సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి
జైపూర్ నేటి ధాత్రి:
వరంగల్ హైవే కు టేకుమట్ల గ్రామానికి సౌకర్యవంతంగా సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని శుక్రవారం మాజీ సర్పంచ్ గొనె సుమలత నర్సయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కార్మిక,గనుల శాఖ మంత్రి డాక్టర్.వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందజేశారు.టేకుమట్ల నుండి వరంగల్ వైపు వెళ్తున్న ప్రధాన హైవే విషయమై ప్రతినిధి బృందం కలిసి వివరణ ఇవ్వడం జరిగింది.హైవేకు ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం చేపడితే,స్థానిక రైతులు,ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని వారు తెలిపారు.
అలాగే స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వేగవంతంగా జరుగడంతోపాటు,రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సర్వే చేపట్టిన బృందం వివరించింది.ఈ విషయాన్ని గమనించిన మంత్రివర్యులు,సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.