గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…
నున్నా నాగేశ్వరరావుసిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…
నేటి ధాత్రి గార్ల:
సీతంపేట సమీపంలో ఉన్న గార్ల పెద్ద చెరువులో శిఖం భూములు కబ్జాకు గురి కాకుండ శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరావు డిమాండ్ చేశారు.గార్ల మండల కేంద్రం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ,766 సర్వే నెంబరు లో ఉన్న వందలాది ఎకరాల భూమిని కొందరు కబ్జా దారులు ఆక్రమించుకుని నిబంధనలకు విరుద్ధంగా బావులు తీసి,విద్యుత్ మోటార్ లు ఏర్పాటు చేసుకొని చెరువు నీటిని వాడుకోవడం వలన ఆయకట్టు రైతుల భూములకు సాగునీరు అందని దుస్థితి దాపురించిందని అన్నారు.గార్ల పెద్దచెరువు శిఖం భూముల విషయంలో ఉన్నతాధికారుల కు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న నామ మాత్రపు సర్వే లు చేసి చేతులు దులుపుకుంటున్నారని అందోళన వ్యక్తం చేశారు.స్దానిక ఎంపి బలరాం నాయక్,ఎమ్మెల్యే కోరం కనకయ్య లు ప్రత్యేక చొరవ తీసుకుని శిఖం భూములను కబ్జా నుండి కాపాడి, ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి, రైతులు జి.వీరభద్రం, ఎ.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమని ఎంఈఓ జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఆటలు ఆడడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుందని చెప్పారు. విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు.
స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం పోటీలు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం గురువారం క్రీడా పోటీలు నిర్వహించినట్లు ఎంఈవో లింగాల కుమారస్వామి తెలిపారు. మండలంలోని మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా పలు గ్రామాలకు చెందిన 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనగా వివిధ పోటీలు నిర్వహించి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం మండల స్థాయిలో పోటీలు నిర్వహించమన్నారు. మండల స్థాయిలో అత్యంత ప్రతిభ చూపిన పదిమంది విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సందీప్, సంతోష్. సుదర్శన్, అజయ్, శ్రావణి, ఉపాధ్యాయులు అంకుష్, మహేష్, ఎమ్మార్సీ సిబ్బంది వేణు, వసంత, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పుట్టిన రోజు వేడుకలు కరీమాబాద్ సుభాష్ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా నాయకులు పూదరి అజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రదీప్ రావు అభిమానులు, బీజేపీ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించారు.
మొదటగా ఎర్రబెల్లి వినీత్ రావు తో కలిసి పూదరి అజయ్ గౌడ్ భారీ కేకు కట్ చేసి ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమారు 500 మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం స్కూల్ చిన్నారులకు వందమందికి పైగా నోట్ బుక్స్, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా పూదరి అజయ్ గౌడ్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు ప్రజలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అని అన్నారు.కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రదీప్ రావు అఖండ విజయాన్ని సాధించి తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో మంద శీను, రాజశేఖర్, కార్తీక్ గౌడ్, మహేష్, రాజు, చిన్న, నాగరాజు, దయాళ్, సతీష్ బాబు, కోమల్ తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి గడువుపెంచా లని డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత
బహుజన సంక్షేమ సంఘం (బి ఎస్ ఎస్)నాయకులు
శాయంపేట నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పథకం గడువు పెంచాలని బహుజన సంక్షేమ సంఘం బి ఎస్ ఎస్ ఆధ్వర్యంలో శాయంపేట డిప్యూటీ తహసిల్దార్ వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి దరఖాస్తు గడువు పెంచాలని చాలామంది పేద రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక దరఖాస్తు చేసుకోలేదని ఇంకో వారం రోజులు గడువు పెంచాలని డిప్యూటీ తహసి ల్దార్ కి బహుజన సంక్షేమ సంఘం బి ఎస్ ఎస్ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారపేల్లి క్రాంతి కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సుమన్, హనుమకొండ జిల్లా ఉపాధ్య క్షులు మారేపల్లి విజయ్ కు మార్ కిరణ్ బాను తదిత రులు పాల్గొన్నారు.
ప్రజలకోసం శ్రమించే నిరంతర శ్రామికుడు రేవూరి. :-గరీభ్ నగర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.
బి.ఆర్.యస్. అసత్య ప్రచారాలు నమ్మదు. రాజకీయ స్వలాభం కోసం అమాయకులను బలిచేయద్దు.
