జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక ధర తగ్గించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T140516.191-1.wav?_=1

 

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక ధర తగ్గించాలి

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు తెలంగాణ బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి పిలుపు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం యూనియన్ అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు గారి అధ్యక్షతన బి.వై. నగర్ లోని కామ్రేడ్.. అమృత్ లాల్ శుక్లా కార్మిక భవన్ లో జరిగింది ఇట్టి సమావేశంలో జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక , మొరం ,మట్టి కొరత మరియు భాను నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం అప్పజెప్పడం ద్వారా భువన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు జరిగే నష్టాలను చర్చించి జిల్లాలో స్థానిక సమస్యలపై ఆగస్టు 25వ తేదీ సోమవారం రోజున ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగినది.ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మండ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక మొరం మట్టి కొరత వలన నిర్మాణ మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతోపాటు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదేవిధంగా భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రభుత్వము ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని దీనివలన జిల్లాలో భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు.జిల్లాలో స్థానికంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీ సోమవారం రోజున ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి ధర్నాలో జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులు అదేవిధంగా నిర్మాణరంగంలో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇట్టి సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాపేల్లి రమేష్ , కోల శ్రీనివాస్ , ఈసంపేల్లి రాజెలయ్య , గుంటుక నరేందర్ , సావన పెల్లి ప్రభాకర్ , భూక్య వెంకట్ , దేవయ్య , శంకర్ , చంద్రయ్య , మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో విచ్చలవిడిగా ఇసుక రవాణా.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో విచ్చలవిడిగా ఇసుక రవాణా.

పట్టణాలకు తరలిస్తూసొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

ఎలుకటి రాజయ్య మాదిగ. ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ఇసుకను అక్రమార్కులు డంపులు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ పీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతా గరిమిళ్లపెల్లి,రామకిష్టాపూర్ ( వి)గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇసుక ను ఇందిరమ్మ ఇండ్లు పేరుతో గ్రామాల్లో డంపులు ఏర్పాటు చేసి, పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, ఈ తతంగం అంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరుగుతుందని అన్నారు. టేకుమట్ల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం టేకుమట్ల మండలకేంద్రంలోని చలివాగు నుండి ఇసుక తరలించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు ఇష్టారీతినా వ్యవహారిస్తూ, అక్రమార్కులకు సహకరించే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇటీవల గరిమిళ్లపెల్లి, రామకిష్టాపూర్ ( వి )గ్రామాల్లోని ఇసుక డంపులు అందుకు నిదర్శనం అని,ఈ దందా ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటిపోయి భవిష్యత్తులో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, ఈ ప్రాంత సహజ వనరులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఎలుకటి రాజయ్య డిమాండ్ చేశారు

ఇందిర ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభూ పూజ…

ఇందిర ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభూ పూజ…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఇందిర మహిళలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఆశయం దిశగా. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన. అందిస్తూ. అర్హులకు . లబ్ధిదారులకు.అండగా ఉండి ప్రభుత్వం. ఇందిరమ్మ. ఇండ్లు మంజూరైన. మహిళలకు. భూమి పూజ చేయడం జరిగిందని. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్.పూజా కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజమైన పేద ప్రజలకు. అనేక సంక్షేమ పథకాలు. అందిస్తూ వారికి అండగా ఉంటున్నారని ఇందిరమ్మ ఇల్లా నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని. లబ్ధిదారులు. అందరూ . వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నామని అలాగే. ఆరోగ్యారంటీలే. కాకుండా. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల. అవకాశం కల్పిస్తూ. పేదవారి . కాంగ్రెస్ పెద్దలు. అధికారులకు పెద్దలకు ఎంతో కృషి చేస్తున్నారని వారందరికీ పేరుపేరునా లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు.తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ తో పాటు. వ్యవసాయ.మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు. నేరెళ్ల నర్సింగ్ గౌడ్. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. లింగాల భూపతి. సత్తు శ్రీనివాస్ రెడ్డి. మునిగిల రాజు. గుగ్గిల భరత్ గౌడ్. గ్రామ శాఖ అధ్యక్షులు కోలా శంకర్. ఆనందం. ఎల్లయ్య. శ్రీను. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

