చలి మెడ.రాజేశ్వరరావు ఘనంగా జన్మదిన వేడుకలు.

చలి మెడ.రాజేశ్వరరావు ఘనంగా జన్మదిన వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం. నేరెళ్ల గ్రామంలో. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లో.కరీంనగర్ డైరీ యూనిట్.సూపర్వైజర్ గుర్రం సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో. కరీంనగర్ డైరీ చైర్మన్ చలి మెడ రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ డైలీ చైర్మన్ రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగిందని కరీంనగర్ డైరీ స్థాపించి డైరీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అట్లాగే రోజుకు 2000 లీటర్ల నుండి రెండు లక్షల లీటర్ల వరకు పాల ఉత్పత్తిని పెంచిన ఘనత చైర్మన్ రాజేశ్వరరావు ది అని. మాకు పండుగ రోజు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్టి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపించుకున్నామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. బి సి యు ఇన్చార్జి రాగుల మధుసూదన్. సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్. ల్యాబ్ అసిస్టెంట్ తిరుపతి. శేఖర్. నరేష్. శ్రీనివాస్. రాజు. సాయికుమార్ రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా హ‌రీష్ రావు జ‌న్మ‌దిన వేడుక‌లు.

ఘనంగా హ‌రీష్ రావు జ‌న్మ‌దిన వేడుక‌లు

జహీరాబాద్ నేటిధాత్రి:

మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే మాణిక్ రావు కేక్ కట్ చేసిన అనంతరం గులాబీ శ్రేణులతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంద‌ర్భంగా శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు మాట్లాడుతూ ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ వెన్నంటి నడిచిన నిజమైన గులాబీ సైనికుడు హ‌రీష్ అని అన్నారు.పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న గొప్ప నాయకుడు హ‌రీష్ రావు గార‌ని కొనియాడారు. భారత రాష్ట్ర సమితి పార్టీ పార్టీ వెన్నెముక, క‌ష్ట‌కాలంలో నిలుస్తూ.. ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడుతున్న యోధుడు హ‌రీష్ రావుగార‌ని అన్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, 10 ఏండ్ల ప్ర‌భుత్వ పాల‌న‌లో నీటి పారుద‌ల‌, ఆర్థిక మంత్రిగా వారు రాష్ట్రానికి ఎన‌లేని సేవ‌లు చేశారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయే కాళేశ్వ‌ర ప్రాజెక్టు సాకారంలో కేసీఆర్ గారితో పాటు హ‌రీష్ గారు శ్ర‌మ, కృషి మ‌రువ‌లేనిద‌ని అన్నారు. హ‌రీష్ రావు నిండు నూరేళ్లు అష్టైశ్వ‌ర్యాల‌తో , సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, ముఖ్య‌మంత్రిగా తిరిగి కేసీఆర్ గారిని చేయ‌డంలో హ‌రీష్ రావు గారి నాయ‌క‌త్వాన్ని తెలంగాణ కోరుకుంటోంద‌ని అన్నారు.కార్య‌క్ర‌మంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ ,యువ నాయకులు మిథున్ రాజ్ ,చిన్న రెడ్డి,వెంకట్, నర్సింహ రెడ్డి,ఇబ్రహీం,దేవదాస్,గణేష్,సురేష్ ,నరేష్ రెడ్డి,జాకీర్,అశోక్ రెడ్డి,ఇమ్రాన్ ,నాయకులు కార్యకర్తలు త‌దిత‌రులు పాల్గొన్నారు

రామారావు గారి జయంతి వేడుకలు.

ఘనంగా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు జహీరాబాద్ పట్టణం రాంనగర్ కాలనీ చౌరస్తా వద్ద గల ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు బండమీది శ్రీనివాస్, సురేష్, రాంచందర్, టి.శివన్న,శికారి గోపాల్, చెంగల్ జైపాల్,లక్ష్మణ్, నాగరాజ్,శికారి శ్రీనివాస్, తుక్కన్న,చేన్ మల్లు,శంకర్, తదితరులు పాల్గొన్నారు,

రావుస్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు.

రావుస్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించి నoదుకుసన్మానించిన ఐక్యవేదిక నేతలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణ ములో రావుస్ జూనియర్ కళాశాలలో పదవ తరగతి చదివి న విద్యార్థులను ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా రాష్ట్ర స్థాయి మార్పులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యన్ని అభినందించారు
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం, ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, గౌనికాడి యాదయ్య, శివకుమార్, వెంకటేశ్వర్లు,రమేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version