మార్కెట్ విలువ ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి…

మార్కెట్ విలువ ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం బలవంత భూసేకరణ అన్యాయం…. మోరే రవీందర్ రెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి

నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం మొగులపల్లి మండల కేంద్రంలోని రైతులను అక్రమంగా అరెస్టు చేసి బలవంతంగా తమ భూమిలోని చొరబడి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మొగులపల్లి మండల కేంద్రంలో ప్రస్తుతమున్నటువంటి మార్కెట్ విలువ ప్రకారము పరిహారం చెల్లించాలని కానీ తమకు తక్కువ పరిహారము చెల్లించడం అన్యాయమని మొగులపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి నబాబుపేట గ్రామంలో 27 లక్షల 50 వేల రూపాయలు చెల్లించి మొగులపల్లి మండల కేంద్రానికి కేవలం 22 లక్షల 50 వేలు చెల్లించడం ఏంటని అంతేకాకుండా మొగులపల్లి మండలంలోని రంగపురం గ్రామానికి నోటిఫికేషన్ తర్వాత ఆ గ్రామానికి 21,50,000 నిర్ణయించి మండల కేంద్రానికి 22 లక్షల 50 వేలు నిర్ణయించి రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ విలువ ప్రకారము ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు చేపట్టిన తర్వాత రంగపురం గ్రామానికి నోటిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటిని పరిగణలోకి తీసుకొని 29 లక్షల 60000 మండల కేంద్రానికి తక్కువ ధర నిర్ణయించడం ఎంతవరకు

సబవని వెంటనే మండల కేంద్రానికి మిగతా గ్రామాల కంటే ఎక్కువ ధర చెల్లించాలని లేనిచో ఎంతటి త్యాగానికైనా సిద్ధమని అరెస్టు చేసి ఎన్ని రోజులు మమ్ములను ఆపగలరని మా వారసత్వంగా వస్తున్నటువంటి మా తాత ముత్తాతల నుండి మా కుటుంబాలకు జీవనాధారముగా నుండి భూమిని కోల్పోవడం చాలా అన్యాయమని మా కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్ గారు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పోలీసులతో బలవంతపు భూసేకరణ చేపట్టినటువంటి తాసిల్దారు గారు మొగలపల్లి మండల కేంద్రానికి ఎందుకు వివక్షత అని ఆ మండల కేంద్రానికి కూడా సరైన ధర నిర్ణయించి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు బండారి రవీందర్ అరికాంతపు కృష్ణారెడ్డి కొల్లూరు మనోహర్ స్వప్న అడ్డూరి రాజేందర్ గుండా బిక్షపతి గుర్రపు సునంద రెడ్డి ముడుపు మల్లారెడ్డిమోరే పద్మ మోరే అనూష చిలకామారి బొంద్యాలు గుర్రపు తిరుపతిరెడ్డి బోయిన కుమార్ రైతులు తదితరులు పాల్గొన్నారుa

దేవాదుల పథకం ప్యాకేజ్-5 కెనాల్‌ను వెంటనే పూర్తి చేయాలి…

దేవాదుల పథకం ప్యాకేజ్-5 కెనాల్‌ను వెంటనే పూర్తి చేయాలి

రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయ్

తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజ్-5 ఎల్ఎంసి డిసి-3 కెనాల్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్లపైడి డిమాండ్ చేశారు.మంగళవారం తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈర్లపైడి మాట్లాడుతూ, నల్లబెల్లి మండలం గొల్లపల్లె గ్రామం నుంచి దబ్బరిపేట, మేడపల్లి, రామారావు తండా, నర్సింగాపురం, ఇటుకలపల్లి, ఆకుల తండా, ఎనగల్ తండా, ముత్తూజిపేట, రాజుపేట దామెర చెరువు వరకు సుమారు 11.905 కి.మీ మేర కెనాల్ నిర్మాణం చేపట్టి దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారని తెలిపారు.అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఆరు సంవత్సరాల క్రితమే పనులను అసంపూర్తిగా వదిలివేయడంతో కెనాల్ పూర్తికాక సాగునీరు అందక ఈ సీజన్‌లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కెనాల్ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా అందలేదని పేర్కొన్నారు.రాబోయే పంట సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ వేసవిలోనే పనులను పూర్తి చేసి సాగునీరు అందేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టర్, ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు భూమా అశోక్, ఎలకంటి కుమారస్వామి, సుక్క వీరన్న, నూకల మరి సదానందం, బోనగిరి సారన్న తదితరులు పాల్గొన్నారు.

న్యాయం ప్రకారమే నష్టపరిహారం అందుకున్నాం…

న్యాయం ప్రకారమే నష్టపరిహారం అందుకున్నాం.

◆-: మాపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు నిర్ధారమైనవి కావు.

◆-: మా భూముల పై ఉన్నతాధికారులు పూర్తి విచారణ చేసిన తర్వాతే పరిహారం అందించారు.

