బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మేకల వీరన్న యాదవ్.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మేకల వీరన్న యాదవ్

రాష్ట్ర టి పి సి సి, ఓ బి సి వర్కింగ్ ప్రెసిడెంట్

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి దాత్రి

 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రం విలేజిలో ఇటీవల అకాల మరణం చెందిన పశువుల పేద్దులు కుటుంబానికి రాష్ట్ర టిపిసిసి ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసముద్రం గ్రామ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్, మాజీ వార్డ్ మెంబర్ గుండు లక్ష్మీనారాయణ ,బోళ్ల కట్టయ్య ,బోళ్ల అశోక్, పెండ్యాల లక్ష్మణ్, ఉల్లి వెంకటేశ్వర్లు ,బొమ్మరబోయిన సతీష్, జీలకర్ర బాబు ,ఎస్కే యాకోబు, పశువుల సమ్మయ్య ,మరియు మృతుడి కూతుర్లు అల్లుళ్లు బోళ్ల ఉప్పలయ్య గుండు అశోక్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

అన్ని విధాలా గ్రామాల అభివృద్ధి.

అన్ని విధాలా గ్రామాల అభివృద్ధి

ఉపాధి హామీతో మెండైన అవకాశాలు

నియోజకవర్గంలో 63 లక్షలతో 187 పశువుల తొట్టెల నిర్మాణానికి భూమి పూజ చేపట్టిన ఎమ్మెల్యే అమర్

పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 01:

 

గ్రామాల సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని కీలపల్లి పంచాయతీ జే.ఆర్. కొత్తపల్లిలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువులకు నీటి తొట్టెల నిర్మాణ భూమీ పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన పూజలు చేసి పనులను ప్రారంభించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలో 62 లక్షల రూపాయలతో 187 నీటి తొట్టెలను నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

MLA Amar

ఉపాధి హామీ పథకంలో రైతులకు ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసుకునేందుకు అవకాశం ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని గ్రామాలలో రోడ్లు, మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ రవికుమార్, అసిస్టెంట్ పిడి ఎస్ రవికుమార్, ఎంపీడీవో సురేష్ కుమార్, తహసిల్దార్ మాధవరాజు, ఏపీవో శ్రీనివాసులు, ఏపీఎం హరినాథ్ లతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాపరెడ్డి,నాగరాజు రెడ్డి, ఆల్ కుప్పం రాజన్న, మునస్వామి రెడ్డి, గిరిధర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు..

సన్న బియ్యం కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.

సన్న బియ్యం కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ

ధనవంతులే కాదు… పేదలు సన్న బియ్యం తినాలి

ముదిగుంట గ్రామంలో సన్న బియ్యం పంపిణీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో ఉగాది కానుకగా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దుగుట జ్యోతి మాట్లాడుతూ ఇప్పటివరకు ధనవంతులు తినే సన్నబియ్యం ఇకపై ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోకి వస్తుంది.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని,పోషక విలువలతో కూడిన సన్న బియ్యం అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.అలాగే సన్న బియ్యం పథకం ప్రారంభించడం పేదలు అదృష్టంగా భావిస్తున్నారు.సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల రైతులకు కూడా మేలు జరుగుతుందని సరైన గిట్టుబాటు ధరలు కూడా వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుగుట జ్యోతి పాండరి, మాజీ ఎంపీపీ గోదారి రమాదేవి లక్ష్మణ్ కాంగ్రెస్ నాయకులు చేలుకల పోశం,గుండా సురేష్ గౌడ్, కొట్టాల మల్లయ్య పోతుగంటి సుమన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

షీ టీం అవగాహన సదస్సు ఏర్పాటుచేసిన.!

సిరిసిల్ల జిల్లాలో షీ టీం అవగాహన సదస్సు ఏర్పాటుచేసిన జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే

మహిళలకు రక్షణగా షీ టీం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల జిల్లాలో మహిళల, విద్యార్థుల రక్షణయే లక్ష్యంగా ఏర్పాటు చేసిన షీ టీం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళ చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పొక్సో, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, వేధింపులకు గురైతే ఎవరిని సంప్రదించాలి అనే మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తూ మహిళల,విద్యార్థినీల భద్రతకు భరోసా కల్పించడం జరుగుతుంది.గడిచిన నెల రోజుల వ్యవధిలో జిల్లాలో విద్యార్థినిలను, మహిళలను వేధిస్తున్న ఆకతాయిలపై 02 కేసులు, 07 పెట్టి కేసులు నమోదు చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే మాట్లాడుతూ..విద్యార్థినులు,
మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి షీ.టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు.

భక్తాంజనేయ స్వామి ఆలయకమిటీ చైర్మన్ గా.!

భక్తాంజనేయ స్వామి ఆలయకమిటీ చైర్మన్ గా అంబీరు మహేందర్ ప్రమాణ స్వీకారం

 

పరకాల నేటిధాత్రి

మండల పరిధిలోని మల్లక్కపేట గ్రామంలో బుధవారం రోజున ఉదయం 9:45 నిమిషాలకు శ్రీ భక్తాంజనేయ స్వామి పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మల్లక్కపేట గ్రామానికి చెందిన అంబీరు మహేందర్ ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పరకాల మండల మరియు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,జడ్పిటిసిలు,ఎంపీపీలు,ఎంపీటీసీలు సర్పంచులు,వార్డ్ మెంబర్లు మరియు పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్,డైరెక్టర్స్, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్స్ పరకాల మండల మరియు పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు,కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావలని అంబీరు మహేందర్ కోరారు.

