మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలి.

మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పట్టణ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చొప్పరి శేఖర్, మంద భాస్కర్ మాట్లాడుతూ కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి పాలన గాడి తప్పిందన్నారు. ఫుల్ టైం కమిషనర్ లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. విలీన గ్రామాలలో వీధిలైట్లు వెలగక పోవడంతో బయటకు రావాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా పారిశుధ్యం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. అంతేకాకుండా దోమలు రాత్రి వేళల్లో స్వ్యేరా విహారం చేయడం వలన కంటిమీద కునుకు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా విష జ్వరాల బారిన పడకుండా తక్షణమే ఫాగింగ్ చేపట్టాలని, సైడ్ కాల్వల్లో ఆయిల్ బాల్స్ వేయాలని అన్నారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు స్పందించి సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శాఖ మహాసభలు జూన్ 21 నుండి 29 వరకు జరుగుతాయని, జూన్ 30న మున్సిపాలిటీ కేంద్రంలో మండల మహాసభ జరుగుతుందని,ఈ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం సిపిఐ నాయకులు కాసు సాయిచరణ్, ఎస్కే ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version