భూ భారతితో రైతులకు మేలు.!

‘భూ భారతితో రైతులకు మేలు’

కలెక్టర్ విజయేందిర బోయి

జడ్చర్ల నేటి /ధాత్రి:

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం మండలంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి చట్టం అమల్లోకి వచ్చిందని, భూ భారతి చట్టంలో పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేస్తే ముందు నిర్ణీత కాలంలో విచారణ, పాసు పుస్తకాలలో భూమి పటం, భూ ఆధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, వ్యవసాయతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వం భూధాన్, అసైన్డ్, ఎండోమెంట్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉందన్నారు. భూభారతి చట్టంతో రైతులకు మేలు కలుగుతుందన్నారు.

program

అనంతరం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ధరణి పేరుతో అనేక అక్రమాలకు పాల్పడిందని, బీఆర్ఎస్ రాజకీయ నాయకులు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చారన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు మేలు చేస్తుందన్నారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ సెక్షన్ 6 ప్రకారం.. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి, గత 12 సంవత్సరాలుగా.. అనుభవంలో ఉంటూ.. 12-10- 2020 నుండి 10-11-2020 మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం చిన్న సన్నకారు రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీవోలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారన్నారు. భూభారతి చట్టంలో రైతులకు మేలు కలుగుతూ.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుందన్నారు.

program

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీవో నవీన్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ లిఖిత రెడ్డి, బాలానగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మల్ల అశ్విని రాజేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, విజయలక్ష్మి తిరుపతి, వెంకట్ రెడ్డి, పొట్లపల్లి యాదయ్య, శ్రీనాథ్ నాయక్, రైతులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షడు మృతి.!

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షడు మృతి.

చిట్యాల నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం అందుకుతండా గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయిని దేవదాస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించిన నాయకుడు. దేవదాస్ అకాల మరణం చాలా బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య తన ప్రగాఢ సానుభూతి తెలిపారు..

రావుస్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు.

రావుస్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించి నoదుకుసన్మానించిన ఐక్యవేదిక నేతలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణ ములో రావుస్ జూనియర్ కళాశాలలో పదవ తరగతి చదివి న విద్యార్థులను ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా రాష్ట్ర స్థాయి మార్పులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యన్ని అభినందించారు
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం, ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, గౌనికాడి యాదయ్య, శివకుమార్, వెంకటేశ్వర్లు,రమేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఇందారం గోదావరి ఇసుక.!

ఇందారం గోదావరి ఇసుక రిచ్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఇసుక రీచ్ ను సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామ పంచాయతీల ప్రజలు తమ అవసరాలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.అలాగే ఈ అవకాశాన్ని ఎవరైనా అదునుగా చేసుకొని అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి జగన్ మోహన్ రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి సుమన్,స్థానిక ప్రజా ప్రతినిధులు,ట్రాక్టర్ యజమానులు గ్రామప్రజలు పాల్గొన్నారు.

ఆదివాసీల,మావోయిస్టులపై సైనికుల.!

ఆదివాసీల,మావోయిస్టులపై సైనికుల దాడులు ఆపాలనీ డిమాండ్

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నిరసన

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా) నేటిధాత్రి:

 

కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలని,ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలనీ
కర్రెగుట్ట ను చుట్టుముట్టిన సైనిక బలగాలు వెనక్కి రావాలి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గుండాల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలనిమేధావులు నుండి పెద్ద ఎత్తున డిమాండ్ ముందుకు వస్తున్న బిజెపి నరేంద్ర మోడీ,అమిత్ షా ప్రభుత్వాలు స్పందించకపోవడం సరికాదని అన్నారు.
గత జనవరి నుండి ఇప్పటివరకు మావోయిస్టుల పేరుతో అనేకమంది ఆదివాసీలను చంపివేశారని అన్నారు.
దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన మిలటరీ సాయుధ బలగాలు మధ్య భారత దేశంలో ఆదివాసీలపై దాడులు చేస్తున్నాయని విమర్శించారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపి ఆదివాసీల మారనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం( ఏఐటిఎఫ్) జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, రాష్ట్ర నాయకులు ఈసం కృష్ణన్న,న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు అరెం నరేష్, పర్శక రవి, యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య, పెండకట్ల పెంటన్న, ఈసం మంగయ్య,మానాల ఉపేందర్, బానోతు లాలు, భూఖ్య వెంకన్న, పాయం ఎల్లన్న, గోగ్గల శ్రీను, మోకాళ్ళ సూర్యనారాయణ , దుగ్గి శేఖర్, వాగబోయిన బుచ్చయ్య,అరెం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

సెలవు దినాల్లో పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి..

అందరూ ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి..

