మాదిగ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

మాదిగ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
◆ – అబ్రహం మాదిగ

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలో దండోర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి అమరులైన మాదిగ అమరవీరులకు జహీరాబాద్ లోని స్థానిక అతిథి గృహంలో ‘ఉల్లాస్ మాదిగ’ ఎమ్మార్పిఎస్ జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఆద్వర్యంలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.

అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సాగిన ముప్పై యేండ్ల ఎమ్మార్పీఎస్ పోరాటం ఫలితంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించడం హర్షనీయమన్నారు. యావత్ మాదిగ జాతి మందకృష్ణ మాదిగ గారికి ఋణపడి ఉంటుందని అన్నారు. మాదిగ జాతి విజయం సాధించిన ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేస్తూ అమరులైన (అమృత్,ప్రకాష్,రవీందర్, బాలరాజ్,మొల్లప్ప,భూమన్ మధు,పద్మారావు) ఉద్యమ వీరులకు నివాళులు అర్పించడం మాదిగ బిడ్డలుగా మన నైతిక బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ఎంతో మంది త్యాగాలు ఉద్యమాన్ని విజయ తీరాలకు నడిపించాయని అన్నారు. వారు ఉద్యమమే ఊపిరిగా జీవించారని వారి స్ఫూర్తి, త్యాగం, అమరత్వం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని కొనియాడారు.
ఈ ముప్పై యేండ్ల కాలంలో ఎమ్మార్పిఎస్ ఉద్యమంలో జహీరాబాద్ నియోజకవర్గంలో పనిచేస్తూ చనిపోయిన మాదిగ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.జిల్లా వ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంలో పనిచేస్తూ అమరులైన కుటుంబాల వివరాలు సేకరిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు చొరవ తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో..నవీన్ కూమార్ ఎంజేఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి,అరుంధతి సంఘం నాయకులు రాంచందర్, జె జైరాజ్  ఎమ్మెఎస్పి నాయకులు జైరాజ్,పద్మారావు
ఆయా మండలాల అధ్యక్షులు టీంకు మాదిగ,మైకల్ రాజ్, రవికుమార్, నిర్మల్,మాదిగలు మరియు నాయాకులు సుకుమార్, శ్రీనివాస్,అజయ్, సుధాకర్,సునీల్,కిట్టు,అనిల్,పవన్,దయానంద్,ప్రశాంత్, రమేష్,షాలేం,సుదీష్  మాదిగలు తదితరులు పాల్గొన్నారు.

నా పాక ఆలయ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు.

నా పాక ఆలయ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో గల అతి ప్రాచీన గల నాపాక దేవాలయ ప్రాంగణంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ యాదడ్ల రాజయ్య తెలిపారు ఈ కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పలువురు రాజకీయ నాయకులు హాజరవుతారని తెలిపారు, ఈ ప్రాచీన ఆలయం రాష్ట్రంలో ఎక్కడ లేని విధానం ఒకే శిలపై నాలుగు ద్వారాలకు నాలుగు విగ్రహాలను రూపొందించి ఏకశిలపై గుడిని ప్రాచీన కట్టడాలతో నిర్మించి ఉన్న విశిష్ట గల దేవాలయం అని తెలిపారు ఈ ఆలయంలో రానున్న రోజుల్లో భూపాలపల్లి శాసనసభ్యుడు సహకారంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి జరిగేలా ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు సీతారాముల కళ్యాణం అనంతరం నృత్య రవళి కళాక్షేత్రం హనుమకొండ 40 మంది కళాకారులచే కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని మండలాల్లోని వివిధ గ్రామాల భక్తుల ప్రజలు సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు కృతజ్ఞతలు కాగలరని తెలిపారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/నేటి ధాత్రి

 

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం మాదాయ పల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప్పలా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఉప్పల వెంకటేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. రూ. 3 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ హైమావతి రామస్వామి, యాదయ్య, సుధాకర్, దశరథం, లక్ష్మీనారాయణ, పరంజ్యోతి, యాదయ్య, శేఖర్, యాదయ్య, పెంటయ్య, రామస్వామి, మైసయ్య, జంగయ్య, మైసయ్య, లక్ష్మయ్య, మల్లేష్, పరుశరాములు, పర్వతాలు, సత్యం, రాజు, రవి, కుమార్, భగవంతు, రమేష్, శ్రీశైలం, అశోక్, వినోద్, సతీష్, ప్రశాంత్, గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పైసా వసూల్.  

