ముగ్గుల పోటీల్లో మహిళల సృజనాత్మకత

ముగ్గులు వేయడం మహిళల సృజనాత్మకతకు నిదర్శనం

విజేతలకు బహుమతులు అందజేసేన ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి .

ముగ్గులు భారతీయ మహిళల హస్తకళా నైపుణ్యానికి ప్రతిబింబాలని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. మకర
సంక్రాంతి సందర్భంగా వనపర్తి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మహిళలకు ముగ్గుల పోటీని ఎస్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ఏ ఆర్, అదనపు ఎస్పీ,వీరా రెడ్డి, వనపర్తి డి ఎస్పీ, వెంకటేశ్వరావు, డిసిఆర్బి డిఎస్పి,బాలాజీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, శ్రీనివాస్, అప్పలనాయుడు, మహిళ ఎస్సైలు, మహిళ, కానిస్టేబుల్, మరియు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేశారు

భారత సంస్కృతికి సంక్రాంతి ప్రతీక: చిత్తూరు ఎంపీ

*సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక భారత దేశం…

*ప్రకృతిని ఆరాధించే పండుగే సంక్రాంతి…

*ఆచార వ్యవహారాలను ఆరాధించే గొప్ప సియం చంద్రబాబు నాయుడు…

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు…

*తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు

చిత్తూరు (నేటిధాత్రి:

 

 

సంస్కృతి, సంప్రదాయాలకు భారత దేశం ప్రతీక అన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.. వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు, ఆచారాల సమ్మేళనమన్నారు. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు.
ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏటా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పర్వదినాన్ని తన సొంతూరు నారావారి పల్లెలో జరుపుకుంటూ.. “సంక్రాంతి” పండుగ వైశిష్ట్యాన్ని భావితరాలకు తెలియజేస్తున్న
స్పూర్తి ప్రదాత అని ఆయన కొనియాడారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం ఏ.పి. సియం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా, ఐ.టి.శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు,
తెలుగు ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ మూడు రోజుల సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. ఈ సంక్రాంతి అందరిలోనూ నూతన వెలుగులు తీసుకొస్తుందనీ ఆయన కాంక్షించారు.
మానవునిలో నూతన ఉత్తేజాన్ని నింపేవి పండుగలన్నారు.ఆధ్యాత్మికంగాను, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పడంలోనూ, అలాగే మనిషి మూలాలు, ఉనికిని ఈ పండులు ప్రతిబింబిస్తాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వివరించారు.

నాగర్ కర్నూలులో ఘనంగా వివేకానంద జయంతి…

నాగర్ కర్నూలు జిల్లా నేటి దాత్రి

 

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కేంద్రంలో పదో వార్డులో మాజీ కౌన్సిలర్ బాదం సునీత నరేందర్ అధ్యక్షతన జరిగిన వివేకానంద జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆయన బాల్యం నుండి ధైర్యం వివేకం సేవ వంటి గుణాలను కలిగిన వాడు భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్ దేశాల్లో వేదాంతం శాస్త్రములను తన ఉప న్యాసాల ద్వారా వాదనల ద్వారా క్రాంతి అతనికి ఉంది అమెరికాకు వెళ్లి అక్కడ హిందూ మతం ప్రాశాస్త్రం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు భారతదేశాన్ని ప్రేమించి భారతదేశ మళ్లీ తన ప్రాచీన ఒణ్యత్యాన్ని పొందాలని ఆశించిన ప్రముఖులలో స్వామి వివేకానంద ఒకడు అందరం వివేకానంద మార్గంలో నడవాలని సూచించారు అనంతరం కేక్ కట్ చేసి చిన్న పిల్లలకు పుస్తకాలు పెన్నులు వృద్ధులకు రైసు నిత్యవసర సరుకులు ఎమ్మెల్యే గారు వివేకానంద జయంతిని పునస్కరించుకొని వారి చేతుల మీదుగా ఇచ్చాడు ఈ కార్యక్రమానికి మార్కెట్ చైర్మన్ రమణారావు మాజీ కౌన్సిలర్స్ వాసవి క్లబ్ ప్రముఖులు టౌన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – కేసముద్రంలో ప్రత్యేక పూజలు