దిగ్వాల్లో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-33.wav?_=2

దిగ్వాల్లో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలో ప్రజపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆత్మ కమిటీ చైర్మన్ పట్లోళ్ల రామలింగా రెడ్డి గురువారం అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. భూమి పూజలో పాల్గొని పనులు ప్రారంభించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఎమ్మెల్యే

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T114519.415.wav?_=3

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

కవర్గాలబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని మరియు నియోనికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు గత ప్రభుత్వం లో నియోజకవర్గంలోని నిరుపేదలకు అర్హులైన 660 మంది లబ్దిదారులకు లాటరీ సిస్టం ద్వారా ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం జరిగింది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని & నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పాతపక్షంగా ఉండాలని,అర్హులైన వారందరికీ పార్టీలకు అతీతంగా అందజేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య గారికి వినతిపత్రం అందజేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, మాజి సర్పంచ్ చిన్న రెడ్డి తదితరులు ఉన్నారు..

బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల తనిఖీలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T134426.549-1.wav?_=4

బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల తనిఖీలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

బస్వాపూర్ గ్రామంలో. ఇందిరమ్మ ఇండ్లతీరుపై. హారా తీసిన స్థానిక ఎంపీడీవో. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల వాడవాడలా ఇండ్లు తిరుగుతూప్రభుత్వ ఆదేశానుసారం. విడతలవారీగా తొందరగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన ఇండ్లకు సంబంధించిన దానిని లబ్ధిదారులు తొందరగా పనులు పూర్తి చేసుకొని ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా. స్థానిక. తంగళ్ళపల్లి. ఎంపీడీవో లక్ష్మీనారాయణ లబ్ధిదారులను వారు చేస్తున్న పనులు త్వరగా ముగించుకొని. ప్రభుత్వం అందించే. రుణాలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎగుర్ల.ప్రశాంత్. దేవరాజ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ గ్రామ లబ్ధిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ శాఖ లసమావేశం….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T122230.511.wav?_=5

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ శాఖ లసమావేశం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లి. మల్లాపూర్ గ్రామంలో. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ శాఖల పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తూ ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు గురించి అవగాహన కల్పిస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన స్థానిక అభ్యర్థులని గెలిపించుకోవాలని ప్రచారం చేస్తూ ప్రభుత్వం వచ్చిన 18 నెలల లోపే. ప్రభుత్వం ఇచ్చిన ఆర్ గ్యారంటీలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి. ఇందులో ఇందిరమ్మ ఇండ్లు కానీ. సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ. రైతు రుణమాఫీ కానీ. మహిళలకు పావలా వడ్డీ.10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ తో పాటు 18 నెలలలో ప్రభుత్వం చేసిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను. అందించారని వివరిస్తూ ప్రజలకు. అవగాహన చేయడం జరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని. అభివృద్ధిలో ముందు ఉంచుతూ. గత ప్రభుత్వాలు చేసిన అప్పులను తీర్చుకుంటూ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలను అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ల భరత్ గౌడ్. జిల్లా సీనియర్ నాయకులు ఆఖరి బాలరాజు.మల్లేష్ యాదవ్. ఎడ్ల తిరుపతి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.!

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో గ్రామసభలు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download.wav?_=6

తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలే స్థానిక సంస్థలఎన్నికల లో.కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు పునాదులు. అని. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ప్రవేశపెట్టిన పథకాలే స్థానిక అభ్యర్థులను గెలిపిస్తాయని దానికి ఇందిరమ్మ ఇండ్లు కానీ. సన్న బియ్యం గాని. రేషన్ కార్డులు గానీ. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో కానీ. రైతు రుణమాఫీ కానీ. మహిళలకు పావలా వడ్డీరుణాలు గాని
. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 18 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పిస్తూ ఇక ముందు కూడా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కంటే. ఎక్కువగా అమలు చేస్తారని. తంగళ్ళపల్లి మండలంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ప్రజలకు వివరిస్తూ. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని రాబోయే కాలంలో మరింత అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయేలా. ప్రజలు తమ ఓటు హక్కుతో స్థానిక అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగిల రాజు. సత్తు శ్రీనివాస్ రెడ్డి.లింగాల గుగ్గిళ్ళ భరత్
. బాలరాజ్ కోల మాజీ సర్పంచ్ బానయ్య.జలంధర్ రెడ్డి. సదానందం. శ్రీరామ్. శ్రీనివాస్. అంజయ్య. రాములు. లావణ్య. ప్రమీల. తంగళ్ళపల్లి మండల. ప్రతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో బుర్రకాయలగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘం ఎరువుల దుకాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆరోగ్య కేంద్రాలను, తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులు, స్టోర్ రూము తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులతో ముకాముఖి మాట్లాడారు. నిర్మాణ పనులలో జాప్యం జరుగకుండా నాణ్యత పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులకు నిర్మాణ పద్ధతులపై అవగాహన కల్పించి, అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చే దిశగా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి ఇంటి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులు వీలైనంత తొందరగా గృహ ప్రవేశం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేస్తూ సత్వరం పనులు పూర్తి అయ్యేలా పని చేస్తేనే లక్ష్యాన్ని సాధించగలమన్నారు. గణపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని గృహ నిర్మాణ శాఖ పిడిని అడిగి తెలుసుకున్నారు. ఇసుక ఎక్కడి నుండి తెస్తున్నారని అడిగి తెలుసుకుని ఇసుక ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాల్వపల్లి నుండి ఇసుక తెస్తున్నట్లు పిడి తెలిపారు.
అనంతరం ప్రాథమిక పశు వైద్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పశువుల చికిత్స కు వచ్చిన రైతులతో వైద్యసేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందులు స్టాకు ఉంచాలని, పశువులు వ్యాధులకు గురికాకుండా టీకాలు వేయాలని సూచించారు. పశు సంపదను కాపాడుకోవాలని తెలిపారు. అవసరమైన మందుల కొరకు ప్రతిపాదనలు ఇవ్వాలని పశు సంవర్ధక శాఖ డిడిని సూచించారు. ఈ సందర్భంగా గొర్రెల వైద్య సేవలకు వచ్చిన రైతు జిల్లా కాలెక్టర్ కు గొర్రె పిల్లను బహుకరించారు వ్యాధులతో బాధ పడే ప్రజలు వైద్యుల సలహాలు, సూచనలతో మేరకు క్రమం తప్పక మందులు వాడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
తెలిపారు.శుక్రవారం గణపురం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలకు వచ్చిన ప్రజలతో సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీ పేరేంటి అని గట్టయ్యను అడిగి తెలుసుకుని ఏమి సమస్య ఉంది, వైద్యులు మంచిగా చూశారా లేదా మందులు ఇచ్చారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మీ అనే మహిళతో మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ తేలు కుట్టినందున వైద్య సేవలకు వచ్చానని తెలుపగా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని సూచించారు. ఓపి రిజిస్టర్, స్టోర్ రూము ను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు.
ప్రాథమిక సహకార సంఘం ఎరువుల విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి ఎరువుల నిల్వలు పరిశీలించారు జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు అవసరం మేర తీసుకోవాలని సూచించారు. ధరల పట్టిక, స్టాకు రిజిస్టర్ పరిశీలించారు. ఈ రోజు ఇప్పటి వరకు ఎంత మంది రైతులు యూరియా తీసుకున్నారని వివరాలు అడుగగా 13 మంది రైతులకు 30 బస్తాలు యూరియా ఇచ్చామని తెలిపారు. ఎరువులు, విత్తన దుకాణాలను నిత్యం పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులు, స్టోర్ రూములను పరిశీలించారు
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ భారతి దరఖాస్తులు. పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను ఆదేశించారు. నోటీసు లు జారీ, విచారణ ప్రక్రియ, దరఖాస్తులు తిరస్కరణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తిరస్కరించిన దరఖాస్తు దారులకు కారణాలు తెలియచేయాలని తెలిపారు.తహసీల్దార్ కార్యాలయ సందర్శనలో కార్యాలయానికి వచ్చిన వయోవృద్ధునితో ఏ సమస్య కొరకు వచ్చారని అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ ఎల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి.

