న్యాల్ కల్ మండలం లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-25-4.wav?_=1

న్యాల్ కల్ మండలం లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండలంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా న్యాల్ కల్ మండలం కుర్మ సంఘం అధ్యక్షులు గొల్ల నర్సింలు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులు గా జహీరాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ జక్కుల హనుమంత్ సార్ హద్నూర్ గారు రావడం జరిగింది గోపికలు శ్రీకృష్ణ వేశాధారణ తో చిన్నారులతో కృష్ణ భగవానునికి పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం ఉట్టి కొట్టు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం శ్రీకృష్ణ భగవానుని జీవిత చరిత్ర గురించి విశ్వాహిందు పరిషత్ మండలం అధ్యక్షులు రాంచందర్ పవార్ మాట్లాడం జరిగింది ఈ కార్యక్రమం లో మల్గి మాజీ సర్పంచ్ జట్టుగొండ మారుతీ ఓంకార్ యాదవ్ మల్గి ఎంపీటీసీ శివానంద శ్రీపతి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మాజీ ఎస్. ఎం.సీ. చేర్మెన్ నర్సప్ప అశోక్ చల్కి దత్తు గొల్ల దిలీప్ కుమార్ యాదవ్ శ్రీనివాస్ పెద్దగొల్లా శ్రీనివాస్ గొల్ల రాములు మారుతీ మహేష్ సిద్దు సునీల్ మొగుళప్ప రాకేష్ ఆకాష్ విట్టల్ గొల్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు,

వీరశైవ లింగాయతుల విశ్వశాంతి పాదయాత్ర..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-21-5.wav?_=2

వీరశైవ లింగాయతులు పాదయాత్రలో సమాజ సేవకు కొత్త అడుగు

జహీరాబాద్ నేటి ధాత్రి:

విశ్వ శాంతికై వీర శైవుల పాదయాత్ర జిల్లాఉపాధ్యక్షులు ఆగూర్ శివరాజు జహీరాబాద్, విశ్వశాంతి కై తాలూకా వీరశైవ లింగాయత్ సమాజంతో పాటు శ్రీ రాచన్న స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జహీరాబాద్ నుండి బడంపేట్ మహా పాదయాత్ర ఈ నెల 17న ఆదివారం ఉదయం 7.00 గంటలకు జహీరాబాద్ శ్రీ రాచన్న స్వామి ఆలయం నుండి బయలుదేరుతుందని ఆ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆగూర్ శివరాజ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం చేపడుతున్న ఈ మహా పాదయాత్ర కార్యక్రమానికి వీర శైవ లింగాయత్ సమాజ్ సభ్యులు శివ నామ స్మరణతో సంకీర్తన చేస్తూ పాదయాత్ర లో పాల్గొంటారని తెలిపారు. పాదయాత్ర జహీరాబాద్ నుండి ప్రారంభమై శివాలయం, షేకాపూర్ మీదుగా పర్సుపల్లి నుండి బడంపేట్ కు చేరుతుందన్నారు.సభ్యులు, భక్తబృందం సాంప్రదాయ వస్త్రధారణతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ జిల్లా సలహాదారులు అనిమిశెట్టి జయప్రకాష్, తాలూకా వీరశైవ లింగాయత్ యూత్ అధ్యక్షులు శ్రీ సిద్దాపురం అరుణ్, జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బండి శ్రీనివాస్, రాష్ట్రీయ బసవ దాల్ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేష్, అమర్ కౌలాస్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం..

భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-87.wav?_=3

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. సోమవారం అమావాస్య సందర్భంగా భక్తులతో కిక్కిరిసి పోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. తెలుగు రాష్ట్రాలు ఉండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తదితర ప్రాంతాల భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మందుగా భక్తులు ఆలయం స్వామి వారి అమృత పుష్కరిణిలో స్నానాలు ఆచరించి జల లింగానికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు “ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి నామాన్ని స్మరిస్తూ” గర్భాలయంలోని శ్రీ పార్వతీ సమేత కేతకి సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా భారీగా తరలివచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం కోసం మూడు గంటల సమయం పడుతోంది. ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

స్వామి వారికి ప్రత్యేక పూజలు..

గురువారం అమావాస్య సందర్భంగా ఆలయంలోని శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవా, అభిషేకం, క్షీరాభిషేకం, పాలాభిషేకం, మహా మంగళ హారతి క్రతువును నిర్వహించారు. అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళహారతి నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ శేఖర్ పటేల్
,కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప,తగిన ఏర్పాట్లు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్. ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అమ్మవారి ఆలయాల కూల్చివేత భక్తజనాల ఆవేదన.

