వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే .!

దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునందుకొని తాను సైతం దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్

గంగాధర నేటిధాత్రి :

 

 

నేను భారతీయుడను- నేను భారత సైన్యానికి మద్దతుగా నిలబడతానని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చిందన్నారు. సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. దేశ ప్రజలు గర్వించే విజయాలను అందిస్తున్న భారత సైన్యానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ, తమ కర్తవ్యం గా దేశ రక్షణ నిధికి ప్రజా ప్రతినిధులు ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు విరాళం అందజేసినట్లు తెలిపారు.పహాల్గంలో అమాయక ప్రజల ఉసురు తీసి విర్రవీగుతున్న ఉగ్రముకలు, వారిని భారతదేశం పైకి ఉసిగలిపిన పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీకి భారతదేశ పౌరులు మద్దతుగా నిలబడే సమయం వచ్చిందన్నారు. నేను భారతీయుడిని, దేశ సరిహద్దుల్లో విరోచితంగా పోరాడుతున్న భారత వీర జవాన్లకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమకు తోచిన విధంగా దేశ రక్షణ నిధికి విరాళం అందజేయాలని సూచించారు.

మూడు నెలలుగా జీతాలు ల్లేవ్….

మూడు నెలలుగా జీతాలు ల్లేవ్….

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల అవస్థలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో మూడు నెలలుగా జీతాలు లేక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నో అవ స్థలు పడుతున్నారు. ఉగాది పండుగ జరుపుకోవడా నికి కూడా చేతిలో రూపాయి లేకుండా పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. పండగ రోజున భార్య పిల్లలకు ఏమీ కొనివ్వలేని పరిస్థితులు ఎదు ర్కుంటున్నామని వాపోతున్నారు. పని దగ్గరికి వెళ్తే అక్కడ కూలీలతో ఎన్నో అవస్థలు ఉంటున్నాయని. సమయానికి సర్వర్ రాదు ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని చెప్తున్నారు. రోజురోజుకు పెరుగుతు. న్న ఎండ తీవ్రత కూడా సమస్యగా మారిందన్నారు. ఒకే వ్యవస్థలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు ఆఫీసులో పని చేసే వారికి, ప్రతి నెల జీతాలు ఇస్తు న్నారు కానీ ఎండలో కూలీలతో కలిసి పనిచేస్తున్న తమకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గత ప్రభుత్వంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్యాయ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మూడు నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version