దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎమ్మెల్యే జిఎస్ఆర్.

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి:

దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
గురువారం ఐడిఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అలింకో వారి సహాయంతో
దివ్యాంగులకు సహాయ ఉపకరణముల పంపిణి
శిభిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిడబ్ల్యూఓ మల్లేశ్వరి ప్రారంభించారు అనంతరం దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాలలో ముందుండాలని దివ్యాంగులకు అద్భుతమైన తెలివి తేటలు, ప్రతిభా పాఠవాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో దివ్యాంగులకు ప్రత్యేక కోట ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా బలపడేందుకు తోడ్పడతామని అన్నారు. జైపాల్ రెడ్డి దివ్యాన్ గుడు అయినప్పటికి సుదీర్ఘ కాలం పాటు రాజకీయ నాయకుడుగా ప్రజలకు సేవలు అందించారని అన్నారు. లోకల్ బాడి ఎన్నికల్లో సైతం దివ్యాంగుల ప్రజాసేవలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.
అలీంకో సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా 204 భూపాలపల్లి నియోజక వర్గంలో 154 దివ్యాంగులకు 21 రకాల వివిధ సహాయ ఉపకరణాలు అందించడం జరుగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ అమృతం పథకం ద్వారా జిల్లాలో 8640 మంది 14 నుండి 18 సంవత్సరాల వయసు గల కిషోర బాలికలను గుర్తించి వారిని రక్త హీనత నుండి కాపాడడి, సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తయారు చేసేందుకు పల్లి పట్టీలు, మిల్లెట్ పట్టీలు, నెలకు రెండుసార్లు అందించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆరోగ్య పరిరక్షణ లి భాగంగా ప్రభుత్వం ఇందిరమ్మ అమృతం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం దివ్యాన్గులకు ఉప కరణాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,
విజయలక్ష్మీ,
డిడబ్ల్యూఓ మల్లేశ్వరి, ఆలిం కో ప్రోస్టేటిక్ అండ్ ఆర్థోటిస్ట్ రష్మీ రాజన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది.

ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది

 

 

 

 

అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతున్న…

 

అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇటీవలే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించింది. ఈ సందర్భంగా రవిశంకర్‌ మాట్లాడుతూ ‘సినిమా విజువల్‌గా చాలా బాగుంది. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది. ఒక అమ్మాయి జీవిత ప్రయాణమే ‘8 వసంతాలు’ సినిమాగా మీ ముందుకొస్తోంది. తప్పకుండా మీకు నచ్చుతుంది’ అన్నారు. ‘ఇది చాలా డిఫరెంట్‌ మూవీ. కథ బాగా నచ్చి మేము చేసిన ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని నవీన్‌ యెర్నేని అన్నారు. ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ ‘మా నిర్మాతలు ఒక మంచి కథతో వస్తే సినిమా తీస్తారు అనే దానికి మా ‘8 వసంతాలు’ చిత్రం ఓ నిదర్శనం. ఈ సినిమాతో ఒక మంచి చిత్రాన్ని నిర్మించారనే పేరు వారికి వస్తుంది. అనంతిక నటన ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణ’ అని అన్నారు. అనంతిక మాట్లాడుతూ ‘మైత్రీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. ఫణీంద్ర గారి వల్ల ఈ సినిమాలో ఒక బలమైన పాత్రను చేశాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం’ అన్నారు.

మహేశ్‌ సినిమా… ఎంతైనా తగ్గేదేలే..

మహేశ్‌ సినిమా… ఎంతైనా తగ్గేదేలే..

 

 

 

 

గుణశేఖర్‌ తర్వాత అలా భారీతనంతో సెట్స్‌ వేయడంలో రాజమౌళి (SS Rajamouli) ఘనాపాటి. అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్య్టా ఎలాంటి సమస్య లేదు. బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు

 

బాలీవుడ్‌లో భారీ కాన్వాస్‌ కథలు, సెట్లు, కళాత్మక పంథాలో చిత్రాలను తెరకెక్కించడం అంటే గుర్తొచ్చే పేరు సంజయ్‌ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali).

దేవదాస్‌ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్‌తో భారీ సెట్‌ నిర్మించారని అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు.

అది తెరపై కనిపించింది.

ఆయన తీసే సినిమా బడ్జెట్‌లో 15 నుంచి 35 కోట్లు సెట్స్‌ కోసం ఖర్చవుతుంది.