*తిరుపతి జిల్లాలో అమ్మవారి ఆలయాల కూల్చివేత భక్తజనాల ఆవేదన…

*పునర్నిర్మాణం కోరుతున్న ప్రజలు..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 23:

తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మండల పరిధిలో కూతవేటు సమీపంలో ఉన్న జగత్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం అకస్మాత్తుగా కూల్చివేయబడింది. గత అయిదేళ్లుగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం పట్ల స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
వేలాది భక్తులు అమ్మవారిని తమ ఇంటి దేవతగా పూజించడమే కాకుండా ప్రతి సంవత్సరం జాతర, నవరాత్రుల వంటి పూజాకార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ ఆలయం అధికారిక గుర్తింపు లేకపోయినా, ప్రజల నమ్మకాన్ని చాటే భక్తిశ్రద్ధలు ప్రతి మూలకూ వ్యాపించాయి.
అయితే, ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండానే ఆలయాన్ని కూల్చివేయడాన్ని భక్తులు సాంఘికంగా, ఆధ్యాత్మికంగా గాయపడే చర్యగా భావిస్తున్నారు. మతస్వేచ్ఛను హరించడమే కాకుండా, ఇది ప్రజాస్వామ్య పరిపాటికి విరుద్ధంగా ఉందని పలువురు విశ్వాసపాత్రులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే, ఆలయం కూల్చివేయడానికి అసలైన కారణం ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఆలయం ప్రమాద స్థితిలో ఉందని కారణంగా వ్యవహరించి ఉంటే, దాన్ని కూల్చడం కంటే పునర్నిర్మాణం చేయడమే అనుకూలమైన మార్గం కావాలి.
ఇంకా ముఖ్యంగా ఇదంతా స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర తిరుపతి జిల్లాలో జరగడం మరింత బాధాకరంగా మారింది. ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, ఇలాంటి చర్యలు ఆ విశిష్టతను మరుగున పరుస్తున్నాయి.ప్రజలు ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయాన్ని తిరిగి అదే స్థలంలో పునర్నిర్మించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని. చిన్న ఆలయమైనా ప్రజల విశ్వాసానికి నిలయంగా ఉంటే, దానికి శాసనబద్ధమైన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆలయాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించి, పూర్వ స్థితికి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, సంప్రదాయాల పరిరక్షణకు ఇది ఒక ఉదాహరణగా నిలిచేలా చూడాలని పొన్నా రవికుమార్ మరియు అమ్మవారి భక్తులు కోరుతున్నారు..

కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు..

కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. బుధవారము అమావాస్య, సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారు జాము నుంచి చేరుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అమావాస్య సందర్భంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ, మేల్కొల్పు సేవ, మహా రుద్రాభిషేకం, మహా మంగళ హారతి నిర్వహించిన అనంతరం రాత్రి 4 :30 నుండి భక్తులకు ప్రవేశాన్ని దర్శనానికి అనుమతించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది.

 

Ketaki

 

 

ఓం నమశ్శివాయ పంచాక్షరి నామం తో మార్మోగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో శివ రుద్రప్ప ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించడం జరిగింది ఝరాసంగం ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రామేశ్వరంలో.. ఆలయ ముట్టడికి భక్తుల యత్నం

రామేశ్వరంలో.. ఆలయ ముట్టడికి భక్తుల యత్నం

shine junior college

 

 

 

రామేశ్వరం ఆలయం వద్ద స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆలయ ముట్టడికి దిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి రోజూ దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

 

 

 

 

చెన్నై: రామేశ్వరం(Rameshwaram) ఆలయం వద్ద స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆలయ ముట్టడికి దిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి(Rameshwaram Ramanathaswamy Temple) రోజూ దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో స్థానికులు ఆ ఆలయంలో సులువుగా దైవదర్శనం చేయలేకపోతున్నారు. ఈ కారణంగా కొన్ని దశాబ్దాలకు పూర్వమే రామేశ్వరం ఆలయంలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించే వారి కోసం ప్రత్యేకంగా క్యూలైన్‌ ఉండేది.

