కన్నప్ప కు రజనీ అభినందనలు.

కన్నప్ప కు రజనీ అభినందనలు…

 

shine junior college

దిగ్గజ నటులు రజనీకాంత్‌, మోహన్‌బాబు కలసి నటించిన ‘పెదరాయుడు’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 జూన్‌ 15న విడుదలైన ఆ చిత్రం సంచలన…

దిగ్గజ నటులు రజనీకాంత్‌, మోహన్‌బాబు కలసి నటించిన ‘పెదరాయుడు’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 జూన్‌ 15న విడుదలైన ఆ చిత్రం సంచలన విజయం సాధించి, వసూళ్ల చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆదివారం రజనీకాంత్‌ ఇంట్లో ఆయన్ని కలిశారు మోహన్‌బాబు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రాన్ని రజనీకాంత్‌ చూశారు. విష్ణుని అక్కున చేర్చుకుని సినిమా బాగుందంటూ అభినందించారు. ఈ ఆనందాన్ని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు విష్ణు. ‘ఈ క్షణం కోసమే 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నా నటనని రజనీ అంకుల్‌ మెచ్చుకోవాలని నా కల. అది ఇప్పుడు నెరవేరింది. ఈ రోజు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అని అందులో పేర్కొన్నారు. అలాగే మోహన్‌బాబు కూడా సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ‘ నేను నిర్మించిన ‘పెదరాయుడు’ చిత్రానికి 30 ఏళ్లు పూర్తైన రోజునే నా ప్రియ మిత్రుడు రజనీకాంత్‌ ‘కన్నప్ప’ చిత్రాన్ని తన కుటుంబ సభ్యులతో కలసి చూశారు. సినిమా చూసిన అనంతరం ఆయన కురిపించిన ప్రేమ, అభిమానం, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరచిపోలేను. థాంక్యూ మిత్రమా’ అని పేర్కొన్నారు. ‘కన్నప్ప’ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

◆ సప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్ అవడంతో అఘాయిత్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

 

జహీరాబాద్: ఇంటర్మీడియట్లో ఫెయిల్అయి
నందుకు మనస్థాపానికి గురై వెంకట రమణ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ పట్టనంలో నివాసం ఉంటున్న రాయిపల్లి కృష్ణ కుమారుడు వెంకటరమణ (19) డాక్టర్ ఆర్ఎల్ఆర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మృతుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాశాడు. సోమవారం మధ్యానం 12 గంటలకు ఇంటర్ సప్లి రిజల్ట్స్ రావడంతో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వెంకట రమణ తల్లి వెంకటరమ ణకు ఫోన్ చేస్తే లిఫ్ట్చేయడంలేదని స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి చూడమని చెప్పింది.దీంతో తన స్నేహితులు ఇంటికి వెళ్లి చూడగా ఉరేసు కుని ఉన్నారు. స్నేహితులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీ క్షించిన వైద్యులు వెంకట రమణ మృతిచెందినట్లు ధృవీకరించారు. వెంకట్ రమణ మృతిపై తండ్రి కృష్ణ జహీరాబాద్ టౌన్ పీఎస్ లో ఎలాంటి అను మానాలు లేవని పేర్కొన్నట్లు ఎస్ఐ. కె. వినయ్ కుమార్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

అందుకే పాకిస్థాన్‌లో విడుదల చేయలేదు.

అందుకే పాకిస్థాన్‌లో విడుదల చేయలేదు.

 

 

shine junior college

ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘దంగల్‌’. 2016లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలకు…

ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘దంగల్‌’. 2016లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాఽధించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ఆమిర్‌ఖాన్‌ వెల్లడించారు. తాజాగా ఓ టెలివిజన్‌ షో పాల్గొన్న ఆయన ‘దంగల్‌’ను పాకిస్థాన్‌లో విడుదల చేయకపోవడం వెనుకున్న కారణాన్ని వివరించారు. ‘గీతా ఫొగట్‌ విజయం సాధించిన అనంతరం జాతీయ పతాకం నింగిలోకి ఎగురుతూ ఉండగా… జాతీయ గీతం వినిపించే దృశ్యాలు సినిమా నుంచి తొలగించండి లేదంటే చిత్ర ప్రదర్శనకు అంగీకరించం’ అని పాకిస్థాన్‌ సెన్సార్‌ బోర్డు షరతు విధించింది. ఇదే విషయమై చిత్ర సహ నిర్మాణ సంస్థ డిస్నీ నన్ను సంప్రదించగా నష్టం వచ్చినా సరే.. మనం సినిమాని పాకిస్థాన్‌లో విడుదల చేయడం లేదు అని ఖరాఖండిగా చెప్పేశాను’ అని ఆమిర్‌ఖాన్‌ వివరించారు. ‘మీ జాతీయ పతాకాన్ని తొలగించండి, మీ జాతీయ గీతాన్ని తీసివేయండి అనే వారితో నాకు పనేంటి. అలాంటి వ్యాపారం అక్కర్లేదని చెప్పేశాను’ అంటూ ఆయన ఆ నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