బిజెపి ఆధ్వర్యంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాదిని ‘సోమనాథ్ స్వాభిమాన పర్వం’గా ప్రకటించిన నేపథ్యంలో కేసముద్రం రామమందిరంలోని శివుణ్ణి దర్శించుకొని ఓంకార జపం మరియు విశేష పూజల్లో పాల్గొన్న బిజెపి కేసముద్రం మండల బిజేపి పార్టీ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, మండల ప్రధాన కార్యదర్శి బోగోజు నాగేశరచారి , జిల్లా నాయకులు ఓలం శ్రీనివాస్ మండల నాయకులు కంచు సురేందర్ శింగంశెట్టి మధుకర్ , వోలం వీరభద్రరావు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ సోమనాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో భారతీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, వారి త్యాగం భవిష్యత్ తరాల సాంస్కృతిక చేతనకు నిరంతర స్ఫూర్తినిస్తుందని అన్నారు.
మండల ప్రధాన కార్యదర్శి బోగోజు నాగేశరచారి , మాట్లాడుతూ మహాశివుడి 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొట్టమొదటిదైన గుజరాత్ సోమ్ నాథ్ పై దాడి జరిగి ఈ ఏడు వెయ్యేళ్లు అవుతుంది. వెయ్యేళ్లుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ మహిమాన్విత క్షేత్రం భారత అధ్యాత్మికత, నాగరికత, వారసత్వ వైభవోపేతానికి సజీవ సాక్షిగా నిలబడింది. అంతేకాదు, ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగి ఈ ఏడాది 75 సంవత్సరాలు అవుతుంది అని అన్నారు.

సనాతన ధర్మం నిర్మూలన పేరుతో భయాందోళనలు..

సనాతన ధర్మం నిర్మూలన పేరుతో భయాందోళనలు..

 

గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ కొందరు సమాజంలోని ప్రజల మధ్య భయాందోళనలు రేకెత్తిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలాలు మారేకొద్దీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ తమిళనాడు రాష్ట్రంలో కొందరు మాట్లాడుతున్నారంటూ ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనానికి దారితీశాయి..

 సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ కొందరు సమాజంలోని ప్రజల మధ్య భయాందోళనలు రేకెత్తిస్తున్నారని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి(Governor RN Ravi) ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో ‘తమిళ కాశీ సంగమం’ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. కాశీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య అనుబంధం ఈనాటిది కాదన్నారు. సుమారు వెయ్యేళ్ళ క్రితం రాజేంద్ర చోళుడు ఇక్కడకు వచ్చి పవిత్ర గంగా జలాలను తీసుకెళ్ళారన్నారు. తమిళ ప్రజల హృదయాల్లో కాశీ చిరస్థాయిగా నిలిచిపోయిందని, దీనికి శివపెరుమాళ్‌ నిదర్శనమన్నారు.
కాలాలు మారేకొద్దీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ తమిళనాడు రాష్ట్రంలో కొందరు మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ప్రజల మధ్య అనవసరమైన భయాందోళనలు రేకెత్తించడమే వారి ఉద్దేశమన్నారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో భారతీయార్‌ కోసం ప్రత్యేక కుర్చీని కేంద్రం ఏర్పాటు చేసిందని, ఇలాంటి అనేక మంచి పనులు కేంద్రం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యువతదే..

సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యువతదే

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రమణారావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

అత్యంత ప్రాచీనమైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత నేటి యువతపై ఉంటుందని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రమణారావు అన్నారు భారత అడవుల, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ గ్రీన్ కార్ప్స్ వారి సౌజన్యంతో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన క్యాంపస్ ఎకో బజార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్
ఏ రమణారావు
హాజరైనారు అనంతరం మాట్లాడుతూ నేటి అనిశ్చిత వాతావరణం దృష్ట్యా పర్యావరణ రహిత, భారత సాంప్రదాయ ఉత్పత్తులతో దీపావళి పండుగను సమాజ హితం దృష్టిలో ఉంచుకొని నిర్వహించుకోవాలని సూచించారు. ప్రకృతి హితమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని సూచించారు. అంతకుముందు కళాశాల విద్యార్థులు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను సందర్శించారు. హస్తకళలు, చేతివృత్తులు, పేపర్ బ్యాగ్స్,గాజులు,మట్టి దీప ప్రమిదలు, తృణధాన్యాలతో చేసిన పిండి వంటకాలు, జావా చెత్తను వేరు చేయు విధానం, వివరించే స్టాల్స్ సందేశకులందరినీ ఆకట్టుకున్నాయని విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రుక్షాన మహమ్మద్, చంద్రకళ, కవిత, కాత్య, కుమారస్వామి, ఆర్ శ్రీధర్, టీ శ్రీధర్, హైమావతి, రామచందర్, దేవేందర్, శ్రీనివాస్, వరలక్ష్మి, సమీరా, హనుము, శిరీష, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహక సర్టిఫికెట్ ప్రధానం చేశారు.

చిట్యాలలో హర్ ఘర్ తిరంగా జెండా పంపిణీ…

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాల పంపిణీ.

చిట్యాల, నేటిధాత్రి ;

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా.ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు జాతీయ భావాన్ని కలిగి ఉండే విధంగా భారతీయ సంస్కృతిని కాపాడే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు కలిసికట్టుగా దేశం కోసం పనిచేయాలని సంకల్పంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా , చిట్యాల మండల కేంద్రంలో జాతీయ జెండాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం, శ్రీకాంత్, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు గుండ సురేష్, రాష్ట్ర నాయకులు నరసయ్య గారు, తీగల వంశీ,కేంసరపు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version