జర్నలిస్ట్ నాయకులను ఘనంగా సన్మానించిన సేవాలాల్ సేన.

టీ.ఎస్.జె.యు జిల్లా జర్నలిస్ట్ నాయకులను ఘనంగా సన్మానించిన సేవాలాల్ సేన జిల్లా కమిటీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:కేంద్రం లోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నూతన జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ లు ఇటీవల ఎన్నిక కావడం జరిగింది ఈ సందర్భంగా బంజారా సేవాలాల్ సేన జిల్లా కమిటీ నాయకులు కాకతీయ ప్రెస్ క్లబ్ లో టీ.ఎస్.జె.యు జిల్లా కమిటీ నాయకులను శాలువాతో ఘనంగా సన్మానించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన టీ.ఎస్.జె.యు జిల్లా కమిటీ ఎన్నిక కావడం వారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది మరెన్నో ఉన్నంతమైన పదవులు చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అన్నారు బంజారా సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు నాయక్
ముఖ్య రూప్ సింగ్ సేవాలాల్ సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
ధరావత్ రాజు నాయక్ సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షులు
నగవత్ రాజేందర్ నాయక్ సేవాలాల్ సేన జిల్లా నాయకులు,
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు బండారి రాజు,సంయుక్త కార్యదర్శి కడపక రవి,ఆర్గనైజ్ సెక్రెటరీ చంద్రమౌళి,జిల్లా నాయకులు బొల్లేపల్లి జగన్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు బస్ సౌకర్యం ఏర్పాటు.

కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు బస్ సౌకర్యం ఏర్పాటు

 

సిరిసిల్ల టౌన్  (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల(కేవీ స్కూల్)ని తంగళ్లపల్లి మండలం లోని పద్మనగర్ లో గల సొంత భవనంలోకి మార్చాగ విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు మంగళవారం రోజున సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి బస్ ని సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు కొబ్బరికాయ కొట్టి బస్ ని ప్రారంబించారు..సుమారు 180 మంది విద్యార్థులు సిరిసిల్ల పట్టణం నుండి విద్యాభ్యాసం కోసం కేవీ స్కూల్ కి వెళ్లనున్నారు.. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్.టి.సి ని లాభాల్లోకి తీసుకురావాలని కోరారు..విద్యార్థుల కోసం మరో బస్ ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రోజు ఈ బస్ ఉదయం 7:30 నిమిషాలకి కొత్త బస్ స్టాండ్ నుండి ప్రారంభం అయ్యి పాత బస్టాండ్,గాంధీ చౌక్,పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుందని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు డిపో మేనేజర్ ని శాలువాతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్ వైజర్ వర్జిలాల్, కంట్రోలర్ రామ్ రెడ్డి, కార్గో డి.ఎం. ఈ శేఖర్ రావు, ఆర్. టి. సి సిబ్బంది మరియు విద్యార్థుల తల్లి దండ్రులు పెద్ది నవీన్ కుమార్,బండరాజు, కొండికొప్పుల రవి , తడుకల సురేష్,శ్రీనివాస్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

సీఎం రేవంత్ ఎమ్మెల్యే గండ్ర చిత్రపటానికి పాలాభిషేకం.

సీఎం రేవంత్ ఎమ్మెల్యే గండ్ర చిత్రపటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిధాత్రి :

 

చిట్యాల మండలం నైన్ పాక గ్రామంలోని రేషన్ షాప్ నెంబర్ : 1 మరియు రేషన్ షాప్ నెంబర్ 2 లో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు ఉచిత సన్న రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అనంతరం గ్రామ ప్రజలతో కలిసి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి* చిత్రపటానికి మరియు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు* చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తొట్ల రాజయ్య , కుమ్మరి పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు తానేష్ , కనకనాల శంకర్ , కంచర్ల రాములు , పాలడుగుల రఘుపతి , ఎలావెణ శివకుమార్ , కట్టెకొల్ల మల్లేష్ , చెలుపురి రాజయ్య , జంగ మల్లేష్ , నగునూరి వెంకటేష్ , జంబుల నరసయ్య , రాయరాకుల రమేష్ అందుగుల రాజు , జంగా కుమార్ , కంచర్ల ప్రభాకర్ , మొగిలి , గడ్డి రాములు , శ్యామల శ్రీనివాస్ , రాజు , కుమార్ తదితరులు పాల్గొన్నారు..

సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం.

రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం

– అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా పథకాల అమలు

– మంత్రి పొన్నం ప్రభాకర్

– సిరిసిల్లలో సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించిన మంత్రి

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

 

రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త  బస్ స్టాండ్ వద్ద ఉన్న రేషన్ దుకాణంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని మంత్రి, విప్, కలెక్టర్, ఎస్పీ తదితరులతో కలిసి పంపిణీ చేశారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలోని 17,263 రేషన్ దుకాణాల్లో రెండు లక్షల 91 కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. దాదాపు 60 వేల ఉద్యోగాలను తమ ప్రభుత్వం భర్తీ చేసిందని గుర్తు చేశారు. మహిళల అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు,రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. మహిళా మణులను కోటీశ్వరులుగా చేయాలని సదుద్దేశంతో ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద వివిధ యూనిట్లు ప్రారంభించామని తెలిపారు. అలాగే సోలార్ యూనిట్లు మహిళా సంఘాలకు బస్సులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సన్న సన్న ధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు అదనంగా 500 అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీకి నూతన బస్సులు అందజేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందజేస్తున్నామని వివరించారు.