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల సెక్రటరీ బైరం శంకర్..

రామాయంపేట ఏప్రిల్ 28 నేటి ధాత్రి (మెదక్)

 

 

ఎండలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు జాగ్రత్తలు డాక్టర్ల సూచనలు సలహాలు పాటించాలని కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ సెక్రటరీ బైరం శంకర్ విజ్ఞప్తి చేశారు. వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు డాక్టర్ల సలహాలు సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా సెలవు దినాలు ఉన్నందున విద్యార్థులు చెరువుకుంటల వద్దకు ఈతలకు వెళ్లకుండా తల్లిదండ్రులు వారిని గమనించాలని కోరారు. ఉపాధి పని జరుగుతున్న గ్రామాల్లో ఉపాధి కూలీలకు అందుబాటులో తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైతే వారికి చికిత్స కోసం ప్రధమ చికిత్స బాక్సులు అందుబాటులో ఉంచాలని అన్నారు. అలాగే పని చేసే కూలీలను కూడా ఎండ తీవ్రం కాకుండా ముందే పని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నిజాంపేట, నేటిధాత్రి

 

 

 

ఈ మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన ముచ్చర్ల కల్పన రూ.54 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ కాంగ్రెస్ నాయకులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరo మని అన్నారు .అలాగే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మనిషి తెలివిమీరిన చేష్టలు చేస్తూ..

శీర్షిక:అక్షరమా..!

 

(నేటిధాత్రి )

 

 

మనిషి తెలివిమీరిన చేష్టలు చేస్తూ… పకృతి మాతకు విఘాతం కలిగిస్తూ…
రకరకాల ఉడుపులతో వేషధారణ చేస్తూ…
మతిమాలిన మితిమీరిన తెలివితేటలతో సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేస్తూ…
కాయంలో ప్రాణం పోయాక
ఒక్క క్షణం కూడా ఇంట్లో
ఉంచుకోని బంధాలు కోసం అబద్ధాలు, మోసాలు చేస్తూ…
కళేబరాలతో కల్తీ నూనెలు తయారు చేస్తూ…
రాజ్యం ఏలుతున్న
దుష్ట నికృష్టు రక్కసులను
నామరూపాలు లేకుండా
చేసే అణ్వాయుధమైపో అక్షరమా..!
గుంట నక్కల మాయతెరల వెనుక కృంగుతున్న…కనులుండీ కబోదులుగా మారుతున్న ప్రతి మనిషి లోని అజ్ఞాన తిమిరాలను సంహరణ చేసి వారి జీవితాల్లో చిరుదీపమై వెలిగేట్లు చేయి అక్షరమా..!

శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న.!

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న జరిగే నిరసనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ముఫ్తీ మౌలానా అబ్దుల్ సబూర్ ఖాస్మీ అధ్యక్షతన జహీరాబాద్‌లోని ఇస్లామిక్ సెంటర్ లతీఫ్ రోడ్‌లో విలేకరుల సమావేశం జరిగింది. స్థానిక జమాతే-ఇ-ఇస్లామీకి చెందిన మౌలానా అతిక్ అహ్మద్ ఖాస్మీ, ముఫ్తీ నజీర్ అహ్మద్ హసమి, ముఫ్తీ ఉబైద్-ఉర్-రెహ్మాన్, ముహమ్మద్ నజీముద్దీన్ ఘౌరి, అమీర్ సంయుక్తంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్వహించిన నిరసన కార్యక్రమం ప్రకారం, ఏప్రిల్ 30 బుధవారం రాత్రి 9 గంటల నుండి రాత్రి 9:15 గంటల వరకు, అంటే 15 నిమిషాల పాటు “బాతి గుల్ ప్రచారం” కింద ముస్లింలందరూ తమ ఇళ్ళు, దుకాణాలు, కర్మాగారాలు మరియు ఇతర వ్యాపార సంస్థలలో లైట్లు ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ద్వారా, కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ సవరణ చట్టం, 2025పై మీ అసంతృప్తిని నమోదు చేయండి. ఈ బ్లాక్ వక్ఫ్ సవరణ చట్టం ద్వారా, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడం ద్వారా మరియు ఇతర వర్గాల సంక్షేమం పేరుతో వివక్ష చూపడం ద్వారా భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన ప్రాథమిక హక్కులతో ఆడుకోవడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది, ఇది వాస్తవాలకు విరుద్ధం. ఈ సందర్భంగా, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, తీవ్రంగా ఖండించారు మరియు ఈ సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించి, నిందితులను న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బతిగుల్ ప్రచారం సందర్భంగా, ఎలాంటి శబ్దం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ముహమ్మద్ మజీద్ ముహమ్మద్ మొయిజుద్దీన్, హఫీజ్ ముహమ్మద్ అక్బర్ ముహమ్మద్ మొయినుద్దీన్ ముహమ్మద్ ఖ్వాజా నిజాముద్దీన్ ముహమ్మద్ యూసుఫ్ ముహమ్మద్ అబ్దుల్ ఖదీర్, ముహమ్మద్ ఫిరోజ్, ముహమ్మద్ అయూబ్ ఖాన్ ముహమ్మద్ వసీం మరియు ఇతరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన.!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీనియర్ జర్నలిస్ట్ మల్యాల బాలస్వామి ని ఫోన్ లో పరామర్శిస్తున్న ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లా కేంద్రంలో రాజనగరం గోశాల దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సీనియర్ జర్నలిస్ట్ నాగవరం మల్యాల బాలస్వామిని ఫోన్ లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి పరామర్శించి గాయాలపై ఆరా తీశారు .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ మెరుగైన వైద్యం చేయించుకుని త్వరగా కోలుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామిని కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న.!