 

 

 

 

ఆ క్యూలైన్‌లో వెళ్ళి స్థానికులు సులువుగా దర్శనం చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ఆ ఆలయానికి డిప్యూటీ కమిషనర్‌ చెల్లదురై బాధ్యతలు చేపట్టినప్పటి నుండి స్థానికుల క్యూలైన్‌ తొలగించారు. స్థానికులు ధర్మదర్శనం (సర్వదర్శనం) క్యూలైన్‌లోనే రావాలని ఉత్తర్వు జారీ చేశారు. దీంతో ఆలయ నిర్వాహకులపై స్థానికులు, రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇటీవల రాజీ చర్చలు కూడా జరిగాయి. కానీ ఆలయ అధికారులు గతంలా ప్రత్యేక క్యూలైన్‌లో స్థానికులను అనుమతించే ప్రసక్తే లేదంటూ ప్రకటించారు.

 

 

 

 

 

 

 

 

ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ మంగళవారం ఉదయం రామేశ్వరం నగరంలోని ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు ఆలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వేల సంఖ్యలో స్థానికులు ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం వైపు దూసుకొచ్చారు. ఆ సందర్భంగా పోలీసులకు, స్థానికులకు మధ్య తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో స్థానికులు పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ప్రదర్శన కారణంగా ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

పుష్కరాలకు వెళ్లే భక్తులకు అన్నదానం.

పుష్కరాలకు వెళ్లే భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులకు దాతల సహకారంతో కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వరుసగా పన్నెండు రోజుల పాటు ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాళేశ్వరం పుష్కరాలకు వచ్చి వెళ్లే భక్తులకు పన్నెండు రోజులు అన్నదానం చేయడం అభినందనీయమని, ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన దాతలకు, సేవా కార్యక్రమాలు చేసిన ప్రతీ ఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ సోలీస్ ఐకేర్ వారికి ఇతర దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, వచ్చే ఏడాది మేడారం మహా జాతర జరిగినన్ని రోజులు కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కోటగుళ్లలో సరస్వతి పుష్కర భక్తుల సందడి.

కోటగుళ్లలో సరస్వతి పుష్కర భక్తుల సందడి

తిరుగు ప్రయాణం లో స్వామివారి దర్శనం

చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో గత 12 రోజులుగా కొనసాగుతున్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో కోటగుళ్లను సందర్శిస్తున్నారు. సోమవారం పుష్కరాలకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతా నికి చెందిన భక్తులే కాకుండా ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల భక్తులు కూడా కోట గుళ్ళ ను సందర్శించారు. ఆలయాన్ని సందర్శించిన భక్తులకు ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఆలయ విశిష్టతను వివరించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందజేశారు.

భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్.

భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

సరస్వతి పుష్కరాలకు రానున్న రెండు రోజుల్లో లక్షలల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
సరస్వతి పుష్కరాల కొనసాగుతున్న నేపథ్యంలో 10 వ రోజు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఏర్పాట్లను పరిశీలించి వాకి టాకీ ద్వారా రానున్న రెండు రోజులు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సరస్వతి ఘాట్ లో భక్తల రద్దీని పరిశీలించి కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలు, రక్షణ చర్యలు, విఐపిలు పుణ్య స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని, కంటైనర్ ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మెయిన్ ఘాట్ నుండి సరస్వతి ఘాట్ వరకు ఏర్పాటు చేసిన మట్టి రోడ్డులో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విఐపిల కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ లో క్రమం తప్పక నీటి సరఫరా ఉండే విధంగా చూడాలని సూచించారు. ఘాట్ ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని భక్తుల రద్దీని పరిశీలించి పుష్కరాల సేవలు ఏవిధంగా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని త్వర త్వరగా దర్శనాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడి నుండి కాళేశ్వరం లోని పలుగుల జంక్షన్, తాత్కాలిక బస్టాండ్, ఇప్పల బోరు జంక్షన్, పార్కింగ్ స్థలాలను పరిశీలించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులతో మాట్లాడారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా పోలీసులు అప్రత్తంగా ఉండాలని ఎలాంటి ప్రమాదాలు జరగ కుండా సురక్షిత ప్రయాణాలు చర్యలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

హనుమాన్ మాల ధారణ స్వాములకు భిక్ష.!

పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ మాల ధారణ స్వాములకు భిక్ష

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని నాగవీధిలో పసునూటి సౌమ్య శంకర్ ల కుమారుడు పసునూటి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా గణపురంలోని హనుమాన్ మాలాధారణ స్వాములకు తడి బిక్ష అనంతరం పొడి బిక్ష కార్యక్రమం చేయడం జరిగింది. హనుమాన్ మాల దారణ స్వాములు భిక్ష ఘనంగా చేసి పసునూటి అభిరామను స్వాములు సుఖసంతోషాలతో విద్య బుద్ధి కలిగి ఉండాలని దీవించారు.