జిల్లాలోని 345 రేషన్ దుకాణాలు ద్వారా..

రాష్ట్ర ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వే ను ఇటీవల నిర్వహించిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని నేత కార్మికులకు భరోసా కల్పిస్తూ గత బకాయిలను విడుదల చేసిందని, అలాగే యార్న్ బ్యాంకును ప్రారంభించిందని వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దాదాపు 20వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని వెల్లడించారు. త్వరలో పెన్షన్ పంపిణీ ఇతర కార్యక్రమాలను ప్రారంభించనున్నామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రకటించారు. జిల్లాలోని 345 రేషన్ దుకాణాలు ద్వారా లక్ష 70 వేల రేషన్ కార్డుల లబ్ధిదారులకు
3275 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, పౌర సరఫరాల మేనేజర్ రజిత తదితరులు పాల్గొన్నారు.

మహిళలను దుర్భాషలాడిన విలేఖరి పై చర్య తీసుకోవాలని.

మహిళలను దుర్భాషలాడిన విలేఖరి పై చర్య తీసుకోవాలని ధర్నా రాస్తారోకో.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించిన విషయం తెలిసిందే, ఈ ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యేకి మహిళల యొక్క సమస్యలు పరిష్కరించాలని పబ్లిక్ టాయిలెట్స్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉంది ఆ కొరతను తీర్చాలని స్థానిక మహిళలైనా చిదిరాల సరోజన, మైదం కర్ణ, ఇతర మహిళలు ఎమ్మెల్యే ని కోరగా సానుకూలంగా స్పందించి ,మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు, ఎమ్మెల్యే , ప్రోగ్రాం అయి పోయిన తర్వాత వార్త రిపోర్టర్ కటుకూరు మొగిలి తాగిన మైకంలో వచ్చి మహిళలను చూడకుండా నానా బూతులు తిడుతూ దుర్భాషలతో మాట్లాడనారు, ఇట్టి విషయంపై దుర్భాషలాడిన విలేఖరి పై స్థానిక పోలీస్ స్టేషన్లో మూడు రోజుల క్రితం పిటిషన్ ఇవ్వడం జరిగిందని ఇప్పటివరకు పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం నాడు చిధిరాల సరోజన మై దం కరుణ మరికొందరు మహిళతో కలిసి విలేకరిపై చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని చిట్యాల చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేశారు, అనంతరం సరోజన మాట్లాడుతూ మహిళలను దుర్భాషలాడిన వార్త విలేకరిని తొలగించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు . లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మహిళలు రాయమల్లమ్మ శారద కరుణ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నిప్పంటించిన.!

రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలి

 

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండల కేంద్రంగా మంగళవారం రోజున దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన జరిగిన దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం, తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాలోని కేటి దొడ్డి మండలం ఇర్కుచెడు గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళితులు బహుజనులు కలసి స్టాండ్ నిర్మాణం చేసి విగ్రహం ఏర్పాటు ప్రయత్నంలో అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు అంబేద్కర్ విగ్రహం పెట్టొదని దాని వల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఘర్షణకు దిగారు.

ఘర్షణలో భాగంగా కొంతమంది దుండగులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పై పెట్రోల్ పోసి నిప్పంటించారు, అట్టి మంటలు ఆర్పే క్రమంలో విగ్రహంతో పాటు ఎస్ఐకి కూడా నిప్పు అంటుకుంది.

భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్న భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి దిక్సూచిగా నిలిచిన రాజ్యాంగ నిర్మాత మహనీయుడు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం దురదృష్టకరమని దళిత ప్రజా సంఘాలు మండిపడ్డాయి ఇలాంటి సంఘటనలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఏప్రిల్ మాసం మొత్తం మహనీయుల మాసంగా దేశం రాష్ట్రం మహనీయుల జయంతులు చేస్తున్న క్రమంలో ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమని ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన జీవోలు తెచ్చి రక్షణ కల్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిపిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ కొమ్మట బాబు, మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు బండారి ఎల్లం, ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షులు జనగామ స్వామి, డొక్కా రామస్వామి, కాకి బాలరాజ్, బ్యాగరి రాజు, గుడ్ల బాబు, కొమ్మాట ఎల్లం, తదితరులు పాల్గొన్నారు.

సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

 

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి సి గ్రామంలో ఏర్పాటుచేసిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంగళవారం రోజున భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొ హాజరై, ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ను అందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని. గతంలో రేషన్ బియ్యం పంపిణీ మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగ నిర్మూలించామని అన్నారు, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హేమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ, చిలుకల రాయకుమురు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు దబ్బట అనిల్ బుర్ర శ్రీనివాసు, చిలుముల రాజమౌళి ,అల్ల కొండ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలు దితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబనీకి ఆర్థిక సాయం.

— బాధిత కుటుంబనీకి ఆర్థిక సాయం

నిజాంపేట: నేటి ధాత్రి

 

మండలం లోని రాంపూర్ గ్రామానికి చెందిన అతిగం స్వామి గౌడ్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠ తిరుపతి రెడ్డి బాధిత కుటుంబ నీకి 5,000 వేల రూపాయలు తన అనుచరులతో అందజేశారు. ఈ కార్యక్రమం లో మండల మాజీ కో అప్షన్ మెంబర్ మహమ్మద్ గౌస్, సీనియర్ నాయకులు దుబ్బరాజా గౌడ్, గ్రామ నాయకులు అంజా గౌడ్, రాజు, పర్శ గౌడ్, ఫిరోజ్ లు ఉన్నారు.