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులు

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం 2024 జనవరిలో నిర్వహించిన గ్రామ సభలలో దరఖాస్తు చేసుకున్నారు. పెదమద్యతరగతి నిరుపేద కుటుంబాలకు చెందిన జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్నట్లు, సోమవారం ఉదయం పలువురు
ఝరాసంగం మండలం ప్రజలు తెలిపారు.

ఏ పేదవాళ్లకు న్యాయం చేసారని.!

ఏ పేదవాళ్లకు న్యాయం చేసారని
రజత్సోహలు చేస్తున్నారు??

కొత్తగూడ నేటిధాత్రి:

60 ఏళ్లు సుదీర్ఘ పోరాటాలతో శ్రీమతి సోనియా గాంధీ చల్లని చలువతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు టిఆర్ఎస్ పరిపాలించి ఏ పేద వాళ్లకు న్యాయం చేశారు ఎన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూములు ఇండ్లు నిర్మించి ఇచ్చారు ఎన్ని గ్రామాలలో రోడ్లు నిర్మించి అభివృద్ధి చేశారు పేదవారికి రైతు బందు పేరిట పది రూపాయలు ఇచ్చి పెద్దవారికి దొరలకు భూస్వాములకు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు రైతుబంధు ఇచ్చారు మీరు దోచుకుని తిన్నందుకా రజోత్సవాలు,ఏజెన్సీ మండల లో తరలుగా వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ గిరిజన గిరిజనేతరుల భూములను హరితహారం పేరుతో మా భూములు గుంజుకున్నాందుక.
మీ రజత్సహలు కాలేశ్వరం ప్రాజెక్టు పేరు తోలక్షల కోట్లు
దొచుకున్నందుక రథోత్సవాలు నీళ్లు నిధులు నియామకాల అని ఊకడు దంపుడు ఉపన్యాసాలు తప్ప మీరు ఎన్ని ఉద్యోగలు ఇచ్చారు ఇంటింటికి ఉద్యోగం పేరుతో గద్దెనెక్కిన మీరు మీ కుటుంబంలో మాత్రం నాలుగైదు ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. అప్పుడే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని మీ కబంధహస్తాలతో విచ్చిన్నం చేసి ఎక్కడికక్కడ దోచుకొని తిన్నారు నిరుద్యోగులను గాలికొదిలేసి కంపెనీల పేరుతో బురిడీ కొట్టించి పేరుకు కొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని మీరే చెప్పి పేపర్లు లీకులు చేసి వాటి మీద కేసులు వేసి తప్పించకు తిరిగారు, నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు హడావిడిగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేసి వారి చావులకు కారణమైనందుకా బి ఆర్ ఎస్ నాయకులు రజత్సోవాలు జరిపేది దొడ్డు బియ్యం పంపిణీ చేసి దళారుల చేతికి పంపించి వాటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రజలకు పంచి గప్పాలు కొట్టారు మీ ప్రభుత్వ హాయంలో ఏనాడైనా పేదవారిని పట్టించుకున్నారా వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించార సన్న బియ్యం పంపిణీ చేయమని మాట్లాడితే రెండు వేల కోట్లు కావాలని మాట్లాడిన మీరు సంపద సృష్టిస్తాం సంపద పెంచడం పేదలకు పంచుతామని గొప్పలు చెప్పిన మీరు సంపద పెరిగింది అలాగనే మీ ఆస్తులు పెరిగాయి ఆ రూపాయల తోనే లతోనే ఈరోజు రజోత్సవాలు జరుపుతున్నారు.. మీరు పేదవాలని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని మరొక్కసారి గుర్తు చేస్తున్నామని
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య అన్నారు…

ఆకాశ రామన్న ఉత్తరంపై పోలీసులకు ఫిర్యాదు.

