ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన ఏడిఏ.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన ఏడిఏ

నర్సంపేట నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలం వెంకటాపూర్, మల్లంపల్లి గ్రామాలలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రైతు భరోసా కొత్త దరఖాస్తులను నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతీ రైతుకు ఒక యూనిక్ ఐడిని ఇస్తుంది.అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు దీనిని అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.పీఎం కిసాన్ లబ్ధిదారాలకు తదుపరి విడత లబ్ది పొందుటకు ప్రామాణికoగా ఫార్మర్ రిజిస్ట్రీలొ నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొన్నారు.రైతులందరు ఫార్మర్ రిజిస్ట్రీలో త్వరితగతిన నమోదు చేసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఓ
మాధవి, ఏఈఓ వైజయంతి,రాజేష్ లు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

వేలకోట్ల రూపాయలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా

రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలబెట్టా.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటిధాత్రి:

 

 

 

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలు అవినీతి పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి మార్పు వస్తుందని ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించగా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని. 18 నెలలోనే ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకించడం దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి దక్కిందని ఆయన ఎద్దేవ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మండలంలో ప్రతి తండాకు, గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించి 40 కిలో మీటర్ల పొడవున కంకర వేసి తారు రోడ్డు వేసే సమయంలో నోటిఫికేషన్ రాగా అట్టి పనులను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే పనులను రద్దు చేయడం విడ్డూరంగా ఉంది. మండలంలో పార్టీలకతీతంగా రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, పైపులు మోటార్లు ఇవ్వడం జరిగిందని అలాగే అకాల వర్షాలతో రైతులకు పంట నష్టం జరగగా ప్రతి రైతుకు పదివేల చొప్పున నష్టపరిహారం ఇప్పించి మరికొంతమంది కి రాలేదని నా దృష్టికి రావడంతో ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి మరల 3000 మందికి నష్టపరిహారం మంజూరు చేయించి అప్పటి కలెక్టర్ వద్ద మంజూరు నిధులను ఉంచడం జరిగిందని.

 

BRS

 

ఇప్పుడున్న ఎమ్మెల్యే దానిపై ఎందుకు దృష్టి పెడుతలేరని దానితోనే రైతులపై మాధవరెడ్డికి ఎంత ప్రేమ ఉందో రైతన్నలు గమనించాలని అన్నారు. ఒకప్పుడు రాజకీయ కక్షలకు నిలయంగా మారిన నర్సంపేట నియోజకవర్గం వర్గాన్ని శాంతియుతంగా అన్ని రాజకీయ పార్టీలు, కులాల మతాలకు అతీతంగా ఎలాంటి గొడవలుకు తావు లేకుండా శాంతి సామరస్యాన్ని నెలకొల్పితే మళ్లీ దురదృష్టవస్తు ఒక దుర్మార్గున్ని గెలిపించుకోగా ఊర్లలో రౌడీ రాజకీయం మళ్ళీ మొదలైంది ఇలాంటి వాటికి చరమగీతం పాడాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త చెమటోర్చి కసిగా పనిచేస్తేనే విజయం దిశగా పరుగులు తీస్తారని ఆయన కార్యకర్తలకు సూచన చేశారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానంతో తెలిసి తెలియక ప్రాజెక్టులపై మాట్లాడడం విడ్డూరంగా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియని అజ్ఞాన వ్యక్తి రేవంత్ రెడ్డి. దేవదుల ప్రాజెక్టు గోదావరి నదిపై ఉన్నదా లేదా కృష్ణా నదిపై ఉన్నదా తెలియక పోయినా ప్రాజెక్టులపై మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను ప్రభుత్వం ఏర్పడిన నుండి ప్రతి పైసా ప్రజలకు అందే విధంగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసే దిశగా బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, పిఎసిఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ జెడ్పిటిసి హరినాథ్ సింగ్, మాజీ వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వరరావు, క్లస్టర్ ఇన్చార్జిలు గందె శ్రీనివాస్ గుప్తా, మామిళ్ళ మోహన్ రెడ్డి, ఇంగ్లీ శివాజీ, వైనాల వీరస్వామి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తక్కలపల్లి మోహన్ రావు, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నాన బోయిన రాజారాం యాదవ్, మండల మహిళా అధ్యక్షురాలు గోనె శ్రీదేవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఖ్యాతం శ్రీనివాస్, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పాలస్తీనా ఇరాన్లపై యుద్దదాడులు అమెరికా కుట్రలో భాగమే.