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పైసా వసూల్.  

• కంప్యూటర్ ఆపరేటరే బాస్

• సైకం పదందే ఫైల్ కదలదు

• ప్రతి పనికో రేటు లేదంటే పని లేటు

• కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు దాన్ని లంచంతో కొనొద్దు..’అంటూ రాగూర్ సినిమాలోని ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ సినిమా చూసినంత వరకే అవినీతిపై పోరాడాలనే భావన ప్రజల్లో ఉంటుంది. ఆ తర్వాత షరా మామూలే. లంచం తీసుకోవడం ఎంత నేరమో… లంచం ఇవ్వడం అంతకన్నా పెద్ద నేరం. అభివృద్ధికి, మంచి పరిపాలనకు ప్రధాన శత్రువు ఎవరో కాదు.. అవినీతి. అలాంటి అవినీతిని నిరోధిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. ఎంత చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మారడం లేదు.

డబ్బులు ఇస్తే కానీ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. ప్రతీ పనికి ఒక రేటు రెడ్డి డబ్బు ముట్టేవరకు బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వసూళ్ల దందా..

జహీరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యలయంలో ముడుపులు లేనిదే ఎటువంటి మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సవీస్ రెడ్డి మధ్యవర్తిత్వం (మీడియడటర్ ‘గా నడిపిస్తున్నారు. రేషన్ కార్డు లో పేరు తొలగించలన్న, ఓటరు ఐడి నమోదు చేయాలన్న, భూముల రిజిస్ట్రేషన్లు చేయాలన్న ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించాల్సి తాహసిల్దార్ కార్యాలయంలో పని కావాలంటే ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించి ఏ పనికి ఎంత లంచం ఇ్యూలో మాట్లాడిన తర్వాత ఆపరేటర్ తాహల్దారును .సంప్రదించి రేటు ఓకే అయితే వసులు ప్రారంభిస్తారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. 2024 మొగుడంపల్లి శివారులో ఉన్నా ఆరు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయనుంటే భూమి కోర్టు కేసులో ఉందని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఆఫీస్ సమయం అయిపోగానే రూ.20 వేలు బందం తీసుకొని వని పూర్తి చేసినట్లు బాధితుడు నెప్తున్నాడు. ఈమధ్య రేషన్ కార్డు లోని పేరు. తొలగించడానికి రూ.2 వెలు తీసుకున్నట్లు మరో బాధితుడు ఆరోపిస్తున్నారు. రూ.3 వేలు తీసుకున్నట్లు తన దగ్గర ఆధారం ఉందని నరదు బాధితుడు తెలిపాడు. కార్యాలయంలో ఎ రికార్డ్ అవసరం ఉన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదు తహసిల్దార్ వెవితనే. చేస్తున్నానని చెబుతున్నట్లు సంబంధిత బాధితులు ఆరోపించాడు. దాలాకాలంగా తహసిల్దార్ కార్యాలయంలో ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నట్లు మొగుడంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి బంచాల బారి నుంచి తమసు రక్షించాలని మొగుడం పల్లి మండల వాడితులు కోరుతున్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో ఆపరేటరే బాస్..

