ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.

ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.

మెట్ పల్లి జూన్ 20 నేటి ధాత్రి:

మెట్ పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.
లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మెట్పల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం రేకుర్తి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చే కంటి పరీక్షలు చేశారని దాదాపు 300 మంది కంటి వైద్య శిబిరానికి హాజరైనారు .
ఇందులో 50. మందికి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి లయన్స్ క్లబ్ నుండి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి రేకుర్తి హాస్పిటల్కు పంపించడం జరిగిందని అక్కడ ఆపరేషన్ చేసి అనంతరం తిరిగి ఆత్మకూర్ గ్రామం కు ఉచితంగానే బస్సులో తీసుకు వస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకొని లబ్ధి పొందాలని అదేవిధంగా సంవత్సరం ఆరు సార్లు కంటి వైద్య శిబిరం రెండుసార్లు గుండె వైద్య శిబిరం చేస్తామని ఇటీవల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని పట్టణ గ్రామీణ ప్రజలు అత్యధిక మంది సద్వినియోగం చేసుకున్నారని ప్రభుత్వ పాఠశాలలో గాని హాస్టల్లో గాని ఇతర పేదవారికి ఫుట్పాత్ వ్యాపారులకు అంబ్రెల్లాల్సు లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా అందిస్తుందని పట్టణ గ్రామీణ ప్రజలు లయన్స్ క్లబ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్, సెక్రెటరీ గూండా రాకేష్ క్యాషియర్ నాంపల్లి వేణు గోపాల్, వెల్ముల శ్రీనివాసరావు, మర్రి భాస్కర్,ఆల్ రౌండర్ గంగాధర్ లయన్స్ క్లబ్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

(TEOBDA) తెలంగాణ ఐ ఆర్గాన్ బాడీ డోనర్స్.!

(TEOBDA) తెలంగాణ ఐ ఆర్గాన్ బాడీ డోనర్స్ అసోసియేషన్ కన్వీనర్ గా గోనె ఎల్లప్ప

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

అవయవ దానం అత్యున్నత మైన దానమని, మానవత్వంతో అమరత్వం పొందవచ్చునని, మరణానంతర జీవం మరణించి జీవించవచ్చని తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిరిసిల్ల వాసి గోనె ఎల్లప్పను తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల(TEOBDA) సంఘం జిల్లా కన్వీనర్ గా డాక్టర్ అశోక్ నియమించారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో గోనె ఎల్లప్పకు సిరిసిల్ల జిల్లా కన్వీనర్ గా నియామక పత్రాన్ని అందజేశారు, వారు సిరిసిల్ల జిల్లాలో అవయవదానంపై అవగాహన, నేత్రదానాలు, దేహదానాలు ప్రోత్సహించవలసి ఉంటుందని, ఈ పదవి మూడు సంవత్సర కాలం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా పనిచేయవలసి ఉంటుందని డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.

భీమారం లో ఉచిత నేత్ర వైద్య శిభిరము.

భీమారం లో ఉచిత నేత్ర వైద్య శిభిరము

30 మంది రేకుర్తి ఆసుపత్రి కి తరలింపు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