పాలస్తీనా ఇరాన్లపై యుద్దదాడులు అమెరికా కుట్రలో భాగమే

ప్రజా సమస్యలపై పోరాటాలను ఉదృతం చేయాలి

యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట నేటిధాత్రి:

యుద్దోన్మాదంతో సామాన్య ప్రజలను బలికొంటూ ఆర్థిక వ్యవస్థను చిన్నబిన్నం చేస్తు ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. అమెరికా ట్రంప్ విధానాలకు వత్తాసు పలికే బిజెపి మోడీ పద్ధతులను మార్చుకోవాలని లేకపోతే ప్రజా వ్యతిరేకతను చెవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
యంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం నర్సంపేట పార్టీ ఆఫీస్ లో కామ్రేడ్ కుసుంబ బాబురావుఅధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గాదగోని రవి మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదం – పెట్టుబడి దారీ విధానం సంక్షోభం లో చిక్కు కొని ఆ విధానం అనుసరిస్తున్న అమెరికా అనేక ఆర్థిక సమస్యలతో అంతరంగిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాల పై ఆర్థిక సుంకాలు, ట్యాక్సీలు విధిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆంతరంగిక సమస్యలను ఎగదోసి, సరిహద్దు దేశాలతో సమస్యలను ఎగదోసి సామ్రాజ్య వాద, పెట్టుబడి దారీ దేశాలు యుద్ధ వాతావరణం కల్పించి యుద్దాలు చేస్తున్న
తీరు భారత దేశం – పాకిస్తాన్ సమస్య, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం
ఇజ్రాయిల్ – పాలస్తీనా గాజా యుద్ధ సమస్య, నేడు ఇజ్రాయెల్ ఇరాన్ పై సాగిస్తున్న యుద్ధ దాడులు యావత్ సామ్రాజ్య వాద, పెట్టుబడి దారీ దేశాలు పేద, వర్తమాన అభివృద్ధి చెందుతున్న దేశాలలో దోపిడీ ని పెంచి పోషిస్తున్న తీరు అంతర్గత సమస్యలను పోషించి నేడు పతనం చెందుతున్న తీరు తో యుద్ధాలను ఎగదోయటం జరుగుతుంది అని ఆ క్రమంలోనే నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు దెబ్బ తింటున్న సామ్రాజ్యవాదం – పెట్టుబడి దారీ వ్యవస్థ ను తేటతెల్లం చేస్తుంది అని దీనికి ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్తె తప్ప ఈ పెట్టుబడి దారీ, సామ్రాజ్య వాద వ్యవస్థ కాదని అందుకు అనుగుణంగా ప్రపంచ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి అని, ప్రజలు ప్రజా ఉద్యమాల ద్వారా ఈ దోపిడీ పెట్టుబడి దారీ వ్యవస్థ ను కూల్చాలని పిలుపు నిచ్చారు.దేశంలో బిజెపి గత పదకొండు సంవత్సరాల పాలనలో దేశాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పని చేయకుండా విద్వేష రాజకీయాలను, మతోన్మాద రాజకీయాలను చేస్తున్న తీరు తో ప్రపంచం ముందు తలవంపుల పాలు కావడం జరుగుతుంది అని దీనికి వ్యతిరేకంగా పీడిత ప్రజా ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాలలో బాగంగా జూన్ 20 నుంచి జిల్లా వ్యాప్తంగా పౌరహక్కుల పరిరక్షణ – ఓంకార్ పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలు నిర్వహించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై అనుసరిస్తున్న సాచివేత విధానాలకు వ్యతిరేకంగా గ్రామ, వార్డు స్తాయి లో ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కన్నం వెంకన్న, వంగల రాగసుధ, కనకం సంధ్య తదితరులు పాల్గొన్నారు.

సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి.

సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి

జైపూర్ నేటి ధాత్రి:

 

వరంగల్ హైవే కు టేకుమట్ల గ్రామానికి సౌకర్యవంతంగా సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని శుక్రవారం మాజీ సర్పంచ్ గొనె సుమలత నర్సయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కార్మిక,గనుల శాఖ మంత్రి డాక్టర్.వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందజేశారు.టేకుమట్ల నుండి వరంగల్ వైపు వెళ్తున్న ప్రధాన హైవే విషయమై ప్రతినిధి బృందం కలిసి వివరణ ఇవ్వడం జరిగింది.హైవేకు ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం చేపడితే,స్థానిక రైతులు,ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని వారు తెలిపారు.
అలాగే స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వేగవంతంగా జరుగడంతోపాటు,రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సర్వే చేపట్టిన బృందం వివరించింది.ఈ విషయాన్ని గమనించిన మంత్రివర్యులు,సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రైతన్నలు ఆకాశం వైపు ఎదురుచూపు.

ఎటూ పోయావు వానమ్మా…

రైతన్నలు ఆకాశం వైపు ఎదురుచూపు

శాయంపేట నేటిధాత్రి:

జూన్ మాసం వచ్చి 20 రోజులు గడిచిన తొలకరి పలకరించలేదు ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైన రైతు వర్షం రోజు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. మేఘాలు వర్షం రావడం కరుణించకపోవడంతో వానకాలం పంట సీజన్ ఆరంభంలో నిరాశ చెందు తున్నారు. ప్రకృతి విపత్తుల నేపథ్యంలో పంటలు దెబ్బ తినడంతో రైతులు నష్ట పోవలసిన పరిస్థితి వస్తుంది ఒక నెల ముందుగానేప్రారంభిం చాలని దిశ నిర్దేశం చేసింది. చినుకులు లేకపోవడంతో విత్తనాలు విత్తకుంటే అధిక దిగులు వస్తాయని రైతులు ఆలోచించారు ఎప్పటిలాగే రైతులు వానాకాలంలో వ్యవసాయ పనులు చేసుకునే పరిస్థితి కూడా లేకపోయింది. మేఘాలు మొఖం చాటేసుకోవ డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అమ్ముకోవా లని నానా కష్టాలు పడి అమ్ముకుంటే జూన్ నెలలో విత్తనాలు వేసుకుంటే రైతన్నలకు వాన కాలంలో అనావృష్టి వెంటాడుతుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాకే నల్లరేగడిలో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లో రైతులు వర్షం వస్తుందని నమ్మకంతో పత్తి విత్తనాలు నాటి ఎదురు చూస్తున్నారు ఈసారి ఎండ తీవ్రత విపరీతంగా ఉండడం తో మండలంలోని చెరువులు కుంటాను నీళ్లు లేక విలవిల బోతున్నాయి ఆయకట్టు వనరులు ఉన్న ప్రాంతాల్లో ఆయకట్టు వనరులు ఉన్న ప్రాంతాలలో ఆయకట్టు రైతులు కూడా వరుణుడు దీవెనలు కోసం ఎదురుచూ డాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎదురుచూస్తున్నాం..

మండలం రైతు ముసికే అశోక్

వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాం సీజన్ లో వర్షాలు రాకుండా కష్టపడి పండించిన తర్వాత లేదా పంటలు చేతకొచ్చే సమయంలో వర్షాలు వచ్చి మమ్మల్ని నష్టం పరుస్తుంది ఈ వర్షాకాలంలో మొదట్లోనే వర్షాలు రాక కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రచురణార్ధం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన.

ప్రచురణార్ధం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తప్పదు
రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ

మంచిర్యాల జూన్ 19 నేటి ధాత్రి:తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో మరింత జాప్యం చేస్తే రాష్ట్రవ్యాపిత ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం మంచిర్యాలలోని నస్పూర్ సీసీసీ ప్రెస్ క్లబ్ లో టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ ఘనంగా జరిగింది. ఈ మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జర్నలిస్టులకు
అండగా నిలిచి సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్
టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న యూనియన్ టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అని అన్నారు. అన్ని జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలపడుతుందని, ఈ నేపథ్యంలో అవగాహన లోపంతో ఫెడరేషన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వానికి
ఒక యూనియన్ వంతపాడితే.. ప్రస్తుత ప్రభుత్వానికి మరో యూనియన్ వంత పాడుతుందని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలోపాతానికి చేస్తున్న జిల్లా నాయకులను మామిడి సోమయ్య ఈ సందర్భంగా అభినందించారు.ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ… రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ 20 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ…
జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదని, జర్నలిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు మొండి చేయి చూపిందని అన్నారు. కనీసానికి వర్కింగ్ జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా మూడు నెలలకోసారి స్టిక్కర్ల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమంపై ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ మహాసభలో సీపీఐ రాష్ట్రదర్శి వర్గ సభ్యుడు శంకర్, ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు యూసుఫ్, జిల్లా సన్నాహక కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మధు, కో- కన్వీనర్లు వెంకట స్వామి గడ్డం సత్యా గౌడ్
మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అధ్యక్షుడుగా మిట్టపల్లి మధు(సూర్య), ఉపాధ్యక్షుడుగా వెంకటస్వామి(ప్రజాపాలన), కార్యదర్శిగా గడ్డం సత్యగౌడ్(నేటిధాత్రి), సంయుక్త కార్యదర్శులుగా నేరెళ్ళ నరేష్ గౌడ్, నరేందర్, సుమన్,రవి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎంఏ హఫీజ్, ఇప్ప సురేష్, సందలేని నర్సయ్య, సదానందం, శ్రీనివాస్,కోశాధికారి గా సబ్బని భాస్కర్,కార్యవర్గ సభ్యులుగా ఎండీ సుల్తాన్, ఎస్. మల్లేష్
తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా శానగొండ శ్రీనాథ్ ఎన్నికైనట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.

ఆర్ధిక సహాయం అందించిన శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్.

ఆర్ధిక సహాయం అందించిన శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్

మంగపేట నేటిధాత్రి:

 

శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అకినేపల్లి మాల్లారం గ్రామానికి చెందిన ఆవిరి.సూరిరావు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంవల్ల వారి కుటుంబంలో ఆర్థిక సమస్యలమ ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ చైర్మన్ ఈశ్వర్ చంద్ తెలుసుకొని వారి కుటుంబానికి సహాయంగా 50 కేజీల బియ్యం,ఐదు కేజీల ఆయిల్ క్యాన్ ను ట్రస్ట్ సభ్యుల ద్వారా అందించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రస్ట్ మండలం అధ్యక్షులు:నూతులకంటి.ఈశ్వర్ చంద్, ట్రస్ట్ సభ్యులు నన్ను బోయిన. సాంబయ్య,నూతులకంటి.గౌరీ శంకర్,జై భీమ్ రామ్మోహన్,రవి తదితరులు పాల్గొన్నారు

సంక్షేమ సారధి మంత్రి సీతక్క…

సంక్షేమ సారధి మంత్రి సీతక్క…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు…

సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

మంగపేట-నేటిధాత్రి

 

 

 

 

 

సంక్షేమ సారధి మంత్రి సీతక్క అని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు శుక్రవారం మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో ఇటీవల మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల కి ముగ్గులు పోసి నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో మంజూరు కానీ పేదవాడి సొంతింటి కలని నేడు మంత్రి సీతక్క సాకారం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు మొదటి విడతలో అకినేపల్లి మల్లారం గ్రామ పంచాయతీ కి మొత్తం పదమూడు ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే మరో విడతలో అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ పక్కా ఇండ్లు మంత్రి సీతక్క సహకారంతో మంజూరు అవుతాయని అర్హులైన వారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సాంబశివరెడ్డి అన్నారు ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు గృహ నిర్మాణ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులకు సేవలు అందించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధూళిపాల బాలకృష్ణ కటుకూరి శేషయ్య శెట్టిపల్లి నర్సింహారావు రవి సాంబశివరావు రాజు శెట్టిపల్లి పూలమ్మ గ్రామపంచాయతీ సిబ్బంది చెట్టిపల్లి వెంకటేశ్వర్లు ఇందిరమ్మ లబ్ధిదారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ప్రజా పాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి.