పనులు జరగడం లేదని కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొగుడంపల్లీ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇవ్వనిదే అక్కడ ఏ పసులు జరగవని ఆవేదన వ్యక్షం చేస్తున్నారు. దీంతో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అటెండర్ నుంచి మొదలు పెడితే అధికారులు వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలల పరిధిలో ధనిసి౦ గ్రామంలో ఉన్న ఆహార భద్రతా కార్డులో నుండి పేరును తొలగించటానికి వెయ్యి నుండి అయిదు వేల వరకు దందుకున్నట్లు ప్రజల ఆరోపిస్తున్నారు. మరో అధికారి కిందిస్థాయి అధికారైనప్పటికీ అంతే కానే వడిపిస్తున్నట్టు ప్రతి పనికి రేటు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు.

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పైసా వసూల్

• కంప్యూటర్ ఆపరేటరే బాస్

• సైకం పదందే ఫైల్ కదలదు

• ప్రతి పనికో రేటు లేదంటే పని లేటు

• కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు

జహీరాబాద్. నేటి ధాత్రి:

ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు దాన్ని లంచంతో కొనొద్దు..’అంటూ రాగూర్ సినిమాలోని ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ సినిమా చూసినంత వరకే అవినీతిపై పోరాడాలనే భావన ప్రజల్లో ఉంటుంది. ఆ తర్వాత షరా మామూలే. లంచం తీసుకోవడం ఎంత నేరమో… లంచం ఇవ్వడం అంతకన్నా పెద్ద నేరం. అభివృద్ధికి, మంచి పరిపాలనకు ప్రధాన శత్రువు ఎవరో కాదు.. అవినీతి. అలాంటి అవినీతిని నిరోధిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. ఎంత చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మారడం లేదు.

డబ్బులు ఇస్తే కానీ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. ప్రతీ పనికి ఒక రేటు రెడ్డి డబ్బు ముట్టేవరకు బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వసూళ్ల దందా..

జహీరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యలయంలో ముడుపులు లేనిదే ఎటువంటి మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సవీస్ రెడ్డి మధ్యవర్తిత్వం (మీడియడటర్ ‘గా నడిపిస్తున్నారు. రేషన్ కార్డు లో పేరు తొలగించలన్న, ఓటరు ఐడి నమోదు చేయాలన్న, భూముల రిజిస్ట్రేషన్లు చేయాలన్న ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించాల్సి తాహసిల్దార్ కార్యాలయంలో పని కావాలంటే ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించి ఏ పనికి ఎంత లంచం ఇ్యూలో మాట్లాడిన తర్వాత ఆపరేటర్ తాహల్దారును .సంప్రదించి రేటు ఓకే అయితే వసులు ప్రారంభిస్తారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. 2024 మొగుడంపల్లి శివారులో ఉన్నా ఆరు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయనుంటే భూమి కోర్టు కేసులో ఉందని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఆఫీస్ సమయం అయిపోగానే రూ.20 వేలు బందం తీసుకొని వని పూర్తి చేసినట్లు బాధితుడు నెప్తున్నాడు. ఈమధ్య రేషన్ కార్డు లోని పేరు. తొలగించడానికి రూ.2 వెలు తీసుకున్నట్లు మరో బాధితుడు ఆరోపిస్తున్నారు. రూ.3 వేలు తీసుకున్నట్లు తన దగ్గర ఆధారం ఉందని నరదు బాధితుడు తెలిపాడు. కార్యాలయంలో ఎ రికార్డ్ అవసరం ఉన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదు తహసిల్దార్ వెవితనే. చేస్తున్నానని చెబుతున్నట్లు సంబంధిత బాధితులు ఆరోపించాడు. దాలాకాలంగా తహసిల్దార్ కార్యాలయంలో ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నట్లు మొగుడంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి బంచాల బారి నుంచి తమసు రక్షించాలని మొగుడం పల్లి మండల వాడితులు కోరుతున్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో ఆపరేటరే బాస్..

