాదాపు 5570 దరఖాస్తులు రావడం జరిగిందని ఇప్పటివరకు దాదాపు 5వేల దరఖాస్తులను స్కాన్ చేసి ఆన్లైన్ చేశామని ఆగస్టు 15 లోపు దరఖాస్తులను గ్రామాల వారీగా పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకు పట్టా చేయడం జరుగుతుందని అలాగే భూభారతి అనేది నిరంతర ప్రక్రియని అని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఒక హెల్ప్ డిస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని మండలంలో ఇంకా భూభారతిలో ఇవ్వని రైతులు నేరుగా తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డిస్క్ లో దరఖాస్తు లు ఇవ్వాలని తెలిపారు ,అలాగే ఇప్పటివరకు 16 రెవెన్యూ గ్రామాలలో వచ్చిన దరఖాస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నవి, చైన్ పాక గ్రామ సభలో 156 హెల్ప్ డెస్క్ లో 170, చల్లగరిగె గ్రామ సభలో 126 హెల్ప్ డెస్క్ లో 153, చిట్యాల గ్రామ సభలో 126 హెల్ప్ డెస్క్ లో 195, దూత్ పల్లి గ్రామ సభలో 109 హెల్ప్ డెస్క్ లో 90, గిద్ద ముత్తారం గ్రామసభలో 99 హెల్ప్ డెస్క్ లో 79, గోపాలపూర్ గ్రామసభలో 176 హెల్ప్ డెస్క్ లో 65, జడల్ పేట గ్రామసభలో 264 హెల్ప్ డెస్క్ లో 200, జూకల్ గ్రామసభలో 269 హెల్ప్ డెస్క్ లో 147 ,కైలాపూర్ గ్రామసభలో 126 హెల్ప్ డెస్క్ ల 64, కాలువ పళ్లి గ్రామసభలో 40 హెల్ప్ డెస్క్ లో 19, ముచిని పర్తి గ్రామసభలో 250 హెల్ప్ డెస్క్ లో 86, నవాబుపేట గ్రామసభలో 350 హెల్ప్ డెస్క్ లో 182,నైన్ పాక గ్రామసభలో 787 హెల్ప్ డెస్క్ లో 159, తిరుమలపూర్ గ్రామసభలో 189 హెల్ప్ డెస్క్ లో 35, వెంచరామీ గ్రామసభలో 42 హెల్ప్ డెస్క్ లో 35, ఒడితల గ్రామసభలో 417,ఈఈ గ్రామాలలో ఇప్పటివరకు వచ్చినదరఖాస్తులు, గ్రామ సభలలో ఇచ్చిన ప్రతి దరఖాస్తుకు ఒక అప్లికేషన్ నెంబర్ ఇచ్చామని దాని ద్వారా దరఖాస్తుదారులు వారి స్టేటస్ ను పరిశీలించుకోవచ్చని తెలిపారు, అలాగే ప్రభుత్వం దరఖాస్తులను మూడు కేటగిరీలుగా విభజించి పరిశీలించి అర్హులైన వాళ్లకు పట్టాలు జారీ చేయడం జరుగుతుందని అన్నారు మొదటిది ,2014 కన్నా ముందు రైతులు భూములు కొనుగోలు చేసి 2018 లో సాదా బైనమకింద ఆన్లైన్ చేసిన రైతులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలించడం, రెండవది 2014 తర్వాత కొనుగోలు చేసిన భూములను సాదా బైనమ కింద ఆన్లైన్ చేయని దరఖాస్తులను పరిశీలించడం, మూడవది ప్రభుత్వ భూములను నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్నా భూములను పరిశీలించి ప్రభుత్వం అసైన్ కమిటీలను వేసిన తర్వాత వాటి దరఖాస్తులనుకూడా పరిశీలించడం జరుగుతుందని అన్నారు, అలాగే ప్రభుత్వ భూములను అమ్మిన కొన్న నేరమని దళాల నమ్మి మోసపోవద్దని అన్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రైతులకు ఒక వరం లాంటిదని కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరినారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.

‘రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు’

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, బాలానగర్, మొదంపల్లి, మోతీ ఘనపూర్, హేమాజీపూర్ గ్రామాలలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మల్ల అశ్వినీ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు వరి ధాన్యమును అమ్ముకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోకూడదన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాలో.. డబ్బులు జమ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, ఆది రమణారెడ్డి, లింగారం యాదయ్య గౌడ్, బత్తుల రాఘవేందర్, భాస్కర్ గౌడ్ వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.!