ప్రతీ ఉద్యోగికి పదవీవిరమణ తప్పనిసరి..

ప్రతీ ఉద్యోగికి పదవీవిరమణ తప్పనిసరి..

బ్రాంచ్ సీనియర్ మేనేజర్ వెంకట్ రెడ్డి

ఎల్ఐసి డి.ఓ వెంకటయ్యకు ఘనంగా వీడ్కోలు.

డి.ఓ వెంకటయ్య టీమ్ ఆధ్వర్యంలో గజమాలతో ఘన సన్మానం..

నర్సంపేట,నేటిధాత్రి:

 

విధి నిర్వహణలో ప్రతీ ఉద్యోగికి పదవీవిరమణ తప్పనిసరి అని నర్సంపేట బ్రాంచ్ సీనియర్ మేనేజర్ వెంకట్ రెడ్డి అన్నారు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నర్సంపేట బ్రాంచ్ లో బానోతు శాంత వెంకటయ్య డెవలప్ మెంట్ ఆఫీసర్ గత 34 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం డి.ఓ వెంకటయ్య పదవీవిరమణ పొందారు.ఈ సందర్భంగా నర్సంపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో పదవీవిరమణ కార్యక్రమాన్ని చేపట్టారు.నర్సంపేట బ్రాంచ్ తో వరంగల్ డివిజన్ పరిధిలోని పలువురు అధికారులు, డి.ఓలు హాజరయ్యారు.బ్రాంచ్ సీనియర్ మేనేజర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఐసి వికాస అధికారి నిరంతరం పనిచేసే వ్యక్తి అని పేర్కొన్నారు.గత 34 సంవత్సరాలుగా నర్సంపేట బ్రాంచ్ కు ఒక ఫిల్లర్ గా సేవలు అందించారని వెంకటయ్య పట్ల కొనియాడారు.అనంతరం శాలువాలతో సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు.అలాగే వరంగల్ జిల్లా ఎల్ఐసి ఉద్యోగుల ఎస్సి ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.

DO Venkataiah’s

 

డి.ఓ వెంకటయ్య టీమ్ ఆధ్వర్యంలో గజమాలతో ఘన సన్మానం..

DO Venkataiah’s

 

ఎల్ఐసి నర్సంపేట బ్రాంచ్ లో గత 34 సంవత్సరాలుగా వికాస అధికారిగా విధులు నిర్వర్తించిన బానోతు శాంతవెంకటయ్య సోమవారం పదవీవిరమణ నేపథ్యంలో బ్రాంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకటయ్య టీమ్ ఏజెంట్లు గజమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు,బహుమతులు అందజేశారు.ఏజెంట్లు పడిదం కట్టస్వామి,రాక రాజలింగంలు మాట్లాడుతూ జీవితభీమా పాలసీల అమ్మకంలో ఏజెంట్లకు వెంకటయ్య ఇచ్చే ప్లానింగ్స్ పట్ల కొనియాడారు.ఈ కార్యక్రమంలో పెండ్లి రవి,శంకరయ్య,మర్థ గణేష్ గౌడ్,కందుల శ్రీనివాస్ గౌడ్,రఘుపతి,అనంతగిరి స్వామి,దాసరి కుమారస్వామి,రాజేందర్, పోశాల శ్రీనివాస్,చందు తదితరులు పాల్గొన్నారు.

ఎల్ఐసి యూనియన్స్ ఆధ్వర్యంలో…

DO Venkataiah’s

 

ఎల్ఐసి ఏ.ఓ.ఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య,వరంగల్ డివిజన్ కోశాధికారి మొద్దు రమేష్,నర్సంపేట బ్రాంచ్ గౌరవ అధ్యక్షులు ఆర్.చంద్రమౌళి,బ్రాంచ్ అధ్యక్షుడు పెండ్లి రవి,ప్రధాన కార్యదర్శి పడిదం కట్టస్వామి అలాగే ఎల్ఐసి ఎల్.ఐ.ఏ.ఎఫ్.ఐ డివిజన్ అధ్యక్షుడు పులి సుధాకర్, బ్రాంచ్ అధ్యక్షుడు వల్లాల శ్రీహరి,వైస్ ప్రెసిడెంట్ రాక రాజలింగం ఆధ్వర్యంలో పదవీవిరమణ పొందిన వికాస అధికారి బానోతు వెంకటయ్యకు శాలువాలతో ఘనంగా సన్మనించారు.ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ యూనియన్ వరంగల్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ ,బ్రాంచ్ ఏఓ లచ్మ,ఏ.ఏ.ఓ శ్యాంసింగ్,హెచ్ జి.ఏ నిఖిల్,సుబ్బారావు,వికాస అధికారులు సురేందర్ రావు,శ్రీనివాస్,రాజు,ఐశ్వర్య,వినయ్ కుమార్,వినోద్ కుమార్,రమేష్,పలువురు అధికారులు,కార్యాలయ సిబ్బంది యునియన్ నాయకులు,ఏజెంట్లు పాల్గొన్నారు.

మీరాకుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన అబ్రహం మాదిగ.

మీరాకుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన అబ్రహం మాదిగ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

భారతదేశపు తొలి మహిళా లోకసభ స్పీకర్ మీరాకుమార్ ని ఢిల్లీలోని ఆమె నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అబ్రహం మాదిగ. భారతీయ సామాజిక దార్శనికుడు, సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు డా. బాబూ జగ్జీవన్ రామ్ కూతురుగా ఆయన రాజకీయ వారసురాలిగా ఎన్నో పదవులను అధిరోహించారు. పలుమార్లు కేంద్ర మంత్రిగా, భారతదేశపు తొలి మహిళా లోకసభ స్పీకర్ గా భారతదేశానికి ఎనలేని సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ఆమోదం తెలిపిన ధీరవనితగా అభివర్ణించారు. రావి ఆకుపై వేసిన మీరాకుమార్ చిత్రాన్ని ఆమెకు బహుకరించారు. ప్రముఖ కవి రచయిత డప్పోల్ల రమేష్ రచించిన డా. బాబూ జగ్జీవన్ రామ్ సంక్షిప్త జీవిత చరిత్ర ఆంగ్లానువాదం డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్, విషనరీ ఆఫ్ ఇండియా సొసైటీ “ పుస్తకాన్ని అందజేసి ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. మీరాకుమార్ ను కలిసిన వారిలో ఆయనతో పాటు ఉల్లాస్ మాదిగ ఉన్నారు.

వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకాలు.

వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకాలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం రేజింతల్ లోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామికి మంగళవారం ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో స్వామి వారికి పూజా కార్యక్రమాలను జరిపించారు. అనంతరం వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు సంగారెడ్డి తో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు.

లైన్స్ క్లబ్ మూడోసారి చైర్మన్గా దేమె యాదగిరి.

లైన్స్ క్లబ్ మూడోసారి చైర్మన్గా దేమె యాదగిరి…

రామాయంపేట ఏప్రిల్ 1 నేటి ధాత్రి (మెదక్)

 

 

లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట 2025-2026 సంవత్సరానికి గాను అధ్యక్షుడిగా మూడవసారి దేమే యాదగిరి, సెక్రటరీగా తిరుపతి, ట్రెజరర్ గా జిపి స్వామి లను పివిపి చారి మాజీ గవర్నర్ సమక్షంలో స్థానిక మెహర్ సాయి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

Ramayampet

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ సేవలను విస్తృత పరిచి గ్రామాలలో చక్కటి కార్యక్రమాలు చేపడతామని మొక్కల పంపకం,నీటి సంరక్షణ, అవయవదానం,ఉచిత కంటి మరియు దంత వైద్య ఆరోగ్య శిబిరాలు విరివిగా నిర్వహిస్తామని స్కూల్ లలో విద్యార్థులకు వ్యాస రచన,కెపాసిటీ బిల్డింగ్ గురించి సమావేశాలు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. తమను ఎన్నుకున్నందుకు రీజియనల్ చైర్మన సంజయ్ గుప్తా, జోన్ చైర్ పర్సన్ సుఖేందర్, ఏరియా కోఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి,డిసీలు లక్ష్మణ్ యాదవ్, కైలాసం, దారం రమేష్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

జాతర మహోత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ.

జాతర మహోత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రమైన తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామంలో ప్రసిద్ది చెందిన భద్రకాళి సమేత వీరభద్రేశ్వర జాతర. మహోత్సవం ఏప్రిల్ 17వ తేదీ గురువారం నుండి 22వ తేదీ మంగళవారం వరకు నిర్వహించునున్న శుభ సందర్భంగా సోమవారం నాడు ఏర్పాటుచేసిన అనే చైర్మన్ కులకర్ణి ప్రభాకర్ రావు (సతీష్) ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప. అధ్యక్షతన ధర్మకర్త మండలి సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ కార్య నిర్వాణ అధికారి వారు మాట్లాడుతూ ఆలయంలో చలువ పందిళువిద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని భోజనాలు ఏర్పాటుకై జాతర మహోత్సవం గురించి గ్రామ గ్రామాన తెలియపరచాలని జాతరకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తదితర అంశాలపై వాటి నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఆలయ చైర్మన్ కార్యనిర్మాణ అధికారి శివ రుద్రప్ప ఆధ్వర్యంలో ఆదివారం జాతర మహోత్సవ కార్యక్రమం వివరాల ఆహ్వాన పత్రిక గోడ పత్రికను ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో. ఆలయ చైర్మన్ కులకర్ణి ప్రభాకర్ రావు (సతీష్) కార్యనిర్వాన అధికారి శివ రుద్రప్ప. మాజీ చైర్మన్ నట్కరి మావయ్య. గ్రామ పెద్దలు యువకులు ఆలయ సిబ్బందులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

పంతుళ్ల ప్రాపకం..నాయకుల జాతకం!

-నేతలు..జాతకాలు..ఉగాది సంబరాలు.

-ఒక్కో పంతులు ఒక్కో జోస్యం.

-పంచాంగ లెక్కలందరూ ఒకటే చెబుతారు.

-అది ప్రామాణికమని అందరూ నమ్ముతారు.

-జాతకాల విషయంలో ఎవరికి తోచింది వారు చెబుతారు.

-నాయకుల చేత జేజేలు కొట్టించుకుంటారు.

-ఉగాది సాక్షిగా పండగ రోజే ఇన్ని అబద్దాలా!

-తొలి రోజే లెక్కలేనన్ని అసత్యాలా!

-జోస్యం ఎవరికైనా ఒకటే వుండాలి.

-పార్టీల పరిస్థితి నిజాయితీగా చెప్పగలగాలి.

-నిజం చెబితే సంభావన కష్టం. నిజం నిష్టూరం.

-కష్టాల గురించి చెబితే వచ్చే ఉగాదికి పిలువరు.

-ఎవరి కష్టాలు వారివి…పంతుళ్ల తిప్పలు పంతుళ్లవి.