ఆకాశ రామన్న ఉత్తరంపై పోలీసులకు ఫిర్యాదు
విలేఖరి పై అనుమానాలు
జమ్మికుంట :నేటిధాత్రి

 

 

జమ్మికుంట అయ్యప్ప దేవాలయం అధ్యక్షుడు సిరిమల్లె జయేందర్, కార్యదర్శి ఎలిమెల్ల రాజేంద్రప్రసాద్ లపై ఆలయానికి వచ్చినటువంటి విరాళాలు సొంతానికి వాడుకొని లెక్కలు చూపించకుండా అక్రమాలు చేసినట్టు ఆలయ సభ్యులకు అయ్యప్ప మాలధారులకు కరపత్రాలు పోస్ట్ ద్వారా సీతారామయ్య చీటీ లాగా అడ్రస్ లేకుండా పంపించిన వారు ఎవరనేది తెలియకుండా పంపించడం జరిగింది ఇది జమ్మికుంట పట్టణం ఒక సంచలన వార్తగా మిగిలిపోయింది ఈ కరపత్రాల సమస్య విషయమై ప్రజల యొక్క నానుడి ఎలా ఉందంటే ఆలయ నిర్మాణ టైంలో యాంసాని కృష్ణమూర్తి అధ్యక్షులుగా ఉన్నప్పుడు అయ్యప్ప మాల వేసుకునే భక్తుడే కృష్ణమూర్తి అనుచరుడిగా శ్రేయోభిలాషిగా మెదులుతూ అతనిని తప్పుదోవ పట్టించి తప్పు చేయించి లక్షల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నటువంటి ఈ భక్తుడే కృష్ణమూర్తి ఉండే టైంలో గుడి పైసలు లక్షల రూపాయలు వాడుకొని కృష్ణమూర్తి తో ని కట్టించిన ఘనత ఈయనదే అని అనుకుంటున్నారు ఇతని లీలలు శ్రీకృష్ణ లీలలు త్వరలోనే బయటికి వస్తాయి అనుకుంటున్నారు ఇకపోతే ఆలయానికి చాలా ఖర్చులు ఉంటాయి ఒక కుటుంబం పోషించడానికి ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు అలాంటిది వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి ఆలయానికి సౌకర్యాలు కలిగించడం ఉత్సవాలు జరిపించడం ప్రతి పండుగ రోజు పండుగ వాతావరణం కలిగించడానికి ఎంతో ఖర్చవుతుంది అలాంటిది రాయలేదు వచ్చిన రూపాయలు అక్రమం జరిగిందని రాస్తున్నారు అందులో ఎంతవరకు నిజం ఉన్నదో ఈ ఆకాశరామన్న ఉత్తరంలో ఏది నిజమో ఏది అబద్దమో కాలమే తెలియజేస్తుంది అలాగే ఆలయ మొత్తము విలువ 20 కోట్లు ఉంటుందేమో కానీ 15 కోట్ల రూపాయలు అక్రమం జరిగింది 15 కోట్ల రూపాయలు సంతానికి వాడుకున్నారు అనేదాంట్లో ఎంతవరకు నిజమో అనేది ప్రజలు గమనిస్తున్నారు ఏది ఏమైనా భగవంతుని యొక్క సన్నిధిలో ఉంటూ భగవంతుని యొక్క పైసల విషయంలో ప్రజల్లోకి ఇలాంటి వార్తలు రావడం రానున్న రోజుల్లో విరాళాలు కూడా రాకుండా ఆలయ అభివృద్ధికి వెనకడుగు వేసే విధంగా చేసినారు తప్ప ఇది ఏదో అభివృద్ధి కో లేకుంటే ఏదో ఆలయానికి పనికివచ్చే విషయం అనేది ఎవరూ పరిగణించట్లేదు వాళ్ల దాంట్లో వాళ్లకు పడక ఆదిపత్య పూర్ లో భాగంగానే ఇది వచ్చిందని నిపుణులు భక్తులు ప్రజలు అనుకుంటున్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.

‘రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు’

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, బాలానగర్, మొదంపల్లి, మోతీ ఘనపూర్, హేమాజీపూర్ గ్రామాలలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మల్ల అశ్వినీ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు వరి ధాన్యమును అమ్ముకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోకూడదన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాలో.. డబ్బులు జమ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, ఆది రమణారెడ్డి, లింగారం యాదయ్య గౌడ్, బత్తుల రాఘవేందర్, భాస్కర్ గౌడ్ వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

హనుమకొండలో గుర్తు తెలియని మృతదేహం.