అర్హులైన వారికి విడతల వారిగా ఇందిరమ్మ ఇండ్లు. పేద ప్రజలకు అనునిత్యం అందుబాటులో కాంగ్రెస్ పార్టీ.
గొర్రెకుంట నేటిధాత్రి:
వరంగల్ నగరంలోని, 16వ డివిజన్ పరిధిలో గరీబ్ నగర్ నందు, నిన్న కొందరు బిఆర్ఎస్ నేతలు, స్థానిక కార్పొరేటర్ చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ స్థానిక మహిళా వికలాంగురాలు లింగంపల్లి నిర్మల ఇంటిని సందర్శించి, వారికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాని అందించిన 16వ డివిజన్, గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు. దాసారపు సారన్న ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 16 డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఆలస్యం అవుతున్నాయని తెలుసుకున్న టిఆర్ఎస్ నాయకులు అదే అదునుగా చూసుకొని అమాయకురాలైన మహిళలను ముందు పెట్టి వారి రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నం చేస్తు టిఆర్ఎస్ నేతలు విఫలమయ్యారు అని అన్నారు. గత బి.ఆర్.యస్ పాలనలో తీసుకున్న కమిషన్లకు, అక్రమాలకు పాల్పడిన వారు ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నారు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమాలకు, అరాచకాలకు తావు లేకుండా అభివృధే ధ్యేయంగా పని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక గరీబ్ నగర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు అమాయకపు దళిత మహిళ వికలాంగురాలను చూపిస్తూ బి ఆర్ యస్ పార్టీ రాజకీయ స్వలాభం కోసం అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ నేతల మాటలను ఖండించారు. ఇలాంటి ఉదంతాలను అసత్య ప్రచారాలను గరీబ్ నగర్ ప్రజలు నమ్మదు, టోపీ నాయకులు వస్తున్నారు మనకు టోపీ పెడుతారు జాగ్రత్త అని తెలిపారు. గత బి.ఆర్.యస్ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వకపోగా కనీసం ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపనపోలేదు. ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం. గరీబ్ నగర్ ప్రజలకు మాయమాటలు చెప్పి సుమారు 18 మంది ఇండ్లను కూలగొట్టి ఇల్లు ఇస్తాము అని ఓట్ల కోసం రాజకీయం చేసిన పార్టీ బి ఆర్ యస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఈ రోజు ప్రజాప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లపై మాట్లాడే నైతిక హక్కు లేదు అని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు నియమ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే దిశగా మన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి కృషి చేస్తారని వారు తెలిపారు. అంతేకాకుండా గరీబ్ నగర్ ప్రజలను మాయ మాటలతో మభ్యపెడుతూ పది సంవత్సరాలు కాలయాపన చేసిన బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల బాధలు వారి గోడు వినకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరించి భూకబ్జాలకు, అక్రమాలకు పాల్పడి ఇప్పుడు గరీబ్ నగర్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి మతిభ్రమించిన టిఆర్ఎస్ నాయకులు ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఏ ఆధారం లేక, అమాయక ప్రజలను మోసపరుస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ తిరగడం వారికి అలవాటైపోయింది అని అన్నారు. వరంగల్ జిల్లాలోనే మచ్చలేని నాయకుడిగా సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న నేత పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు అని, ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలిపారు. బి ఆర్ యస్ నాయకులు ఆకాశంపై ఉమ్మితే అది వారి మొఖంపై పడుతుంది అని వారు గ్రహించాలి అని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతర శ్రామికుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారుల ఎంపికలో పారదర్శకంగా చిత్తశుద్ధితో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు, ఏ ఒక్క లబ్ధిదారుల దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకోని పనిచేస్తుందని తెలిపారు. కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బి.