నాపై ప్రభాస్‌కు ఉన్న నమ్మకమే రాజాసాబ్‌.

నాపై ప్రభాస్‌కు ఉన్న నమ్మకమే రాజాసాబ్‌

 

 

 

 

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్‌ కామెడీ ‘రాజాసాబ్‌’.

మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ కథానాయికలు.

సంజయ్‌దల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌…

 

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్‌ కామెడీ ‘రాజాసాబ్‌’.

మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ కథానాయికలు.

సంజయ్‌దల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

డిసెంబరు 5న చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సోమవారం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

వింటేజ్‌ లుక్‌లో ప్రభాస్‌ చేసిన హంగామా, అదిరిపోయే విజువల్స్‌, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

ముఖ్యంగా ప్రభాస్‌ సంభాషణలు, ఆయన చేసిన కామెడీ అభిమానులను ఖుషీ చేశాయి.

మారుతి టేకింగ్‌ ప్రధానాకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో మారుతి మాట్లాడుతూ ‘ఓ రోజు యువీ వంశీ నిన్ను ప్రభాస్‌ పిలుస్తున్నారు అని చెప్పారు.

ఆయన్ని కలిసేందుకు ముంబై వెళ్లా.

‘నువ్వు చేసిన ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘భలేభలే మగాడివోయ్‌’ లాంటి వినోదాత్మక కథ రెడీ చెయ్యి.

సినిమా చేద్దాం’ అని అన్నారు.

‘పక్కా కమర్షియల్‌’ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో నాతో సినిమా చెయ్యాలనుకున్న నిర్మాత వెనక్కి వెళ్లారు.

అయినా నాపై నమ్మకంతో ప్రభాస్‌ ఈ సినిమాను చేశారు.

ఆయనకు నాపై ఉన్న నమ్మకమే ఈ సినిమా. 

 

షూటింగ్‌ మొదలయ్యాక కూడా ‘ఈ టైమ్‌లో ప్రభా్‌సకు మారుతితో సినిమా అవసరమా’..
‘అయినా ప్రభాస్‌ కామెడీ చేయడమేంటి’ వంటి సందేహాలు వినిపించాయి.
అన్ని సవాళ్లనూ స్వీకరిస్తూ ఈ సినిమాను మరింత పట్టుదలతో కొనసాగించా.
అభిమానులు ఆయన్ని ఎంతగా ప్రేమిస్తారో తెలిసిందే.
అంతకు వెయ్యిరెట్లు ఆయన వారిని ప్రేమిస్తారు’’ అని అన్నారు.
టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఆరంభం నుంచి ముగింపు వరకూ సినిమా మీ అందర్నీ ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోనివ్వకుండా ఎంటర్టైన్‌ చేస్తుంది.
40 నిమిషాల క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంటుంది’’ అని చెప్పారు.
నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం మొదలైనప్పుడు ఓ నిర్మాత దీనిపై నెగెటివ్‌గా మాట్లాడారు.
సినిమా విడుదలయ్యాక ఆయనే పొగుడుతారు’’ అని తెలిపారు.

జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ పాఠశాలాల్లో.

జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ పాఠశాలాల్లో ఉచిత విద్యను అందించాలి

టి ఎస్ జి యు ఎన్యుజే ఇండియా.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

