నిరుపేదలను విస్మరించిన ప్రభుత్వం
.. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి….
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్
యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాబు యాదవ్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ జిల్లా మలహలరావు మండలం లోని కొయ్యూరు గ్రామంలోని ఆదివాసి గిరిజన కాలనీని ఈరోజు సందర్శించడం జరిగింది 60 కుటుంబాలు ఉన్న నిరుపేద ఆదివాసులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నాం నిరుపేదలైన ఆదివాసులకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వాయిస్తున్నారని బడుగు బలహీన వర్గాలు అయినటువంటి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అర్హులైన నిరుపేదలకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం . ఆ కాలనీవాసులను మందలించగా మాకు ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఉన్నత అధికారులు నిర్లక్ష్యం మూలంగానే ఈ కాలనీ వెనుకబడిపోతుందని తక్షణమే సర్వే నిర్వహించి నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా చర్యలుచేపట్టాలని ఈ నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు తక్షణమే స్పందించి నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా అధికారులకు ఆదేశించాలని లేనియెడల నిరుపేదలను సమీకరించి ఆందోళనలో పోరాటాలకు సిద్ధం చేస్తామని అన్నారు ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ఎస్సీ ఎస్టీ దళితులకు బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎవరికి కూడా ఇల్లు అచ్చిన దాకాలు కానరావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి మండల కార్యదర్శి బుర్రి కుమారస్వామి ఆదివాసి నాయకులు గొట్టం ఎల్లన్న సేద మల్లేష్ గొట్టం సమ్మక్క అరవండి లక్ష్మి సమ్మయ్య నాయక్ పాల్గొన్నారు