హనుమకొండలో గుర్తు తెలియని మృతదేహం

హనుమకొండ, నేటిధాత్రి:

 

 

హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది తేది 21.04.2025 రోజున, సమయం 14:46 గంటల సమయంలో కాంగ్రెస్ భవన్ కుమార్ పల్లి వద్ద కనిపించినది, ఈ మృతదేహాన్ని హన్మకొండ పోలీస్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించడం జరిగింది.చనిపోయిన వ్యక్తికి సంబంధించిన రక్త బందువులు ఎవరైనా ఉంటే ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించలని హనుమకొండ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. నెంబర్ 87126 85113, 9550961427.

పాతకోటలో వృదాగా ఉన్న కురాగాయల మార్కెట్ ను.!

పాతకోటలో వృదాగా ఉన్న కురాగాయల మార్కెట్ ను

డబులో బెడ్ రుములు నిర్మెంచి పేదలకు ఇవ్వాలి ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి ;

వనపర్తి పట్టణంలో:

పాతకోట లోని సమీకృత కూరగాయల మార్కెట్ పాత వ్యవసాయ మార్కెట్ లోని సమీకృత మార్కెట్లను వెంటనే వినియోగంలోకి తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక.జిల్లా అధ్యక్షులు
సతీష్ యాదవ్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు గత బీ ఆర్ ఎస్ .ప్రభుత్వ ములో కోట్లు రూపాయలు ఖర్చు చేసి
పాతకోట లోని కందకంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా ఉంది అని దాన్ని వినియోగం లోకి తేవాలనీ సతీష్ ప్రజల తరుపున కోరారు. లేకపోతే డబుల్ బెడ్ రూమ్ లను నిర్మాణం చేసి పేద ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజలు. పాత వ్యవసాయ మార్కెట్లో కట్టిన సమీకృత మార్కెట్ బిల్డింగును తక్కువ ధరలకు కిరాయలకు ఇచ్చి పేదలు వ్యాపారం చేసుకోవడానికి} వినియోగం లోకి తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి కలెక్టర్ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ని సతీష్ యాదవ్ కోరారు
సతీష్ యాదవ్ వెంట ఎస్సీ ఎస్టీ కమిటీ నాయకులు గంధం నాగరాజు సిపిఎం నాయకులు మార్టిన్, గౌని కాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్ శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, భాష తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది.

తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది
– సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

 

టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయిందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణను స్వార్థ రాజకీయాల కోసం వాడుకొని, రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదలు దోచుకున్నారని అన్నారు. అందుకే ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల పక్షాన పోరాడాల్సిన కేసీఆర్ కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న కేటీఆర్, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన సిరిసిల్ల ప్రజలను పట్టించుకోవడంలేదని, అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతుల పక్షాన నిలబడడం లేదని మండిపడ్డారు.
ఆదివారం జరగనున్న రజతోత్సవ సభ టీఆర్ఎస్ పార్టీదో లేక బీఆర్ఎస్ పార్టీదో కేసీఆర్ స్పష్టత ఇచ్చి వరంగల్ కు వెళ్లాలని కేకే సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడా లేక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడా స్పష్టత ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బావ, బావమరుదులు నాడు కుర్చీ కోసం నేడు పార్టీ కోసం కుస్తీ పడుతున్నారని, హరీష్ రావుకు కూడా తెలంగాణ ఉద్యమకారులకు పట్టిన గతే పడుతుందని కేకే జోష్యం చెప్పారు. వరంగల్ సభలో పార్టీలో హరీష్ రావు స్థానం ఏంటో కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని, కుర్చీల కొట్లాటలో హరీష్ రావు బీఆర్ఎస్ నుండి బయటకు రావడం ఖాయమన్నారు. తెలంగాణను నయవంచన చేసిన వాళ్లే ఆ పార్టీలో ఉన్నారని, కార్యకర్తలకు అది బీఆర్ఎస్ పార్టీయో, టీఆర్ఎస్ పార్టీయో తెలియదన్నారు. సంపాదించిన అవినీతి సొమ్ముతో రజతోత్సవ సభకు ప్రజలను తరలిస్తున్నారని, సభకు వచ్చేవారు కదిలివచ్చే జనం కాదని, కదిలిస్తే వచ్చే జనం అని విమర్శించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, జిల్లా నాయకుడు యేళ్లే లక్ష్మీనారాయణ, వైద్య శివప్రసాద్, కత్తెర దేవదాసు, శ్రీనివాస్ రవి, మహిళా నాయకురాలు కల్లూరు చందన, వనిత తదితరులు పాల్గొన్నారు.

దోపిడీ ముఠాలకు దోరలుగా మార్చింది.

దోపిడీ ముఠాలకు దోరలుగా మార్చింది.

అక్రమ వసూళ్లపై టీజీఎండిసి నిశ్శబ్దం వేడుక బలమైన కారణం.

