స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం
వేలకోట్ల రూపాయలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా
రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలబెట్టా.
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
నల్లబెల్లి, నేటిధాత్రి:
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలు అవినీతి పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి మార్పు వస్తుందని ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించగా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని. 18 నెలలోనే ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకించడం దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి దక్కిందని ఆయన ఎద్దేవ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మండలంలో ప్రతి తండాకు, గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించి 40 కిలో మీటర్ల పొడవున కంకర వేసి తారు రోడ్డు వేసే సమయంలో నోటిఫికేషన్ రాగా అట్టి పనులను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే పనులను రద్దు చేయడం విడ్డూరంగా ఉంది. మండలంలో పార్టీలకతీతంగా రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, పైపులు మోటార్లు ఇవ్వడం జరిగిందని అలాగే అకాల వర్షాలతో రైతులకు పంట నష్టం జరగగా ప్రతి రైతుకు పదివేల చొప్పున నష్టపరిహారం ఇప్పించి మరికొంతమంది కి రాలేదని నా దృష్టికి రావడంతో ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి మరల 3000 మందికి నష్టపరిహారం మంజూరు చేయించి అప్పటి కలెక్టర్ వద్ద మంజూరు నిధులను ఉంచడం జరిగిందని.
ఇప్పుడున్న ఎమ్మెల్యే దానిపై ఎందుకు దృష్టి పెడుతలేరని దానితోనే రైతులపై మాధవరెడ్డికి ఎంత ప్రేమ ఉందో రైతన్నలు గమనించాలని అన్నారు. ఒకప్పుడు రాజకీయ కక్షలకు నిలయంగా మారిన నర్సంపేట నియోజకవర్గం వర్గాన్ని శాంతియుతంగా అన్ని రాజకీయ పార్టీలు, కులాల మతాలకు అతీతంగా ఎలాంటి గొడవలుకు తావు లేకుండా శాంతి సామరస్యాన్ని నెలకొల్పితే మళ్లీ దురదృష్టవస్తు ఒక దుర్మార్గున్ని గెలిపించుకోగా ఊర్లలో రౌడీ రాజకీయం మళ్ళీ మొదలైంది ఇలాంటి వాటికి చరమగీతం పాడాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త చెమటోర్చి కసిగా పనిచేస్తేనే విజయం దిశగా పరుగులు తీస్తారని ఆయన కార్యకర్తలకు సూచన చేశారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానంతో తెలిసి తెలియక ప్రాజెక్టులపై మాట్లాడడం విడ్డూరంగా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియని అజ్ఞాన వ్యక్తి రేవంత్ రెడ్డి. దేవదుల ప్రాజెక్టు గోదావరి నదిపై ఉన్నదా లేదా కృష్ణా నదిపై ఉన్నదా తెలియక పోయినా ప్రాజెక్టులపై మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను ప్రభుత్వం ఏర్పడిన నుండి ప్రతి పైసా ప్రజలకు అందే విధంగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసే దిశగా బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, పిఎసిఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ జెడ్పిటిసి హరినాథ్ సింగ్, మాజీ వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వరరావు, క్లస్టర్ ఇన్చార్జిలు గందె శ్రీనివాస్ గుప్తా, మామిళ్ళ మోహన్ రెడ్డి, ఇంగ్లీ శివాజీ, వైనాల వీరస్వామి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తక్కలపల్లి మోహన్ రావు, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నాన బోయిన రాజారాం యాదవ్, మండల మహిళా అధ్యక్షురాలు గోనె శ్రీదేవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఖ్యాతం శ్రీనివాస్, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.