బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా మునెందర్ నియామకం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-13-6.wav?_=1

బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా మునెందర్ నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్‌గా ఊరటి మునెందర్ నియమితులయ్యారు.బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఆదేశాల మేరకు,జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఊరటి మునెందర్ మాట్లాడుతూ “బీజేపీ భావజాలాన్ని,కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్వచ్ఛందంగా చేరవేయడం, పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేయడం నా ప్రధాన బాధ్యత అని జిల్లా లోని ప్రతి గ్రామం,ప్రతి మండలానికి పార్టీ స్వరం చేరేలా కృషి చేస్తాను”అని అన్నారు.జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ… మునెందర్ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు అని మీడియా విభాగంలో ఆయన అనుభవం పార్టీకి మరింత బలాన్నిస్తుంది అని అభిప్రాయపడ్డారు.ఈ నా పార్టీ పదవికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు కి, జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి కి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డి కి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న కి కన్నం యుగదీశ్వర్ కు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.

జాతీయ జెండాకు అవమానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T123932.348-1.wav?_=2

 

జాతీయ జెండాకు అవమానం

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జాతీయ జెండాను అవమానపరుస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పోస్ట్ ఆఫీస్ లో జెండా ఎగరేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి జాతీయ జెండాను అవమాన పరిచారు. సంబంధిత అధికారి సెలవులో ఉన్నట్టు నీ లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ బాధ్యతగల వ్యక్తులే ఇలా చేస్తే ఎలా ఉంటుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఒకపక్క భారత్ మాతాకీ జై అంటూ దేశం పట్ల ప్రజలకు ప్రేమ ఉండాలని దేశభక్తి పెరగాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిపై భారత జాతీయ జెండా ఎగరేస్తూ దేశభక్తిని చాటుతుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కేంద్ర ప్రభుత్వ పనితీరుకు
ఆ పార్టీ వారు చెప్పే మాటలకు చాలా తేడా కనిపిస్తున్నట్టు పలు వర్గాల ప్రజలు విమర్శిస్తున్నాయి.

త్రివర్ణ పతాకాన్ని ఎగరావేసిన బీజేపీ శ్రేణులు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-44.wav?_=3

త్రివర్ణ పతాకాన్ని ఎగరావేసిన బీజేపీ శ్రేణులు

*అహింసా పదం మన మార్గం తగధనాల త్యాగాలతో సూర్యునిగా వెలుగొందుతున్న దేశం మన భారతదేశం

 

వర్ధన్నపేట (నేటిధాత్రి):
మండల కేంద్రంలోని వివేకానంద మండల అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ కొండేటి అనిత ఆధ్వర్యంలో బిజెపి నాయకులతో కలిసి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం బైక్ ర్యాలీ తో ముగించారు.

79th Independence Day.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొండేటి అనిత సత్యం , జిల్లా కౌన్సిల్ మెంబర్ మైస రాము, మాజీ మండల అధ్యక్షులు మండల కన్వీనర్ రాయపురం కుమారస్వామి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సిందం శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షులు పెద్దూరి రాజు, బిజెపి సీనియర్ నాయకులు చేపూరి వెంకటస్వామి, మండల కార్యదర్శి మల్లెపక అనిల్, బోయినపల్లి దేవేందర్ రావు, వెల్మకంటి గిరిప్రసాద్, ఎస్సీ సీ మోర్చా మండల అధ్యక్షులు, నక్క రవి ఓబీసీ మోర్చా, పెన్ తోటి మహంత్ యువమోర్చా, రాకేష్ వెలిశాల, నిమ్మాని సోమేశ్వరరావు, తక్కలపల్లి విష్ణు, వడ్లకొండ మణిదీప్, బొంత రవి, ఆలకుంట లక్ష్మణ్, కుసుమ రాంబాబు, వెలమ కంటి వేణు, తాళ్లపల్లి కృష్ణమూర్తి,అనపర్తి శ్రీకాంత్, కొండేటి శివ, తదితరులు పాల్గొన్నారు

ఆర్షద్ పటేల్‌ను పరామర్శించిన జ్యోతి పండాల్..

ఆర్షద్ పటేల్ గారిని పరామర్శించిన బీజేపీసీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం మాడ్గ్గి గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఆర్షద్ పటేల్ కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతు ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యం తో కోలుకున్న సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్ ఈ రోజు పట్టణంలోని రాంనగర్, బృందావన్ కాలనిలో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థిని తెలుసుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాయికోటి నర్సిములు ఉన్నారు.

చిట్యాలలో హర్ ఘర్ తిరంగా జెండా పంపిణీ…

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాల పంపిణీ.

చిట్యాల, నేటిధాత్రి ;

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా.ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు జాతీయ భావాన్ని కలిగి ఉండే విధంగా భారతీయ సంస్కృతిని కాపాడే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు కలిసికట్టుగా దేశం కోసం పనిచేయాలని సంకల్పంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా , చిట్యాల మండల కేంద్రంలో జాతీయ జెండాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం, శ్రీకాంత్, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు గుండ సురేష్, రాష్ట్ర నాయకులు నరసయ్య గారు, తీగల వంశీ,కేంసరపు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

20 మందితో బిజెపి పార్టీ నూతన జిల్లా కమిటీ ఎన్నిక.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-40.wav?_=4

20 మందితో బిజెపి పార్టీ నూతన జిల్లా కమిటీ ఎన్నిక

జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బిఎంఎస్ కార్యాలయంలో బిజెపి పార్టీ నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ 20 మందితో బిజెపి పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ని రాష్ట్ర అధ్యక్షుడు నియమించడం జరిగింది ఆరుగురు ఉపాధ్యక్షులు ముగ్గురు జనరల్ సెక్రెటరీ ఐదుగురు జిల్లా సెక్రెటరీ మీడియా కోఆర్డినేషన్ ఆఫీస్ బాయ్ 20 మంది సభ్యులతో జిల్లా కమిటీగా ఎన్నిక చేయడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి తెలిపారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ నాయకుల పేర్లు చెప్పి కొంతమంది పాఠశాలలో కళాశాల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు వారు ఎవరైనా ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాము అని వారు అన్నారు అనంతరం జిల్లా కమిటీని ప్రకటించారు జిల్లా ఉపాధ్యక్షులుగా దాసరి తిరుపతిరెడ్డి. మోరి రవీందర్ రెడ్డి. వేషాల సత్యవతి. పూడెపాక స్వరూప. శ్యామల మధుసూదన్ రెడ్డి. గొర్రె శశికుమార్. జిల్లా జనరల్ సెక్రెటరీగా దొంగల రాజేందర్. పెండ్యాల రాజు. తాటికొండ రవి కిరణ్. డిస్టిక్ సెక్రటరీగా రాజేందర్ రెడ్డి. రామకృష్ణ. శ్రీనివాస్. వేణు. జిట్టబోయిన సాంబయ్య. ఆఫీస్ సెక్రటరీ తిరుపతి సోషల్ మీడియా ఇన్ఛార్జి దుగ్యాల రామచంద్రరావు మీడియా కవరే జ్ మునీందర్ ఐటీ ఇన్చార్జి వేణు రావు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఎన్నికలకు సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డికి రాష్ట్ర కమిటీ సభ్యులకు అందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ పదవి మాకు ఇవ్వడంతో మా మీద మరింత భారం పెరిగింది బిజెపి పార్టీ స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలవడానికి మేము మా వంతుగా పాత్ర పోషించి మా నాయకులను కార్యకర్తలను స్థానిక సంస్థలు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

లీడర్లు అటు..క్యాడర్‌ ఇటు!

`తెలంగాణలో విచిత్రమైన రాజకీయ వాతావరణం.

`గతంలో నాయకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు కదిలేవారు.

`ఇప్పుడు నాయకులు మాత్రమే కొత్త దారి వెతుక్కుంటున్నారు.