బాజీరావు మస్తానీ, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ సాయో, రామ్‌ లీలా, హీరామండి ఇవన్నీ ఆ కోవకు చెందినవే.

అలాగే టాలీవుడ్‌ అలా భారీ సెట్స్‌ వేసే అలవాటు దర్శకుడు గుణశేఖర్‌కు (Guna sekhar) ఉంది.

ఎందుకంటే ఆయన ఎంచుకునే కథల స్పాన్‌ అలా ఉంటుంది.

ఒక్కడు, వరుడు సహా చాలా సినిమాలకు గుణశేఖర్‌ భారీతనంతో నిండిన సెట్స్‌కు కోట్లు ఖర్చు చేశారు.

రుద్రమదేవి లాంటి సినిమా కోసం పూర్తి స్థాయి బడ్జెట్‌ లభించకపోవడంతో ఆ సినిమా అవుట్‌పుట్‌ కాస్త డల్‌గా వచ్చింది.

ఆయన తర్వాత అలా భారీతనంతో సెట్స్‌ వేయడంలో రాజమౌళి (SS Rajamouli) ఘనాపాటి.

అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్య్టా ఎలాంటి సమస్య లేదు.

బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు.

ఇప్పుడు మహేశ్‌ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మిస్తున్నారని తెలిసింది.

ప్రస్తుతం ఆయన మహేష్‌ కథానాయకుడిగా ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB 29) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వారణాసిలో కీలక షెడ్యూల్‌ చేయాలట.

నిజానికి గంగానది ఒడ్డున రియల్‌ లొకేషన్లలో ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాలంటే సవాల్‌తో కూడిన విషయమే!  

పోలీసుల నుంచి అనుమతులు పొందడం అంత సులువు కాదు.

దాంతోపాటు ప్రజలు,  ప్రజల నుంచి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.

అది కష్టంతో కూడిన పని కావడంతో రాజమౌళి వారణాసిని తలపించే భారీ సెట్‌ని నిర్మించాలని ప్లాన్‌ చేసినట్టు తెలిసింది.

వారణాసిలో దేవాలయాలు, ఘాట్‌లతో ఆధ్యాత్మికత నిండిన ప్రాంతంగా ఉంటుంది.

అలాంటి నగరాన్ని నిర్మించాలనే ఆలోచన సవాళ్లతో కూడుకున్నదే! తెరపై ఒరిజినాలిటీ చూపించాలి.

దాని కోసం రాజమౌళి టీమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌తో కసరత్తులు చేస్తున్నారని తెలిసింది.

  పర్వతాలలో సంజీవని వనమూలికలు వెతకడానికి వెళ్ళిన హనుమంతుడు స్ఫూర్తితో ఈ కథను రూపొందించారని తెలుస్తోంది.

దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో నిర్మాత కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రియాంక చోప్రా కథానాయిక.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన యువ నాయకుడు షేక్ సోహెల్.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన యువ నాయకుడు షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేసిన తుమ్మన్ పల్లి బిఆర్ఎస్ నాయకులు
శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి, ఆదేశాల మేరకు తుమ్మన పల్లి గ్రామానికి చెందిన పక్కిరి బాబు షా గారికి 43500. చెక్కు అందజేయడం జరిగింది.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి,మండల పార్టీ అధ్యక్షునికి,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు వెంకటరెడ్డి యువ నాయకులు షేక్ సోహైల్ రమేష్ మోసిన్ ఆశప్ప తదిపరులు పాల్గొన్నారు.

ప్రతి రోజు యోగా సాధనతో ఆరోగ్యం.

ప్రతి రోజు యోగా సాధనతో ఆరోగ్యం

కలెక్టరేట్ కార్యాలయ అధికారులతో యోగా శిక్షణ

ఐడీఓసీలో దశాబ్ది ఉత్సవాలు

యోగా శిక్షకులు శ్రీనివాస్, స్వప్న

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రభుత్వ అధికారులకు, యోగ శిక్షణలో భాగంగా నిత్యం యోగా సాధనతో ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ.శ్రీనివాస్,టీ.స్వప్న
పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగ దశాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం జిల్లా కలెక్టరేట్ అధికారులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యోగా ఆసనాలు, ప్రాణాయామం ముద్రలు ధ్యానము తదితర అంశాలపై వివరిస్తూ..చేయించారుప్రతి రోజు యోగా చేయడం వలన కలిగే లాభాలు, ఆరోగ్యం ఆనందం ఎలా పొందవచ్చు వంటి వివరాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు , సిబ్బంది, కలెక్టరేట్ కార్యాలయ ఏవో.రామ్ రెడ్డి, ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శశి ప్రభ, డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వరూప ,డాక్టర్ కళ్యాణి, డీపీఎం తిరుపతి ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

సీసీ కెమెరాల ఏర్పాట్లతో తలెత్తని సమస్యలు.