ప్రజా పాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో

◆ పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి*

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

ప్రజా సమస్యల పరిష్కారానికై టీపీసీసీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది.అందులో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారిని నియమించారు.వారు శుక్రవారం 20/06/2025,ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించారు.అనంతరం సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా గాంధీ భవన్లో ప్రజల సమస్య లకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామన్నారు.ఈకార్యక్రమంలో తెలంగాణ ఫిషరిస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు.సాయి కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం

మంగపేట నేటిధాత్రి:

 

ములుగు జిల్లా మంగపేట మండలం ప్రొద్దుమూర్ గ్రానానికి చెందిన బద్ది పాపారావు ఇటీవల రోడ్ ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబం తీవ్ర దుఃఖం లో వున్నారు.రోజు వారి పనులకు వెళ్లి జీవనం సాగించే ఇంటి పెద్ద అనుకోని ప్రమాదం లో చనిపోవడం ,మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం ఏం చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్న వారి కుటుంబ పరిస్థితి ని స్థానికులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారికి తెలియజేయగా దశదినకర్మల నిమిత్తం (4000 రూపాయలవిలువైన)50 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులు స్థానికులు చే వారి కుటుంబానికి అందజేశారు.అడగగానే సహాయం అందజేసిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కు మరియు ట్రస్ట్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియచేసారు .ఈ కార్యక్రమంలో మాను పెళ్లి. వేణు,కలల రాంబాబు,గుగ్గిల సురేష్,బద్ది రఘుబాబు,మానపల్లి రోహిత్. బద్ది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

శరణార్థులను ఆదుకోవాలి.

శరణార్థులను ఆదుకోవాలి.

సోషలిస్ట్ రిపబ్లికం అసోసియేషన్ అధ్యక్షుడు రాజలింగు మోతే

మంచిర్యాల జూన్ 20 నేటి ధాత్రి:

శరణార్థులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతే అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల ఎస్ ఆర్ ఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… యుద్ధాలు, హింస, లేదా ఇతర కారణాల వల్ల తమ దేశాలను వదిలి వలస వచ్చిన ప్రజలకు ఆహారం, నీరు, వసతి, వైద్య సహాయం, విద్యను అందించి వారికి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని ఆయన అన్నారు.
శరణార్థుల చట్టపరమైన న్యాయపరమైన హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.వారు సమాజంలో కలిసిపోయేలా మరియు సమాన అవకాశాలు పొందేలా చూడాలన్నారు. వారిని సామాజిక దృక్పథంతో అర్థం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో ఎస్ ఆర్ ఏ రాష్ట్ర నాయకులు సైకాలజిస్ట్ డాక్టర్ అంబాల సమ్మయ్య, జిల్లా నాయకుడు కాంపెల్లి హరి చరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు.!

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు తల్లిదండ్రులారా ఆలోచించండి

ట్రైనింగ్ పొందిన టీచర్స్

చదువులో అనుభవం ఉన్న టీచర్స్

పిల్లలకు అనుగుణంగా చదువు చెప్పే టీచర్స్

పిల్లలలోని ప్రతిభను గుర్తించే టీచర్స్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల బస్వ రాజు పల్లి పాఠశాల లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు . ప్రభుత్వ పాఠశాల లో బోదించే ఉపాధ్యాయులు మంచి ప్రతిబావంతులు ఉన్నారు ప్రజలు వారి పిల్లలని తమ దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని అనవసరంగా డబ్బులు ప్రయివేట్ విద్యా సంస్థలకి వృధా చేసుకోవద్దని తీన్మార్ మల్లన్న టీమ్ గణపురం మండల అధ్యక్షులు గండు కర్ణాకర్ ప్రజలకి సూచించారు. తాను కూడా తమ గ్రామం బస్వరాజపల్లి లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకి అతని కూతురుని పంపిస్తూన్నానని ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలల వైవు చూడాలని, ముక్యంగా వివిధ పార్టీల నాయకులు, రాజకీయ నాయకులు తప్పనిసరిగా వాళ్ళ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని డిమాండ్ చేసారు. ఇలా చేస్తే ప్రజలకి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలుగుతుందని చెప్పారు

మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత.

మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే ఫోర్ గడ్డ ఏరియాలో నివాసం ఉండే ఆటో డ్రైవర్ గోగర్ల భీమయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 9న మృతి చెందగా శుక్రవారం గోగర్ల భీమయ్య కుటుంబానికి ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు ఎనగంటి సంపత్ ఆధ్వర్యంలో 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ మనోధైర్యాన్ని అందించారు. భీమయ్య మృతి తోటి డ్రైవర్లను కలిచివేసింధని తోటి డ్రైవర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు పాక అంజయ్య, కమిటీ సభ్యులు ఆల్క పున్నం, చెన్నాల సారయ్య, శ్రీనివాస్, కున్సోత్ సీతారాం నాయక్, నర్సయ్య, రవి,కిషన్ తదితరులు పాల్గొన్నారు.

పైడిపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం..!

పైడిపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం..!

నగరంలో బండి కుమారస్వామి కబ్జా విషయం ఇంకా కనుమరుగక ముందే, ఎల్లవుల కుమార్ యాదవ్ కబ్జాకు ప్రయత్నం?

ప్రభుత్వ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్న ఎల్లావుల కుమార్ యాదవ్ పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి :_ సంఘీ ఎలేందర్, దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు.

పైడిపల్లి, నేటిధాత్రి.

 

 

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పైడిపల్లి గ్రామ శివారు సర్వే నెంబరు 264లో ఎల్లావుల కుమార్ యాదవ్ ప్రభుత్వ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసుకొని, దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సంఘీ ఎలేందర్, జన్ను రవి లు అట్టి ప్రభుత్వ భూమిని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ఎల్లవుల కుమార్ యాదవ్ సర్వేనెంబర్ 263లో రిజిస్ట్రేషన్ చూపించి సర్వే నంబర్ 264 భూములను అమ్మినాడని, ఇట్టి విషయంపై గత కొన్ని ఏళ్లుగా పోరాటం చేయుచుండగా, వరంగల్ తహశీల్దార్ ఇట్టి భూమిలో, ఇది ప్రభుత్వ భూమి ఎవరు అక్రమించరాదని బోర్డు పెట్టడం జరిగినది అని, అయినా కానీ తన వైఖరి మార్చుకోకుండా కొందరి రాజకీయ నాయకుల పేర్లు చెప్పి, అక్కడున్న గుడిసె వాసులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కావున ఎల్లవుల కుమార్ యాదవ్ పై నమోదైన కేసుల సంఖ్యలు పరిశీలించి వరంగల్ పోలీస్ కమిషనర్ అతడిపై రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని కోరడమైనది. నగరంలో బండి కుమారస్వామి కబ్జా విషయం ఇంకా కనుమరుగక ముందే ఎల్లవుల కుమార్ యాదవ్ కబ్జాకు ప్రయత్నం చేయడం వరంగల్ జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ గా మారిందని భూకబ్జాదారులను వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్ కట్టడి చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో
సిపిఐ నాయకులు ఆరే రాజు, మాస్కే సుదీర్, బెజ్జంకి యాకంబ్రచారి, రాచర్ల రాజేందర్, మంద నవీన్ లు పాల్గొన్నారు.

హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి.

ఎన్నికల హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి,

ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు ఇవ్వాలి,

యూరియా సరఫరా లో ప్రభుత్వం విఫలం

గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో వడ్లు పండించిన ప్రతి రైతుకు ఎన్నికల హామీ మేరకు బోనస్ ఇవ్వాలని గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు హామీల అమలు విషయంలో కాలయాపన చేస్తున్నారని అన్నారు, ఇప్పటికైనా రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, ప్రతి రైతుకు రైతు బంధు పథకం అమలు చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన ధర్నా చేపడతామని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో అనేక కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టారని, కొందరు రైతులకు ఇప్పటికీ ధాన్యం డబ్బులు పడలేదని, జిల్లా యంత్రాంగం రైతులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వానకాలం పంట సాగు సమీపిస్తున్న ఇప్పటికీ యూరియా అందుబాటులో లేదని, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

హఫీజ్ భాయ్ సోదరుని రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న నాయకులు.

హఫీజ్ భాయ్ సోదరుని రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం చిలపల్లి మాజీ ఎంపీటీసీ హఫీజ్ భాయ్ సోదరుని రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మరియు జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ మరియు ఉదయ్ శంకర్ అశ్విన్ పటేల్ మొహమ్మద్ జఫర్ ప్రసాద్ ఫక్రుద్దీన్ సద్దాం హుస్సేన్ రవి శీను పార్టీ పెద్దలు, నాయకులు,యుత్ కాంగ్రెస్ నాయకులు. పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పల్లా గారిని పరామర్శించిన మాజీ మంత్రి.

