సన్న బియ్యం కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.

సన్న బియ్యం కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ

ధనవంతులే కాదు… పేదలు సన్న బియ్యం తినాలి

ముదిగుంట గ్రామంలో సన్న బియ్యం పంపిణీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో ఉగాది కానుకగా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దుగుట జ్యోతి మాట్లాడుతూ ఇప్పటివరకు ధనవంతులు తినే సన్నబియ్యం ఇకపై ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోకి వస్తుంది.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని,పోషక విలువలతో కూడిన సన్న బియ్యం అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.అలాగే సన్న బియ్యం పథకం ప్రారంభించడం పేదలు అదృష్టంగా భావిస్తున్నారు.సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల రైతులకు కూడా మేలు జరుగుతుందని సరైన గిట్టుబాటు ధరలు కూడా వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుగుట జ్యోతి పాండరి, మాజీ ఎంపీపీ గోదారి రమాదేవి లక్ష్మణ్ కాంగ్రెస్ నాయకులు చేలుకల పోశం,గుండా సురేష్ గౌడ్, కొట్టాల మల్లయ్య పోతుగంటి సుమన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version