అదనపు బకెట్ పోతే పర్వాలేదు,అక్రమ వసూళ్లు ఉన్నాయి కదా.

అక్రమ వసూళ్ల సాక్షాలు తెరపైకి వచ్చిన కొద్ది పెరుగుతున్న లారీలు.

పలుగుల 8, 9, మరో మూడు ఇసుక రీచుల్లో రోజుకు వందకు పై లారీల ఇసుక రవాణా.

టీజీఎండిసి అక్రమాలపై చర్యల కు నిరాకరణ, రెట్టింపు ఉత్సాహంతో వసూళ్ల పర్వం.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

 

దోపిడీ లక్ష్యంగా అక్రమ వసూళ్లు, అదునపు ఇసుకను లోడ్ చేస్తూ దర్జాగా దర్జాగా లక్షల రూపాయలు దూచుకుంటున్న ఇసుక క్వారీ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకుండా, దోపిడీకి మరింత సహకరిస్తూ దోపిడి ముఠాలకు దొరలుగా మార్చింది టీజీఎండిసి, దీనికి సాక్షాలు ఒకటి కాదు వందల సంఖ్యలో తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది కానీ టీజీఎండిసి ఇలాంటి చర్యలు తీసుకోదు.

robbery gangs.

ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండల కుదురుపల్లి కాలేశ్వరం పరిధిలో పలువుల 8 పలుగుల 9, ఉసుక్ పల్లి పలువుల ఆరు, మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఆదేశం లాగా, దర్జాగా దూచుకోవడం జరుగుతుంది. ఇక పుసుకుపల్లి ఒకటి ప్రస్తుతం ఈ క్వారీ పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లు అక్రమ ఇసుక రవాణా చేసి తమ క్వాంటిటీని సమాప్తం చేసుకుంది, ఇక్కడ సిబ్బంది దర్జాగా అదనపు ఇసుక రవాణా చేయడం నిబంధనకు విరుద్ధం కాదని చెప్పడం జరిగినప్పటికీ టీజీఎండిసి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉన్నదంతా సమాప్తం చేసుకొని వెళ్లిపోయింది.

robbery gangs.

ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగు ఇసుక క్వారీల అక్రమాలు మాత్రం ఆగడం లేదు, ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలు చేపడుతున్న కొద్ది ఈ క్వారీలకు లారీల సంఖ్య రోజుకు 100కు పైచిలువు లారీడు ఇసుక రవాణాకు రావడం ఆశ్చర్యం.

అక్రమ వసూళ్లపై టీజీఎండిసి నిశ్శబ్దం వేడుక బలమైన కారణం.

ఇక ప్రస్తుతం మహదేవ్పూర్ మండల పరిధిలో దర్జాగా టీజీఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ గుమస్తాల కంటే ఎక్కువగా, వసూళ్ల పర్వం చేపట్టడం, సీరియల్ లోడింగ్ కాంటా, వే బిల్, వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లు చేయడం శరమాములుగానే కొనసాగుతుంది.

robbery gangs.

సిబ్బంది అక్రమ వసూళ్ల పర్వం వెనుక ఒక బలమైన రహస్యం దాగి ఉందని తెలుస్తుంది. ఇక ఇసుక రిచుల్లో సిబ్బంది అక్రమాలపై టీజీఎండిసీ నిశ్శబ్దం, పెద్ద మొత్తంలో ప్రతి క్వారీలో సుమారు రోజుకు లక్ష 30 వేల నుండి 2 లక్షల పదివేల రూపాయల వరకు అక్రమ వసూళ్లు చేపడుతున్న టీజీఎండిసి నిశ్శబ్దం వెనుక ఒక బలమైన కారణం ఉందని అందుకే అధికారులు అక్రమ వసూళ్లపై పట్టించుకోవడంలేదని, ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి, అంతేకాకుండా మండలంలో ఇసుక క్వారీల అక్రమ వసూళ్లు, స్వయంగా టీజీఎండిసి సిబ్బంది కలెక్షన్ చేయడం, వెనుక దాగి ఉన్న ఒక రహస్యం అది రహస్యం కాదు జగమెరిగిన సత్యం అని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే కింది స్థాయి అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు చర్యలకు ససేమిరా అనడానికి ప్రధాన కారణం అని చెప్పడంలో సందేహం లేదు.

అదనపు బకెట్ పోతే పర్వాలేదు,అక్రమ వసూళ్లు ఉన్నాయి కదా.