`బీఆర్‌ఎస్‌ నుంచి నాయకులు కారు దిగుతున్నారు.

`ఇతర పార్టీల నుంచి నాయకులు కారెక్కుతున్నారు.

`కారు దిగుతున్న నాయకులతో మేం రామంటున్నారు.

`అధికారంలో వున్న కాంగ్రెస్‌ వైపు కార్యకర్తలు ఎందుకు చూడడం లేదు!

`కాంగ్రెస్‌ లో కొత్త వారిని కలుపుకుపోరన్న భయమా!

`ఇప్పటికే రెండేళ్ళు గడిచింది.. పార్టీ మారితే ఒరిగేముందన్న భావనా?

`బీఆర్‌ఎస్‌ లో కూడా కార్యకర్తలు అసంతృప్తిగానే వున్నారు.

`అయినా కారు దిగి జారుకోవడానికి సిద్ధంగా లేరు!

`ఇతర కండువాలు కప్పుకోవడానికి సిద్ధంగా లేదు.

`గువ్వల బాలరాజు మీటింగ్‌ తో కొంత తేట లెల్లమైంది.

`మేం రామని తెగేసి చెప్పినట్లైంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అటు లీడర్‌..ఇటు క్యాడర్‌! తెలంగాణలో విచిత్రమైన రాజకీయ వాతావరణం. పార్టీలు మారుతున్న నాయకులతో క్యాడర్‌ రావడం లేదు. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా క్యాడర్‌ కదలేదు. ఏ ఎమ్మెల్యేతో పట్టు పని పది మంది వెళ్లలేదు. వెళ్లినా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో పొసగడం లేదు. తమతో ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు వస్తారని, రావాలని కూడా ఎమ్మెల్యేలు అనుకోలేదు. అందుకే కాంగ్రెస్‌లో చేరిన ఏ ఎమ్మెల్యే కూడా దర్జాగా కండువా కప్పుకోలేదు. గతంలో ఈ పరిస్దితి భిన్నంగా వుంది. కాంగ్రెస్‌ నుంచి గాని, తెలుగుదేశం నుంచి గాని బిఆర్‌ఎస్‌లో నాయకులు చేరిన క్రమంలో పెద్ద పెద్ద ర్యాలీలు. వందల కార్లు కాన్వాయిలు. గులాబీలు. జెండాలో అబ్బో అదో పెద్ద సెటప్‌తో వెళ్లేవారు. జిల్లాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులతో చేరి, కండువాలు కప్పుకున్నారు. కండువాలు కప్పే నాయకులు కూడా ఇంకా వున్నారా? అని ఎదురుచూసిన పరిస్దితి కనిపించేది. ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ పార్టీలో నాయకులు చాలానే చేరారు. కాని వారి వెంట క్యాడర్‌ పెద్దగా కదిలినట్లు లేదు. వందల మంది చేత వచ్చి కాంగ్రెస్‌లో కలిసిన నేతలు లేరు. బిఆర్‌ఎస్‌ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరి, కండువా కప్పుకొని, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌ వెంట కూడా జనం వెళ్లలేదు. క్యాడర్‌ ఆయనతో కదలేదు. ఆయన అదృష్టం పాత పరిచయాలు ఆయనకు దానంకు పనికి వస్తున్నాయి. వ్యతిరేకతకు తావు లేకుండా చేస్తున్నాయి. కాని మిగతా ఎమ్మెల్యేలందరికి మాత్రం విచిత్రమైన వాతావరణమే వుంది. ఇందులో కడియం శ్రీహరి లాంటి నాయకుడు గతంలో తెలుగుదేశంలో వున్నంత కాలం బలమైన క్యాడర్‌ను మెంటైన్‌ చేశారు. తర్వాత పదేళ్లకాలం పాటు బిఆర్‌ఎస్‌లో కూడా బాగానే అధికారం చెలాయించారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన జిల్లాకు, నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడిగా మిగిలిపోయారు. ఆఖరుకు ఏ పార్టీలో వుండాలో ఆపార్టీలోనే వున్నానంటూ ముక్తాయించాల్సిన పరిస్ధితి తెచ్చుకున్నారు. కాకపోతే తన రాజకీయ చాణక్యంతో, చైతన్యంతో మాత్రం తన కూతురు కావ్యను ఎంపిని చేశారు. ఇది ఎంతైనా గొప్ప విషయం. రాజకీయాల్లో నైతికత అనే పదం ఈరోజుల్లో వాడడమే శుద్ద దండగ. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో వుండి, నైతికత గురించి మాట్లాడడం అంటేనే గొంగడిలో కూర్చొని అన్నం తిన్నట్లే లెక్క. పార్టీలు మారినా, తన రాజకీయ ప్రస్తానాన్ని దిగ్విజయంగా కొనసాగించిన నాయకులలో కడియంశ్రీహరి ఎంతైనా ప్రత్యేకమే. అందుకే ప్రత్యర్ధి రాజకీయాలు చేసినా, ఒకే పార్టీలో కలిసి రాజకీయాలు చేసినా ఆయన స్దానం ఎప్పుడూ నిలబెట్టుకున్నారు. అధికారం చెలాయించారు. ఇతరుల అదృష్టాన్ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అలాంటి నాయకుడు బహుశా దేశంలో కూడా లేకపోవచ్చు. తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు తనకు ఎదురులేకుండాపాలించారు. బిఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత తన రాజకీయ ప్రత్యర్ధి అదృష్టం లాగేసుకున్నారు. 2018 తర్వాత మంత్రి కాకపోయినా, సరే తన పాత్రలోకి ఎవరూ రాకుండానే చూసుకున్నారు. వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో తన దరిదాపుల్లోకి కూడా ఎవరినీ రాకుండాచూసుకున్నారు. ఇంత పెద్ద నాయకుడైనా సరే ఇప్పుడు క్యాడర్‌ ను వెతుక్కొవాల్సిన పరిస్ధితి వచ్చింది. రాజకీయాలలో వున్న వారు ఎప్పుడు ఏ పార్టీలో వుంటారో..వుండాలో అన్న దానిపై ఎవరి స్ధిర నిర్ణయం లేదు. నిలకడ అసలే లేదు. గాలి వాటం రాజకీయాలు. ఎందుకంటే గతంలో తన జీవితమంతా గులాబీతోనే అని అనేక సార్లు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పేవారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా వేరే రక్తం మనలో పారదు అని కూడా చెప్పారు. కాని అధికారం పోయింది. ఆయన ఓడిపోయారు. బిఆర్‌ఎస్‌లో తనను అనుమానంగా చూస్తున్నారు. మరో వైపు లెక్క చేయడం లేదు. మహబూబ్‌ నగర్‌ బిఆర్‌ఎస్‌లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పెత్తనం ఎక్కువైపోయింది. పార్టీ కూడా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. తనను లెక్క చేయకుండా పార్టీ కార్యక్రమాలు చేపడుతోంది. ఇలాగే వుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కూడా వచ్చే అవకాశం వుంటుందో లేదో అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే మహబూబ్‌ నగర్‌ రాజకీయాలను ఇప్పుడున్న పరిస్దితుల్లో ఒంటి చేత్తో లాగించుకొస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సామాజిక వర్గం, గువ్వల బాలరాజు సామాజిక వర్గం ఒకటే. అంతే కాకుండా అది రిజర్వుస్ధానం. రాజకీయ సమీకరణాలలో భాగంగా చూసుకున్నా, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ లాంటి వారిని జనరల్‌ సీట్లో పోటీ చేయించే అవకాశం వుండదు. రిజర్వు స్ధానంలో బలమైన నాయకులను పెట్టిన పార్టీలే గెలుస్తుంటాయి. కడియం రాజకీయం కూడా అలాగే సాగింది. ఆయన స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఆది నుంచి అక్కడినుంచే పోటీ చేస్తూ వస్తున్నారు. గెలుస్తున్నారు. 2014లో పార్లమెంటుకు ఎన్నికైనా సరే వరంగల్‌ ఎస్సీ రిజర్వుడు నుంచే గెలిచారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కూడా తన సొంత జిల్లా నుంచే పోటీచేయాలని చూస్తున్నారు. గతంలో ఆయన ఆదిలాబాద్‌ నుంచి పోటీ చేసి పొరపాటు చేశారు. ఇది పాత రోజులు కాదు. గతంలో నాయకులకు పార్టీలు సీట్లు ఇచ్చినా గెలిచేవారు. అలా చరిత్రలో చాలా మంది వున్నారు. ఇప్పటికీ వున్నారు. మల్లు భట్టి విక్రమార్క అసలు జిల్లా పాలమూరు. కాని ఆయన మధిరను ఎంచుకొని వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కాని ఇప్పుడు కొత్త నాయకత్వానికి ప్రజలనుంచి ఆ సహకారం అందేలా వుండేలా లేదు. ఉమ్మడి జిల్లా వరకు సరే,గాని జిల్లాలు దాటి వెళ్లి గెలవడం అంటే సాద్యమయ్యే పని కాదు. నాయకులు కొత్త దారితోపాటు సరికొత్త పంధాలో వెళ్లాలనుకుంటున్నారు. తాజాగా కారు దిగి, కమలం గూటికి చేరిన గువ్వల బాలరాజుతో పెద్దగా నాయకులు వెళ్లలేదు. దాంతో చేరిక సభ కార్యక్రమంలో గువ్వల బాలరాజుతో బిజేపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు వంద మందికూడా రాలేదని సభా సాక్షిగానే నవ్వుతూనే ఎద్దేవా చేశారు. పైగా వంద మంది జాయిన్‌ అయినప్పుడు అసలైన సభ్యత్వం ఇస్తామనే అర్దం వచ్చేలా చిన్న చెనుకు వదిలారు. కాని అది ఒక నాయకుడికి ఇబ్బందికరమే. ఇదిలా వుంటే బిఆర్‌ఎస్‌ నుంచి పెద్ద నాయకులు కారు దిగిపోతున్నారు. అదే సమయంలో జిల్లాలలో నాయకులతో సంబంధం లేకుండా పెద్దఎత్తున ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. అలా మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలలో ఇటీవల చాలా మంది చేరారు. సహజంగా ఒక నాయకుడు ఎటు వైపు వెళ్తే క్యాడర్‌ అటు వైపు వెళ్లడమే చూశాం. కాని కారు దిగుతున్న నేతలతో క్యాడర్‌ మేం రామని తెగేసి చెబుతున్నారు. మీరు వెళ్తే వెళ్లండి..మమ్మల్ని రమ్మకనండి అని ముఖం మీదే చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరడానికి కార్యకర్తలు ఒకింత భయపడుతున్నారు. కాంగ్రెస్‌లో కొత్తవారిని కలుపుకుపోయే వాతారణం కనిపించడం లేదు. పార్టీ మారినా పనులు వస్తాయన్న నమ్మకం లేదు. పదవులు వస్తాయన్న ఆలోచన వారిలో అసలే లేదు. ఎందుకంటే పదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీకి అండగా వుంటూ, సేవలు చేసిన నాయకులు, కార్యకర్తలను కాదని కొత్త వారికి పెద్ద పీట వస్తుందన్న విశ్వాసం కలగడం లేదు. పైగా చేరిన ఎమ్మెల్యేల పరిస్దితే అలా వుంటే, చేరితే మా పరిస్దితి అంత కన్నా భిన్నంగా వుంటుందా? అన్న ఆలోచనలో బిఆర్‌ఎస్‌ క్యాడర్‌ గులాబీ జెండాను వదలడం లేదు. పైగా కాంగ్రెస్‌, బిజేపిల నుంచి వస్తున్న వారిని వద్దని వారించడం లేదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు చేరే నాయకులు ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడాల్సిందే. కొంత కాలం గడిస్తే అందరూ కలిసిపోతారు. పోటీ పడి పనులు చేస్తారు. పార్టీకి మరింత బలమౌతారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బిఆర్‌ఎస్‌ క్యాడర్‌ కూడా నిరుత్సాహం, అసంతృప్తిగానే వున్నారు. కాని కారు దిగడానికి, జారుకోవడానికి సిద్దంగా లేరు. కాంగ్రెస్‌లో పొసగలేరు. బిజేపిలో చేరినా గుర్తింపు, ప్రజల్లో ఆదరణ వుంటుందన్న నమ్మకం అసలే లేదు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఒక్క బిఆర్‌ఎస్‌ క్యాడరే మరో కండువా కప్పుకోవడానికి సిద్దంగా లేరు. ఇది మాత్రం నిజం.