స్వాములకు అన్నప్రసాదం చేసిన చైర్మన్ రాజిరెడ్డి.!

స్వాములకు అన్నప్రసాదం వితరణ చేసిన మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి

 

పరకాల నేటిధాత్రి :

 

 

మండలంలోని మల్లక్కపేట గ్రామంలోగల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మాలధారుల స్వాములకు
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి అన్నప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,ఆలయ చైర్మన్ అంబిరి మహేందర్,ఆలయ ప్రధానార్చకులు కాటూరి జగన్నాధాచార్యులు,అల్లం రఘు నారాయణ,కొత్తపల్లి రవి,ఆలయ కమిటీ డైరెక్టర్ మిట్ట బాలరాజు,టెంపుల్ డైరెక్టర్ దొమ్మటి శంకరయ్య,మంద నాగరాజు,దుప్పటి సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బందులు కల్గకుండా .!

భక్తులకు ఇబ్బందులు కల్గకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు

దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్

శృంగేరి పీఠం అనుమతులు తీసుకుని జూన్ నుంచి ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభిస్తాం

వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని పత్రిక సమావేశం నిర్వహించిన దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ

వేములవాడ నేటిధాత్రి

 

భక్తులకు ఇబ్బందులు కల్గకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు.గురువారం వేములవాడ లో పర్యటించిన దేవాదయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా, ఈఓ వినోద్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం పాత్రికేయులతో దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ దేవాలయ ఆలయ అభివృద్ధి కోసం 38 కోట్ల ప్రకటించారని అన్నారు. ఆగమ శాస్త్రం, వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆలయం పునః నిర్మాణం చేపట్టాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తిర్ణం అభివృద్ధి కోసం ప్రభుత్వం 76 కోట్ల , అన్నదాన సూత్రానికి 35 కోట్ల మంజూరు చేసిందని అన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరగాలని లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు 47 కోట్ల నిధులు మంజూరు చేసిందని అన్నారు.

అన్నదానం సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేసామని అన్నారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతి, ఆశీర్వాదం తీసుకొని ఆలయ అభివృద్ధి పనులు చేపడ్తున్నామని అన్నారు. రాబోయే నెలలో రొడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా స్వామివారికి జరిగే పూజలు ఎక్కడ ఆటంకం కలగదని, ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు, భక్తులకు స్వామి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

శృంగేరి పీఠం అనుమతులు తీసుకున్న తర్వాత ఆలయ అభివృద్ధి పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలలో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

రాజన్న భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు…

ఈ సందర్భంగా భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనం కల్పించే స్థలాలను పరిశీలించారు. ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం, అభిషేకం మండపం, కోడె కట్టుట, క్యూ లైన్ తదితరు ఆర్జిత సేవల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ సత్యనారాయణ, ఈఓ వినోద్, ఈఈ రాజేశ్, డీఈ రఘు నందన్, ఆర్అండ్ బీ సీఈ బిల్డింగ్స్ రాజేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బీ సీఈ ఎలక్ట్రికల్ లింగారెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ బీ లక్ష్మణ్, జిల్లా ఈఈ వెంకట రమణయ్య, ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ, శరత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇల్లందకుంట బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం.