ఆర్ఎస్ నాయకులు బురద చల్లుతున్నారు. ఏ ఒక్క లబ్ధిదారుడు దగ్గరైన డబ్బులు వసూలు చేసినట్టు రుజువు చేయిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని వారు అన్నారు. బి. ఆర్. యస్ నాయకులు మీరు బహిరంగ చర్చకు సిద్దామా అని అన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు పంపిణీ జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి విడతలవారీగా ఇండ్లు వచ్చే విధంగా స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవ తీసుకుంటారని తెలిపారు. గతంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 93, 95 సర్వే నెంబర్ల లో భూ అక్రమాలకు పాల్పడి గరీబ్ నగర్ లోని పేద ప్రజలకు వచ్చే స్థలాని వారి సహచరులకు, బినామీలకు కట్టబెట్టి గరీబ్ నగర్ ప్రజలకు సొంత ఇంటి స్థలము లేకుండా చేసారు. గరీబ్ నగర్ లోని సొంత ఇంటి లేని వారికి సర్వేనెంబర్ 93 95లో ఇల్లు ఇప్పిండం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కొండేటి కొమర రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్, గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసారపు సారన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెక్కలక్ష్మి రమేష్, అఫ్రీన్, అంకేశ్వరపు రాజు, పిట్టల అనిల్, గ్రామ పార్టీ అధ్యక్షులు జానీ, హుజూర్, జన్ను రాజు, మార్త రాజశేఖర్, గుర్రం వెంకటేశ్వర్లు, పరకాల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లెం సాయి కుమార్, గొట్టిముక్కుల పరిపూర్ణ చారి, గుర్రపు వెంకటేశ్వర్లు, శివరాత్రి పెద్ద వెంకన్న, కృష్ణ, పోలేబోయిన శివ, బిర్రు ప్రసాద్, కె.మోహన్, జన్ను రాజు, తక్కల్లపల్లి రాజశేఖర్, నూరూజహాన్, గొర్రె కరుణాకర్, ఐత అశోక్, జన్ను కళ్యాణ్, భరద్వాజ్. శివరాత్రి చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ ను ఘనంగా సన్మానించిన మంత్రి సురేఖ
హైదరాబాద్ నేటిధాత్రి:
తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్గా చేరిన సరిత, ఈ దేశంలోని ఎంతోమంది మహిళలకు ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గురువారం డ్రైవర్ సరిత, మంత్రి సురేఖను వారి జూబ్లీహిల్స్ నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సరితను శాలువాతో మంత్రి ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మరింత రాణించాలని మంత్రి అభిలాషించారు. ఈ నేపథ్యంలో సరిత తన కుటుంబ సమస్యలు మంత్రి సురేఖకు నివేదించగా, ఎటువంటి సమస్యలున్నా తనను సంప్రదించాలని సూచించగా, ఆమె మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
నగరంలోని 14 వ డివిజన్ ఎనుమాముల ముసలమ్మ కుంట పేస్ వన్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం రోజున సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దేశానికి విశ్వసనీయత కలిగిన వారని, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే నిజమైన ప్రజా నాయకులు ఆయన నాయకత్వంలో దేశంలో సామాజిక న్యాయం సమనత్వం ప్రజాస్వామ్యం బలపడుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్. జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరాటే ప్రభాకర్. ఎస్టీ సెల్ హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పులి చేరి రాధాకృష్ణ.డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పస్తం శంకర్ ఏనుమాముల గ్రామ పార్టీ అధ్యక్షులు సౌరం చిన్ని సుందరయ్య నగర్ గ్రామ అధ్యక్షుడు త్రికోవేల శ్రీను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఏకామ్రాచారి దస్రు నాయక్ పార్టీ సీనియర్ నాయకులు ఖల్నాయక్ సౌరం ప్రభాకర్ సౌరం మాణిక్యం సౌరం జయకర్ సంగారబోఎన రాజు సంగార బోయిన రాజేష్ కన్నా ఇందిరమ్మ కాలనీ డెవలప్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి బండ్ల సురేందర్ తోట శీను పల్లకొండ చందు ముక్తార్ మహేష్. మహిళలు మొద్ధసాని మాధవి. గుగులోతు మంగ కార్యకర్తలు పాల్గున్నారు
◆ లబ్ధిదారులకు మొండి చేయి చూపిస్తున్న కాంగ్రెస్ సర్కార్
