భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి లక్ష పుష్పార్చన…

భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి లక్ష పుష్పార్చన

నేటి ధాత్రి , పఠాన్ చేరు :

 

కార్తీకమాస ఏకాదశి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి శనివారం నాడు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ
ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది అందరి సహకారంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు
వచ్చే బుధవారం కార్తీక పౌర్ణమి దీపోత్సవం ప్రత్యేకంగా
నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు
ఈకార్యక్రమంలో ఈవో శశిధర్, ఆలయ అర్చకులు ప్రహ్లాద్,
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఘనంగా వెంకటేశ్వర స్వామి లక్ష పుష్పార్చన

ఘనంగా వెంకటేశ్వర స్వామి లక్ష పుష్పార్చన

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై రామానుజాచార్యులు పర్యవేక్షణలో పొడిచేటి శేషాచార్యులు ముడుంబై శ్రీకరాచార్యులు కార్యక్రమాన్ని చేపట్టారు.ఆలయ చైర్మన్ ఎర్ర జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 13 న ఉదయం 10 గంటలకు సుదర్శన నరసింహ యాగము లోక కళ్యాణార్ధం జరుపనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు,మహిళలు,భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version