ఒకరితో అభివృద్ధి సాధ్యం కాదు…

ఒకరితో అభివృద్ధి సాధ్యం కాదు
-జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము

రాయికల్, ఆగస్టు 14, నేటి ధాత్రి:

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అల్లీపూర్ నందు వాటర్ ప్లాంట్ మరియు బాస్కెట్బాల్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి కే. రాము గారు మాట్లాడుతూ ఏ ఒక్కరితో అభివృద్ధి సాధ్యం కాదని అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. 2024- 25 10వ తరగతి బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులు చందాలు వేసుకొని పాఠశాలలో విద్యార్థుల కొరకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు. అలాగే బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటుకు పూర్తిస్థాయిలో సహకరించిన గొడ్డండ్ల రాజగోపాల్, మ్యాలపు మురళి గార్లను ప్రత్యేకంగా డీఈఓ గారు అభినందించారు. ఈ పాఠశాలకు అభివృద్ధి కొరకు గతంలో సహకరించిన వారి విధంగానే భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. కలిసికట్టుగా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందాన్ని డీఈవో గారు అభినందించారు. తదనంతరం దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్ గారు, దాతలు గొడ్డండ్ల రాజగోపాల్ గారు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version