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి. అనర్హులకు ఇవ్వడం సరైనది కాదు.

ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ పథకాన్ని కొంతమంది అభాసుపాలు చేస్తున్నారు

పారదర్శకత లేనట్లయితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలి

ఎన్ హెచ్ ఆర్ సి. సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మెహేందికార్ సందీప్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T143400.508.wav?_=7

“నేటిధాత్రి”,సూర్యాపేట టౌన్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు, గూడులేని నిరాశ్రయులకు ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తుంటే రాష్ట్రంలో చాలా చోట్ల అధికార పార్టీ పేరిట ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు కంకణం కట్టుకున్నారని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మెహిందీకార్ సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షురాలు పిడమర్తి నాగేశ్వరితో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లను ఎంపిక చేయడం సరికాదని అసలైనటువంటి నిరుపేదలకు, ఒంటరి మహిళలకు చెందాల్సినటువంటి ఇండ్లను స్థానికంగా ఉన్నటువంటి కొందరు నాయకులు, ఎంపిక చేసి అధికారులు కుమ్మక్కై కార్లు , లక్షల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నటువంటి వ్యక్తులకు కేటాయిస్తున్నారని అక్కడక్కడ ఒకే ఇంట్లోనే రెండు ఇండ్లు కూడా కేటాయించి నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పారదర్శకత లేనట్లయితే సంబంధించిన అధికారులని బాధ్యులని చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ కమిటీకి సంబంధించిన అధికారుల జాబితాను తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను అప్రతిష్టపాలు చేయడానికి అధికార పార్టీ పేరిట కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన తెలిపారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు విచారణ జరిపి అర్హులైన వారికే ఇండ్లను కేటాయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోటాచారి, అధికార ప్రతినిధి నామ వేణు, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు నెల్లుట్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ ద్వారా నిరుపేద గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి..

ఐటీడీఏ ద్వారా నిరుపేద గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతరావు

నేటిధాత్రి చర్ల

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-46.wav?_=8

ఐటీడీఏ ద్వారా గిరిజన కుటుంబాలకు అదనంగా మంజూరు అయిన 280 ఇళ్లను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అర్హులైన ఎస్టీ కుటుంబాలకు మజురు చేయాలిని అల కాకుండా అధికార పార్టీ నాయకుల అనుచరులకు కానీ కమిటీలు సూచించిన లిస్ట్ ప్రకారం అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తే బిఆర్ఎస్ పార్టీ తరుపున కచ్చితంగా నిలదీస్తాం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా వెనకడబోము అని బిఆర్ యస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఎస్టీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు తుర్రం రవి కారం కన్నారావు తెలియజేసారు మొదటి విడతలో అధికార పార్టీ నాయకులే బహిరంగంగా లబ్ధిదారుల జాబితాలో కొంతమంది అనర్హులకు ఇల్లు కేటాయించారు అని విమర్శలు చేసుకున్న ఇళ్లు ఉన్న వారికే ఇళ్లు కేటాయించిన అధికారులు ఏమి పట్టనట్టే వున్నారు కనీసం ఈసారైనా మండలంలో వున్న నిరుపేద ఎస్టీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి అని బిఆర్ఎస్ పార్టీ తరుపున అధికారులకు తెలియజేస్తున్నామని ఈ విషయంలో గిరిజన నాయకులు కూడా కలిగించుకొని బీద గిరిజనులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నామని పత్రికా ప్రకటనలో తెలిపారు

ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి

ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి*

గ్రామాల్లో నిత్యం పారిశుద్య పనులు నిర్వహించాలీ

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సనుగుల, రామారావుపల్లెలో ఆకస్మిక తనిఖీ

చందుర్తి, నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకొని.. ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. చందుర్తి మండలంలోని రామారావు పల్లె గ్రామపంచాయతీ కార్యాలయం ఎదురుగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువగా తిరగడం గమనించిన కలెక్టర్.. వాటిని నియంత్రించాలని పంచాయతీ సెక్రెటరీ , అధికారులకు ఆదేశించారు.

