పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని ప్రముఖ పురాతన శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బ్రహ్మశ్రీ జె వెంకటేశ్వర శర్మ,మణిదీప్ శర్మ ల ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు.అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,భక్తులు పాల్గొన్నారు.