◆-: చిలేపల్లి తండా మహిళా రైతు గేనీ బాయ్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జరా సంఘం, న్యాల్కల్ మండలాల పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్ ) ఏర్పాటుకు 2012లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కాలుష్య రైతు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం. అందులో భాగంగా కేంద్రం ఆదేశాల ప్రకారం 12635 ఎకరాల ప్రభుత్వ, అసైన్ పట్టా భూములు సేకరించడానికి అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు 7,500 ఎకరాల పైచిలుకు భూములను రైతుల నుంచి సేకరించి నష్టపరిహారం అందజేశారు. నిమ్జ్ భూ సేకరణలో భాగంగా చీలపల్లి తాండ పరిధిలోని సర్వే నంబర్ 151 లో ఆరుగురు రైతుల పైన 20.33 ఎకరాల భూమి ఉంది. ఇట్టి భూమి రికార్డులలో ప్రభుత్వ భూమిగా నమోదు చేసుకుంటూ వచ్చారు అధికారులు. 2012 నుంచి 20.33 గుంటల భూమి ఆన్లైన్లో ప్రభుత్వ భూమిగా నమోదయింది. ఇట్టి భూమిలో ఆరుగురు రైతులు గత 30 సంవత్సరాల నుండి కబ్జాలో ఉండి పంటలు పండించుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నిమ్జ్ భూసేకరణ లో భాగంగా ఇట్టి భూమి నష్టపరిహారం అధికారులు మాకు ఇవ్వలేదు. ఇట్టి విషయంపై మేము తెలంగాణ హైకోర్టుకు అప్పిలు చేసినాము.. నిమ్జ్ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ గారు మా యొక్క కేసును వాపు తీసుకున్నచో నష్టపరిహారం ఇస్తామని తెలిపినారు. తెలంగాణ హైకోర్టులో ఇట్టి కేసును 119/2012 కేసును మేము విత్ డ్రా చేసుకున్నాము. ఇటి కేసు విత్ డ్రా చేసుకున్నట్లు జూన్/ 7 /2024లో కేసును రాజీ కుదుర్చుకున్నట్లు నిమ్జ్ ప్రత్యేక అధికారులకు సమర్పించిన తదుపరి వారు విచారణ వారు పూర్తి దర్యాప్తు చేసిన అనంతరం మాకు నష్టపరిహారం అందజేశారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు ల చుట్టూ తిరిగి కేసుల నుండి రాజి కుదుర్చుకున్న తర్వాత నిమ్జ్ అధికారులు ఇట్టి సర్వే నంబర్ భూములపై పూర్తి విచారణ చేసిన తర్వాత మాకు నష్టపరిహారం అందించారు. మా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మా కుటుంబ సభ్యులపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ఆసత్యపు ఆరోపణలపై మా కుటుంబ సభ్యులం ముక్తకంఠంతో త్రీవంగా ఖండిస్తున్నాం. మాకు ప్రభుత్వ అధికారులు పూర్తి విచారణ అనంతరం మాకు నష్టపరిహారం అందజేశారు. ఈ విషయంలో కొందరు కావాలని మాపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బులకు ఆశపడి ఇతరులు చెప్పుడు మాటలు విని మమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వీరి ఆరోపణలు నిరాధారణమైనవి కావు. ఈ సమావేశంలో జాదవ్ ధర్మీబాయి, సుమిత్ర బాయ్, మోతి బాయ్ , రేఖ భాయ్, సావిత్రిబాయి తదితరులు పాల్గొన్నారు.

నాలుగు గంటల నీటి విడుదలకు నలుగురు మంత్రులు..

నాలుగు గంటల నీటి విడుదలకు నలుగురు మంత్రులు – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఆదివారం రామడుగు మండలంలో మంత్రుల పర్యటన సందర్భంగా వచ్చిన మంత్రులకు కనీసం మండలంలోని మరియు నియోజకవర్గ పరిధిలోని సమస్యలు పట్ల మంత్రులకు, ఇక్కడి శాసనసభ్యుడికి అవగాహన లేదని వారు ఎద్దేవా చేశారు. స్థానిక సమస్యలను మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లాకపోవడం శోచనీయంశం అని, స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గ పరిధిలోని సమస్యల పట్ల కనీసం అవగాహన లేదని అన్నారు. మండల కేంద్రంలోని బ్రిడ్జికి ఇరువైపులా భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం కోసం మంత్రుల వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించిన రైతులను అక్రమంగా అరెస్టు చేసి పొలీస్ స్టేషన్ల చుట్టూ తింపరని, రైతులను నేరస్థులుగా చూడటం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి కోసం వారి భూములను ఇవ్వడం నేరమా అని ప్రశ్నించారు. ప్రతి పక్షాల పట్ల దురుసుగా మాట్లాడం కాదు, మీకు చాతనవుతే నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి చూపండి అని హితబోధ చేశారు. కేవలం నాలుగు గంటలు మాత్రమే నీటిని విడుదల చేసి ఆపడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు నీటి సరఫరా తిరిగి విడుదల చేయాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొలపురి రమేష్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, మండల ఉపాధ్యక్షులు కళ్లెం శివ, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శిలు ఎడవెల్లి లక్ష్మణ్, దయ్యాల రాజు, ఐటి సెల్ మండల కన్వీనర్ మాడిశెట్టి జయంత్, దయ్యాల వీరమల్లు, పురంశెట్టి మల్లేశం, లంక నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version