వీడియోతో ‘వోట్ చోరి’పై కాంగ్రెస్ ఆగ్రహం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-32-3.wav?_=5

వీడియోతో ‘వోట్ చోరి’పై కాంగ్రెస్ ఆగ్రహం..

న్యూఢిల్లీ, ఆగస్టు 13 (పిటిఐ):
కాంగ్రెస్ పార్టీ బుధవారం ‘వోట్ చోరి’పై తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేసింది. నకిలీ ఓట్లు ఎలా వేయబడుతున్నాయో చూపించే వీడియోను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రజలను తమ హక్కులను కాపాడుకోవాలని, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) “పట్టులో నుండి రాజ్యాంగ సంస్థలను విముక్తం చేయాలి” అని పిలుపునిచ్చారు.

మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆ వీడియోను పంచుకుంటూ, “మీ ఓటు చోరీ అనేది మీ హక్కుల చోరీ, మీ గుర్తింపు చోరీ” అని అన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ, ఓటు దోపిడీని ఖండించారు. ఖర్గే మాట్లాడుతూ, “మీ ఓటు హక్కు దోపిడీకి గురి కాకుండా కాపాడుకోండి. ప్రశ్నించండి, సమాధానాలు కోరండి, ఈసారి వోట్ చోరికి వ్యతిరేకంగా స్వరం వినిపించండి” అని పిలుపునిచ్చారు.

గోదారి నీటిని గణపసముద్రం కు కలపాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-22-2.wav?_=6

గోదారి నీటిని గణపసముద్రం కు కలపాలి

గణపురం బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలo దేవాదుల ప్రాజెక్ట్ నుండి గోదావరి నీరు రామప్ప చెరువులో చేరడం జరుగుతుంది అదేవిధంగా గ్రావిటీ కెనాల్ ద్వారా గణపసముద్రం చెరువులోకి నీటిని వదిలి దాని ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా ఎమ్మార్వో కి వినతి పత్రం ను మండల అధ్యక్షుడు నవీన్ రావు ఆధ్వర్యం లో ఇవ్వడం జరిగింది ఇందులో సీనియర్ నాయకులు దుగ్గిశెట్టి పున్నం చందర్ ఉపాధ్యక్షులు మాదాసు మొగిలి. బూత్ అధ్యక్షులు కాశెట్టి సాయి కన్వీనర్ .మండల కన్వినర్ మండల రాజు పాల్గొనడం జరిగింది అలాగే రేపు మండల కేంద్రం లో జరిగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో అందరు పెద్ద ఎత్తున పాల్గొని స్వాత్రంత్ర సమర్యోదులను గుర్తు చేస్తూ బావితరాలకు తెలియజేయాలనీ కోరడం జరిగింది

ఆనంద్ కుమార్ తల్లోజు ఆచారికి క్షమాపణ చెప్పాలి.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-11T170554.426.wav?_=7

