పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేసిన పి.ఎ.సి.ఎస్ చైర్మన్…

పోటీ పరీక్షల పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసిన – పి.ఎ.సి.ఎస్ చైర్మన్

* ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన – ప్రిన్సిపాల్

మహాదేవపూర్ ఆగస్టు 19 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనీ విద్యార్థులకు మంగళవారం రోజున పి.ఎ.సి.ఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి పోటీ పరీక్షల పుస్తకాలని పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న ప్రధమ మరియు ద్వితీయ పేద విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొని ఉన్నత స్థానాలకు ఎదగాలని నీట్, జేఈఈ, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలలో పాల్గొనాలన్న సదుద్దేశంతో ఈ పుస్తకాలను పంపిణీ చేశామని, పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని పి.ఎ.సి.ఎస్ చైర్మన్ చల తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు. అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను అందించినందుకు పి.ఎ.సి.ఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు అబ్దుల్ అలీ, రమేష్, సదానందం, సంధ్యారాణి తోపాటు అధ్యాపకెతర బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్యం.. నులిపురుగుల నివారణ తప్పనిసరి: మాక్సుద్

చిన్నారుల ఆరోగ్యం.. నులిపురుగుల నివారణ తప్పనిసరి: మాక్సుద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మాక్సుద్ మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడాలంటే నులిపురుగులను నివారించడం తప్పనిసరి అని, ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వీటిని ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సింఫోనియా, వైస్ ప్రిన్సిపల్, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version