-తెలంగాణలో సిఎం రేవంత్‌ రెడ్డి కి తిరుగులేదంటారు.

-వచ్చే సారి కూడా రేవంత్‌ రెడ్డే సిఎం అని ఓ పంతులు చెప్పాడు.

-మూడు నెలల్లో కేసిఆర్‌ సిఎం అవుతారని మరో పంతులంటారు.

-తెలంగాణ వచ్చే ఎన్నికలలో బిజేపి గెలుస్తుందని మరో పంతులు చెబుతాడు.

-చంద్రబాబు ఆరు సార్లు సిఎం అవుతారని అక్కడంటారు.

-వచ్చేది జగనే మరో పంతులు సెలవిస్తాడు.

-పవన్‌ కళ్యాణ్‌ ఇంకా పదిహేనేళ్లు చంద్రబాబు వుండాలంటాడు.

-పంతులేమో పవన్‌ కళ్యాణ్‌ సిఎం అవుతారని అంటారు.

-ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం వుంది.

-ఈ ముచ్చట్లు ఇప్పుడెందుకు చెబుతారో అర్థం కాదు.

-గతంలో కాలాల గురించి మాత్రమే చెప్పే వారు.

-గ్రహ గతుల వల్ల ప్రాంతాలకు ఎదురయ్యే సమస్యలు ప్రస్తావించే వారు.

-ప్రతి సారి వర్షాలు విపరీతంగా కురుస్తాయంటారు.

-కరువొచ్చిన కాలంలో కూడా ఇలా చెప్పే ఊరడిరచారు.