ఇల్లందకుంట బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం…చలివేంద్ర ప్రారంభం
1983-84 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సహకారంతో
ఇల్లందకుంట:నేటి ధాత్రి
.. అపర భద్రాద్రిగా పేరుందిన ఇల్లంద కుంట శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం లో నిర్వహించే రథోత్సవాలు,నాగబెల్లి ఉత్సవాల కోసం జమ్మికుంట జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల పదో తరగతి 1983- 84 బ్యాచ్ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జెడ్పి మాజీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, దేవాలయ కమిటీ చైర్మన్ ఇంగ్లె రామారావు ప్రారంభించారు. జెడ్పి మాజీ చైర్పర్సన్ కనుమల విజయ మాట్లాడుతూ 1983- 84 10వ తరగతి జెడ్పి హెచ్ఎస్ బాలుర పాఠశాల జమ్మికుంట బాల్యమిత్రులు కరోనా సమయం నుంచి సామాజిక సేవలో పాల్గొం టున్నారని గత ఐదు సంవత్సరాలుగా ఇల్లంతకుంట సీతారాముల బ్రహ్మోత్సవాలకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు సేవలు చేయడం అభినందనీయమన్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ రామారావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు నాలుగు రోజులపాటు భక్తులకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్న బాల్య మిత్రుల సేవా సమితి చేయూ తను అభినందించారు. బాల్య మిత్రుల సేవా సమితి అధ్యక్షులు మొకిరాల సంపత్ రావు మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం పదవ తరగతి చదువుకున్న మిత్రులమంతా బాల్య మిత్రుల సేవాసమితి ఏర్పాటు చేసుకొని గత ఐదు సంవత్సరాలుగా సామాజిక సేవలో పాల్గొంటున్నామని ఈ క్రమంలో ఇల్లంద కుంట రామాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వేలాది భక్తులకు నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. బాల్య మిత్రుల చేతతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, తమకు మొదటి నుంచి సహకరిస్తున్న జెడ్పి మాజీ చైర్పర్సన్ కు కృతజ్ఞతలు తెలిపారు. నిర్వహిస్తున్న చలివేదిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవస్థాన ఈవో కే సుధాకర్, ఆలయ కమిటీ డైరెక్టర్లు బాల్య మిత్రుల సేవాసమితి అధ్యక్షులు మొకిరాల సంపత్ రావు,o ప్రధాన కార్యదర్శి మంద వెంక రెడ్డి కోశాధికారి డి. సంపత్, బాల్యమితుల సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

BRS పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష.

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష

ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్

సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవనంలో ఈరోజు

సిరిసిల్ల నేటి ధాత్రి:

 

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష కార్యక్రమం చేపట్టడం జరిగినది.
ముఖ్య అతిథిగా బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.

BRS & KTR

అనంతరం మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి కృప, కటాక్షం సుఖ:సంతోషాలతో ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కే.టీ.ఆర్ కోరాతు, స్వామి వారి చిత్రపటాన్ని స్వీకరిస్తూ, అనంతరం హనుమాన్ దీక్ష స్వాములతో బిక్ష కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు హనుమాన్ దీక్ష పరులు పాల్గొన్నారు.

మీడియా మిత్రులకు శ్రీవారి భక్తుల అభివందనాలు.

మీడియా మిత్రులకు శ్రీవారి భక్తుల అభివందనాలు

సీఎం నోట శుభవార్త విన్నాము

తిరుపతిని మధ్య రహిత క్షేత్రంగా సాధిద్దాం

తిరుపతి(నేటి ధాత్రి)మార్చి 24:

శ్రీనివాస సదానంద స్వామి స్వాముల ఆధ్వర్యంలో చేపట్టిన తిరుమల పవిత్రతను కాపాడుకుందాం శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ ను నిలిపివేయాలని నిరసనలు నిరాహార దీక్షలు పాదయాత్రలో చేపట్టిన కార్యక్రమాలను మీడియా మిత్రులు ప్రత్యేకంగా పలుమార్లు ప్రచురించి నందుకు మీడియా మిత్రులకు స్వామివారి భక్తులైన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో బీసీ నాయకులు శ్రీవారు భక్తుల జగన్నాథం మరియు అభయ హస్త గోవింద సేవ మండలి అధ్యక్షులు చంద్రమౌళి లు అన్నారు,సీఎం తిరుమలకు వస్తున్నారు. సీఎం నోటి శుభవార్త విందురని టిటిడి పాలకమండలి చైర్మన్ స్వాములకు ఫోన్ చేసి స్వయంగా తెలిపారని హిందూ పరిషత్ ఓంకార్ తెలిపారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ప్రక్షాళన ముంతాజ్ హోటల్ తోనే మొదలెట్టారని ముఖ్యమంత్రి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,
అలాగే సైనికులకు హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నీ మధ్య రహిత క్షేత్రంగా కలిసి పోరాడుదాం అని పలు పుణ్యక్షేత్రాలలో మధ్యరహిత పుణ్యక్షేత్రాలు గా ఎలాగైతే చేశారో అలాగే తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కూడా మధ్యాహ్నం క్షేత్రంగా చేసేంతవరకు హిందువులందరు కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభయాస్త గోవింద మండలి సేవా సభ్యులు సురేష్ , రోహిత్ బాబు తదితరులు పాల్గొన్నారు..

భక్తులతో పోటెత్తిన దత్తగిరి.. ముగిసిన సంగీత్ దర్బార్.