◆ జహీరాబాద్ బిఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్,,ఎమ్మెల్యే కోనింటి మాణిక్ రావు ఆదేశాల మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది.. నాయకులు మాట్లాడుతూ ‘రాజీవ్ యువ వికాసం పథకం, కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీల వలె విజయవంతంగా చెత్త బుట్టలోకి చేరిపోయిందని ఈ పథకం అమలు విధానంపై పునరాలోచన చేస్తాం’ అని రాష్ట్ర క్యాబినెట్ తెలంగాణ యువతపై ఓ పిడుగును పడేసిందన్నారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 తారీకున రెండు లక్షల మంది అబ్ధిదారులను ప్రకటించి, పథకం మంజూరు పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వట్టి మాటలు అయ్యాయి అన్నారు.. రేవంత్ చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మిన తెలంగాణ యువత సుమారు 16 లక్షల మంది ఈ పథకానికి నమోదు చేసుకున్నారని, రకంలో నమోదు చేసుకోవడానికి ప్రతి ఒక్క యువకుడికి సుమారు 200 నుంచి 300 రూపాయల వరకు ఖర్చు అయిందని అన్నారు .. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఆదాయం కలిగిందని అన్నారు.. నమ్మిన యువకులకు కాంగ్రెస్ తన హామీలను పక్కనబెట్టడం ఇదే తొలిసారి కాదు.,బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు చేయించిన కాంగ్రెస్, తాను అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెలువరించిన ఉద్యోగాలకు రేవంత్ ప్రభుత్వం జాయినింగ్ లెటర్లు ఇచ్చి తొలి ఏడాదిలోనే 58 వేల ఉద్యోగాలిచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారని కాంగ్రెస్ చేస్తున్న ఇలాంటి మోసపూరిత ప్రకటనలను ప్రజలు, నిరుద్యోగులు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎంతో అర్భాటంతో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ఉద్యోగాల కల్పన అంటుంచితే కనీసం స్వయం ఉపాధికి కార్పొరేషన్ రుణాలు తీసుకుందామన్నా యువతను మోసగాళ్లుగా చిత్రించి కాంగ్రెస్ ఆ పథకాన్ని కూడా ఆపేయడం ఆక్షేపణీయం అన్నారు.. ఎంతో తెలివితో ఆలోచించే తెలంగాణ యువత ఇప్పటికైనా కాంగ్రెస్ కపట నాటకాలను గుర్తించాలని. ‘ఒడ్డెక్కే దాన్క ఓడ మల్లన్న ఒడ్డు దాటినాక బోడ మల్లన్న’ అనే రీతిలో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సరైన సమయంలో, సరైన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,యువ నాయకులు దీపక్ ,బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు రాకేష్ ,బి ఆర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు ఓంకార్, ఫయాజ్,రోహిత్, శ్రీనాథ్ ,ప్రవీణ్ మెస్సీ, తదితరులు .పాలుగోన్నారు.
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
పరకాల నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండలంలోని వివిధ గ్రామలలోని ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ పరకాల మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,ఏఎంసీ చైర్మెన్ చందుపట్ల రాజిరెడ్డి,బొమ్మకంటి చంద్రమౌళి,బొచ్చు జెమిని,అలీ,దార్నా వేణు,ఒంటెరు శ్రవణ్,మచ్చ సుమన్,యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లం శ్రీరామ్,పరకాల మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిలివేరు రాఘవ,వెంకటేశ్,యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
జూన్ 19.రాహుల్గాంధీ జన్మదిన సందర్భంగా రాయికల్ పట్టణంలో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశానికి మార్గదర్శనం చేయగలిన యువ తేజం రాహుల్ గాంధీ అని ఆయన దెబ్బకు బిజెపి ఇతర పార్టీలతో జట్టు కట్ట వలసి దుస్థితి వచ్చిందని అన్నారు.దేశ స్వతంత్ర అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వలు రక్షణ రంగంలో భారత్ ను ఓక అజేయశక్తి గా నిలిపాయన్నారు.యువతకు ఉద్యోగాలు కల్పించల్సిన కేంద్ర ప్రభుత్వం యువతను నిరాశకు గురిచేస్తోందని ఆరోపించారు.నిరుద్యోగ సమస్యను గుర్తిచడంలో కేంద్రం ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశంలో సుస్థిరమైన ప్రజా పాలన అందించగల ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని మత చాందస వాదులు మతాల పేరు చెప్పి ఎంత గెలిచే ప్రయత్నం చేసిన బడుగు బలహీనవర్గాల సంక్షేమం పట్ల ఆలోచన గలిగిన రాహుల్ గాంధీ దేశంలోనే అత్యున్నతమైన నాయకుడిగా పేరుపొందిరని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ,మండల అధ్యక్షులు మ్యాకల రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షాకీర్,హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్, యూత్ కాంగ్రెస్ మండల,పట్టణ అధ్యక్షులు ఏలేటి జలంధర్ రెడ్డి,బత్తిని నాగరాజు,నాయకులు ఎద్దండి భూమారెడ్డి,కొయ్యేడి మహిపాల్ రెడ్డి,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య,వాసం దిలీప్,కొమ్ముల ఆదిరెడ్డి,కడకుంట్ల నరేష్,అశోక్,మోబిన్,మండ రమేష్, రాకేష్ నాయక్,తలారి రాజేష్,బాపురపు రాజీవ్,జక్కుల సాగర్,రాజేష్,నరసింహారెడ్డి,ఆనంద్,పాసం భూమయ్య,పల్లికొండ రమేష్,కాటి పెల్లి రాజశేఖర్, రాజేందర్,రవీందర్,తదితరులు పాల్గొన్నారు.