గ్రామాల్లో నిత్యం పారిశుద్య పనులు నిర్వహించాలీ

సనుగుల గ్రామపంచాయతీ పరిధిలో రహదారుల వెంట ఇరువైపులా గడ్డి, నిరుపయోగ మొక్కలు పెరగడం, రహదారి వెంబడి వర్షపు నీరు ఉండడాన్ని కలెక్టర్ పరిశీలించారు. రోడ్ల వెంట గడ్డి, ఇతర మొక్కలు వెంటనే తొలగించాలని, నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని
సూచించారు. గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో నిత్యం పారిశుద్య పనులు చేయించాలని, నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బోర్నపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ.

బోర్నపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ.

రాయికల్ జూలై 16, నేటి ధాత్రి.

రాయికల్ మండల పరిధిలోని బోర్నపెల్లి గ్రామంలో బుధవారం రాయికల్ మండల ఆర్ఐ పద్మయ్య, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరైన ఇండ్ల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరేష్, కోల శ్రీనివాస్.మాజీ సర్పంచ్ రాజు లత, ఆంజనేయులు, రాగుల సత్యం, లబ్ధిదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల.!

 

పారదర్శకంగా లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

పారదర్శకంగా లబ్దిదారులకు లాటరీ పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ముస్తాబాద్ మండల కేంద్రం మాతృశ్రీ గార్డెన్స్ లో ముస్తాబాద్ , గూడెం, కొండాపూర్ ఇందిరమ్మ ఇండ్ల లాటరీ కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

 

 

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, 94 ఇందిరమ్మ ఇండ్లను లబ్దిదారులకు లాటరీ పద్ధతిలో పారదర్శకంగా కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు నేడు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రొసీడింగ్స్ అందిస్తామని, ఇండ్లు పోందిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.కొండాపూర్ ఇందిరమ్మ ఇండ్ల వద్ద రోడ్డు, ప్లంబింగ్ పనులు నిర్మించాల్సి ఉందని వీటి నిర్మాణం కోసం 30 లక్షల రూపాయలు కలెక్టరేట్ నిధుల నుంచి మంజూరు చేసి నెల రోజుల లోపు పూర్తి చేస్తామని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల వద్ద మౌలిక వస్తువుల కల్పనకు ఇసుక, మోరం (మట్టి) సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా వేగవంతంగా లబ్ధిదారులు పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తూ సంబంధిత లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.

 

 

పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో సాండ్ ట్యాక్సీ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 200 మంది యువకులకు వాహనాలు అందించే వారి ద్వారా ఇసుక మట్టి తరలింపుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం గూడెం గ్రామం పరిధిలోని నూతనంగా కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కేకే మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ తాలారీ రాణి పీడీ,హౌసింగ్ శంకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి ఎంఏ భారతి, తాసిల్దార్, ఎంపీడీవో సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై హౌసింగ్.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లా లో ఇందిరమ్మ ఇళ్ల.నిర్మాణానికి సంబంధించి రెండవ దశలో ప్రభుత్వ పథకానికి ఎంపికై మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వేగంగా గ్రౌండింగ్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టర్ తన ఛాంబర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కు సంబంధించి అదనపు కలెక్టర్ యాదయ్య తో కలిసి హౌసింగ్ అధికారులతో సమీక్షించారు.
ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు రావడం జరుగుతుందని లబ్ధిదారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఒక్కో మండలం వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణం కొరకు మన ఇసుక వాహనం ద్వారా ఉచితంగా ఇసుక పొందడానికి అవగాహన కల్పించాలన్నారు. మన ఇసుక వాహనం ద్వారా ఇసుక అందించే విషయంపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని మైనింగ్ శాఖ సూచించారు.
సమావేశంలో హౌసింగ్ అధికారులు విఠోబా, ఏఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

14వ వార్డులో ఇందిరమ్మ గృహ ఇండ్ల భూమిపూజా.

