న్యాల్కల్ లో దేశభక్తితో హోలీ సంబరాలు…

న్యాల్కల్ లో దేశభక్తితో హోలీ సంబరాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల కేంద్రంలో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. స్థానిక హనుమాన్ మందిరం వద్ద యువతతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగులు చల్లుకుంటూ ఆనందంగా పండుగను జరుపుకున్నారు. ఈసారి సినీ గీతాలకు బదులుగా యువత దేశభక్తి పాటలతో వేడుకలను నిర్వహించి వినూత్న సందేశం ఇచ్చారు. గ్రామీణ వాతావరణంలో సంప్రదాయబద్ధంగా, ఐక్యంగా జరిగిన ఈ సంబరాలు గ్రామీణ సంస్కృతికి, జాతీయతకు ప్రతీకగా నిలిచాయి. న్యాల్కల్ గ్రామ సంస్కృతి వైభవాన్ని మరోసారి చాటిచెప్పాయి.

దిగ్వల్ లో హోలీ సంబరాలు: రంగుల పండుగతో యువత ఉత్సాహం

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం దిగ్వల్ గ్రామంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. వసంత కాలపు తొలి వేడుకగా, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా గ్రామ యువత ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. ధనిక, పేద తారతమ్యం మరచి, రాధాకృష్ణుల ప్రేమ గీతాల నడుమ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చలికి వీడ్కోలు పలుకుతూ హోళికా దహన కాంతులతో ప్రారంభమైన ఈ వేడుకలు గ్రామంలో ప్రత్యేక సందడిని నింపాయి. ఈ పండుగను పురస్కరించుకుని గ్రామస్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.

చిట్యాలలో హర్ ఘర్ తిరంగా జెండా పంపిణీ…

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాల పంపిణీ.

చిట్యాల, నేటిధాత్రి ;

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా.ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు జాతీయ భావాన్ని కలిగి ఉండే విధంగా భారతీయ సంస్కృతిని కాపాడే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు కలిసికట్టుగా దేశం కోసం పనిచేయాలని సంకల్పంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా , చిట్యాల మండల కేంద్రంలో జాతీయ జెండాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం, శ్రీకాంత్, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు గుండ సురేష్, రాష్ట్ర నాయకులు నరసయ్య గారు, తీగల వంశీ,కేంసరపు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version