DCRB నలివేల లక్ష్మణ్ ముదిరాజ్’కి ఘన సన్మానం.

డి.సి.ఆర్.బి. నలివేల లక్ష్మణ్ ముదిరాజ్’కి ఘన సన్మానం

నేటిధాత్రి :హన్మకొండ

 

రామగుండం కమిషనరేట్ ఏ.ఎస్సై’గా విధులు నిర్వహించి, బదిలీ’పై ములుగు జిల్లా’ కు నూతనంగా విచ్చేసిన నలివేల లక్ష్మణ్’ ముదిరాజ్’ కు మెపా జిల్లా కార్యాలయానికి ఆహ్వానించి, ముదిరాజ్’ల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని ఇచ్చి, శాలువా’తో ఘనంగా సన్మానించడం చేశారు అనంతరం
మెపా జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి బదిలీ పై ములుగు జిల్లా కు విచ్చేసిన ఉద్యోగులందరని మెపా ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుందని, జాతి బిడ్డలు ఎక్కడ ఉన్నా ఒకరికొకరు మర్యాదపూర్వకంగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం జాతి ఐక్యత’కు నిదర్శనం అని తెలిపారు.
డి.సి.ఆర్.బి. నలివేల లక్ష్మణ్’ముదిరాజ్ మాట్లాడుతూ సన్మానం చేసినా మెపా టీమ్ కి, ముదిరాజ్ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కార్యదర్శి సింగారపు రామకృష్ణ ముదిరాజ్, మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, మెపా జిల్లా గౌరవ అధ్యక్షుడు బండి రాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version