బీసీ హక్కుల సాధన సమితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెండో మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు టి వెంకట్ రాములు తెలిపారు అధ్యక్షులుగా భీమనాథుని సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా వేముల శ్రీకాంత్ సహాయ కార్యదర్శిగా క్యాతరాజు సతీష్ అస్లాం జిల్లా ఉపాధ్యక్షులుగా మేరుగు రమేష్ గోలి లావణ్య. జిల్లా కోశాధికారిగా కట్టెగొల్ల భారతి…
Election
జిల్లా కార్యవర్గ సభ్యులుగా రమేష్ చారి,మహేష్,పుప్పాల వనిత, సుధాకర్, శేఖర్, అజయ్, భగత్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు
కోహీర్ మండల ఫొటో వీడియో గ్రఫీ నూతన కార్యవర్గం ఏక గ్రీవంగా ఎన్నిక…
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలో ని జహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ మండలం ఫొటో వీడియో గ్రఫీ నూతన కమిటీ ఏర్పాటు చేసారు.. మండలం లోని ఆయా గ్రామ ల ఫొటో వీడియో గ్రాఫర్లు గురువారం నాడు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్ను కున్న కమిటీ ని అందరు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు కోహీర్ మండల ఫొటో వీడియో సంక్షేమ కార్యవర్గ వ్యవస్థాపకులుగ శ్యామ్ రావు, అధ్యక్షులు రచన్న,ప్రధాన కార్యదర్శి రాజు,కోశాధికారి పరమేష్,సoయక్త సహాయ కార్యదర్శులు సంజువు, ప్రవీణ్ కుమార్, సంయుక్త కోశాధికారి కృష్ణ,ఉపాధ్యక్షలు ప్రకాష్, రాజు జనార్దన్ ఆర్గానేజర్ సెక్రటరీ శేఖర్, నవీన్ కుమార్, లక్ష్మాన్, నాగరాజు, మీడియా ఇంచార్జి కె.అశోక్, కార్యవర్గ సభ్యులు రవి, జకీర్, నందు, కాశినాథ్, వినోద్,ఎన్నుకొన్నారు.
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు రవి పటేల్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశం కర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ టీం సభ్యుల ఆహ్వానం మీద పర్యటించడం జరిగింది గ్రామంలో పలువురు ఆరోగ్య సమస్యలపై రవి పటేల్ వారి కుటుంబాలను కలిసి మాట్లాడడం జరిగింది గ్రామంలో కొడారీ స్వరూప కొడుకు అనిరుద్ యూరినరీ ట్రాక్ సర్జరీ అవసరం ఉంది అని చెప్పారు హాజర హాస్పిటల్ dr ఉషిక కిరణ్ యూరలజిస్ట్ తో ఫోన్లో మాట్లాడి సర్జరీకి సహకరించని విజ్ఞప్తి చేశారు పైడిమల్ల ఐలయ్య గీత కార్మికుడు తడిచేట్టు మీదనుండి పడితే కాలు విరిగింది వారిని చూసి మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తేలుకోవడం జరిగింది టీం సభ్యుడు నాగరాజు కూతురు లాస్య వికలాంగురాలు కావున పెన్షన్ రావడంలేదని చెప్పారు కలెక్టర్ గారితో కలిసి మాట్లాడి తప్పకుండా పెన్షన్ పెట్టిస్తానని చెప్పడం జరిగింది మెదరమెట్ల గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి అక్కడి పరిసరాలు పరిశీలించి ఉపాధ్యాయులతో విద్యార్థులతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ స్కూలుకు విద్యార్థులు వచ్చే విధంగా ఉపాధ్యాయులకు కృషి చేయాలని అలాగే గ్రామ ప్రజలు గవర్నమెంట్ స్కూలుకు పిల్లలను పంపించాలని పవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఇందులో పాల్గొన్నవారు గునీకంటి విష్ణు కొడారి రాజు గజ్జి కుమారస్వామి కొడారి రమేష్ కొణికటి దీక్షిత్ పెంతల రాజు p రాజేందర్ ఎడకుల సురేష్ పైడిమల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు
జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులకు రాయితీపై మంజూరుైన డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన రైతులందరూ డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇటీవల ముఖ్యమంత్రి గారు నిర్వహించిన సమావేశంలో, ప్రతి అర్హ రైతుకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ పథకాలను అందించాలని ఆదేశించారని తెలిపారు.