టీజీఎండిసి ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయడం జరిగిందని, నిఘానేత్రం, రెవెన్యూ ,పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలను ఏర్పాటుచేసి అక్రమ ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేశామని, చెప్పడం జరిగింది. కానీ అది కేవలం చెప్పుడు మాటల కొరకే, అదనపు బకెట్ తో ఇసుక క్వారీలు చిన్న బకెట్ కు 1500, పెద్ద బకెట్ కు 2000 నుండి 2500 వసూలు చేసేవారు, కానీ అప్పట్లో ఇసుక దోపిడీ జరుగుతుందని బహిర్గతం కావడంతో, కాంట్రాక్టర్లకు కాస్త ఇబ్బంది కలిగింది, కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా టీజీఎండిసి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించి దానికి అమలు చేస్తుంది, అదేమిటంటే అక్రమ వసూళ్లు చేస్తే సరిపోతుంది అదునపు బకెట్ కు ఎంత అయితే కాంట్రాక్టర్లకు వస్తుండేది దానికి సరి సమానం అదునపు చార్జీలు, సీరియల్ కాంట లోడింగ్, కలిపితే 1600 నుండి 2200 వరకు వస్తుందని చెప్పి మరి తన సిబ్బందిచే కాంట్రాక్టర్లకు కలెక్షన్ చేసి అప్పజెప్పేలా చేసింది. దీనికి వందల సాక్ష్యాలు గత 20 రోజుల నుండి తెరపైకి తీసుకురావడం జరిగింది.

అక్రమ వసూళ్ల సాక్షాలు తెరపైకి వచ్చిన కొద్ది పెరుగుతున్న లారీలు.

టీజీఎండిసి అక్రమ వసూళ్లపై వ్యవహారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడానికి, గడిచిన 20 రోజుల నుండి అనేక సాక్షాలు తెరపైకి తీసుకు వచ్చినప్పటికీ, మహాదేవపూర్ కాళేశ్వరం పరిధిలోని ఐదు ఇసుక క్వారీలపై చర్యలు తీసుకోకుండా ఉండడం ఒకవైపు అయితే, మరోవైపు పలువుల 8, 9, పుసుపల్లి పలువుల ఆరు, మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, ఈ ఇసుక క్వారీలో ఒక్క రోజు కూడా ఇసుక రవాణా కొరకు లారీలు తగ్గుముఖం పట్టిన దాఖలా లేదు, గడిచిన 22 రోజుల్లో పలుగుల 8 ,9, 100 నుండి 150 లారీల వరకు ప్రతిరోజు ఈ రెండు క్వారీల్లో పెద్ద మొత్తంగా ఇసుక అరవణ చేయడం జరిగింది. మరోవైపు మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, పుసుపల్లి పలువుల 6, పుసుపల్లి ఒకటి, 70 నుండి 110 లారీల వరకు ఈ మూడు ఇసుక క్వారీలు ప్రతిరోజు లారీల్లో ఇసుక రవాణా చేయడం జరిగింది. పూసుకుపల్లి ఒకటి, క్వారీలో తమ క్వాంటిటీ పూర్తికాకముందు ఒకటవ తేదీ నుండి 21వ తేదీ వరకు యావరేజ్ రోజుకు డెబ్బై నుండి మొదలుకొని 110 లారీల్లో ఇసుక రవాణా చేసింది. అక్రమ వసూలు చేస్తూ పాసింగ్ పై అదనపు ఇసుక దర్జాగా తరలిస్తున్నప్పటికీ టీజీఎండిసి చర్యలు తీసుకోకపోవడం, ఈ క్వారీల్లో పాసింగ్ పై అదనపు ఇసుక వస్తుందని, లారీ యజమానులు ఈ క్వారీలో మరింత రెట్టింపు ఉత్సాహంతో తమ లారీలను బుక్ చేయడం జరుగుతుంది.

 

టీజీఎండిసి అక్రమాలపై చర్యల కు నిరాకరణ, రెట్టింపు ఉత్సాహంతో వసూళ్ల పర్వం.