ఎమ్మెల్యే పల్లా గారిని పరామర్శించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఇటీవల స్వల్ప ప్రమాదానికి గురై హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని శుక్రవారం మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు,జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా గారిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు సంగారెడ్డి, కుత్బుల్లాపూర్ వివేక్ గౌడ్,ఎమ్మెల్సీ నవీన్ రావు గార్లు ఉన్నారు.

ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.

ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.

మెట్ పల్లి జూన్ 20 నేటి ధాత్రి:

మెట్ పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.
లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మెట్పల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం రేకుర్తి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చే కంటి పరీక్షలు చేశారని దాదాపు 300 మంది కంటి వైద్య శిబిరానికి హాజరైనారు .
ఇందులో 50. మందికి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి లయన్స్ క్లబ్ నుండి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి రేకుర్తి హాస్పిటల్కు పంపించడం జరిగిందని అక్కడ ఆపరేషన్ చేసి అనంతరం తిరిగి ఆత్మకూర్ గ్రామం కు ఉచితంగానే బస్సులో తీసుకు వస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకొని లబ్ధి పొందాలని అదేవిధంగా సంవత్సరం ఆరు సార్లు కంటి వైద్య శిబిరం రెండుసార్లు గుండె వైద్య శిబిరం చేస్తామని ఇటీవల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని పట్టణ గ్రామీణ ప్రజలు అత్యధిక మంది సద్వినియోగం చేసుకున్నారని ప్రభుత్వ పాఠశాలలో గాని హాస్టల్లో గాని ఇతర పేదవారికి ఫుట్పాత్ వ్యాపారులకు అంబ్రెల్లాల్సు లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా అందిస్తుందని పట్టణ గ్రామీణ ప్రజలు లయన్స్ క్లబ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్, సెక్రెటరీ గూండా రాకేష్ క్యాషియర్ నాంపల్లి వేణు గోపాల్, వెల్ముల శ్రీనివాసరావు, మర్రి భాస్కర్,ఆల్ రౌండర్ గంగాధర్ లయన్స్ క్లబ్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పదోన్నతి పొందిన లక్ష్మణ్ సన్మానం.

పదోన్నతి పొందిన లక్ష్మణ్ సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో సెక్యూరిటీ హెడ్ గార్డ్ గా పదోన్నతి పొంది బదిలీపై కరీంనగర్ వర్క్ షాప్ వెళ్తున్న భోజనపు లక్ష్మణ్ ను ఆర్టీసీ సిబ్బంది ఘన సన్మానం చేశారు.ఈ సందర్భంగా
డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీతో పాటు డిపో సెక్యూరిటీ హెడ్ వీరారెడ్డి, సెక్యూరిటీ టీం గోవర్ధన్,దేవేందర్ లక్ష్మణ్ ను శాలువాలు,పుష్ప గుచ్చo తో సన్మానం చేశారు.అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో డిపో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ వెంకట్ రెడ్డి,గ్యారేజ్ సిబ్బంది,డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలి.

మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పట్టణ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చొప్పరి శేఖర్, మంద భాస్కర్ మాట్లాడుతూ కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి పాలన గాడి తప్పిందన్నారు. ఫుల్ టైం కమిషనర్ లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. విలీన గ్రామాలలో వీధిలైట్లు వెలగక పోవడంతో బయటకు రావాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా పారిశుధ్యం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. అంతేకాకుండా దోమలు రాత్రి వేళల్లో స్వ్యేరా విహారం చేయడం వలన కంటిమీద కునుకు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా విష జ్వరాల బారిన పడకుండా తక్షణమే ఫాగింగ్ చేపట్టాలని, సైడ్ కాల్వల్లో ఆయిల్ బాల్స్ వేయాలని అన్నారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు స్పందించి సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శాఖ మహాసభలు జూన్ 21 నుండి 29 వరకు జరుగుతాయని, జూన్ 30న మున్సిపాలిటీ కేంద్రంలో మండల మహాసభ జరుగుతుందని,ఈ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం సిపిఐ నాయకులు కాసు సాయిచరణ్, ఎస్కే ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version