విఘ్నాలను తొలగించి సర్వ శుభాలను ప్రసాదించే దేవుడు వినాయకుడు
◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం లోని రామ్ నాగర్ , హౌసింగ్ బోర్డు, వెంకటరమణ కాలనీ,విద్యుత్ కాలనీ, ఆదర్శ నగర్ లో ఏర్పాటు చేసిన గణపతి మండపలలో గణనాథుని దర్శించుకున్న ఎమ్మెల్యే
సర్వ విఘ్నాలను తొలగించి సకల శుభాలను కలిగించే దేవుడు, భాద్రపద శుద్ధ చవితి నుండి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుని గంగమ్మ ఒడికి చేరే ఆ గణనాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు అన్నారు. వారితో పాటుగా మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.