పనులు జరగడం లేదని కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొగుడంపల్లీ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇవ్వనిదే అక్కడ ఏ పసులు జరగవని ఆవేదన వ్యక్షం చేస్తున్నారు. దీంతో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అటెండర్ నుంచి మొదలు పెడితే అధికారులు వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలల పరిధిలో ధనిసి౦ గ్రామంలో ఉన్న ఆహార భద్రతా కార్డులో నుండి పేరును తొలగించటానికి వెయ్యి నుండి అయిదు వేల వరకు దందుకున్నట్లు ప్రజల ఆరోపిస్తున్నారు. మరో అధికారి కిందిస్థాయి అధికారైనప్పటికీ అంతే కానే వడిపిస్తున్నట్టు ప్రతి పనికి రేటు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు.

• కంప్యూటర్ ఆపరేటరే బాస్

• సైకం పదందే ఫైల్ కదలదు

• ప్రతి పనికో రేటు లేదంటే పని లేటు

• కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు

జహీరాబాద్. నేటి ధాత్రి:

ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు దాన్ని లంచంతో కొనొద్దు..’అంటూ రాగూర్ సినిమాలోని ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ సినిమా చూసినంత వరకే అవినీతిపై పోరాడాలనే భావన ప్రజల్లో ఉంటుంది. ఆ తర్వాత షరా మామూలే. లంచం తీసుకోవడం ఎంత నేరమో… లంచం ఇవ్వడం అంతకన్నా పెద్ద నేరం. అభివృద్ధికి, మంచి పరిపాలనకు ప్రధాన శత్రువు ఎవరో కాదు.. అవినీతి. అలాంటి అవినీతిని నిరోధిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. ఎంత చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మారడం లేదు.

డబ్బులు ఇస్తే కానీ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. ప్రతీ పనికి ఒక రేటు రెడ్డి డబ్బు ముట్టేవరకు బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వసూళ్ల దందా..

జహీరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యలయంలో ముడుపులు లేనిదే ఎటువంటి మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సవీస్ రెడ్డి మధ్యవర్తిత్వం (మీడియడటర్ ‘గా నడిపిస్తున్నారు. రేషన్ కార్డు లో పేరు తొలగించలన్న, ఓటరు ఐడి నమోదు చేయాలన్న, భూముల రిజిస్ట్రేషన్లు చేయాలన్న ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించాల్సి తాహసిల్దార్ కార్యాలయంలో పని కావాలంటే ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించి ఏ పనికి ఎంత లంచం ఇ్యూలో మాట్లాడిన తర్వాత ఆపరేటర్ తాహల్దారును .సంప్రదించి రేటు ఓకే అయితే వసులు ప్రారంభిస్తారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. 2024 మొగుడంపల్లి శివారులో ఉన్నా ఆరు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయనుంటే భూమి కోర్టు కేసులో ఉందని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఆఫీస్ సమయం అయిపోగానే రూ.20 వేలు బందం తీసుకొని వని పూర్తి చేసినట్లు బాధితుడు నెప్తున్నాడు. ఈమధ్య రేషన్ కార్డు లోని పేరు. తొలగించడానికి రూ.2 వెలు తీసుకున్నట్లు మరో బాధితుడు ఆరోపిస్తున్నారు. రూ.3 వేలు తీసుకున్నట్లు తన దగ్గర ఆధారం ఉందని నరదు బాధితుడు తెలిపాడు. కార్యాలయంలో ఎ రికార్డ్ అవసరం ఉన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదు తహసిల్దార్ వెవితనే. చేస్తున్నానని చెబుతున్నట్లు సంబంధిత బాధితులు ఆరోపించాడు. దాలాకాలంగా తహసిల్దార్ కార్యాలయంలో ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నట్లు మొగుడంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి బంచాల బారి నుంచి తమసు రక్షించాలని మొగుడం పల్లి మండల వాడితులు కోరుతున్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో ఆపరేటరే బాస్..