డాక్టర్ భాస్కర్ మాదేకర్ ఉదార నేత్ర వైద్యశాల రేకుర్తి, కరీంనగర్ వారి సౌజన్యంతో, వైస్ చైర్మన్ లయన్ చిదురా సురేష్ సహకారంతో, మంచిర్యాల జిల్లా భీమారం జడ్పి ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ మంచిర్యాల,లయన్స్ క్లబ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ,లయన్స్ క్లబ్ విజన్ కేర్ ల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిభిరము నిర్వహించారు. వైద్య శిభిరానికి 70 మంది విచ్చేసి బి పి,షుగర్,కంటి పరీక్షల అనంతరం 30 మంది కంటి ఆపరేషన్ కోసం అర్హత సాధించినట్లు,వారిని ఉచిత కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి ఆసుపత్రి కి పంపించామని రేకుర్తి ప్రతినిధి ప్రభాకర్ మరియు లయన్ డాక్టర్ కె. సుగుణాకర్ రెడ్డి తెలిపారు.ఐ పెషేంట్ లకు వారి వెంట వెళ్లే వారికి ఉచిత బస్సు ప్రయాణం,ఉచిత భోజన వసతి ఉంటుందని తెలుపుతూ,కంటి ఆపరేషన్ తరువాత ఆదివారం భీమారం కు తిరిగి వస్తారని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఛైర్పర్సన్ ఫర్ ఐ క్యాంప్స్ లయన్ మోదుంపురం వెంకటేశ్వర్,మంచిర్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ పుల్లూరి బాలమోహన్,కోశాధికారి లయన్ కొల్ల వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి విజన్ కేర్ అధ్యక్షులు లయన్ సయ్యద్ ఇలియాస్ వారి సిబ్బంది,భీమారం మాజీ సర్పంచ్ చేకుర్తి సత్యనారాయణ రెడ్డి,భగద్గీత అధ్యయన మండలి సభ్యుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి.

ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి…

తంగళ్ళపల్లి నేటి దాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలంలో బస్సాపూర్ గ్రామంలో సందర్శించిన కలెక్టర్ సందీప్ కుమార్ . తంగళ్ళపల్లి మండల లో బస్వాపూర్ అంగన్వాడి కేంద్రంలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కేంద్రాల్లో అంగన్వాడి కేంద్రాల్లో చదివే ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా బ్లడ్ నెస్ ప్రివెన్షన్ వీక్ అంధత్వం నివారణ వారత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని తంగళ్ళపల్లి మండలంలోని బస్వాపూర్ లో సోమవారం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు ఏమైనా లోపాలు ఉంటే గుర్తించి పిల్లలకు మందులు అందజేయాలని సూచించారు ఎక్కువ ఇబ్బంది పడే విద్యార్థులకు ప్రభుత్వ దవాఖానలువైద్యం అందించాలని తెలిపారు బస్వాపూర్ లోని ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులు హాజరు శాతం పాఠశాలలో బోధిస్తున్న తీరు విద్యార్థుల ఉపాధ్యాయులు హాజరులను పరిశీలించారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం జిల్లా వైద్య అధికారి రజిత వైద్యులు నయు మా జహా సంపత్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు కంటి అద్దాల పంపిణి

*నులిపురుగుల నివారణ మాత్రలు అందజేత..

*విద్యార్థులు సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని హితవు.

పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 10:

పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా పలువురు విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేశారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలిక ఉన్నత పాఠశాల మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలలో ఈ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ…. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ పెట్టగలరని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను చేపడుతున్నాయన్నారు.అందులో భాగంగా కంటిచూపు సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు సెల్ఫోన్ వాడకంతో కంటి చూపును త్వరగా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అనంతరం కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న పలువురు విద్యార్థినిలకు ఆయన కంటి అద్దాలను పంపిణీ చేశారు.

నులిపురుగు నివారణ మాత్రల పంపిణి..

నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నులి పురుగు నివారణ మాత్రలైన ఆల్బెండజోల్ టాబ్లెట్లను ఈ సందర్భంగా ఆయన విద్యార్థినీలకు పంపిణీ చేశారు. అంతకుముందు నులిపురుగులతో తలెత్తే ఆరోగ్య సమస్యలపై అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ప్రతి ఒక విద్యార్థిని తప్పనిసరిగా ఆల్బెండజోల్ టాబ్లెట్లను తీసుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమాలలో పలమనేరు కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్.వి.బాలాజీ, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ అర్పిత, ఎంఈఓ బాలసుబ్రమణ్యం,బాలిగోన్నత పాఠశాల హెచ్ఎం లత,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి,పీ.ఎం. ఓ.ఓ మధు,ఎం. పి.హెచ్.ఈ.ఓ జయశంకర్ మరియు టీడీపీ నాయకులు ఆర్ బి సి,కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు, శ్రీధర్, కిరణ్, బీ ఆర్ సీ కుమార్, సుధాకర్, శంకరప్ప తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version