9000 రూ తో పాఠశాలకు సౌండ్ సిస్టం బహుకరణ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-48-2.wav?_=1

9000 రూ తో పాఠశాలకు సౌండ్ సిస్టం బహుకరణ

గుర్రం వెంకన్న గౌడ్ సేవలు అభినందనీయం

పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశిధర్.

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం గ్రామంలో ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్ సేవలు అభినందనీయం అని జిల్లాపరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశిధర్ అన్నారు,తాను పనిచేస్తున్న పాఠశాల కోసం వారి యొక్క నేస్తం మిత్రులు, వాకర్స్ మిత్రులు , ఫ్యామిలీ ఫ్రెండ్స్ మిత్రులు మరియు ఇంకా కొంతమంది దగ్గరి మిత్రుల నుండి సేకరించిన 9000/- రూలతో ఆహుజ కంపెనీ సౌండ్ సిస్టంను తీసుకొని రాంపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా పాఠశాలకు ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశిధర్ మాట్లాడుతూ పాఠశాలకు వచ్చిన మొదటి రోజు నుండి మొదలుకొని ఇప్పటివరకు పిల్లల అవసరాలు తీర్చడానికి, పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు గతం లో పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు,పెన్సిల్ లు,నవోదయ పుస్తకాలు ఇవ్వడం జరిగిందని ఇప్పుడు ప్రార్థన సమయంలో, మరియు వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడే సౌండ్ సిస్టం ను తీసుకురావడం ఎంతో ఉపయోగం అన్నారు వెంకన్న గౌడ్ ను తోటి ఉపాద్యాయులు,పిల్లల తల్లిదండ్రులు అభినందించారు,ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం కనకం గణేష్, శ్రీధర్, కిన్నెర శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version