పనులు జరగడం లేదని కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొగుడంపల్లీ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇవ్వనిదే అక్కడ ఏ పసులు జరగవని ఆవేదన వ్యక్షం చేస్తున్నారు. దీంతో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అటెండర్ నుంచి మొదలు పెడితే అధికారులు వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలల పరిధిలో ధనిసి౦ గ్రామంలో ఉన్న ఆహార భద్రతా కార్డులో నుండి పేరును తొలగించటానికి వెయ్యి నుండి అయిదు వేల వరకు దందుకున్నట్లు ప్రజల ఆరోపిస్తున్నారు. మరో అధికారి కిందిస్థాయి అధికారైనప్పటికీ అంతే కానే వడిపిస్తున్నట్టు ప్రతి పనికి రేటు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జైబాపు, జై భీమ్, జైసం విధాన్ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు

శాయంపేట నేటిధాత్రి:

MLA lays foundation stone for construction of Indiramma’s houses

శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు పాల్గొన్నారు. రైస్ మిల్లు నుండి అంబేద్కర్ కూడలి వరకు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మనదేశ రాజ్యాంగం అమలు లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాం క్షలు నెరవేరటంలేదని, ప్రధా నికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్,గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్రగ్రంథమన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగా న్ని బీజేపీపార్టీ అనగాదొక్కా లని చూస్తుందని అన్నారు అమిత్ షా అంబెడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించాలని అన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాల ను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు

 

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. గట్లకానిపర్తి గ్రామంలో ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు న్న పథకాలలో ఒకటి ఇందిర మ్మ ఇండ్లు అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఉన్నవా రికి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకం ఉపయోగిం చుకోవాలని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. గత పదేళ్ల నుండి నిరుపేదలకు గత ప్రభుత్వం ఇళ్లను ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమా లల్లో వివిధ శాఖల అధికా రులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

7న కేతకి ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం.

7న కేతకి ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం

జహీరాబాద్ నేటివ్ ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం లోని ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారం ఈనెల 7న నిర్వహించనున్నట్టు తెలిపారు గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న పాలకమండలి ప్రమాణ స్వీకారం ఈనెల 7తో జరగనుంది అని తెలిసింది.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణం 9వ వార్డు (సర్ధాపూర్, జెగ్గరావుపల్లె) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి గారు గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ గారు.

 

Ration shop.

బాలకీస్టాయ్య, యాదయ్యా,రాజనర్సు,కనకయ్య,రాములు,ఉపేందర్, షాధుల్, అంజయ్య, తిరుపతి, మోఫిక్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు..

రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి.

రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి

★గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించిన జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

టీపీసీసీ ఏక్సిక్యూటివ్ మెంబెర్ ధనాలక్మి
కోహిర్ మండలంలోని పిచరాగాడి గ్రామంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ” రాజ్యాంగ పరిరక్షణ సన్నాక సమావేశం మరియు పాదయాత్ర నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్. మరియు టిపిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ధనలక్ష్మి కోహిర్ మండల పార్టీ అధ్యక్షులు రామలింగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుని హక్కు అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నామని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క విలువలు రాజ్యాంగ స్ఫూర్తిని గ్రామ ప్రజలకు వివరించారు. యాత్రలో పాల్గొన్న ప్రజలందరికీ మాజీ మంత్రి గారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్షద్ గ్రామ పార్టీ అధ్యక్షులు వీర రెడ్డి,కోహిర్ టౌన్ అధ్యక్షులు.శంషీర్,మాజీ ఎంపిపి షౌకత్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజమ్మిల్,బాడంపేట్ ఆలయ కమిటీ చైర్మన్ దయానంద పాటిల్, మాజీ సర్పంచ్ అంజయ్య ,మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవాలి.

సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని జహీరాబాద్ లోని ఫరీద్ నగర్ కాలనీలో రేషన్ షాప్ నెంబర్ 46 వాడు ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇస్మాయిల్ ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే అన్నారు. ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా, పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేస్తామని తెలిపారు. బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రమేష్ బాబు అజీమ్ రాజు ఉస్మాన్ రబ్బానీ డీలర్ అధికారులు, మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మూడు నెలలుగా జీతాలు ల్లేవ్….