-విని సంతోషించాలనే పంచాంగ శ్రవణం అంటారేమో!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మారేదే అయితే జాతకమెలా అవుతుంది. కలిసొచ్చేదే అదృష్టమైతే ఎందుకు దాగి వుంటుంది. లాక్కొచ్చి పరిహారం చెల్లిస్తేగాని పని చేయనిది భవిష్యత్తు ఎలా అవుతుంది. బతుకు జీవుడా అని ఏళ్లకేళ్లు బాదించి, ఆఖరుకు కలిసొస్తే అది కలిసొచ్చే కాలమెలా అవుతుంది. బతకలేని బతుకులు బతుకంతా ఏడిపించి, కన్నీళ్లను కూడా మిగల్చకుండా చేస్తుంటే అది బతుకెలా అవుతుంది. భగవంతుని కరుణెలా అవుతుంది. నమ్మకం మన బలం. ఆ నమ్మకమే కొంపలు ముంచడం..చదువుకున్న వాళ్ల మూడత్వం..ఈ జన్మకే దిక్కులేని సంబరం..ఏడేడే జన్మలు తెచ్చేదంతా ఆనందం. అంటే ఎవరైనా సంతోషిస్తారా? వచ్చే జన్మ కోసం ఈ జన్మంతా కష్టపడతారా? దేవుణ్ణి తిట్టుకోకుండా వుంటారా? ఈ జన్మకు మోసిన కష్టాలు..మళ్లీ జన్మొద్దు. ఈపుట్టకే వద్దనే కదా? కైలాసం కోరుకుంటారు..అలాంటి వారిలో ఆశలు నింపడం కోసమే జ్యోతిష్యులుంటారు. వారి ప్రాపకం గడుపుకుంటారు. ఆశలో జీవి జీవితాంతం ఎదురుచూస్తుంటారు. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణ పాండిత్యం వున్న పండిత సిద్దాంతులు పడే యాతన అంత ఇంతా కాదు. ఏ పార్టీ పంచాంగ శ్రవణానికి వెళ్తే ఆ పార్టీ గొప్పదని చెప్పకుండా వుండలేరు. ఒక్కసారి విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఫలితాలు చెప్పిన సిద్దాంతులు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ఒకటే. పాలన ఒకటే. కాని రాజకీయాల మీద రకరకాల అభిప్రాయాలు, రకరకాలుగా చెప్పారు. అందరూ అన్ని పార్టీల జాతకాలు అద్భుతమనే అన్నారు. మరి అన్ని పార్టీల జాతకాలు అధ్భుతమే అయినప్పుడు అన్ని పార్టీలు గెలవలేవు. ఏదో ఒకపార్టీ మాత్రమే గెలుస్తుంది. అన్ని పార్టీలకు ఆ అవకాశం లేదు. కాని చెబుతారు. పార్టీలను నమ్మిస్తారు. నాయకులను రంజింప జేస్తారు. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి సంతోష్‌ కుమార్‌ శర్మ చెప్పిన జాతక ఫలితాలు ఎలా వున్నాయో చూద్దాం. రేవంత్‌ రెడ్డిది తులా రాశి అని చెప్పుకుంటూ ఆయనకు నరగోష వుందన్నారు. ఆయనపై నరఘోష చెప్పాలంటే ఇప్పుడు కాదు, ఆయనపై ఎప్పటి నుంచో వుందనే చెప్పాలి. ఈ విషయం చెప్పడానికి పంచాంగమే అక్కర్లేదు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి స్వతహాగా పైకొచ్చిన నాయకుడు. ఆయనను ఎవరూ నాయకుడిగా తయారు చేయలేదు. రాజకీయ గురువు ఆయనకు ఎవరూ లేరు. ఒక్కసారిగా రాజకీయ యవనిక మీదకు ఉత్తుంగతరంగంలా వచ్చారు. వస్తూ వస్తూనే జడ్పీటీసి అయ్యారు. తర్వాత ఏడాదిన్నరకే ఎమ్మెల్సీ అయ్యారు. మరో రెండేళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. తెలుగుదేశం పార్టీలో అందరూ అసూపడేలా ఎదిగారు. చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీలో వర్కింగ్‌ ప్రెసిడెంటు అయ్యారు. ఒక దశలో తెలంగాణ తెలుగుదేశంపార్టీకి అధ్యక్షుడు కావాలనుకున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్దితుల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కూడా వర్కింగ్‌ ప్రెసిడెంటుగానే తన ప్రస్దానం ప్రారంభించారు. గత ఎన్నికలకు మూడేళ్ల ముందే పిపిసి. అధ్యక్షుడయ్యారు. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనపై నరదిష్టి అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఎదుగుతున్న క్రమంలోనే మొదలైంది. ఏ నరదిష్టి ఆయనను ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే జాతకం బాగుంది. అసలు ఆయన ఎమ్మెల్సీ అయినప్పుడే తాను ముఖ్యమంత్రి అవుతా! అన్నారు. అప్పటికి తెలంగాణ రాలేదు. ఒక్కరోజైనా సరే నేను ముఖ్యమంత్రికావాలన్నదే తన లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ వచ్చిందే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసమా? అన్నట్లు ఆయన జాతకం కాలాన్నే మార్చేసింది. ఇప్పుడుకొత్తగా ఆయనపై దిష్టి వుందన్న సంగతి ప్రత్యేకంగాచెప్పాల్సిన పనిలేదు. కాని చెప్పాలి. చెప్పకుంటే పంచాంగ శ్రవణం పూర్తికాదు. అందుకే ఓ వైపు రేవంత్‌రెడ్డికి తిరుగులేదు. ఎదురులేదు. మరో పదేళ్లపాటు ఆయన పాలనకు తిరుగుండదని చెప్పిన సిద్దాంతి నరోఘోష వుందని పరిహారం చేసుకోవాలని సూచించారు. అందరిలోనూ ఆనందం నింపారు. ఇది నిజమా? అబద్దామా? అనేది కాలం తేల్చుతుంది. ఇక బిఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో మరో విశేషం జరిగింది. ఇకపై ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్‌ఎస్‌దే గెలుపు అంటూ సిద్దాంతి చెప్పుకోచ్చారు. ఇంత వరకు బాగానే వుంది. మరి ప్రభుత్వం తరుపున పంచాంగ శ్రవణం చెప్పిన సిద్దాంతి సిఎం. రేవంత్‌ రెడ్డికి పదేళ్లపాటు తిరుగులేదన్నాడు. మరి బిఆర్‌ఎస్‌ జాతకం చెప్పిన సిద్దాంతి ఈసారి సిఎం. అయ్యేది కేసిఆరే అంటున్నారు. ఇదెలా సాధ్యం. లెక్కలంటే లెక్కలాగానే వుండాలి. పక్కాగా వుండాలి. లెక్కలకు సూత్రాలెన్ని వున్నా, ఆన్సర్‌ మాత్రం ఎప్పుడూ ఒక్కటే వుండాలి. ఒకే లెక్కను సూత్రానికొక సమాధానం వస్తే అది లెక్కెలా అవుతుంది. దానికి విలువేమిటుంటుంది. ఇక బిజేపి కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో ఇక వచ్చేదంతా బిజేపి కాలమే అని సిద్దాంతి సెలవిచ్చారు. అదేంటి ఒకే రాష్ట్రంలో మూడు పార్టీల జాతకం బాగానే వుంది. కాని అదికారం ఏదో ఒకపార్టీనే వరిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అదికారంలో వుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిఎంగా వున్నారు. ఆయన పదవికి పదేళ్లు ఢోకాలేదన్నప్పుడు, ఈ రెండు పార్టీలు ఎలా అదికారంలోకి వస్తాయో? అర్ధం కాని విషయం. అయినా ఎన్నికలు మరో ముడున్నరసంవత్సరాలకు గాని రావు. ఇప్పటికిప్పుడు ఎన్నికల వస్తే అని సర్వే సంస్ధలు చెప్పినట్లు జోస్యం చెబితే పంచాగానికి విలువేముంటుంది. పంచాంగం అంటే అన్నీ నిజాలే చెప్పాలి. సిద్దాంతులు అదే చెప్పాలి. గ్రహగతులు అన్ని పంచాంగాలలో ఒకటే వుంటుంది. ఎప్పుడు పౌర్ణమివస్తుందో..ఎప్పుడు గ్రహణాలు వస్తాయో? లెక్క పొల్లు పోకుండా పంచాంగంలో రాస్తారు. ఇప్పటికీ సైన్స్‌కు అందని మిస్టరీ. అంత కరక్టుగా పంచాంగం రూపకల్పన జరిగినప్పుడు నేతల జాతకాలు, పార్టీల భవిష్యత్తును ఇలా మర్చి చెప్పిడం కరక్టు కాదు కాదా? నిజం చెప్పాలంటే సిద్దాంతుల విజ్ఞానం సామాన్యమైంది కాదు. ఎంతో విద్వత్తు వుంటే గాని సిద్దాంతులు కాలేరు. మరి అలాంటి సిద్దాంతులు ఉగాది పూట ఎందుకు అబద్దాలు చెప్పడం. ఉన్నది ఉన్నట్లు చెబితే జనం నమ్మరు. అంతా బాగుందంటేనే నమ్ముతారు. వ్యక్తిగా కష్టాలొస్తాయంటే నమ్ముతారు. కాని రాజకీయాల్లో వున్నవారు పదవులు పోతాయంటే జీర్ణించుకోలేరు. అందుకే సిద్దాంతులు కూడా లోకకల్యాణం కోసమే అబద్దాలు ఆడుతుంటారేమో? అనుకోవాలేమో?? ఇక ఏపిలో మాడుగుల నాగఫణి శర్మ లాంటి గొప్ప సిద్దాంతి కూడా చెప్పింది వింటే విచిత్రమనిపిస్తుంది. అదేంటో సిద్దాంతులు సామాన్యులను కష్టాలున్నాయని భయపెడతారు. నాయకులకు అంతా బాగుందని చెప్పి సంతోషపెడతారు. మీరు పదవిలో నుంచి దిగిపోతారని ఏ నాయకుడి ముందు, ఏ సిద్దాంతి చెప్పరు. ఇదే అసలు ట్విస్టు. ఏపి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తంగా ఆరు సార్లు ముఖ్యమంత్రి యోగముందని నాగఫణిశర్మ చెప్పారు. ఇప్పటికి నాలుగు సార్లు పూర్తి చేశారు. ఇంకా రెండుసార్లు మిగిలి వుంది. మరి స్వయంగా మంత్రి లోకేష్‌ ఆ మధ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలకైనా, మంత్రులకైనా, ఎమ్మెల్సీలకైనా మూడుసార్లే అవకాశం. నేను కూడా అదే ఆచరిస్తానని చెప్పారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడుకు వర్తింపజేస్తారా? అంతే కాకుండా లోకేష్‌ అప్పటి వరకు ముఖ్యమంత్రికాకుండా వుండగరలా? ఇదిలా వుంటే పవన్‌ కల్యాన్‌కు కూడా రాజయోగం వుందని సిద్దాంతులు అంటున్నారు. పవన్‌ కల్యాణేమో చంద్రబాబుమరో మూడుసార్లు సిఎంగా వుండడమే నేను కోరుకుంటున్నానంటున్నారు. జాతకం ప్రకారం ఆరుసార్లు సిఎం. చంద్రబాబు అయ్యే అవకాశంవుంటే పవన్‌కు సిఎం.అయ్యే చాన్స్‌ లేనట్లే. మరి ఇతర సిద్దాంతులు పవన్‌కు ఆ వరం వుందంటున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్‌ విషయానికి వస్తే ఆయన వచ్చే ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తారని పంచాంగ సిద్దాంతి సూరి నారాయణ మూర్తి అన్నారు. అదెలా సాధ్యమౌతుంది. వరుసగా ఇంకా రెండు సార్లు చంద్రబాబు సిఎం. అయ్యేదే వుంటే వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఎలా సిఎం అవుతారు. అసలు అక్కడ కూడా ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం వుంది. కూటమి బలంగా వుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలువచ్చే అవకాశమే లేదు. ఇకపోతే జగన్‌ విజయనగర రాజు శ్రీ కృష్ణదేవరాయలంత కీర్తిని సంపాదిస్తారట. ఇలా పంతుళ్లు పోటీ పడి మరి నాయకులను కీర్తించారు. గతంలో ఎప్పుడు పంచాంగ శ్రవణాలు చెప్పినా నాయకుల జాతకాలు చెప్పేవారు కాదు. వాతవారణ పరిస్ధితులు, భూకంపాలు, వర్షాలు, వరదలు, కరువు కాటకాల గురించి చెప్పి, ప్రభుత్వాలను అప్రమత్తం చేసేవారు. ఇప్పుడు నాయకులు జాతకాలు చెప్పి వారిని సిద్దాంతులు ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇదీ మ్యాటర్‌.