సీసీ కెమెరాల ఏర్పాట్లతో తలెత్తని సమస్యలు…

నర్సంపేట టౌన్ సిఐ లేతాకుల రఘుపతి రెడ్డి

చంద్రయ్యపల్లి గ్రామంలో టౌన్ సీఐ బహిరంగ సమావేశం

నర్సంపేట నేటిధాత్రి:

 

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో ఎలాంటి సమస్యలు తలెత్తవని నర్సంపేట టౌన్ సిఐ లేతాకుల రఘుపతి రెడ్డి అన్నారు. బుధవారం నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో టౌన్ సిఐ రఘుపతిరెడ్డి ఆ గ్రామ పంచాయితీ పరిది ప్రజలతో బహిరంగ సమావేశం నిర్వహించారు. సిఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామాన్ని సందర్శించిన ఆయన ప్రజలతో మాట్లాడారు. గ్రామంలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నాటు సారాయి తయారీ, అమ్మకాల పట్ల అడిగి తెలుసుకోగా గ్రామపంచాయతీ పరిధిలో గుడుంబా తయారీ అమ్మకం ఏరులై పారుతున్నదని సిఐకి గ్రామస్తులు తెలుపగా అవాక్కయ్యారు.

ఎక్సైజ్ శాఖ పోలీసులు మంత్రంగా తనిఖీలు చేసి వెళ్తారని ప్రజల ఆరోపించారు. గుడుంబా అమ్మకాలు తయారీ పట్ల ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా ఫిర్యాదు చేస్తే వెంకటేష్ స్పందించి చర్యలు తీసుకుంటామని సిఐ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.యువత మత్తుపదార్థాలకులోనై బంగారు భవిష్యత్తును పడుచేసుకోవద్దన్నారు. పిల్లలు,విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు తో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు.గ్రామ ప్రజలందరి సహకారంతో మరో రెండువారాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా సీఐ రఘుపతిరెడ్డి తెలియజేశారు.ముందుగా గ్రామస్తులు వనభోజనాలకు వెళ్తున్న తరుణంలో సీఐ గ్రామానికి చేరుకోగా మహిళలు బొట్టుపెట్టి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ ఖాజంఆలీ,గ్రామస్తులు పెద్ది తిరుపతి రెడ్డి, బాషబోయిన శ్రీను, వరంగంటి ప్రవీణ్ రెడ్డి,ఉప్పుల రాజు,మాటేటి రాంబాబు, వంగ పురుషోత్తం, కోమాల్ రెడ్డి, చేరాలు,మల్లయ్య,జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇండ్లనుండి బయటకు వెళ్ళేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇండ్లనుండి బయటకు వెళ్ళేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి.

దుగ్గొండి ఎస్సై రణధీర్.

నర్సంపేట దుగ్గొండి నేటిధాత్రి:

 

వివిధ పనుల నిమిత్తం ఇండ్ల నుండి బయటకు వెళ్ళేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దుగ్గొండి ఎస్సై రణధీర్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ
మీ మీ బంధువుల ఇండ్లకు గాని, తీర్థయాత్రలు గాని, ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్లినప్పుడు మీ ఇండ్లకు తాళాలు వేసి పోయేటప్పుడు తలుపులకు సెంట్రల్ లాకింగ్ ఉండే విధంగా జాగ్రత్తలు పడాలని మండల ప్రజలకు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇండ్లలో చొరబడి అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే ఇంట్లో ఉండే విలువైన వస్తువులను తమతో పాటు తీసుకెళ్ళాలని లేనిపక్షంలో ఇంట్లో ఒకరు ఉండే విధంగా చూసుకోవలని ఎస్సై రణధీర్ తెలియజేశారు.

జూలై 9న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి.

జూలై 9న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా జూలై 9 వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ జహీరాబాద్ డివిజన్ కన్వీనర్ మహిపాల్ కోరారు. జహీరాబాద్ లో గురువారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా సమ్మెలో పాల్గొనాలని కోరారు.     

చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్.

చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్

 

 

 

 

 

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా గురించి వార్తలు విశేషంగా వినిపిస్తున్నాయి- కానీ, ఆ మూవీ రిలీజ్ డేట్ మాత్రం తెలియడం లేదు.. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కు భీమ్స్ ట్యూన్స్ అందిస్తూ ఉండడం ఇప్పుడు విశేషంగా మారింది.

 

మొదటి నుంచీ ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహిస్తూ సాగుతున్నారు చిరంజీవి…

ఆయన రీ ఎంట్రీ తరువాత ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ మినహాయిస్తే మిగిలిన నాలుగు సినిమాలు అంతగా అలరించలేకపోయాయి…

‘భోళాశంకర్’ పరాజయం చిరంజీవి ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది…

దాంతో ‘విశ్వంభర’ ద్వారా అభిమానులకు ఆనందం పంచే దిశగా సాగుతున్నారు చిరంజీవి.

యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసే చిరంజీవి ఈ సినిమాలో డైరెక్టర్ మల్లిడి వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చారు…

అతను కూడా శక్తివంచన లేకుండా ‘విశ్వంభర’ను రూపొందించారు…

ఓ పాట మినహా ‘విశ్వంభర’ పూర్తయింది…

ఈ సాంగ్ ఐటమ్ నంబర్ గా రూపొందనుంది… .

ఇందులో చిరంజీవితో చిందేసే ముద్దుగుమ్మ కోసం అన్వేషణ సాగుతోంది…

ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు…

ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమా రీ-రికార్డింగ్ లో బిజీగా ఉన్నారు…

అందువల్ల ఈ ఐటమ్ నంబర్ కు మాత్రం భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ ఎంచుకున్నారట…

ఈ యేడాది బంపర్ హిట్ గా నిలచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కు భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ భలేగా పనిచేశాయి…

ఈ చిత్రంలోని పాటలు మాస్, క్లాస్ అన్న తేడాలేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయి…

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రానికి కూడా భీమ్స్ స్వరకల్పన చేస్తున్నారు…

ఈ నేపథ్యంలోనే ‘విశ్వంభర’ చిత్రంలోని ఐటమ్ నంబర్ కు భీమ్స్ బాణీలు ఉపయోగించుకోవాలని చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ నిర్ణయించారు…

చిరంజీవి సినిమాలో ఐటమ్ నంబర్ అంటే ఇరగదీసేలా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు…

మరి వారి అంచనాలకు తగ్గట్టుగానే భీమ్స్ బాణీలు ఉంటాయని టాక్!

అప్పుడలా… ఇప్పుడిలా…

దాదాపు 21 సంవత్సరాల క్రితం చిరంజీవి ‘అంజి’ సినిమా అప్పట్లో జనాల్లో విశేషమైన క్రేజ్ క్రియేట్ చేసింది…

ఆ సినిమాకు ముందు శ్రీ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు…

ఓ పాటను కూడా చిత్రీకరించారు…

తరువాత పలు మార్పులు జరిగి, మణిశర్మ బాణీలతోనే ‘అంజి’ రిలీజయింది…

అప్పట్లో గ్రాఫిక్స్ తో ‘అంజి’ అలరించే ప్రయత్నం చేసింది…

ఇప్పుడు ‘విశ్వంభర’లోనూ జీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంది…

అంతేకాదు, ‘విశ్వంభర’ విడుదలలోనూ జాప్యం జరుగుతోంది…

అయితే అప్పుడు శ్రీ స్థానంలో మణిశర్మ వచ్చి ఒక పాట మినహా అన్నీ పూర్తి చేశారు…

ఇప్పుడు కీరవాణి బిజీ వల్ల భీమ్స్ వచ్చి ఓ పాటకు ట్యూన్స్ కడుతున్నారు…

ఏది ఏమైనా చివరగా మిగిలిన పాట పూర్తయితే ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.

మరి కీరవాణికి బదులుగా ఓ పాటకు బాణీలు కడుతున్న భీమ్స్ ఈ ఐటమ్ నంబర్ ను ఎలా రూపొందిస్తారో చూడాలి.

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన.