ప్రస్తుతం మండలంలోని కాలేశ్వరం మహాదేపూర్ పరిధిలో నిర్వహించబడుతున్న నాలుగు ఇసుక రీచ్ లో, అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక, అక్రమంగా రవాణా చేస్తూ, లక్షల రూపాయలను దూచుకుంటున్న క్వారీలపై టి జి ఎం డి సి, చర్యలు తీసుకోకపోవడం. కాంట్రాక్టర్లకు అధికారులు తమపై ఎలాంటి చర్యలు తీసుకోరన్న బలమైన నమ్మకం, మరోవైపు టి జి ఎం డి సి సిబ్బంది అధికారులు తమకు ఏమీ చెప్పరు, ఎందుకంటే మా రూటు కాస్త సపరేటు, అన్న విషయం వారికి తెలియడంతో, వారి వసూళ్ల పర్వం కొనసాగిస్తున్న క్రమంలో, ఈ నాలుగు ఇసుక రీచ్ లో అక్రమ వసూలు మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతున్నాయి, అమాయక లారీ డ్రైవర్ల నుండి లోడింగ్ ,పాసింగ్, కాంట, వే బిల్, మరోవైపు పాసింగ్ పై అదనపు ఇసుక మరో 500 తమకు అడిగే నాధుడే లేడని, మరింత రెట్టింపు ఉత్సాహంతో దర్జాగా వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా టీజీఎండిసి, ఈ ఐదు క్వారీలపై చర్యలు తీసుకొని, క్వారీల కమిషన్ నిలిపివేసి, ఈ క్వారీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకొని వారిని విధుల నుండి తొలగిస్తారా, లేక అక్రమాలకు ప్రోత్సహిస్తారా అనేది వేచి చూడాలి.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగిన పనులు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగిన బ్రిడ్జి నిర్మాణం పనులు.

ఓడేడ్ బ్రిడ్జి ని పూర్తి చేయండి.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.

పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని డిమాండ్.

సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్.

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

మంథని నియోజక వర్గ పరిధిలో ఓడేడ్ గ్రామ శివారులో మానేరు నది పై గత ప్రభుత్వ పాలన లో ప్రారంభమైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండానే కూలి పోయిందని, దానిని వెంటనే పూర్తి చేసి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఓడెడ్ గ్రామ శివారులో లో కూలి పోయిన బ్రిడ్జి ని పరిశీలించి అనంతరం మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం లో లోపాలు ఉన్న మూలంగా నిర్మాణం పూర్తి కాకుండానే పిల్లర్ లు కూలిపోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం లో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం, ప్రభుత్వ అధికారుల అజమాయిషీ లేక పోవడం మూలంగా బ్రిడ్జి పిల్లర్లు గాలి దుమారానికి కూలీ పోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి పిల్లర్లు కూలీ రెండు సంవత్సరాలు గడిచినా ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక పోవడం వల్ల బ్రిడ్జి పక్క నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు మీద వాహానాల ద్వారా సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలు మరియు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కూడా చాలా మంది ఈ బ్రిడ్జి ప్రక్క నుంచి ప్రయాణం చేస్తున్నప్పటికీ ని వర్షాకాలంలో ఇబ్బందులకు గురి అవుతారని ఆయన పేర్కొన్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా మంత్రి వర్యులు శ్రీదర్ బాబు దృష్టి సారించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి ఐతే దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం రెండు జిల్లాల ప్రజలకు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూముల రీ సర్వే కంప్లీట్.

ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూముల రీ సర్వే కంప్లీట్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

రామగుండంలో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని స్థల సేకరణ పై రీ సర్వే చేయాలని గత పది రోజుల క్రితం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి కి వినతి పత్రాన్ని అందించడం జరిగింది.

వెంటనే స్పందించిన ఎయిర్ ఫోర్స్ అథారిటీ శుక్రవారం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూములను పరిశీలించారు.

పెద్దపల్లి జిల్లాలో ఎయిర్ పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఎంపీ వంశీకృష్ణ చొరవతో రీ సర్వే జరగడం ద్వారా రెండు దశాబ్దాల కల నెరవేరబోతుందనీ ప్రజలలో ఆశాభావం వ్యక్తం అవుతుంది.

అంతర్గాం మండల కేంద్రంలోని టెక్ట్స్ టైల్స్ భూములను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉన్నతాధికారులు సందర్శించి ఎయిర్ పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.

గతంలో సమర్పించిన భూ రికార్డుల ఆధారంగా ఆ స్థలాన్ని రీ సర్వే నిర్వహించారు.

సమీపంలోని రైల్వే ట్రాక్,రాజీవ్ రహదారి కనెక్టివిటీ,ఇరువైపులా పట్టణాలు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు.

అక్కడి నుండి బసంత్ నగర్ ఎయిర్ పోర్ట్ భూములు పరిశీలించారు.ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఎంతో అవసరం కాగా అంతర్గాం,బసంత్ నగర్ కేంద్రాల్లో దానిని ఎక్కడ నిర్మిస్తారనే ల్యాండ్ మార్క్ వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏఏఐ అధికారులు తీసుకు వెళ్తామన్నారు.

అతి త్వరలో ప్రతిపాదిత స్థలాన్ని గుర్తించి ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు దిశగా అడుగులు వేయనున్నట్లు సమాచారం.

రామగుండం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ చేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా తో పాటు జగిత్యాల జిల్లా వాసులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం కావడం తో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

భూములను పరిశీలించిన వారిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య,అంతర్గాం తాసిల్దార్ రవీందర్ పటేల్ ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version