ఎన్ హెచ్ ఆర్ సి నల్లబెల్లి మండల కమిటీ ప్రకటితం….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T151315.045.wav?_=1

ఎన్ హెచ్ ఆర్ సి. నల్లబెల్లి మండల అధ్యక్షులుగా యార మధుకర్ రెడ్డి

ప్రధాన కార్యదర్శిగా నాగపురి రమేష్, ఉపాధ్యక్షులుగా ఇంతల అనంతరెడ్డి, అధికార ప్రతినిధిగా రమేష్

నియామక పత్రాలు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

వరంగల్ జిల్లా అధ్యక్షులు మేరుగు రాంబాబు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఆవునూరి కిషోర్

“నేటిధాత్రి”,నల్లబెల్లి (వరంగల్ జిల్లా):

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నల్లబెల్లి మండల కమిటీని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షులు మెరుగు రాంబాబు ప్రకటించారని జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అవునూరి కిషోర్ తెలిపారు. మండల అధ్యక్షులుగా యార మధుకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నాగపురి రమేష్, మండల ఉపాధ్యక్షులుగా ఇంతల అనంతరెడ్డి, అధికార ప్రతినిధిగా ఆవునూరి రమేష్ లను నియమించినట్లు తెలిపారు. పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పడిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర జిల్లా కమిటీల ఆదేశాల మేరకు పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నల్లబెల్లి మండల అధ్యక్షులుగా ఎన్నికైన యార మధుకర్ రెడ్డి మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్, నెహ్రూ నాయక్, వరంగల్ జిల్లా అధ్యక్షులు మేరుగు రాంబాబుకు, గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కిషోర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. తమకిచ్చిన ఈ పదవిని నీతి నిజాయితీతో నిర్వహిస్తామని మండలంలో సంస్థ బలోపేతం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. మండల అధ్యక్షులుగా యార మధుకర్ రెడ్డి నియామకంతో నల్లబెల్లి మండల ప్రజలు, విద్యావంతులు, మేధావులు అభినందించి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version