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని

#పార్టీలకు అతీతంగా ఆరోగ్య పరంగా అండగా ఉంటానని భరోసా…

#63 మంది లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

హనుమకొండ, నేటిధాత్రి:

 

 

 

 

 

ప్రజల ఆరోగ్యం కోసం పతాకంగా నిలిచిన సీఎం సహాయనిధి చెక్కులను పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం రోజున బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు రూ 28,48,600/- విలువైన చెక్కులు ,వరంగల్ మండలానికి చెందిన 5 మందికి రూ.5,00,580/-ల విలువగల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఎవరికి అయినా ఊహించకుండా వస్తాయి. అటువంటి సమయంలో ప్రభుత్వ మద్దతు అనేది ప్రజలకు వెన్నంటే నిలిచి అండగా ఉంటుంది అని అన్నారు.
ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు పార్టీలు, కులాలు, మతాలు అనే భేదాలు ఉండవు. ఒక్క మనిషిగా చూస్తూ, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటం కోసం నేనెప్పుడూ అండగా ఉంటాను అని తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం
ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడేలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో చికిత్స కోసం ఆర్థిక సాయాన్ని అందజేస్తూ వేలాది కుటుంబాలను ఆదుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికార యంత్రాంగం  పాల్గొన్నారు.

మినీ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన..

మినీ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి పట్టణం కేంద్రంలోనీ సుభాష్ కాలనీలో గల టి యు ఎఫ్ ఐ డి సి నిధులు 400 లక్షల రూపాయలతో మినీ స్టేడియం నిర్మాణ పనులకు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ ఈ స్టేడియంను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ స్టేడియం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి మరియు సంబంధిత అధికారులకు సూచించారు. రాబోవు రోజుల్లో ఈ స్టేడియంకు సావిత్రి బాయ్ పూలే పేరు పెడతామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఏఈ మానస పట్టణ అధ్యక్షుడు దేవన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు అప్పం కిషన్ బుర్ర కొమురయ్య దాట్ల శ్రీనివాస్ ముంజాల రవీందర్ కురుమిళ్ళ శ్రీనివాస్ రమణ చారి పార్టీ మండల నాయకులు అధికారులు పాల్గొన్నారు.

మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..

మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..

 

 

 

 

పవన్‌ కళ్యాణ్ కొత్త కథలు వింటున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఆయనతో హిట్ సినిమా తీసిన  దర్శకుడితో మరోసారి సినిమా చేయబోతున్నాడని  తెల్సింది  

 

పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్ల్లు’ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. ‘ఓజీ’కీ కూడా  కాల్షీటు ఇచ్చారు. త్వరలోనే ఆ చిత్రం కూడా పూర్తికానుందని మేకర్స్‌ వెల్లడించారు. ఇంకో వైపు హరీశ్‌ శంకర్‌ కూడా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్‌ షురూ చేశారు. ఈసినిమా సెట్‌లోనూ పవన్‌ పాల్గొంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్‌ కొత్త కథలు వింటున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఆయనతో ‘బ్రో’ చిత్రం తీసిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని పవన్‌తో మరో సినిమా చేయాలనుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఇటీవల సముద్రఖని పవన్‌కు ఓ కథ చెప్పారట.

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘బ్రో’ సినిమా వచ్చింది. పవన్‌ ఫ్యాన్స్‌ను మెప్పించిన సినిమా అది. అప్పట్లోనే పవన్‌ సముద్రఖనితో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారట. ఇప్పుడు అది పట్టాలెక్కబోతోందని తెలిసింది. పవన్‌కు ఇప్పటికే కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్‌ ఇచ్చారు. ఆయన పార్టీ పనులతో బిజీ కావడం, సినిమాలకు కొంత గ్యాప్‌ ఇవ్వంతో కొందరికి అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేశారు. అందులో కొంత మందికి ఇవ్వాల్సి ఉంది. వారిలో ఓ నిర్మాత కోసం ఇప్పుడీ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. తక్కువ సమయంలో, లిమిటెడ్‌ బడ్జెట్‌ లో ఈ సినిమా ప్లాన్‌ చేశారట. ఇటీవల సముద్రఖని పవన్‌ని కలిసి కథ చెప్పేసినట్టు ఇన్‌ సైడ్‌ వర్గాల టాక్‌. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.

 

Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చోటు

Dhanush: ‘కుబేర’.. టచ్ చేసే పాట

 

Vishwambhara: చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్

పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం.

పల్లె పోరుకు సిద్ధం…..

◆ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం

◆ ఎన్నికలెప్పుడొచ్చినా సజావుగా నిర్వహించేలా కసరత్తు

◆ బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు సమకూర్చేపనిలో నిమగ్నం

◆ పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణపై దృష్టి

◆ జిల్లాలకు చేరిన ఎన్నికల గుర్తులు

◆ సర్పంచ్‌కు 30.. వార్డు సభ్యులకు 20

◆ రాష్ట్రంలో 12,848 పంచాయతీలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది.