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు.

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు.

 

నర్సంపేట,నేటిధాత్రి:

 

పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు నర్సంపేట డివిజన్ పరిధిలోని సోమవారం ఘనంగా నిర్వహించారు.
నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు ఈద్గా స్థలంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రత్యేక నమాజ్ ముస్లిం ప్రజలు జరుపుకున్నారు.మత పెద్ద జామీ మజీద్ ఇమామ్ మహబూబ్ నమాజ్ ను చదివారు. అనంతరం రంజాన్ పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ మాట్లాడుతూ భారత దేశ ముస్లింలు రంజాన్ మాసంలో లోనే పవిత్ర గ్రంథం ఖురాన్ ఆర్బించడం జరిగిందన్నారు. 30 రోజులు కఠోర ఉపవాస దీక్షలు పాటించి ప్రతిరోజు ప్రత్యేక తరాబి నమాజు పటించి అనంతరం జకాత్ ఫిత్రాలు మరియు హదీయాలు డబ్బు రూపాన పేదలకు అనాధలకు వితంతువులకు దానం చేస్తారన్నారు. ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగ ప్రత్యేక నమాజుకై ఈద్గాకు మండల స్థాయి ముస్లిం చదువుతారని పేర్కొన్నారు. అనంతరం ఒకరికి ఒకరు అలింగనం చేసుకొని కులమతాల అతీతంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ముస్లిం ఖబురస్థాన్లోకు వెళ్లి చనిపోయిన బంధువుల సమాధులపై పూలతో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రముఖ నాయకులు జామి మసీద్ అధ్యక్షులు మహమ్మద్ నబీ, మహమ్మద్ హబీబ్, మహమ్మద్ అయుబ్, మీర్జా మసూద్, అలీబేగ్, మహమ్మద్ రబ్బాని, మహమ్మద్ ఆఫీస్,ఇర్ఫాన్ మహమ్మద్, అన్వర్ సయ్యద్ జావేద్ ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version