14వ వార్డులో ఇందిరమ్మ గృహ ఇండ్ల భూమిపూజా

 

పరకాల నేటిధాత్రి

 

 

shine junior college

 

 

 

పరకాల పట్టణంలోని 14 వార్డులో ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన లబ్ధిదారులకు భూమిపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పట్టణ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ సోద అనితా రామకృష్ణ కాంగ్రెస్ పట్టణ అద్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,కుంకుమేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,మాజీ కౌన్సిలర్ మార్క ఉమా రఘుపతి,మాజీ మైనారిటి సెల్ అధ్యక్షులు ఎండీ అలీ హాజరై కొబ్బరికాయ కొట్టి నూతన నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటి సబ్యులు కొక్కిరాల స్వాతి,ఎండీ అమీనా,ఆకుల అశోక్,ఎండీ షఫీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

Shine Junior Colleges

భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, పద్దెనిమిది మంది లబ్దిదారులకు ఉత్తర్వుల మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అంతకుముందు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుడైన పాలకుర్తి తిరుపతి – స్వప్న ఇంటి నిర్మాణ పనులను ఎమ్మెల్యే టెంకాయ కొట్టి, మట్టి తీసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుపతి దంపతులకు ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు.

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం జరుగుతుందని. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని. మండలంలో పాపాయి పల్లె. రామన్నపల్లి. బస్వాపూర్. నేరెళ్ల. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసి భూమి పూజ చేసిన మని. ప్రజలకు అండగా ఉండి ప్రజా పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి అని ఆయన పాలనలో రాష్ట్రకాంగ్రెస్ ప్రజా పరిపాలన సాగిస్తుందని. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలు నెరవేస్తూ ఆరోగ్యారంటీలు అమలు చేస్తున్నామని. ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు పాలభిషేకం చేయడం జరిగిందని . ఇట్టి ఇందిరమ్మ ఇండ్లురావడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. పొన్నం ప్రభాకర్ కి. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కే కే మహేందర్ రెడ్డికి మండల అధ్యక్షుడు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ లింగాల భూపతి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ నాయకులు మునిగల రాజు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్. అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రాజేశ్వరరావు కిషన్ లక్కీ గారు తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో.!

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

జహీరాబాద్: నేటి ధాత్రి:

 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి
కొన్నింటి.నర్సింలు డిమాండ్ చేశారు. గురువారం జహీరాబాద్ ఆర్డీఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో వికలాంగులతో ప్రత్యేకంగా శ్రమ శక్తి సంఘాలు ఏర్పాటు చేసి జాబ్ కార్డ్స్ ఇచ్చి 150 రోజులు పని కల్పించాలని అన్నారు. .రాజీవ్ యువ వికాసం పథకంలో వికలాంగులకు 5 శాతం ఎస్సి ఎస్టీ బీసీ, మైనారిటీ కార్పొరేషన్లలో కేటాయించాలని కోరుతున్నాము.2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నాము అన్నారు.మండలంలో వికలాంగులను కించపరుస్తూ మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జహీరాబాద్ మండల అధ్యక్షుడు ఎం రాజ్ కుమార్
అల్గోల్ మచ్చేందర్ బిస్మిల్లా శోభమ్మ వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిధుల విడుదల.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిధుల విడుదల

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 24 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు లక్ష రూపాయల నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రభుత్వం ప్రతి మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిందని, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద మొత్తం 1023 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశామని అన్నారు. జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ లలో 300 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేసుకున్న 24 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మొదటి విడత ఆర్థిక సహాయం లక్ష రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు ప్రోసిడింగ్స్ పొందిన లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని, ప్రభుత్వం నాలుగు దశలలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తుందని, హౌసింగ్ శాఖ అధికారులు నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వేగంగా నిర్మించుకునేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version