కన్నప్ప కు రజనీ అభినందనలు.

కన్నప్ప కు రజనీ అభినందనలు…

 

shine junior college

దిగ్గజ నటులు రజనీకాంత్‌, మోహన్‌బాబు కలసి నటించిన ‘పెదరాయుడు’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 జూన్‌ 15న విడుదలైన ఆ చిత్రం సంచలన…

దిగ్గజ నటులు రజనీకాంత్‌, మోహన్‌బాబు కలసి నటించిన ‘పెదరాయుడు’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 జూన్‌ 15న విడుదలైన ఆ చిత్రం సంచలన విజయం సాధించి, వసూళ్ల చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆదివారం రజనీకాంత్‌ ఇంట్లో ఆయన్ని కలిశారు మోహన్‌బాబు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రాన్ని రజనీకాంత్‌ చూశారు. విష్ణుని అక్కున చేర్చుకుని సినిమా బాగుందంటూ అభినందించారు. ఈ ఆనందాన్ని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు విష్ణు. ‘ఈ క్షణం కోసమే 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నా నటనని రజనీ అంకుల్‌ మెచ్చుకోవాలని నా కల. అది ఇప్పుడు నెరవేరింది. ఈ రోజు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అని అందులో పేర్కొన్నారు. అలాగే మోహన్‌బాబు కూడా సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ‘ నేను నిర్మించిన ‘పెదరాయుడు’ చిత్రానికి 30 ఏళ్లు పూర్తైన రోజునే నా ప్రియ మిత్రుడు రజనీకాంత్‌ ‘కన్నప్ప’ చిత్రాన్ని తన కుటుంబ సభ్యులతో కలసి చూశారు. సినిమా చూసిన అనంతరం ఆయన కురిపించిన ప్రేమ, అభిమానం, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరచిపోలేను. థాంక్యూ మిత్రమా’ అని పేర్కొన్నారు. ‘కన్నప్ప’ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version