భక్తులతో పోటెత్తిన దత్తగిరి.. ముగిసిన సంగీత్ దర్బార్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ దత్తగిరి క్షేత్రంలో తెలంగాణ ఉద్యమ గాయని రేలారే రేలా గంగా భక్తి పాటలతో దుమ్ము లేపింది. దత్తగిరి మహారాజ్ 46వ వార్షిక అమర తిథి సందర్భంగా ఆలయంలో రాత్రి ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి, సిద్దేశ్వరానంద గిరి జ్యోతి ప్రజ్వలన చేసి రాత్రి 10 గంటలకు సంగీత దర్బార్ ను ప్రారంభించారు. రేలారే గంగ బృందం సభ్యులు ఫోక్ సింగర్స్ జంగిరెడ్డి,సునీత, మల్లంపల్లి రాజు వారు నిర్వహించిన భక్తి జానపద గీతాలతో దత్తాత్రేయ స్వామి వారి భక్తులు మంత్ర ముగ్ధులయ్యారు. భక్తి పాటలతో దత్తగిరి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమైన సంగీత దర్బార్ సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగింది. గంగా ఫోక్ సాంగ్స్ తో మహిళల భక్తులు స్టెప్పులు, కోలాటలు వేశారు. అనంతరం నారాయణఖేడ్, బీదర్, జహీరాబాద్, ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత కళాకారులతో భజన సంకీర్తనలు కొనసాగాయి. వేడుకలను తిలకించేందుకు హైదరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్, బీదర్, జహీరాబాద్, ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ అల్లాడి వీరేశం, విశ్వమాను ధర్మ ప్రచారం నాయకులు శేరి నర్సింగ్ రావు, రాజు పాటిల్ గ్రామస్తులు తమ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఝరాసంగం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేతకీకి పోటెత్తిన భక్తులు..!

కేతకీకి పోటెత్తిన భక్తులు.. భక్తుల అగ్నిగుండ ప్రవేశం

జహీరాబాద్. నేటి ధాత్రి:

అష్ట తీర్థాల నిలయం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరా సంగం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలు శుక్రవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. అమావాస్య కలిసి రావడంతో భక్తుల మరింత పెరిగే అవకాశం ఉంది. రాత్రికి కల్యాణోత్సవానికి ఏర్పాటు చేస్తున్నారు.

కోట గుళ్ళకు పోటెత్తిన భక్తజనం..

కోట గుళ్ళకు పోటెత్తిన భక్తజనం

తెల్లవారుజామున ప్రారంభమైన అభిషేకాలు, పూజలు

గణపేశ్వరునికి నందీశ్వరునికి రుద్రాభిషేకం

కొనసాగిన భక్తుల రద్దీ

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఓఎస్ డి కిషన్ , డి.ఎస్.పి సంపత్ రావు సీఐ నరేష్ కుమార్ గణపురం ఎస్ఐ అశోక్

గణపురం:నేటి ధాత్రి

lord shiva

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజామున గణపతి పూజ, అఖండ దీపారాధన తోరణ బంధనం కార్యక్రమాన్ని అర్చకులు గంగాధర్, నాగరాజు, శంకర్ లు నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి, గణపేశ్వరునికి రుద్రాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి ఓఎస్ డి బోనాల కిషన్ దంపతులు , డి.ఎస్.పి సంపత్ రావు దంపతులు భూపాలపల్లి సీఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ గణపురం ఎస్ఐ రేఖ అశోక్ దంపతులు అభిషేకంలో పాల్గొన్నారు. శివరాత్రి జాగరణ సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.

స్వర్ణోత్సవ మంగళ ఆహ్వానము

నేటి ధాత్రి కథలాపూర్

కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో భగవాన్ శ్రీ సత్య నంద మహర్షి ఆశ్రమ వేడుకలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం
ఈ కార్యక్రమం మూడు రోజులు ఫిబ్రవరి 7 8 9 రోజులలో నిర్వహించబడును ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం స్వామీజీల ప్రవచనాలు ఆలగే నిత్య అన్నదానం తీర్థ ప్రసాద వితరణ ప్రతిరోజు సాయంత్రం భగవత్ సంకీర్తన అలాగే రామాయణ ఇతిహాసాల మీద ప్రవచన కార్యక్రమం ఉండును
కావున కథలాపూర్ మండల ప్రజలు ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా సత్యానంద మహర్షి బృందంవారు ఈ సందర్భంగా తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version