మూడు నెలలుగా జీతాలు ల్లేవ్….

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల అవస్థలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో మూడు నెలలుగా జీతాలు లేక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నో అవ స్థలు పడుతున్నారు. ఉగాది పండుగ జరుపుకోవడా నికి కూడా చేతిలో రూపాయి లేకుండా పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. పండగ రోజున భార్య పిల్లలకు ఏమీ కొనివ్వలేని పరిస్థితులు ఎదు ర్కుంటున్నామని వాపోతున్నారు. పని దగ్గరికి వెళ్తే అక్కడ కూలీలతో ఎన్నో అవస్థలు ఉంటున్నాయని. సమయానికి సర్వర్ రాదు ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని చెప్తున్నారు. రోజురోజుకు పెరుగుతు. న్న ఎండ తీవ్రత కూడా సమస్యగా మారిందన్నారు. ఒకే వ్యవస్థలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు ఆఫీసులో పని చేసే వారికి, ప్రతి నెల జీతాలు ఇస్తు న్నారు కానీ ఎండలో కూలీలతో కలిసి పనిచేస్తున్న తమకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గత ప్రభుత్వంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్యాయ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మూడు నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

పంటల కోతలు వాయిదా వేసుకోవాలి.

పంటల కోతలు వాయిదా వేసుకోవాలి.

మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం.

నర్సంపేట ఏ.డీ.ఏ దామోదర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

Crop harvesting should be postponed.

వాతావరణంలో వచ్చిన మార్పులు నేపథ్యంలో మొక్కజొన్న, ఎండుమిర్చి, ఇతర పంటల కోతల నిర్వహణ పనులను వాయిదా వేసుకోవాలని నర్సంపేట డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కే. దామోదర్ రెడ్డి రైతులను కోరారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ అకస్మాత్తుగా వచ్చిన వాతావరణ మార్పుల్లో మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

 

వరంగల్ జిల్లా పరిధి పలు ప్రాంతాలతో పాటు నర్సంపేట డివిజన్ లోని 6 మండలాలకు మూడు రోజులపాటు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.కోత దశలో ఉన్న మొక్కజొన్న,ఎండుమిర్చి, ఇతర పంటల కోత మరొక రెండు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.ఇప్పటికే కోసిన మొక్కజొన్న,ఎండుమిర్చి పంట ఇతర ఉత్పత్తుల పట్ల అప్రమత్తమై ఇళ్లల్లో జాగ్రత్తగా తడవకుండా భద్రపరచుకోవాలని అన్నారు.ఒకవేళ కల్లాలలో ఉన్నచో వాటినిటార్పాలిన్లతో తగువిధంగా భద్రపరచుకొనుటకు పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాలని ఏటియ దామోదర్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.

జిల్లా ఎస్పీ ని కలిసిన పెబ్బేరు నూతన ఎస్సై.

జిల్లా ఎస్పీ ని కలిసిన పెబ్బేరు నూతన ఎస్సై గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి :

 

గురువారం నూతన పెబ్బేరు ఎస్సై గంగిరెడ్డి యుగంధర్ రెడ్డివనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలోజిల్లాఎస్పీ రావుల గిరిధర్నుమర్యాదపూర్వకంగాకలిస పుష్పగుచ్చం అందజేశారురు ఈ సందర్భంగ ఎస్పీ మాట్లాడుతూవిధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు
జి,యుగంధర్ రెడ్డి వనపర్తి జిల్లా పెద్దమందడి పోలీస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ పెబ్బేరుకు బదిలీపై వచ్చారు.పెబ్బేరు ఎస్సైగా పనిచేసిన హరిప్రసాద్ రెడ్డి వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయానికి బదిలీపై వెళ్ళారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పెబ్బేరు ప్రజలు సహకరించాలని నూతన ఎస్సై యుగందర్ రెడ్డి  ప్రజలను కోరారు.