ఆనంద్ కుమార్ తల్లోజు ఆచారికి క్షమాపణ చెప్పాలి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 ఆధ్వర్యంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆఫీసు కల్వకుర్తిలో ప్రెస్ మీట్ నిర్వహించారు ముందుగా కార్యక్రమంలో మొగలి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ…ఈనెల ఆరో తారీఖున కల్వకుర్తి పట్టణంలో జరిగిన బిజెపి ధర్నా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ మాజీ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీల హామీని ప్రజల సాక్షిగా నిలదీయడంతో రాబోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుందని భయాందోళనలకు గురై కంగుతిన్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ కుమార్ 45 ఏళ్లుగా ఒకే పార్టీ ఒకే జెండా ఒకే అజెండాతో పని చేస్తున్న,ఉద్యమనేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పోరాటాల సూర్యుడు, తల్లోజు ఆచారిని ఆరుసార్లు ఓడిపోయావని బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేసి లోన్లు తేలేదని కించపరుస్తూ తిట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం…ఆచారి ఆరుసార్లు ఓడిపోయాడని అంటున్న నువ్వు ఒక్కసారి వెనుక తిరిగి నీ వీపు నువ్వు చూసుకో…
మొదటిసారి కాటన్ మిల్ ఎలక్షన్లలో చిత్తరంజన్ దాసు గారి కాళ్లు పట్టుకొని గెలిచావు గుర్తులేదా…?ఇప్పటికీ 9 సార్లు ఓడిపోయిన నువ్వు నీ చరిత్ర ఏందో నువ్వు తెలుసుకో…
కౌన్సిలర్ గా ఓటమి…
ఎంపీటీసీ గా ఓటమి…
సర్పంచ్ గా ఓటమి…
కాటన్ మిల్లు ఓటమి…
100 నుంచి 1000 ఓట్ల ఎలక్షన్లలో ఓడిపోయిన నువ్వు ఆచారి గారిని అనే అంత గొప్పోడివా…?
మొదటి ఎలక్షన్లలో 8500 ఓట్లు
రెండవ ఎలక్షన్లలో 52 వేల ఓట్లు
మూడవ ఎలక్షన్లలో 29 వేల ఓట్లు
నాల్గవ ఎలక్షన్లలో 42 వేల ఓట్లు
ఐదవ ఎలక్షన్లలో 60 వేల ఓట్లు
ఆరోసారి ఎలక్షన్లలో 70 వేల ఓట్లు కల్వకుర్తి ప్రజల చేత మన్నన పొంది కల్వకుర్తి ప్రజల ప్రేమాభిమానాలు ఆస్తులుగా సంపాదించిన
తల్లోజు ఆచారీని కించపరుస్తావా…?బిజెపి నుండి కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ నుండి టిడిపిలోకి టిడిపి నుండి స్వతంత్ర అభ్యర్థి వైపు అక్కడి నుండి మళ్ళీ కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ వైపు ఇప్పుడు టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వైపు ఇప్పుడు చెప్పండి ఇంకా ఏ పార్టీ మిగిలింది మీకు..?6సార్లు పార్టీలు మారిన నీచరిత్రను తిరిగేస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది కాదా…?
నునుగు మీసాల వయసు నుంచి 45 ఏళ్లుగా ఒకే పార్టీ ఒకే జెండా
ఒకే అజెండా ఒకే పార్టీలో పనిచేస్తూ ఎన్ని గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినా కలలో కూడా పార్టీ మారే ఆలోచన చేయకుండా నిరంతరం కల్వకుర్తి ప్రజల గురించి తప్పా తన వ్యక్తిగత జీవితం కూడా మరచి కల్వకుర్తి ప్రజల కోసం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు తల్లోజు ఆచారిని అవమానిస్తావా…?
తల్లోజు ఆచారి బీసీ కమిషన్ ద్వారా ఏం న్యాయం చేశాడని ప్రశ్నించిన ఆనంద్ కుమార్ అసలు బీసీ కమిషన్ అంటే ఏంటో తెలుసా…? ఒక ఉన్నత విద్యావంతుడిని అని చెప్పుకుంటావు కదా..?
బీసీ కమిషన్ కు నిధులు ఉండవన్న సంగతి నీకు తెలియదా…?
బీసీ కమిషన్ అనేది కేవలం బీసీలకు న్యాయం చేయడానికి మాత్రమే ఏర్పడ్డ ఒక రాజ్యాంగ వ్యవస్థాని నీకు తెలియదా…?
ఆచారి గారు బీసీ కమిషన్ మెంబర్ అయిన తర్వాతనే ఈ దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, లా యూనివర్సిటీలో, ఎంబీబీఎస్ సీట్ల విషయంలో బీసీలకు 27% రిజర్వేషన్లు, అమలుపరిచారన్న సంగతి నీకు తెలియదా…?
బీసీ కమిషన్ ద్వారా దక్షిణ భారతదేశంలో ఎంతోమంది బీసీ ఉద్యోగులకు బీసీ ప్రజలకు న్యాయం చేశాడన్న సంగతి మరిచిపోయావా…?మాట్లాడితే బీసీ బిడ్డ అని చెప్పుకుంటావు కదా కల్వకుర్తి పట్టణంలో గత 30 ఏళ్ళ నీ రాజకీయ చరిత్రలో ఏ ఒక్కరికి న్యాయం చేసావో..?ఏ ఒక్క బీసీని ఉద్ధరించావో చూపిస్తావా…?
ఒక్క బీసీ నైనా రాజకీయ నాయకుడిగా ఎదగనిచ్చావా…?ఖబర్దార్ ఆనంద్ కుమార్ నీ తప్పు తెలుసుకుని తల్లోజు ఆచారి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను…. అన్నారు.
తదనంతరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుర్రాల రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..పదవుల కోసం పార్టీలు మారే మీరు అలుపెరుగని పోరాటయోధులైన తల్లోజు ఆచారి గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదం…మొన్న ఆరో తారీకు జరిగిన ర్యాలీలో 100 మంది పాల్గొన్నారు.అనడం నీఅవివేకం ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది అర్హులైన లబ్ధిదారులను కించపరచడం మీఅహంకారానికి నిదర్శనం…మీకాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ 2000 పెంచను 4000 చేస్తాం అనలేదా…?వికలాంగుల పింఛన్ 4000 రూపాయలను 6000 రూ” చేస్తాం అనలేదా..?
ప్రతి మహిళకు నెల నెల
2500/-రూ ” ఇస్తాం అనలేదా..?
ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తాం అనలేదా..?
ప్రతి రైతుకు రెండులక్షల రూ రుణమాఫీ హామీ మీరు ఇచ్చింది కాదా..?ఎకరాకు ప్రతి సంవత్సరం 15000/- రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వలేదా…?మీరు ఇచ్చిన 6గ్యారంటీల దొంగ హామీల మీద మాట్లాడితే ఆచారిని తిడతారా..?
ఈ ప్రాంతంలో ఆచారి గారి ప్రజా ఉద్యమాలు గుర్తులేదా..?KLI.. కోసం ఆమనగల్ నుంచి కల్వకుర్తి మీదుగా ఎడ్లబండ్లతో పాలమూరు కలెక్టర్ ముట్టడి మరిచినావా…KLI.. పూర్తి కోసం సీఎం ఇల్లు ముట్టడి కోసం రైతులతో చలో హైదరాబాద్ పేరుతో ప్రభుత్వంతో చేసిన యుద్ధం గుర్తులేదా..?రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్తు కోసం 4రోజుల దీక్ష గుర్తులేదా…?
RDO.. కార్యాలయం కోసం ఏడు రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలపెట్టి సాధించింది మరిచిపోయావా..?కొట్ర నుండి కల్వకుర్తి మీదుగా తిరుపతి వరకు 1000 కోట్ల రోడ్డును మోడీ గారితో మాట్లాడి పట్టుబట్టి తీసుకొచ్చింది మర్చిపోయావా..?ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ జడ్చర్లకు తరలిస్తే అప్పటి ప్రభుత్వంతో యుద్ధం చేసి కల్వకుర్తికి తెచ్చింది గుర్తులేదా..? కల్వకుర్తి ప్రాంతంలో ఏది సాధించాలన్న ఉద్యమాలకు ఊపిరి పోసి తన ప్రాణాలను అడ్డుపెట్టి మరి సాధించే ఏకైక నాయకుడు తల్లోజు ఆచారి అని తెలుసు కదా..?కల్వకుర్తిలో 20 సీట్లు గెలుస్తామని గొప్పలు మాట్లాడిన నీవు గత ఎన్నికల్లో కౌన్సిలర్ ఎందుకు ఓడినావు..?కల్వకుర్తి పట్టణంలో గత ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ సాధించిన బిజెపి పార్టీ ఎదుగుదలను భరించలేకనే కుట్రతో మాట్లాడుతున్నావని మాకు అర్థమవుతుంది…2014-2016-2023 ఆచారికి కల్వకుర్తి పట్టణం లీడు వచ్చింది నిజం కాదా…?
నిజాలని గుర్తుంచుకొని మాట్లాడితే మీకే మంచిది ప్రశాంతమైన కల్వకుర్తిలో ఉద్దేశ పూర్వకంగా చిచ్చులు పెట్టాలని చూసే మీ
కుటిల రాజకీయం ఇకపై చెల్లదు మీరు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని తల్లోజు ఆచారి కి క్షమాపణ చెప్పాలనిడిమాండ్ చేసారు…ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్ సీనియర్ నాయకులు, సూర్య కృష్ణ గౌడ్,నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నరేడ్ల శేఖర్ రెడ్డి, బోడ నరసింహ, పాలకూర్ల రవి గౌడ్, సురేందర్ గౌడ్, గుండోజు గంగాధర్, నాప శివ,కొల్లూరు శ్రీధర్,తగుళ్ల వెంకటేష్ యాదవ్, లక్ష్మీ నరసింహ, సాయి,తోడేటి అరవింద్ రెడ్డి, వాకిటి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

