కారల్ మార్క్స్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ఎమ్మెల్యేకు ఎంసిపిఐ(యు) నేతల వినతి.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో నెలకొన్న సమస్యల పట్ల స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి నెలకొన్న సమస్యల పట్ల ఎంసిపిఐ(యు) నేతలు వినతిపత్రం సమర్పించారు.నర్సంపేట పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రారంభోత్సవానికి వచ్చిన నేపథ్యంలో అదే కాలనీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.ఈ సందర్భంగా ఎంసీపీఐయు రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న , వంగల రాగసుధ మాట్లాడుతూ కాలనీలో ముఖ్యంగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభమైతే వరద నీరుమొత్తం కాలనీలోకి చేరి ఇండ్లు బురద మయంగా మారుతున్నాయని ,దీంతో విష సర్పాలు ఇళ్లలోకి చేరి కాలనీ వాసుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లె అవకాశం ఉందన్నారు.అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు కాలనీవాసులు అందరు కూడా అర్హులేనని,వారందరికీ వెంటనే ఇల్లు మంజూరు చేయాలన్నారు.అదేవిధంగా రాజీవ్ యువ వికాస పథకాన్ని అనర్హులకు కాకుండా అర్హులకు వర్తించేలా చూడాలన్నారు. ఈ సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎం సిపిఐ యు నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి , స్థానిక నాయకులు గజవెల్లి జగపతి , గణిపాక బిందు ఎండి ఆరిఫ్ , జను జమున , చొప్పరి పద్మ గుజ్జుల శివ , క్రొర్ర మాలమ్మ బైరవైన నరసయ్య ,ఎస్.కె సద్దాం తదితరులు పాల్గొన్నారు.