ఉచిత మెగా వైద్య శిబిరం.

ఉచిత మెగా వైద్య శిబిరం

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండల పరిధిలోని బచ్చరాజ్ పల్లి గ్రామంలో గురువారం మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రముఖ సంఘ సేవకుడు గట్టు ప్రశాంత్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ,షుగర్, థైరాయిడ్, మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించి గ్రామంలోని సుమారు 200 మందికి ఉచిత టాబ్లెట్లు అందించారు. అవసరమైన వారికి 60 మందికి పైగా చెవి ముక్కు,గొంతు,థైరాయిడ్, గర్భసంచి, శరీర సంబంధ వ్యాధులకు గాను ఉచితంగా ఆపరేషన్ చేయించడానికి వీలుగా మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత బస్సు ప్రయాణం ఉచిత ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.క్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుకు గట్టు ప్రశాంత్,ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాములు, మల్లారెడ్డి హాస్పిటల్ బృందం డాక్టర్ అఖిలేష్,భవ్య,స్టాఫ్ నర్స్ లు అరుణ,ప్రవణి,ఫార్మా అంకిత,మార్కెటింగ్ మేనేజర్ ఎండి.మహమ్మద్,నాగప్ప, గ్రామస్తులు అంజయ్య,నక్క రవి,బోడపట్ల శ్రీనివాస్, హంసమ్మ,పాల్గొన్నారు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు

నిజాంపేట, నేటి ధాత్రి

 

చలో HCU కార్యక్రమానికి తరలిన ఏబీవీపీ విద్యార్థి నాయకులను నిజాంపేట పోలీసులు ముందస్తుగా అక్రమ అరెస్టులుచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) భూములను కాపాడేందుకు పోరాడుతున్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమన్నారు.
క్యాంపస్‌లో 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఇందిరమ్మ పాలనలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై దమనకాండ ఆపాలని
HCU భూములను రక్షించాలన్నారు.
విద్యార్థుల గొంతును నొక్కాలని చూస్తే, తెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం మరింత మిన్నంటుతుంది! రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువత ఏకమై ప్రభుత్వంపై ప్రతిఘటన తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే .

వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే .

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

ఈరోజు తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో శ్రీ మహాలక్ష్మి గోదాసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తృతీయ బ్రహ్మోత్సవాలకు ( జాతార) సందర్భంగా స్వామి వారి కల్యాణ మహోత్సవం లో పాల్గొన్న మన ప్రియతమ నేత ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.

అలాగే ఆవంచ గ్రామంలో మహా గణపతి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు,మండల నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు.

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు.  

 

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, దేవరుప్పుల మండల పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి హాజరై, దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అన్యాయానికి వ్యతిరేకంగా, రైతుల హక్కుల కోసం పోరాడిన వీరయోధుడు. ఆయన చూపిన మార్గంలో నడిచి, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు రైతుల భద్రతకు కల్పించిన అద్భుత సంక్షేమ కార్యక్రమాలు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వారి జీవనోపాధిని మరింత మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అని పేర్కొన్నారు. అదనంగా, రైతులు అన్నదాతలు వారికి గౌరవం కల్పించడం మన బాధ్యత. దొడ్డి కొమురయ్య వంటి పోరాట యోధుల త్యాగాల వల్లే ఈ రోజు రైతులు హక్కులు పొంద గలుగుతున్నారు. ఈ త్యాగాలను గుర్తుంచుకుని, ప్రతి రైతు సంక్షేమానికి పాటుపడాలి అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రాంతీయ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తూ, రైతు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే  పిలుపునిచ్చారు.

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాట సరికాదు.

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాట సరికాదు

నర్సంపేట,నేటిధాత్రి:

 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలంపాట వేయడం సరికాదని ఎబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ ఆరోపించారు.