నాలుగు గంటల నీటి విడుదలకు నలుగురు మంత్రులు..

నాలుగు గంటల నీటి విడుదలకు నలుగురు మంత్రులు – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఆదివారం రామడుగు మండలంలో మంత్రుల పర్యటన సందర్భంగా వచ్చిన మంత్రులకు కనీసం మండలంలోని మరియు నియోజకవర్గ పరిధిలోని సమస్యలు పట్ల మంత్రులకు, ఇక్కడి శాసనసభ్యుడికి అవగాహన లేదని వారు ఎద్దేవా చేశారు. స్థానిక సమస్యలను మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లాకపోవడం శోచనీయంశం అని, స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గ పరిధిలోని సమస్యల పట్ల కనీసం అవగాహన లేదని అన్నారు. మండల కేంద్రంలోని బ్రిడ్జికి ఇరువైపులా భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం కోసం మంత్రుల వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించిన రైతులను అక్రమంగా అరెస్టు చేసి పొలీస్ స్టేషన్ల చుట్టూ తింపరని, రైతులను నేరస్థులుగా చూడటం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి కోసం వారి భూములను ఇవ్వడం నేరమా అని ప్రశ్నించారు. ప్రతి పక్షాల పట్ల దురుసుగా మాట్లాడం కాదు, మీకు చాతనవుతే నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి చూపండి అని హితబోధ చేశారు. కేవలం నాలుగు గంటలు మాత్రమే నీటిని విడుదల చేసి ఆపడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు నీటి సరఫరా తిరిగి విడుదల చేయాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొలపురి రమేష్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, మండల ఉపాధ్యక్షులు కళ్లెం శివ, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శిలు ఎడవెల్లి లక్ష్మణ్, దయ్యాల రాజు, ఐటి సెల్ మండల కన్వీనర్ మాడిశెట్టి జయంత్, దయ్యాల వీరమల్లు, పురంశెట్టి మల్లేశం, లంక నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.

గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T172721.005.wav?_=8

గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు.

బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్

చిట్యాల, నేటిధాత్రి ;

గ్రామల అభివృద్ధియే బిజెపి లక్ష్యమని చిట్యాల మండల కేంద్రంలో బిజెపి మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలుసాని తిరుపతిరావు విచ్చేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టడం జరిగిందని పేద ప్రజల కోసం ముద్ర లోన్లు ఇంటింటికి ఎల్ఈడి బల్బులు సౌకర్యం సులభతరంగా ఉండాలని ఐదు వందే భారత్ రైలును యువత కు ఉద్యోగ కల్పన అదేవిధంగా మహిళలకు ఉజ్వల యోజన గ్యాస్ లు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం రామగుండం యూరియా ఫ్యాక్టరీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి కొన్ని వందల కోట్ల విడుదల చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మద్దతుగా నిలబడి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మద్దతు తెలిపాలని అన్నారు
అదేవిధంగా అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ బూటక హామీలతోని దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు నోచుకోలేని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అములు చేయలేదన్నారు,
కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు సీనియర్ నాయకులు చెక్క నరసయ్య, సుధ ల వెంకటరాజ వీరు, సుదగాని శ్రీనివాస్ ,నల్ల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, గొపగాని స్వామి, మారత అశోక్ ,అనుపమ మహేష్, గొప గాని రాజు, మాదారపు రాజు ,రాజేష్, చెన్నవేని సంపత్, కదం రాజు, కేంసారపు ప్రభాకర్, ఆ వంచ రాజు, తీగల వంశీ,, అశోక్ చారి, శివారెడ్డి, చింతల రాజేందర్ ,జూనువల వివేక్, తొట్ల మహేష్, జంజర్ల కుమార్, కల్వచర్ల కిషోర్, చెప్పాలా రాజు, తదితరులు పాల్గొన్నారు.

కథలాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో..

కథలాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T141432.971.wav?_=9


నేటి ధాత్రి కథలాపూర్

కథలాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున ప్రధాన రహదారి నుండి మాడల్ స్కూల్ వరకు మంజూరు అయిన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కథలాపూర్ ఎంపీడీఓ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ రహదారి కోసం ప్రభుత్వం రూ. 1.30 కోట్లు మంజూరు. చేసిందని, భూమి పూజ చేసి 8 నెలలు గడిచినా పనులు ప్రారంభించలేదన్నారు. మోడల్ స్కూల్,కస్తూరిభా స్కూల్, జూనియర్ కళాశాల కు ఈ. దారిలో వెళ్లే విద్యార్థులకు వర్షం కురిసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పనులు వెంటనే ప్రారంబించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి,గాంధారి శ్రీనివాస్,ఎగ్యారపు జలందర్, గడ్డం జీవన్ రెడ్డి,ప్రసాద్,కాసోజి ప్రతాప్ బీజేపీ నాయకులుపాల్గొన్నారు.

మాటలకు అంతు లేదు..చేతలకు చింత రాదు!?

`ఆదరించిన ప్రజలకు సేవ చేయడం మర్చిపోతున్నారు.

`దిక్కు మాలిన రాజకీయాలు చేస్తున్నారు.

`రాజకీయాలు వదిలేశారు.

`వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యతనిస్తున్నారు.

`ప్రజాక్షేత్రంలోకి వెళ్లే శక్తి లేదు.

`ఎన్నికలుంటే తప్ప సభలు పెట్డుకోలేరు.

`కార్యకర్తలను కలుసుకోలేరు.

`ఒకరినొకరు పరస్పర విమర్శలు చేసుకోవడం అలవాటు చేసుకున్నారు.

`అయితే అవినీతి ఆరోపణలు!

`లేకుంటే నీతి మాలిన ఆరోపణలు!

`నిత్యం అవే ఆరోపణలా!?

`నాయకులు రాసలీల బాగోతాలా!

`చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడడం లేదు!

