3 వ రోజుకు చేరుకున్న శ్రీశైలం పాదయాత్ర…

3 వ రోజుకు చేరుకున్న శ్రీశైలం పాదయాత్ర

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి క్షేత్రం నుండి శ్రీశైలం
శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి మహాక్షేత్రం వరకు 24 వ. మహా పాదయాత్ర శివ నామ స్మరణ చేస్తూ..ఝరాసంగం నుంచి శ్రీశైలంకు ఝరసంగం గ్రామానికి చెందిన భక్తులు పాదయాత్రగా శుక్రవారం బయలుదేరారు. 3 వ రోజు వికారాబాద్ నుండి ఉదయం పాదయాత్ర గా తరలి వెళ్ళడం జరిగింది. పరమ శివుని ఆశీస్సులతో పాదయాత్ర దిగ్విజయం కావాలని వేడుకుంటున్నామన్నారు. భక్తులు సుమారు 300 కిలో మీటర్ల పాదయాత్రను పది రోజుల పాటు కొనసాగిస్తారని, శ్రీశైలంలో స్వామిని దర్శించుకున్న అనంతరం పాదయాత్ర ముగుస్తుందన్నారు. ఈ పాదయాత్రలో సంగయ్య స్వామి, వీరు సజన, శ్రీనివాస్, శివరాజ్ సింగ్, శివకుమార్, సను రాక్ తేజ, విజయ బసవ, ఓంకార్, మహేష్, రాజు, అభిషేక్ పటేల్, భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి లక్ష పుష్పార్చన…

భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి లక్ష పుష్పార్చన

నేటి ధాత్రి , పఠాన్ చేరు :

 

కార్తీకమాస ఏకాదశి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి శనివారం నాడు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ
ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది అందరి సహకారంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు
వచ్చే బుధవారం కార్తీక పౌర్ణమి దీపోత్సవం ప్రత్యేకంగా
నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు
ఈకార్యక్రమంలో ఈవో శశిధర్, ఆలయ అర్చకులు ప్రహ్లాద్,
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version