సంగారెడ్డి,పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది. సిబ్బంది ఎంపిక, వారికి శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తిం పు, ఎన్నికల గుర్తులు తదితర అంశాలపై అధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇందు లో భాగంగా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధులను కేటాయించారు. తెలంగాణ లో గ్రామాల సంఖ్య పెరగడంతో బ్యాలెట్‌ బాక్సుల అవసరం మరింత ఏర్పడింది. అందుకే పక్క రాష్ర్టాల నుంచి బాక్సులు తెప్పిస్తున్నారు. అలాగే, గ్రామాలు, వార్డుల వారీగా కావాల్సిన బ్యాలెట్‌ పత్రాల అవసరాన్ని అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యింది. ఇక, ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి ఉపాధ్యాయులతోపాటు ఇతర శాఖల ఉద్యోగులను గుర్తించారు. పలుచోట్ల సిబ్బందికి శిక్షణ కొనసాగుతోంది. ఇక, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే గుర్తులు కూడా సిద్ధమైనట్టు సమాచారం.

Elections

పంచాయతీ గుర్తులివే..

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తులపై తుది కసరత్తు పూర్తయ్యింది. సర్పంచ్‌ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను ఆమోదించినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇవే గుర్తులు ఖరారయ్యే అవకాశం ఉంది.

సర్పంచ్‌ గుర్తులు:

ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్‌, లేడీ పర్సు, టీవీ రిమోట్‌, టూత్‌ పేస్టు, స్పానర్‌(పానా), చెత్త డబ్బా, బ్లాక్‌ బోర్డు, బెండకాయలు, కొబ్బరితోట, వజ్రం, బకెట్‌, డోర్‌ హ్యాండిల్‌, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్‌, బ్యాటరీ లైట్‌, బ్రష్‌, క్రికెట్‌ బ్యాటర్‌, పడవ, బిస్కెట్‌, పిల్లనగ్రోవి, చైను, చెప్పులు, బెలూన్‌, క్రికెట్‌ వికెట్లు

వార్డు సభ్యుల గుర్తులు

గౌను, గ్యాస్‌స్టవ్‌, స్టూల్‌, గ్యాస్‌ సిలిండర్‌, బీరువా, విజిల్‌, కుండ, డిష్‌ యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీం, గాజుగ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వలప్‌ కవర్‌, హాకీ స్టిక్‌ మరియు బంతి, నెక్‌ టై, కటింగ్‌ ప్లేయర్‌, పెట్టె, విద్యుత్‌ స్తంభం, కెటిల్‌.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

రాష్ట్రంలోని పల్లెల్లో ప్రస్తుతం ఎన్నికల రిజర్వేషన్లే హాట్‌టాపిక్‌గా మారాయి. సామాజిక వర్గాల వారీగా ఆశావహులు పోటీకి సిద్ధమయ్యారు. పం చాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించకుం టే స్థానిక ఎన్నికల వైపు గురిపెడుతున్నారు. పం చాయతీ ఎన్నికల్లో సగం దాకా మహిళా రిజర్వేషన్లు ఉండడంపైనా తర్జనభర్జన పడుతున్నారు. అయితే, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా గ్రా మాల్లో సామాజికవర్గాల జనాభాశాతం, మహిళల సంఖ్యతోపాటు గతంలో వరుసగా మూడుసార్లు వచ్చిన రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తెలిసింది. గతసారి వచ్చిన రిజర్వేషన్‌ ఈసారి మారవచ్చని అంటున్నారు. తమ గ్రామానికి ఫలానా రిజర్వేషన్‌ను కేటాయించాలని అధికారులకు వినతిపత్రాలు కూడా అందజేస్తున్నారు.మొత్తంగా ఎన్నికల కోడ్‌ వెలువడకముందే రిజర్వేషన్ల అంశం పల్లెల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 12,848 గ్రామ పంచాయతీలను గుర్తించింది. వీటన్నింటికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదిక వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. దాని ప్రకారం మొత్తం 12,848 గ్రామ పంచాయతీల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలుండగా, 570 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు ఉండగా అక్కడ 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇక, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లాలో 19 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.

ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం

రాష్ట్రంలోని పంచాయతీల వివరాలు

జిల్లా గ్రామపంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు

ఆదిలాబాద్‌ 473 166 20

భద్రాద్రి కొత్తగూడెం 478 236 22

హన్మకొండ 210 129 12

జగిత్యాల 385 216 20

జనగాం 280 134 12

భూపాలపల్లి 248 109 12

జోగులాంబ గద్వాల 255 142 13

కామారెడ్డి 536 237 25

కరీంనగర్‌ 318 170 15

ఖమ్మం 579 288 20

అసిఫాబాద్‌ 335 127 15

మహబూబాబాద్‌ 482 193 18

మహబూబ్‌నగర్‌ 423 175 16

మంచిర్యాల 306 129 16

మెదక్‌ 492 190 21

మేడ్చల్‌ మల్కాజిగిరి 34 19 3

ములుగు 174 87 10

నాగర్‌కర్నూల్‌ 460 214 20

నల్లగొండ 868 352 33

నారాయణపేట 276 136 13

నిర్మల్‌ 400 157 18

నిజామాబాద్‌ 545 307 31

పెద్దపల్లి 266 140 13

రాజన్న సిరిసిల్ల 260 123 12

రంగారెడ్డి 531 232 21

సంగారెడ్డి 633 276 27

సిద్దిపేట 508 230 26

సూర్యాపేట 486 235 23

వికారాబాద్‌ 594 227 20

వనపర్తి 268 133 15

వరంగల్‌ 317 130 11

యాదాద్రి భువనగిరి 428 178 17

తొలి ఒడి అమ్మ బడి అమ్మ మాట అంగన్వాడి బాట.

తొలి ఒడి అమ్మ బడి అమ్మ మాట అంగన్వాడి బాట

ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత

జైపూర్ నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో అమ్మ ఒడి అంగన్వాడి బాట కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు నర్సరీ,ఎల్కేజీ,యూకేజి తరగతులను ప్రైవేటు పాఠశాలల దీటుగా ప్రీ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్,పుస్తకాలు అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించారని అన్నారు.అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అంగన్వాడి కేంద్రాల్లో ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువు,పెరుగుదలకు కావలసిన పోషక ఆహారం అందిస్తూ పిల్లలకు ఆట,పాటలు,అక్షరాలు నేర్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తు బాల్యం నుంచి క్రమశిక్షణగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత అంగన్వాడి టీచర్ రాజేశ్వరి,ఆయమ్మ, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులకు ఘన స్వాగతం.

మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులకు ఘన స్వాగతం

బిఆర్ఎస్ పార్టీ టేకుమట్ల మండల నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అమెరికాలో దిగ్విజయంగా నిర్వహించి అమెరికా పర్యటన ముగించుకొని, నేడు స్వదేశానికి తిరిగి వచ్చిన భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన టేకుమట్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, మాజీ ఎంపీటీసీలు ఆది రఘు, పింగిలి వెంకటేశ్వర్ల రెడ్డి మాజీ సర్పంచులు బిలకంటి ఉమేందర్రావు నల్లబెల్లి రవీందర్, ఉద్దమారి మహేష్ యాదవ్, దేవేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్- బడం పేట్ మార్గమధ్యలో గల రోడ్డు కోత్తూర్, ఖానాపూర్ సమీపంలో పూర్తిగా పాడైపోయిన కారణంగా ఆసుపత్రి, పాఠశాలకు మండల కేంద్రమైన కోహీర్ కు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థకు గురౌతున్నామని, కోత్తూర్, ఖానాపూర్ గ్రామాలకు చెందిన పలువురు స్థానికులు శనివారం సాయంత్రం విడుదల చేసిన
సంయుక్త పత్రికా ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

స్నేహితుని కుటుంబానికి చేయూత.

స్నేహితుని కుటుంబానికి చేయూత
మొగులపల్లి నేటి ధాత్రి:

 

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో తమతో పాటు చదువుకున్న 2007-08 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన ఇప్పకాయల శ్రీను తండ్రి ఇప్పకాయల రాజేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు 10 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బండారి ఓదెలు, తిప్పారపు సురేందర్,ల్యాండిగా రాజేందర్, జునుమల తిరుపతి, నాగలగని రాజేందర్, పోతుగంటి దశరథం తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా కుటుంబానికి సహాయం.

జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా కుటుంబానికి సహాయం చేసిన – జేపీ చారిటబుల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫౌండర్ జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కొన్ని రోజుల క్రితం కొత్తగా నిర్మించిన జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా గారి కుటుంబానికి సహాయం చేయగలరని జ్యోతి పండాల్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, ఖాజా గారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో యాక్సిడెంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అలాగే వారి కుటుంబం అంతా కూడా ఖాజా గారి సంపాదన పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి వారికి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉండటం వల్ల రేషన్ కి కూడా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిసి కాజా గారి ఇంటికి వెళ్లి బియ్యము, బ్లాంకెట్స్ మరియు పిల్లలకి బట్టలు అందజేయడం జరిగింది. అలాగే వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా తనకు కాల్ చేయమని జ్యోతి పండాల్ వారికి తెలియజేయడం జరిగింది.

ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి.

ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగిడిపెల్లి రవి

మంగపేట నేటిధాత్రి:

బుచ్చంపేట గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు కాటూరు నాగయ్య జంగం భానుచందర్ ఎడ్ల నరేష్ పల్లె శోభన్. అను నలుగురు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటూ సీతక్క పేరు వాడుకుంటూ అక్క కుమారుడు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సూర్య పేరు వాడుకుంటూ.. వారితో దిగిన ఫోటోలు అమాయకులకు చూపిస్తూ.. మాకు అక్కకు దగ్గర మేము చెప్పింది చేస్తదని ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని. యువ వికాసంలో లోన్ ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ నెల లో కొందరికాడా వసూలు చేశారు కానీ మనం అధికారంలో ఉన్నాము కాబట్టి బయపడ్డారు మంగళవారం వచ్చిన వీడియో చూసాక వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చిస్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తారని వాస్తవం అధిష్టానికి మండల అధ్యక్షునికి మండల ప్రజలకు చెపుతున్న వాస్తవం నాపేరు పగిడిపల్లి రవిని నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకున్ని పైగా వారే. మీటింగ్లు పెట్టి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని పార్టీ ముఖ్య నాయకులను గ్రామ పేరును కాంగ్రెస్ పార్టీని చెడగొడుతున్నారు. వాస్తవంగా డబ్బులు తీసుకుంటే బయట పెట్టమని చాలెంజులు విసురుతున్నారు. నేను మీతో చెప్పినది ఏమనగా.. స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన నా దగ్గరే కూడా యువ వికాసం ఇస్తామని పదివేల రూపాయలను కాటూరు నాగయ్యతో కలసి నలుగురు వ్యక్తులు అడిగారు అడిగింది. వాస్తవము. నేను మొదటగా ఐదు వేల రూపాయలు ఫోన్ పే ద్వారా అందజేసింది. వాస్తవం. కాటురు నాగయ్య ఎడ్ల నరేష్ భానుచందర్ శోభన్ బాబు అధ్యక్షుని వివిధ హోదాలో ఉండి కార్యకర్త నైన నా వద్దనే ఈ విధంగా అడిగి పేపర్లలో దొంగే దొంగలు అన్నట్టుగా పేపర్లో వాస్తవములు ఉంటే బయట పెట్టమని ప్రకటనలు ఇస్తున్నారు. అందువలన నేను బయట పెట్టకు తప్పడం లేదు. నాకాడ నలుగురు మాట్లాడిన వీడియో మరియు వాయిస్ రికార్డింగ్ సాక్షులు బాధితులు ఉన్నారు బుచ్చంపేటలో ఎవ్వరిని అడిగిన చెబుతారు అందరికడా ఉన్నాయి ఇట్టి విషయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్న. రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి ధనసరి సూర్య అన్న. వీరిపై చర్య తీసుకోకపోతే రానున్న స్థానిక ఎన్నికలలో బుచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ పూర్తి పరాభవము తప్పదు కావున వెంటనే వీరిపై చర్య తీసుకుని కాంగ్రెస్ పార్టీని నాయకుల మనోభావాలను కాపాడి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పార్టీ విజయం సాధించుటకు సహకరిస్తారని కోరుతున్నాను.

పేదలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం.

పేదలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం పోతుగల్ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
మండలంలోని పోతుగల్ గ్రామంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లపెల్లి రాములు గౌడ్, హౌసింగ్ ఎఈ హర్షిణి, పంచాయతీ కార్యదర్శి. సుజాత అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లకు పూజ కార్యక్రమం నిర్వహించి కొలతల ప్రకారం ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి రాములు గౌడ్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు అందించడంలో ప్రత్యేక చొరవ తీసుకొని పేదోళ్ల సొంతింటి కల నెరవేర్చిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ళు లేకుండా ఎన్నో ఏళ్లుగా అద్దె గృహాల్లో ఉంటున్న మాకు ఇందిరమ్మ ఇళ్ళ కలను సాకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కు లబ్ధిదారులు కృతజ్ఞత చాటుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version