`విమర్శలు చేయడానికి ముందూ వెనుకా ఆలోచించడం లేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాలలో నాయకుల మాటలకు హద్దూ బద్దూ లేకుండాపోతోంది. గతంలో ప్రతిదానిని రాజకీయం చేయడం అలవాటైందని పార్టీలు అంటుండేవి. ఇప్పుడు రాజకీయాలు మానేసి, అశ్లీలాలు మాట్లాడుకుంటున్నారు. ఆ నాయకుడు వ్యవహరం ఇలా, ఈ నాయకుడి చీకటి బాగోతం ఇలా అనే మాటలు తప్ప మరేం వినిపించడం లేదు. అసలు సమాజం ఏమనుకుంటోంది? అన్న ఆలోచన కూడా లేకుండాపోతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా పెరిగిన తర్వాత రాజకీయాలలో కూడా విపరీత ధోరణలు పెరిగిపోతున్నాయి. ఇది సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. అసలు నాయకుల వ్యక్తిగత జీవితాలలోకి ఎందుకు తొంగి చూస్తున్నారన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది. నిజంగానే నాయకులు ఎవరి జీవితాలనైనా నాశనం చేస్తే సమాజమే ఊపేక్షించదు. కాని లేని పోని బురదను జల్లుతూ, పేరున్న మహిళలను జీవితాలను ఎందుకు రోడ్లమీదకు తెస్తున్నారో అర్దం కావడంలేదు. ఇలాంటి విషయాలు ప్రజలు కోరుకుంటున్నారనుకోవడం రాజకీయ పార్టీల అవివేకానికి పరాకాష్ట. ఓ పక్క ప్రజా సమస్యలు నలుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఎంత సేపు ఆధిప్యత రాజకీయాలు..కక్షపూరిత రాజకీయాలకు దారులు వేస్తున్నారు. పాలక ప్రతిపక్ష పార్టీలు ఒక రోజు నిందించుకున్నారంటే వేరు. నిత్యం నిందలేనా? రాసలీలల కధనలేనా? మొన్నటి దాకా కేటిఆర్‌ గురించి చెప్పిందే చెప్పి, రాసిందే రాసి అటు నాయకులు, మీడియా దుర్మార్గంగా వ్యవహరించింది. అసలు ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాంటి విషయాలపై మాట్లాడడడం సరైంది కాదు. నిజంగా ఫోన్‌ ట్యాపింగ్‌ లో కేటిఆర్‌ దోషిగా తేలితే శిక్ష పడుతుంది. కాని అది నిజమే కాదో తెలుసుకోకుండానే రకరాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌ రెడ్డి మేమేం తక్కువ తిన్నామా? అన్నట్లు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీద ఆరోపణలుగుప్పించారు. నిజానికి ముఖ్యమంత్రి పదవిలో వున్న నాయకుడు అర్దరాత్రులు ఒంటరి ప్రయాణం చేసే అవకాశం వుంటుందా? రాజకీయ నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా కౌషిక్‌ రెడ్డికి తెలియదా? గతంలో మేం బురద జల్లుతాం తుడుచుకోండి? అనే రాజకీయాలు చేసేవారు. ఇప్పుడు మేం బురదే జల్లుతాం..మీరు బురదే చల్లండి.. చూసుకుందాం? అన్నట్లు వుంది. ఇవేనా ప్రజా సమస్యలు లేవా? అవి పాలక , ప్రతిపక్షాలకు పట్టవా? ప్రజలు ఎనుకున్న ప్రభుత్వాలు ఏంచేయాలి? ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీలు ఏం చేయాలన్నదానిపై స్పష్టత వుంది. కాని తెలంగాణలో ఏం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ 18నెలలు గడుస్తోంది. అనేక కార్యక్రమాలు రూపకల్పన జరుగుతున్నాయి. కాని అవి ప్రజల్లోకి చేరడంలేదు. కాని నిత్యం అదికార, ప్రతిపక్షాల మద్య జరుగుతున్న వివాదాలు మాత్రం మీడియాలో వార్తలౌతున్నాయి. పెద్ద పెద్ద హెడ్డింగులౌతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. ప్రతిపక్షాలను పాలక పక్షాలు నిందించడం వేరు. వేదించడం వేరు. గతంలో ఇదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ప్రజా సమస్యలు గాలికి వెళ్తున్నాయి. నిజంగా ప్రజల కోసం ఆలోచించే పార్టీలు ఏవైనా వున్నాయా? ఎన్నికల ముందు ఓడిపోయిన బిఆర్‌ఎస్‌ ఇచ్చిన హమీలు, గెలిచిన పార్టీ కాంగ్రెస్‌ ఇచ్చిన హమీల ఎక్కడైనా చర్చ జరుగుతోందా? లేదు. కేవలం నిందలు, ఆరోపణలు తప్ప నిజాయితీ మాటలు ఎక్కడా లేవు. ఎంత సేపు రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్‌ దోచుకున్నది అంటూ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. అదికారంలోకి వచ్చిన ఈ పద్దెనమి నెలల్లో లెక్కలేనంత అవినీతి జరుగుతోందని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. మధ్యలో బిజేపి చోద్యం చూస్తోంది. ప్రతిపక్షంగా వున్న బిజేపి కూడా ఏ ప్రజా సమస్య మీద స్పందిస్తున్న దాఖలాలు లేవు. ఏ క్షణాన ఏ పార్టీ ఎటువైపు మాట్లాడుతుందో అర్దం కావడంలేదు. ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే బిజేపి పాలక పక్షం మీదకన్నా, ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ మీదనే యుద్దం చేస్తోంది.. బిఆర్‌ఎస్‌గతంలోనే చేసిన తప్పులనే తవ్వితీస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హమీల మీద ఇప్పటి వరకు బిజేపి ప్రస్తావించపోవడం గమనార్హం. బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రశ్నించే నైతికలేదనే అనుకుందాం? కాని బిజేపి ఏం చేస్తోంది. ఎందుకు మౌనంగా వుంటోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తేవడం లేదు. పైగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ను ఎంత కార్నర్‌ చేస్తున్నారో అంతే విధంగా బిజేపిని కూడా కార్నర్‌ చేస్తున్నారు. అయినా బిజేపిలో ఎలాంటి చలనం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. వాటితోపాటు మరో 420 హామీలు కూడా ఇచ్చింది. వాటిపై ఏ ఒక్క బిజేపి నాయకుడికైనా అవగాహన వుందా? ఎప్పుడైనా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో చదివారా? అందులోని అంశాలపై చర్చించారా? కార్యచరణ ప్రకటించారా? లేదు. కనీసం ఆరు గ్యారెంటీలలో ఎన్ని అమలౌతున్నాయి. ఎన్ని అమలు కావడం లేదన్న వాటిపైనైనా బిజేపికి అవగాహన వుందా? సహజంగా ప్రబుత్వం మీద యుద్దంచేసేప్పుడు ప్రతిపక్షాలు అన్నీ కలిసి రాకపోయినా సరే, ఒకే ఎజెండాతో ఉద్యమాలు సాగిస్తాయి. కాని ఇప్పుడు పరిస్దితి భిన్నంగా వుంది. బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నప్పుడు ఆపార్టీని దింపడానికి, కేసిఆర్‌ను గద్దెదించడానికి ఏక కాలంలో రెండు పార్టీలు చేయాల్సినంత పోరాటం చేశాయి. అన్ని విషయాల మీద పోరాటంలో ఎవరి పై చేయి అన్నట్లుగా సాగాయి. కాని ఇప్పుడు ఆ బిజేపిలో ఆ దూకుడు లేదు. అసలు ప్రజా సమస్యల మీద స్పందనే లేదు. ముఖ్యంగా రైతుల సమస్యల మీద కూడా బిజేపి మాట్లాడలేకపోతోంది. రైతులకు రైతు భరోసాపై బిజేపి స్పందనలేదు. వృద్దాప్య పించన్లు ఎప్పుడు పెంచుతారని అడిగింది లేదు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. అది ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించిన బిజేపి నాయకుడు లేడు. విద్యార్ధినులకు లాప్‌ టాప్‌లు ఇస్తామన్నారు. విద్యార్దులందరికీ విద్యా భరోసా కార్డులిస్తామన్నారు. వీటి మీద బిజేపి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకు మౌనంగా వుంటున్నారు. నిజంగా బిఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్లకాలంలో తప్పులు చేస్తే శిక్షించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది. నిజంగా కేసిఆర్‌ తెలంగాణకు తీరని అన్యాయం చేసినట్లైతే ఎందుకు ఉపేక్షిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. ప్రజలు కేసిఆర్‌ పాలన వద్దనుకున్నారు. కేసిఆర్‌ నాయకత్వం అవసరమే లేదనుకున్నారు. ఫామ్‌ హజ్‌ పాలన వద్దని నిర్ణయంతీసుకున్నారు. ప్రజలను కలవని కేసిఆర్‌ వద్దనే ఓడిరచారు. ఇంకెందుకు కేసిఆర్‌ ప్రస్తావన. ఓ వైపు కేసిఆర్‌ సిఎం. రేవంత్‌రెడ్డి పేరు కూడా ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడం లేదు. అయినా కేసిఆర్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీకి ఏం పని. ప్రజలు బిఆర్‌ఎస్‌ పార్టీని మర్చిపోయారు. కాంగ్రెస్‌ను గెలిపించారు. కేసిఆర్‌ వద్దనుకున్నారు. ఇంట్లో రెస్టు తీసుకునేలా చేశారు. ఓడిస్తే ఇంట్లో కూర్చుంటానని కేసిఆర్‌ చెప్పారు. అదే చేస్తున్నారు. వదిలేయండి? అధికారంలోవున్నప్పుడు గెలిపించిన ప్రజలే కేసిఆర్‌ బైటకు రావాలని ఉద్యమాలు చేశారు. ప్రగతి భవన్‌ దాటి రావాలని డిమాండ్‌ చేశారు. ఆయన రాకపోతే ప్రజలే ప్రజాస్వామ్య పద్దతిలో ఓడిరచి, ప్రగతి భవన్‌ నుంచి గెంటేశారు. ఇంకా ఎందుకు కేసిఆర్‌ పేరును కాంగ్రెస్‌ కలవరిస్తోంది. పలవరిస్తోంది. కేసిఆర్‌ ముచ్చట చెప్పకుండా వుండలేరా? కేసిఆర్‌ ప్రస్తావన లేకుండా ప్రభుత్వం నడపలేరా? కేసిఆర్‌ పేరెత్తకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేరా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పదే పదే కేసిఆర్‌ పేరును గుర్తు చేస్తుంటే ప్రజలు కూడా ఇష్టపడడం లేదు. కాంగ్రెస్‌ నాయకులు కూడా కేసిఆర్‌ గురించి మనకెందుకు అంటున్నారు. ప్రజలు మర్చిపోదామనుకున్నా, కేసిఆర్‌ను కాంగ్రెస్‌ నాయకులే మర్చిపోకుండాచేస్తున్నారు. కేసిఆర్‌ను పదే పదే గుర్తు చేసి జపం చేస్తున్నారు. అలాంటప్పుడు కేసిఆర్‌పై కేసులు పెట్టినా జనం పట్టించుకోరు. పైగా కేసిఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారన్న సంకేతాలు వెళ్లే అవకాశం వుంటుంది. కేసిఆర్‌ ఆనవాలు చెరిపేస్తామంటూనే నిత్యం బిఆర్‌ఎస్‌ నాయకులకన్నా, కాంగ్రెస్‌ నాయకులే కేసిఆర్‌ జపం చేస్తున్నారు. పొద్దుకు పదుల సార్లు గుర్తు చేస్తున్నారు. కేసిఆర్‌ తప్పులు నిత్యం ఎత్తి చూపుతూ పోతుంటే లాభం లేదు. కేసిఆర్‌ కన్నా మంచి పాలన అందించే ప్రయత్నం చేయండి. కేసిఆర్‌ చేయని సంక్షేమాన్ని అందించండి. అంతే కాని పూట పూటకు, కేసిఆర్‌ ప్రస్తావన ఎందుకు? అంతే కాదు కాంగ్రెస్‌ నాయకులకన్నా సిఎంతోపాటు, ఇతర నాయకులంతా బిఆర్‌ఎస్‌ నాయకులు కేటిఆర్‌, హరీష్‌రావు, కవితల పేర్తు ప్రస్తావిస్తూ జనం వారి పేర్లను మదిలో నింపుకునేలా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు బిఆర్‌ఎస్‌ నాయకుల పేర్తు తప్ప, కాంగ్రెస్‌ నాయకుల పేర్లు మర్చిపోయేలా పాలకులే చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఓ రైతు సభలో వేదిక మీద వున్న పెద్దలెవరో తెలియదని ఓ రైతు అన్నాడంటే అర్దం ఏమిటి? రెండేళ్లు దగ్గరకు వస్తున్నా, మంత్రుల పేర్లు కూడా జనం నాలుకల మీద ఆడడంలేదు. కాంగ్రెస్‌ పార్టీ వల్ల బిఆర్‌ఎస్‌ నాయకులను ప్రజలు మర్చిపోవడం లేదు. ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ను గుర్తు చేసుకోవడం కాంగ్రెస్‌పెద్దలు మర్చిపోండి. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రచారం చేసుకోంది.