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించగా అనంతరం నరేష్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం పాట ద్వారా అమ్మే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

యూనివర్సిటీ అభివృద్ధి కోసం పని చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ భూములు అమ్మి విద్యార్థులకు నష్టం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.

యూనివర్సిటీ భూమి రక్షించుకునేందుకు విద్యార్థి నాయకులు ధర్నాలు నిర్వహిస్తున్న క్రమంలో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసి, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం సరికాదని అవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకొని సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఈశ్వర్, రాజేష్ చింటూ, నాగరాజ్, ప్రమోద్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే.. పేదలకు సంక్షేమ పథకాలు

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామంలో గురువారం.. ఏఐసీసీ ఆదేశాల మేరకు.. జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామంలో పాదయాత్రగా వెళ్లి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..

బూర్గుల గ్రామం నుండి హేమాజీపూర్ గ్రామానికి రూ. 1 కోటి 62 లక్షలతో బీటీ రోడ్డు మరమ్మత్తులు చేపడతామని, భవిష్యత్తులో డబుల్ బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

హేమాజీపూర్ గ్రామంలో అసంపూర్తిగా ఆగిపోయిన గ్రామపంచాయతీ, కమ్యూనిటీ హాల్, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

Congress

 

అనంతరం బిల్డింగ్ తండా, కోయిలకుంట తండా నేల బండ తండా, లింగారం, గాంధీ పాలెం తండాలలో పాదయాత్ర సాగింది.

గాంధీ పాలెంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు.

అంగరంగ వైభవంగా.కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు*

 

రాయికల్ నేటి ధాత్రి. ఏప్రిల్ రాయికల్.పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ “విరించి-2025″వార్షికోత్సవ వేడుకలను గురువారం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ….. పాఠశాలల్లో వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలోని ప్రతిభ పాటవాలు వెలికి తీయడానికి దోహదపడతాయని అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో రాణించాలన్నారు. విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్న శిఖరాలను అధిరోహించాలని,సోషల్ మీడియాలకు బానిసలు కాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యమని అన్నారు.వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు పలు సందేశాత్మకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు,కరాటే,పౌరాణిక దేశభక్తి నృత్యాలతో పలువురిని అబ్బురపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు,డైరెక్టర్ జూపల్లి తిరుపతిరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రైతులను వెంటాడుతున్న అగ్గి తెగులు…

రైతులను వెంటాడుతున్న అగ్గి తెగులు…

– మరోవైపు అకాల వర్షం…

– దిక్కు తోచని స్థితిలో రైతన్నలు…

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

 

రైతులు వేసిన వరి పంటలో అగ్గి తెగులు, మెడ విరుపు రోగాలు, మరోవైపు అకాల వర్షం రావడంతో రైతన్నలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చూసి సంతోషంగా ఉండాల్సిన రైతన్నలకు ఒకవైపు, వరి వేసిన తర్వాత పొట్ట కచ్చిన వరి భూగర్భ జలాలు అడుగంటిపోయి నీరు అందక కొందరి రైతుల పొలాలు ఎండిపోయి రైతులు విలువలాడుతున్నారు.

మరోవైపు వరి ఈ నిన దశలో మెడవిపు రావడంతో రైతులు స్ప్రే మందులకే పరిమితమై పోతున్నారు.

మరోవైపు అకాల వర్షం ఈదు గాలులు రైతులను వెంటాడుతున్నాయి.

Farmers

 

అన్నమొ రామచంద్ర అంటూ అలమటిస్తు, దిక్కు తోచని స్థితిలో రైతులు అప్పుల పాలవుతున్నారు.

అయ్యో ఈ బాధ మాకేనా మా బాధ ఎవరికి చెప్పుకోలే దేవుడా అంటూ నెత్తికి చేయి పెట్టుకొని అలమటిస్తూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version