shine junior college

మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రయివేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించి ఉచిత విద్యను అందించాలి అని,మహబూబాబాద్
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు తెలంగాణా స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ జిల్లా నేతలతో కలసి వినతి పత్రం అందించిన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిర్రగోని ఉదయ్ ధీర్, వారు మాట్లాడుతూ రాత్రానకా పగలనక నిరంతరం వార్తల కోసం తిరుగుతూ,ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందరి శ్రేయస్సు కోసం పాటుపడే జర్నలిస్టులకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు తప్పకుండా కల్పించాలని,మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు అన్ని ప్రయివేటు పాఠశాలల్లో ఉచిత విద్యా భోధన అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు,జిల్లా విద్యా శాఖా అధికారి రవీందర్ రెడ్డి కి వినతి పత్రం అందించామని తెలిపారు.ఇటీవల టి ఎస్ జే యు ఎన్యుజే ఇండియా పోరాటంతో ములుగు జిల్లా కమిటీ అక్కడి జర్నలిస్టుల పిల్లలకు వందశాతం ఫీజు రాయితీ కల్పించిన సంగతి గుర్తు చేస్తూ కాపీ వినతిపత్రానికి జత చేసినట్లు కలెక్టర్ ,విద్యా శాఖాధికారి సత్వరం ఈ వినతి పై సానుకూల స్పందన ప్రకటించాలని కోరారు.

Private Schools.

కార్యక్రమంలో డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్,జిల్లా టీయస్ జేయూ నేతలు పోతుగంటి సతీష్,గాండ్ల కిరణ్,జెల్లీ శ్రవణ్, మల్లారపు నగేష్ శెట్టి వెంకన్న,మిట్టగడుపుల మహేందర్,తాడూరి ఉమేష్ శర్మ,
కేసముద్రం మండల అధ్యక్షులు మంద విక్రం ప్రధాన కార్యదర్శి గంధసిరి యాకాంబరం, ఉపాధ్యక్షులు కందుకూరి రాజేందర్,సతీష్,జన్ను శ్రీనివాస్

కురవి భద్రకాళి సమేత వీరభద్రుని దర్శించుకున్న.

కురవి భద్రకాళి సమేత వీరభద్రుని దర్శించుకున్న టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్

మరిపెడ/కూరవి నేటిదాత్రి

shine junior college

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo లో ని పవిత్ర పుణ్యక్షేత్రమైన కురవి శ్రీభద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్,మాజీ పార్లమెంట్ సభ్యులు ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మధుయాష్కి గౌడ్,ట్రైకా చైర్మన్ బెల్లయ్య నాయక్,కలసి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలకడం జరిగింది దర్శనం అనంతరం వారు మాట్లాడుతూ వీరభద్ర స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు,రాష్ట్రంలోని ప్రజా పాలన అద్భుతంగా సాగుతుందని రేవంత్ రెడ్డిగారి పాలనలో రైతులు సబండ వర్గాలు సంతోషంగా ఉన్నారని ముందు ముందు ఇంకా మంచి పథకాలు ప్రవేశ పెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని వచ్చే ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని పాడిపంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని కొరవి భద్రకాళి సమేత వీరభద్రుని వేడుకోవడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమంలో కొరవి దేవస్థానం చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి, కోరవి మండల పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రo గౌడ్, ఓబీసీ సెల్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మేకల వీరన్న యాదవ్,ప్రధాన కార్యదర్శి ఆవిరె మోహన్ రావు,మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగ్య నాయక్,శ్యామల శ్రీనివాస్,దైద భద్రయ్య,కురవి మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయ్యాల శ్రీధర్,నల్లెల్ల గ్రామపార్టీ అధ్యక్షులు బండి మల్లయ్య గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

నిరుపేద ఆర్యవైశ్యులకు అండగా ఉప్పల వెంకటేష్.

నిరుపేద ఆర్యవైశ్యులకు అండగా ఉప్పల వెంకటేష్.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

shine junior college

సోమవారం కల్వకుర్తి పట్టణంలోని ఇద్దరు నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రెండు కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేయశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు, పట్టణ అధ్యక్షుడు బావండ్ల మధు,మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం, తెలంగాణ జాగృతి అధ్యక్షుడు దారమోని గణేష్, భగత్ సింగ్, కనుక సత్యం,అల్లుడు కృష్ణ.కల్వకుర్తి ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్, ప్రధాన కార్యదర్శి సంబు ముత్యాలు,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పూరి రమేష్,ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండూరు కృష్ణయ్య, యువజన సంఘం అధ్యక్షుడు సంబు తరుణ్, కోశాధికారి గుండ్ల రేవంత్, సంఘం నాయకులు గందె రవి, బచ్చు మురళి,రాము, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం.

రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

shine junior college

జైపూర్ మండలం ఇందారం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది.రైతు వేదికల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ముఖ్య సూచనలు సలహాలు చేశారు.ఈ సందర్భంగా జైపూర్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 75 వేల కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మన రైతులు సుభిక్షంగా ఉండేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను ఇప్పటికి అమలు చేసి వివిధ రాష్ట్రాలకు ఒకదశ,దిశ చూపించారని అన్నారు. అదేవిధంగా రుణమాఫీ,సన్న ధాన్యానికి బోనస్,అన్ని రకాల పంటలకు మద్దతు ధర కొనుగోలు,అన్ని పంటలకు రాయితీపై సూక్ష్మ,సేంద్య పరికరాల సరఫరా వంటివి అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీవో శ్రీనివాసరావు,ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఏఈఓ మాళవిక,పంచాయతీ కార్యదర్శులు,ప్రజా ప్రతినిధులు,రైతులు ప్రజలు పాల్గొన్నారు.

ఝరాసంగం ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

ఝరాసంగం ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మండల కేంద్రంలో సోమవారము పేదలకు గ్రామ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ ఎంపీడీవో సుధాకర్ ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శేఖర్ పటేల్
గ్రామపంచాయతీ సెక్రెటరీ వీరన్న మాజీ సర్పంచ్ రుద్రప్ప పటేల్ మాజీ సర్పంచ్ పెంటయ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సయ్యద్ గోసుద్దీన్ అష్రఫ్ అలీ ల్యాఖత్ అలీ నిస్సార్ అహ్మద్ రాజేందర్ సింగ్ మొహమ్మద్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

మాదారంలో భూభారతి రేవన్యూ సదస్సు.

మాదారంలో భూభారతి రేవన్యూ సదస్సు

భూ సమస్యలపరిష్కారం కోసమే భూభారతి

ఎమ్మార్వో విజయలక్ష్మి

పరకాల నేటిధాత్రి

 

shine junior college

పట్టణంలోని మాదారం కాలనిలో ఎమ్మార్వో విజయలక్ష్మి ఆధ్వర్యంలో భూ భారతి రేవన్యూ సదస్సు ను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని,ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సుమన్ కుమార్,ఎంఆర్ఐ దామోదర్, సర్వేయర్ విజయకుమార్ మరియు రేవన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

యూట్యూబ్ స్టార్ కు ఘన సన్మానం.

యూట్యూబ్ స్టార్ కు ఘన సన్మానం

మల్లాపూర్ జూన్ 16 నేటి దాత్రి

shine junior college

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం, పాత దాంరాజుపల్లి, ముద్దుబిడ్డ అయినటువంటి జంగు రమ్య సుమన్ బావపూర్ (కే) విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు,వీరు మల్లాపూర్ కనక సోమేశ్వర టెంపుల్ కు వచ్చినారు, వాళ్లు ముఖ్యంగా వ్యవసాయం చేస్తూ వ్యవసాయానికి సంబంధించిన మంచి మంచి వీడియోలు చేస్తూ 3,46,000 సబ్స్క్రైబ్ ను సాధించి సిల్వర్ ప్లే బటన్ అనగా యూట్యూబ్ నుండి అవార్డు పొందారు, నేటి సమాజానికి మంచి మెసేజ్ అందిస్తూ విడియోలు తీస్తున్న సుమన్ రమ్య ,మల్లపూర్ ఎక్స్ ఎఎంసి పెద్దిరెడ్డి లక్ష్మన్ చిరు సన్మానం చేయడం జరిగింది,మాకిలి రాకేష్, రుద్రా రామ్ ప్రసాద్, ముద్దం సత్తన్న, ఎండీ రఫి భాయ్,ఉయ్యాల లక్ష్మన్,ఏనుగు వెంకట్ రెడ్డి,నల్ల లక్ పతి, దళిత రాజ్,దామెర ప్రశాంత్,జక్కుల వెంకటేష్, ఆవుసుల సాగర్, చిప్ప రాజేష్,రాచకొండ నర్సయ్య, ముస్కెరి బుమయ్య, తదితరులు పాల్గొన్నారు.

వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన.

వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన *
జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి

జమ్మికుంట :నేటిధాత్రి

shine junior college

ఈరోజు జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు గారు వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి తనిఖీ లో భాగంగా ఫార్మసీ రూమ్, ల్యాబ్ మరియు రికార్డులను పరిశీలించడం జరిగింది ఆరోగ్యశాఖ సిబ్బందికి క్రింది విషయాలపై దిశా నిర్దేశం చేశారు
అందులో
1.NCD క్లినిక్స్ ను పగడ్బందీగా నిర్వహించాలి అందులో ఎన్ సి డి పరీక్షలు హైపర్ టెన్షన్, డయాబెటిస్, బ్రెస్ట్ క్యాన్సర్ ,ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వంటి పరీక్షలు నిర్వహించాలి
2.లెప్రసి సర్వేను ఆశా కార్యకర్తలు ప్రతి గ్రామంలో విధిగా నిర్వహించి ప్రాథమిక దశలో గుర్తించాలిACF camp పెట్టి,Sputum Samples సేకరించాలి. అవసరం అనుకున్న వారికి Xray తీయించాలి.
3.ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్ర వారం తప్పనిసరిగా నిర్వహించాలని అందులో మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని
4.జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శుక్రవారం సభను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని
5.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని
6.వర్షాకాలంలో వచ్చే వ్యాధుల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీద ప్రజలకు అవగాహన కల్పించాలని
7.సిబ్బంది సమయపాలన పాటించాలని విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ABHA కార్ట్స్ ను ఇంప్రూవ్ చేయాలని ప్రజలందరూ ప్రభుత్వ వైద్యాన్ని వినియోగించుకోవాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ , హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ సదానందం,ఫార్మసిస్ట్ శ్రీధర్,ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు

ఆర్టీసీలో భద్రతతో పాటు సురక్షితం.

ఆర్టీసీలో భద్రతతో పాటు సురక్షితం
మల్లాపూర్ 16 నేటి ధాత్రి

 

shine junior college

ఆర్టీసీలో భద్రతతో పాటు సురక్షితం
మెట్‌పల్లి డిపో మేనేజర్ టి దేవరాజ్ మల్లాపూర్ మండలంలోని ముత్యంపేటలో సోమవారం మెట్‌పల్లి టీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ టి దేవరాజు గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ప్రయాణంలో భద్రతతో పాటు సురక్షిత గమ్యాన్ని చేరవచ్చు అన్నారు. అలాగే ప్రైవేట్ వాహనాలను హైదరాబాదు లాంటి దూర ప్రయాణాలకు రెంటుకు తీసుకువెళ్తే కనీసం ఐదువేల రూపాయలు ఖర్చవుతున్నాయని అదే ఆర్టీసీ ఎక్స్ప్రెస్, లగ్జరీ బస్సులలో హైదరాబాద్ వెళ్తే ఒక్కొక్కరికి 400 నుండి 500 రూపాయలు టికెట్కు అవుతున్నాయన్నారు. నూతనంగా ఖానాపూర్ నుండి వయా ఆర్మూర్ హైదరాబాద్ కు లగ్జరీ బస్సు ప్రారంభించామని ప్రయాణికులు ఈ బస్సును వినియోగించుకోవాలన్నారు. ఖానాపూర్ నుండి ఉదయం ఐదు గంటలకు వయా ఓబులాపూర్ మీదుగా మెట్‌పల్లి వచ్చి వయా ఆర్మూర్ నుండి హైదరాబాద్ వరకు నాన్ స్టాప్ గా వెళ్తుందన్నారు.

జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.

జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
మల్లాపూర్ జూన్ 16 నేటి ధాత్రి:

 

shine junior college


ప్రశ్నించే గొంతును నొక్కడం సరికాదు ప్రెస్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు కనుక సంజీవ్
జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసిల్దార్ రమేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు.ప్రెస్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు కనుక సంజీవ్, మల్లాపూర్ ప్రెస్ క్లబ్ 143 అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ…జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఏటువంటి సంబంధంలేని జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని జనంసాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు ఇచ్చి, అక్రమంగా ఎడిటర్ పై కేసులు పెట్టారన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కటం ఏమిటని మీడియా సభ్యులు మండిపడ్డారు. తక్షణమే జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులు తోకల పవన్, రుద్ర రాంప్రసాద్, చింతలూరి రంజిత్, తోట శేఖర్, మిడిదొడ్డి మల్లేష్, ఉడుగుల గంగాధర్, రాజేందర్, మోర సతీష్, తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా పథకంకు అర్హులైన వారు.

రైతు భరోసా పథకంకు అర్హులైన వారు పేర్లు నమోదు చేసుకోవాలి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

shine junior college

ఈనెల 5వ తేదీకి ముందు పట్టా పాస్ పుస్తకాలు పొంది ఉండి, రైతు భరోసా పథకంలో పేరు నమోదు కాని రైతులందరూ వారి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం తో సంబంధిత రైతు వేదికలో వ్యవసాయ విస్తరణాధికారి వద్ద పేరు నమోదు చేసుకోవాలని క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని ఐదవ వార్డ్ అమరవాది లో ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్ తెలిపారు. రైతు కార్డ్ తీసుకోనీ వారు కూడా సంబధిత అధికారులను కలిసి తీసుకోవాలని కోరారు. భూ సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని బత్తుల వేణు ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు
దాంక రమేష్ ,రోడ్డ రమేష్
క్యాతం పురుషోత్తం,రొడ్డ మల్లేష్, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల బోధనను.

భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల బోధనను సులభతరం చేస్తాయి

ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి.

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

shine junior college

మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో ప్రొఫెసర్ “జయశంకర్ బడిబాట “లో భాగంగా FLN LIP దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా ఉపాధ్యాయులు తయారుచేసిన భోధనాభ్యసన సామాగ్రి(TLM) వివిధ తరగతులలో ఆశించిన అభ్యసన ఫలితాల చార్థులు ప్రదర్శించి,వీటి గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఇట్టి ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల భోదన సులభతరం చెయ్యడమే కాకుండా,TLM ద్వారా భోదిస్తే విద్యార్థులు బడి పట్ల ఆకర్షితులై హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులచే గత సంవత్సరం వారు చదివిన కథల, పాఠ్య పుస్తకాలు చదివించి బాగా చదివిన వారికి “నేను బాగా చదువగలను “అనే గుర్తింపు బ్యాడ్జ్ తో అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాధిక, ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, నర్మదా, రాసూరి రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం.

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం

మెట్ పల్లి జూన్ 16 నేటి ధాత్రి

 

 

shine junior college

ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్సూరెన్స్ పాలసీ బాండ్ లు అందజేత
బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు
మెట్ పల్లి: జర్నలిస్టుల భద్రత కొరకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు అన్నారు. టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించగా ఆ పాలసీ బాండ్లను సోమవారం రోజు డాక్టర్ రఘు చేతుల మీదుగా జర్నలిస్టులకు అందజేయడం జరిగింది. డాక్టర్ రఘు మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం ఎంతో అభినందనీయం అని, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉన్న విలేకరులకు ప్రభుత్వం ద్వారా కూడా అందవలసిన సహాయ సహకారాల కోసం నేనెప్పుడూ పాటు పడుతా అని డాక్టర్ రఘు అన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ అధ్యక్షులు మాసుల ప్రవీణ్, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, అఫ్రోజ్,విజయసాగర్, సభ్యులు ఆదిల్ పాషా, ఆగ సురేష్,ఏసవేని గణేష్ ,ఎండి అభిద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి

రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college

 

సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కూలం కషంగా పరిశీలించి, పెండింగ్‌ ఉంచకుండా, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాభవన్ హైదరాబాద్ నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మూడు రోజులలో పరిష్కారం చూపాలని, తదుపరి నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులకు తగు చర్యలు నిమిత్తం ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో 53 దరఖాస్తులు వచ్చాయని వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, ఆర్డిఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికార్లు.

స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికార్లు

సిరిసిల్ల టౌన్ : ( నేటి ధాత్రి )

shine junior college

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో స్కానింగ్ సెంటర్ల ల్లో తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో రికార్డులను పరిశీలించి, స్కానింగ్ మిషన్ల తనిఖీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గర్భిణీ స్త్రీల వివరాలతో ఫారం ఎఫ్ ఆడిట్ లను పరిశీలించి, సి సెక్షన్ కాన్పులు తగ్గించి సాధారణ ప్రసవాలు ప్రోత్సహించవలసిందిగా సూచిస్తూ, లింగ నిర్ధారణ చేయడం నేరమని ఈ సందర్భంగా నిర్వాహకులకు తెలిపినారు. కార్యక్రమంలో డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్ పి ఓ ఎమ్ హెచ్ ఎన్, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెచ్.ఈ బాలయ్య పాల్గొన్నారు.

నెలకే తేలిన నాణ్యత.

నెలకే తేలిన నాణ్యత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

 

 

రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో తారు వేసిన నెల రోజులకే దారి గుంతలమయంగా మారింది. రాయికోడ్ నుంచి కప్పాడ్ వరకు ఆర్అండ్బై ఆధ్వర్యంలో మూడు కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేశారు. చాలా చోట్ల తారు లేచి.. కంకర తేలుతోంది. వర్షా నికి సైడ్ బర్న్స్ కోతకు గురవుతున్నాయి. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు చొరవచూపి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదా రులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version