42 శాతం బీసీ బిల్లును బిజెపి ఆమోదించి ముస్లింలకు న్యాయం చేయాలి.

42 శాతం బీసీ బిల్లును బిజెపి ఆమోదించి ముస్లింలకు న్యాయం చేయాలి.

చిట్యాల, నేటిధాత్రి ;

చిట్యాల మండల మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అన్ని రంగాలలో రాజకీయ ప్రాతినిధ్యం కొరకుకులగనన చేపట్టి 42%బీసీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపించడం జరిగినది ముఖ్యంగా ఇందులో ముస్లిం బీసీలకు స్థానం కల్పించడం జరిగినది ఈ బిల్లును రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు అమలు కాకుండా అడ్డుపడుతున్నారు కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో బీసీ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు అలాగే మధ్యప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ఇంకా దేశంలోని మరికొన్ని రాష్ట్రాలలో బీసీ ముస్లింలకు రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా అక్కడి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయివాస్తవంగా స్వాతంత్రానికి పూర్వం 1852లో అంటర్ కమిషన్ బ్రిటిష్ కాలంలోనేముస్లింలలో ఉన్న బీసీ లకు చట్టబద్ధత చేసింది ముఖ్యంగా ముస్లిం లో ఉన్న బీసీ ఎ బి సి గ్రూప్ లకు చెందిన కులాలైన ఫకీరు మెహతారు దూదేకుల ఖురేషి గారెడి చాకలి మంగలి అత్తరు సాహెబులు పాములు పట్టేవారు 14 కులాలకు చెందిన బీసీ ముస్లింలు దాదాపుగా 37 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విషయము సమాజంలో ఉన్న హిందూ సోదరులకు తెలుసు కావున 42% బిసి బిల్లుకు అడ్డుపడకూడదని మన తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి నాయకులను ముస్లిం బీసీ ఏ బి సి గ్రూపులకు చెందిన కులస్తుల తరపున రాష్ట్ర బిజెపి పెద్దలను కోరుచున్నాము అని మహమ్మద్ రాజ్ మహమ్మద్ విలేకరుల సమావేశంలో తెలియపరిచారు.

బీజేపీ అధ్యక్షులు రామచంద్ర రావుకు ఘన స్వాగతం

బీజేపీ అధ్యక్షులు రామచంద్ర రావుకు ఘన స్వాగతం

బాలానగర్/ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి చౌరస్తాలో శనివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఎంపీ డీకే అరుణ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు గోపాల్ నాయక్ గజమాలతో రామచంద్రరావును సన్మానించారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ డీకే అరుణ, బీజేపీ నేత శాంత కుమార్ వర్గీయులు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి…

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి…

భారతీయ జనతా పార్టీ మద్దూర్ మండలం, అధ్యక్షులు మోకు ఉదయ్ రెడ్డి

మద్దూరు నేటిధాత్రి

జనగామ నియోజకవర్గం మద్దూరు మండలం లో నిర్వహించిన “స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల” లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్ . పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మద్దూరు మండల అధ్యక్షుడు మోకు ఉదయ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బిజెపి జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. అని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొంగోని సురేష్ గౌడ్ అన్నారు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోంది. అన్నారు బిజెపి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి. అని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ నుండి, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బిజెపి కైవసం చేసుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాపాక బుచ్చిరెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబెర్ కూరెళ్ల కిరణ్ గౌడ్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కొండా నాగమణి, ప్రధాన కార్యదర్శులు బొంగోని బాలు, బియ్య రమేష్,సోగాలా మనోజ్,కృష్ణా రెడ్డి, మేక సుదర్మ, చింతల రాజు, చందు, శ్రీకాంత్, బాలకృష్ణ, రాజు మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బిజెపిలో చేరికలు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బిజెపిలో చేరికలు.