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లో
రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రైతులకు సూచించారు. ఈరోజు బుధవారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంతో పాటు రవినగర్(జంగుపల్లి), గొల్లపల్లి గ్రామాలల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అదేవిధంగా, గత ప్రభుత్వంలో దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇలాంటి అనేక హామీలను ఇచ్చి పదేళ్లు ప్రజలను మోసం చేసిందని ఎద్దేవా చేశారు. ఇంతకీ ఇరవై ఐదేళ్ల ఉత్సవాలు టీఆర్ఎస్ పార్టీకా? తెలంగాణ పదాన్ని తీసేసిన బీఆర్ఎస్ పార్టీకా? అని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు. ఎమ్మార్వో ఎంపీడీవో ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.

బెట్టింగులకు ఆకర్షితులై యువత మోసపోవద్దు.

బెట్టింగులకు ఆకర్షితులై యువత మోసపోవద్దు

 

****మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్

*****మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బెట్టింగ్స్ కు ఆకర్షతులై డబ్బులు నష్టపోయి జీవితాలను సర్వం నాశనం చేసుకోవద్దని మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు. ఐపిఎల్ క్రికెట్ సీజన్ ప్రారంబమైన నేపథ్యంలో. మండలంలోని యువతకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ. తల్లిదండ్రులు, తమ కష్టార్జితాన్ని కన్న బిడ్డలు, బెట్టింగుల రూపంలో. డబ్బులను దోపిడీ దొంగలపాలు చేసి చివరకు తమ ప్రాణాలను తీసుకుంటున్నారని. పిల్లల్లో ఏదైనా మార్పులు గమనించినట్లయితే తల్లిదండ్రులు, పెద్దలు, వెంటనే తగిన చర్యలు తీసుకొని బెట్టింగులకు పాల్పడకుండా వారి ప్రవర్తనలో మార్పు తేవడానికి ప్రయత్నం చేసి వారిని సరియైన దారిలోకి తేవాలని అన్నారు. బెట్టింగులకు పాల్పడే వారిపైనా ప్రత్యేక నిఘా ఉంచామని బెట్టింగులకు పాల్పడి కోలుకొని విదంగా ఆస్థి నష్టం జరిగి చివరికి ఆత్మహత్య చేసుకుని మీ కుటుంబాలను రోడ్డున పడేయద్దని ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే మాకు సమాచారం ఇవ్వాలని మొగుళ్లపల్లి ఎస్సై బి అశోక్ మండల ప్రజలను కోరారు.

బెట్టింగ్ యాప్ లకు యువకులు మోగ్గు చూపకండి..

బెట్టింగ్ యాప్ లకు యువకులు మోగ్గు చూపకండి

కరకగూడెం ఎస్సై రాజేందర్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

 

యువత ఈజీ డబ్బులకు అలవాటు పడి బెట్టింగ్ లకు మొగ్గచూపకుడదని,బెట్టింగ్ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలని కరకగూడెం ఎస్ఐ రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన యువతను,ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఐపియల్ క్రికెట్ వెల విపరీతంగా డబ్బులు చేతులు మారుతున్నాయి ఎవ్వరూ ఒక్కరు బెట్టింగ్ లో డబ్బులు గెలుచుకున్నారు అనే వెర్రితనంతో మీరు అ వలలో చిక్కుకోకండి అని అయన తెలిపారు. అలాగె బెట్టింగ్ యాప్స్,ఆన్లైన్ బెట్టింగ్ అడి ఎంతోమంది యువత ప్రణాలు పోగోట్టుకోవడం మనం చూస్తునే ఉన్నాం ఇటువంటి సంఘటనలు మన మండల పరిధిలో జరగకుండా చూడవలసిన భాద్యత మన అందిరిపై ఉందని ముఖ్యంగా యువత తల్లిదండ్రులు పై ఎక్కువగా ఉందని పిల్లల అవసరాలకు మించి డబ్బులు ఇవ్వకుడాదని అయన తెలిపారు.ఈ బెట్టింగ్ మహమ్మారి వలలో చిక్కుకోని ఎన్నో కుటుంబాలు రొడ్డున్న పడ్డాయని అయన గుర్తుచేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version