అలాగే, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పద్ధతుల వినియోగం వలన తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధ్యపడతాయని, ఇది సమర్థవంతమైన నీటి వినియోగానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాజీ సర్పంచ్ ముకిరాల మధు వంశీకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, సిగ్నెట్ కంపెనీ ఏరియా మేనేజర్ రాజు, జైన్ కంపెనీ ప్రతినిధి శ్యామ్ సుందర్ గారు, తదితరులు మరియు పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ జన్మ దిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగాధర మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని మధురానగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ పేరు రాసి ఉన్న కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీని భావి భారత ప్రధానమంత్రిని కొనియాడారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, నాయకులు జాగీరపు శ్రీనివాస్ రెడ్డి,దుబ్బాసి బుచ్చన్న,సత్తు కనుకయ్య, మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్,పడితపల్లి కిషన్,కొలిపాక స్వామి,వేముల అంజి,వేముల భాస్కర్,గుజ్జుల బాపురెడ్డి, కర్ర బాపురెడ్డి,కోలపురం లక్ష్మణ్,రుద్ర మల్లేశం,గరిగంటి కరుణాకర్,బెజ్జంకి కళ్యాణ్,మంత్రి మహేందర్,పానుగంటి సత్యం, గంగాధర సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ సమక్షంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలు పట్టణ అధ్యక్షుడు కొమ్మాట బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని ఆయన కొనియాడారు రాహుల్ గాంధీ త్వరలో దేశ ప్రధానిగా అవుతాడని అన్నారు. ఈ కార్యక్రమంలో గరుగుల శ్రీనివాస్, ప్రసాద్ ,శ్రీనివాస్, కుమ్మట నాగరాజు, గరుగుల భాను, నరేష్ ,రాజు, బాబు తదితరులు పాల్గొన్నారు
బిఆర్ఎస్ పార్టీ అక్రమ అరెస్టులలో కోర్టుకు హాజరైన ఎమ్మార్పీఎస్ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా కో ఇన్ఛార్జ్ నోముల శ్రీనివాస్ మాదిగ కోర్టుకు హాజరవడం జరిగింది గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎమ్మార్పీఎస్ నాయకులను ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేసినారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు చిరుపంగా చంటి మాదిగ ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి మండల అధ్యక్షులు వంతడుపుల చందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పురుషోత్తం నారాయణ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మేకల రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బట్టు విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చిలపాక హరీష్ మాదిగ ఎమ్మార్పీ సీనియర్ నాయకులు ఒంటెరి బిక్షపతి మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ
చర్ల నేటిదాత్రి:
రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు వేడుకలు చర్ల మండలం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నల్లపూ దుర్గాప్రసాద్ ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్వీట్లు పంచి కార్యకర్తలు నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు భద్రాచలం అసెంబ్లీ యూత్ ఉపాధ్యక్షులు బోరా పెద్దిరెడ్డి సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి వందే నరసింహమూర్తి గుండపూడి భాస్కరరావు విజయ నాయుడు ఆలం ఈశ్వర్ పటేల్ వెంకటేశ్వర్లు బోళ్ల వినోద్ మునిగల వెంకన్న సాగర్ పవన్ సిద్ది సురేష్ కర్రీ సంతోషం మేడి రమేష్ తడికల ఏసుబాబు జోగారావు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నరు
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సూచన మేరకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొరవి పరమేష్ ల ఆదేశాల మేరకు వరంగల్ ఎంజిఎంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో యువజన కాంగ్రెస్ నాయకులతో రక్తదానాన్ని చేయించిన నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ తన కర్తవ్యంగా రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపిక శ్రవణ్ కుమార్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొదిల నరేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, నెక్కొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సింగం ప్రశాంత్, చెన్నారావుపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బండి హరీష్, నర్సంపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోంత రంజిత్, యువజన కాంగ్రెస్ నాయకులు ఇజ్జగిరి దిలీప్, చెన్నబోయిన సాయి శ్రావణ్ కుమార్, కోలుగురి కర్ణాకర్, జెట్టి ప్రశాంత్, జెట్టి రాజేంద్రప్రసాద్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.