బీజేపీ గెలిచిన సర్పంచ్‌లకు ఘన సన్మానం

బిజెపి పార్టీ నుండి గెలిచిన సర్పంచ్ లకు సన్మానం

బిజెపి పార్టీ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను ఘన విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి హాజరై
అభ్యర్థులను సన్మానం చేయడం జరిగింది
అనంతరం కీర్తి రెడ్డి మాట్లాడుతూ
ప్రజలు బీజేపీపై పెట్టిన నమ్మకమే ఈ విజయానికి నిదర్శనమని, ఇది పార్టీ కార్యకర్తల కష్టానికి లభించిన ఫలితమని పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని, స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజల సమస్యలను నేరుగా గుర్తించి పరిష్కరించే కీలక పాత్ర పోషిస్తారని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి, పారదర్శకంగా అమలు చేయడంలో మీరు ముందుండాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయగలమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విజయం ఆరంభమే తప్ప అంతిమం కాదని, గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యమని అన్నారు.
ఈ సందర్భంగా విజయం సాధించిన ప్రతి ఒక్కరికి కీర్తి రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో నిబద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న చదువు రామచంద్రారెడ్డి కన్నం యుగదీశ్వర్ పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి రాష్ట్ర నాయకులు బట్టు రవి జిల్లా ప్రధాన కార్యదర్శిలు దొంగల రాజేందర్ పెండ్యాల రాజు తాడికొండ రవి కిరణ్ వివిధ మోర్చ అధ్యక్షులు జిల్లా నాయకులు వివిధ మండలాధ్యక్షుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నాలుగు గంటల నీటి విడుదలకు నలుగురు మంత్రులు..

నాలుగు గంటల నీటి విడుదలకు నలుగురు మంత్రులు – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఆదివారం రామడుగు మండలంలో మంత్రుల పర్యటన సందర్భంగా వచ్చిన మంత్రులకు కనీసం మండలంలోని మరియు నియోజకవర్గ పరిధిలోని సమస్యలు పట్ల మంత్రులకు, ఇక్కడి శాసనసభ్యుడికి అవగాహన లేదని వారు ఎద్దేవా చేశారు. స్థానిక సమస్యలను మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లాకపోవడం శోచనీయంశం అని, స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గ పరిధిలోని సమస్యల పట్ల కనీసం అవగాహన లేదని అన్నారు. మండల కేంద్రంలోని బ్రిడ్జికి ఇరువైపులా భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం కోసం మంత్రుల వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించిన రైతులను అక్రమంగా అరెస్టు చేసి పొలీస్ స్టేషన్ల చుట్టూ తింపరని, రైతులను నేరస్థులుగా చూడటం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి కోసం వారి భూములను ఇవ్వడం నేరమా అని ప్రశ్నించారు. ప్రతి పక్షాల పట్ల దురుసుగా మాట్లాడం కాదు, మీకు చాతనవుతే నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి చూపండి అని హితబోధ చేశారు. కేవలం నాలుగు గంటలు మాత్రమే నీటిని విడుదల చేసి ఆపడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు నీటి సరఫరా తిరిగి విడుదల చేయాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొలపురి రమేష్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, మండల ఉపాధ్యక్షులు కళ్లెం శివ, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శిలు ఎడవెల్లి లక్ష్మణ్, దయ్యాల రాజు, ఐటి సెల్ మండల కన్వీనర్ మాడిశెట్టి జయంత్, దయ్యాల వీరమల్లు, పురంశెట్టి మల్లేశం, లంక నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version