#రాబోయే స్థానిక ఎన్నికల్లో యువతకే పెద్దపీట.

#బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకే మొదటి ప్రాధాన్యత దక్కుతుందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి అన్నారు సోమవారం మండలంలోని రంగాపురం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ముల్క రాజేష్ తో పాటు 50 మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి రాణా ప్రతాపరెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం గ్రామ కూడలిలో జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ. ఈరోజు పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ప్రతి పల్లెకు నేరుగా నిధులను విడుదల చేసి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా పథకాలను రూపొందించి గ్రామాలు దృశ్యశ్యామలంగా ఈరోజు ఇలా ఉన్నాయంటే దానికి కారణం మోడీ ప్రభుత్వం. ప్రతి పేదవాడికి సన్న బియ్యం, రైతులకు ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు యూరియా బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు పెట్టుబడి సహాయం, ప్రతి గ్రామాలలో స్మశాన వాటిక, డంపింగ్ యార్డులు, సిసి రోడ్లు, వీధిలైట్ల ఏర్పాటు, పి ఎం జి ఎస్ వై,, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా తారు రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇలాంటి మరెన్నో అభివృద్ధి పనులకు మోడీ ప్రభుత్వం నిధులను సమకూర్చుతున్నది. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం లో ఎక్కువ స్థానాల్లో యువకులకే అవకాశం కల్పించి ప్రజా ప్రతినిధులను చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు ,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచందర్ రెడ్డి ,జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి ,సీనియర్ నాయకులు వల్లె పర్వతాలు ,మండల ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జెండా ఆవిష్కరించిన గంట రవికుమార్..

బీజేపీ జెండా ఆవిష్కరించిన గంట రవికుమార్

వరంగల్, నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-44.wav?_=10

వరంగల్ వనమాల కనపర్తి గ్రామంలో మండల అధ్యక్షులు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడిన భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, జాతీయ కౌన్సిల్ మెంబర్ మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు లు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. వారూ మాట్లాడుతూ,
ఏకాత్మ మానవత వాదాన్ని మరియు అంత్యోదయ విధానాన్ని రూపొందించి, అందరికీ స్వేచ్ఛ సమానత్వం న్యాయం జరగాలని ఉద్దేశంతో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలతో అడుగుజాడలలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు చేరే విధంగా, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి బిజెపి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు బండి సాంబయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, జిల్లా నాయకులు మహేష్ గౌడ్, నరసింహా, పులి సాగర్, మండల ప్రధాన కార్యదర్శి మద్ది రవితేజ, పొన్నాల రాజు, మండల ఉపాధ్యక్షులు నరికే రాజేషు, శక్తి కేంద్ర ఇన్చార్జి రాజేష్ గౌడ్, బూత్ అధ్యక్షులు శ్రీకాంత్ , నిఖిల్ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు కిరణ్, ప్రభాకర్, రాజేష్, అభిషేక్, సతీష్, నగేష్, రాజు, సాగర్, శివ, రాము మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

స్థానికం దిశగా..

స్థానికం దిశగా..

నిర్మల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ప్రస్తుతం జిల్లాలో పండుగ వాతావరణం కనిపిస్తుంది.

ఎట్టకేలకు ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) స్థానాలు ఖరారు కావడంతో ఇక స్థానిక సమరం ఊపదుకోబోతోంది. జిల్లాలో (Nirmal) మొత్తం 18జడ్సీటీసీ స్థానాలు ఉండగా 156 ఎంపీటీసీ స్థానాలకు గానూ మరో ఎంపీటీసీ స్థానం అదనంగా పెరిగింది. దీంతో 157 ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. ఈ స్థానాల సంఖ్య ఖరారు కావడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు పోటీ చేసే ఔత్సాహికులు ఇక రిజర్వేషన్ల ఆధారంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 18 జడ్పీటీసీ స్థానాలుండగా మెజార్టీ స్థానాలు దక్కించుకున్న పార్టీకి జడ్పీ చైర్మన్ పదవి దక్కనుంది.

జిల్లాలో కీలకంగా నిలిచే జడ్పీచైర్మన్ పదవిపై ఆటు అధికార కాంగ్రెస్ పార్టీ (Congress) రెండు నియోజకవర్గాలకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ పార్టీలు దృష్టి సారించాయి. ఈ రెండు పార్టీల్లోని పలువురు సీనియర్ నాయకులు జడ్పి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వీరు మొదట జడ్పీటీసీగా గెలిచేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జడ్పీటీసీ గెలిచిన తర్వాతే చైర్మన్ పదవిని ఏ నేతకు కట్టబెట్టాలనే అంశాన్ని ప్రధాన పార్జీలు నిర్ణయించనున్నాయి. రిజర్వేషన్లు తమకు అనుకూంలంగా రానట్లయితే రాజకీయంగా తమ ఉనికికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని వీరు తమ అనుచరుల వద్ద పేర్కొంటున్నారు.
జిల్లాలోని 18 మండలాలకు గానూ ఎంపీపీ (MPP) పదవులపై దృష్టి సారించిన ప్రధాన పార్టీల నేతలు ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది. ఎంపీటీసీ సభ్యులే ఎంపీపీగా ఎన్నిక కానుండడంతో మొదలు తమ ఎంపీటీసీ నియోజకవర్గంపై పట్టుసాధించుకోవాలని యోచిస్తున్నారు. వీరుకూడా రిజర్వేషన్లు (Reservations) తమకు కూలంగా రావాలని కోరుకుంటున్నారు. దీంతో పాటు జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు పోటీ చేసేవారు కూడా ఇప్పటినుంచే తమ సన్నాహాల్లో నిమగ్నమవుతున్నారు. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరగనుండగా సర్పంచ్ పదవులు మాత్రం పార్టీలకు అతీతంగా జరగనున్నాయి. అయినా ప్రధాన పార్టీలు సర్పంచ్ పదవులకు తమ కార్యకర్తలనే రంగంలోకి దించి పరో క్షంగా తమ అభ్యర్థులను ప్రచారం చేయనున్నాయి.

కీలకం కానున్న జడ్పీటీసీ పదవులు…

జిల్లాలో అత్యంత ప్రాధాన్యతగల పదవిగా చెప్పుకునే జడ్పీచైర్మన్ పీఠంపై ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే సీరియస్ గా దృష్టి కేంద్రీకరించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని తమ ప్రతిష్టను ఇనుమడింపజేసుకోవాలని యోచిస్తోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. నిర్మల్, ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీ నేతృత్వంలో కొనసాగుతున్న కారణంగా ఆ పార్టీ జడ్పీటీసీ ఎన్నికలను సవాలుగా తీసుకోనుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ రావడాన్ని కూడా ఆ పార్టీ ప్రతిష్టగా భావిస్తోంది. ఎలాగైనా 15 జడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని జడ్పీచైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డితో పాటు రామారావు పటేల్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారంటున్నారు. వీరికి తోడుగా స్వత్రంత్ర అభ్యర్థులు సైతం జడ్పీటీసీ పోటీకి ఇప్పటి నుంచే సిద్దమవుతుండడం ఆసక్తిని రేకేత్తిస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version