అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్ లో రోలింగ్ షీల్డ్ సాధించిన యజుర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు.. హైదరాబాద్ లో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్, కరాటే కుంగ్ ఫూ , టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీలలో వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.. హనుమకొండ జిల్లా నుండి వివిధ స్కూల్ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనగా యజూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి వివిధ విభాగాలలో పథకాలను సాధించారు. తమ కృషి శిక్షణ మరియు ప్రతిభతో మెరిసిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి రోలింగ్ షీల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఏకైక పాఠశాలగా ప్రత్యేక గుర్తింపు సాధించింది.
ఈ ఛాంపియన్షిప్ పోటీలలో యజుర్ పబ్లిక్ స్కూల్ నుండి మొత్తం 39 మంది విద్యార్థులు పాల్గొనగా ఇందులో 26 మంది స్వర్ణ పథకాలు, 10మంది రజత పథకాలు, ముగ్గురు కాంస్య పథకాలు సాధించి తమ ప్రతిభను నిరూపించుకున్నారు..ఈ విజయంతో యజూర్ పబ్లిక్ స్కూల్ మరో అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పొందిందని ఈ గొప్ప విజయంలో విద్యార్థులకు శిక్షణ అందించిన కోచ్ క్రాంతి కుమార్ ను పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జలీల్ అహ్మద్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంతా అభినందించారు..