బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం.

బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం

ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం మైలారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దసరాపు భద్రయ్య కు ముత్యాల సంపత్ కు ఇటీవల బైక్ ఆక్సిడెంట్ కావడం జరిగింది దీనితో వారికి తలకు బాడీకి తీవ్రమైన దెబ్బలు తగలడంతో హైదరాబాదులోని హాస్పిటల్ తీసుకువెళ్లడం జరిగింది వారిది నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబం దాతల సహకారం కోరగా విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్నికి మనోధైర్యం కల్పించి వారి వైద్యానికి 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంచార్జ్ ఆకుల ప్రతాప్,మొర్రి గణేష్, తది ఇతర సభ్యులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గాంధీ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నా వేడుకలు భాగంగా
ఈరోజు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత బడుగు బలహీన వర్గాల నేత, రాహుల్ గాంధీ 55వ జన్మదినం సందర్భంగా గాంధీ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర చేపట్టి, పేద ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా, ప్రజా నాయకుడిగా శక్తిగా ఎదిగిన రాహుల్ గాంధీ ఎల్లవేళలా ఆరు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. గ్రంధాలయ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన వ్యవస్థగా పేద ప్రజలకు అండగా ముందుకు సాగుతుందని రాహుల్ గాంధీ లాంటి నాయకుడు మా అందరికీ ముందుండి నడిపిస్తాడని ఆశిస్తున్నాను అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎనమల తిరుపతి రెడ్డి స్వరూప, జిల్లా మహిళా అధ్యక్షురాలు కామూని వనిత నలినీకాంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూర దేవరాజు , గడ్డం నరసయ్య వైద్య శివప్రసాద్, తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు:-

వరంగల్ హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శివనగర్ అంగన్వాడీ (అండర్ బ్రిడ్జి )కేంద్రంలో కాంగ్రెస్ లీగల్ సెల్ వరంగల్ జిల్లా చైర్మన్ శామంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పిల్లలు గర్భిణీల మధ్య కేక్ కట్ చేసి, పండ్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా మహిళా నాయకురాలు రావుల విజయ రాంచందర్, రాధిక,నాయకులు పట్టూరి సుధాకర్, తిరునగిరి వెంకన్న, తొగరు కృష్ణ, రాజు, శ్రీధర్, మధు, అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు వాణిశ్రీ, ఉమాదేవి,నిర్మల,అనూష,ఇశ్రాల్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, బావి భారత ప్రధాని అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
భారతదేశంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాలకు పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం పేద ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం భారత్ జోడో యాత్ర ప్రారంభించి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపించిన ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు..
రాహుల్ గాంధీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచ్ నాయకులు పోలేబోయిన తిరుపతయ్య, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల నాయకులు పూజారి వెంకన్న , వగలబోయిన శ్రీను, దంచనాల రాజేంద్రప్రసాద్, గాంధర్ల రామనాథం, గోగు కిరణ్ కుమార్, మేడి శ్రీను, అశ్రపునిస, పోలేబోయిన సుజాత,కార్యకర్తలు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

వలస ఆదివాసి గ్రామంలో వాలీబాల్ కిట్లు పలకలు అందజేసిన కరకగూడెం పోలీసులు.

వలస ఆదివాసి గ్రామంలో వాలీబాల్ కిట్లు పలకలు అందజేసిన కరకగూడెం పోలీసులు

 

కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు వలస ఆదివాసి నిమ్మలగూడెం, నీలాద్రి పేట, గండి గ్రామాలలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ఆదివాసి ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించద్దని తెలిపారు ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా ప్రయాణించాలని అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించరాదని తెలిపారు. మావోయిస్టులని కాలం చెల్లిన సిద్ధాంతాలని యువత పిల్లలు విద్య ద్వారానే ఉన్నంత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు అసంఘిక శక్తులకు సహకరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా జైలు పాలై కేసులు పాలు కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడుల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పివి నాగేశ్వరరావు, మరియు స్పెషల్ పార్టీ టి జి ఎస్ పి సిబ్బంది పాల్గొన్నారు.

కళా బృందానికి విరాళాన్ని అందజేసిన వనపర్తి జిల్లా ఎస్పీ.

కళా బృందానికి విరాళాన్ని అందజేసిన వనపర్తి జిల్లా ఎస్పీ
వనపర్తి నెటిదాత్రి :
మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలైన ప్రాచీన రంగస్థల కళలలను బ్రతికించుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
గురువారం శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో మూడు రోజులుగా ప్రదర్శిస్తున్న శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర జీవ సమాధి ఘట్టంచివరి రోజు నాటక ప్రదర్శనకు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారుల నాటక ప్రదర్శనను చూసి సంతోషం వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కళలు మానసిక ఆనందాన్ని ఇవ్వడమే అని అన్నారు సంస్కారాన్ని ప్రబోధిస్తాయని చెప్పారు. సినిమాలు,టీవీలు,సెల్ ఫోన్లు వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొంది ఎంత కాలక్షేపాన్ని అందించినా నాటక రంగం యొక్క గొప్పదనం దానిదేనని వివరించారు.గ్రామాలలో నాటక కళ ఆదరింపబడుతూ ఉందంటే అది పల్లె ప్రజల ఔదార్యానికి నిదర్శనమని కొనియాడారు. భావితరానికి రంగస్థల కళలలను పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీపై ఉందని ఆయన సూచించారు. చిన్ననాడు తాను చూసిన నాటకాలను ఎస్పీ గుర్తు చేసుకున్నారు ఎస్పీ రావుల గిరిధర్ గారు నాటకంలో పాల్గొన్న పాత్రధారుల అభినయాన్ని ప్రశంసిస్తూ శాలువా పూలమాలలతో సన్మానించారు అంతేగాక నాటక సమాజం వారికి విరాళాన్ని అందజేశారు అనంతరం గ్రామస్తులు కళాబృందం వారు ఎస్పీ ని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి ఎక్సైజ్ సీఐ,వెంకట్ రెడ్డి, శ్రీరంగాపూర్ ఎస్సై, రామకృష్ణ, గ్రామ పెద్దలు, యువకులు, కళాకారులు,ఇతర గ్రామాల నుండి వచ్చిన కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకుడు.

నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకుడు…

గార్ల నేటి ధాత్రి:

 

భారతదేశాన్ని ప్రగతిశీల భవిష్యత్తు వైపు నడిపించగలిగే ఏకైక వ్యక్తి అధికారానికి నిజం చెప్పే నిర్భయ నాయకుడు నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశానుసారం గార్ల సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, గొంతు లేని వారిని శక్తివంతం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ప్రయాణం కొనసాగాలని సామాజిక న్యాయం, సమానత్వం మరియు హక్కుల కోసం నిర్భయంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి కోట్లాదిమంది అణగారిన యువత, శ్రామిక ప్రజలకు ఆశా కిరణంగా ఉండాలని కోరారు. 

జూడో యాత్ర చేపట్టి దేశం మొత్తం పర్యటించి ఇండియా కూటమిని అత్యధిక సీట్లు సాధించేందుకు కృషి చేశారని, భవిష్యత్తులో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి దేశంలో అధికార పగ్గాలు చేపడుతుందని,దీంతో దేశంలో పేదరికం మతసామరస్యం అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశ భావం వ్యక్తం చేశారు. దేశం పట్ల తపన, ప్రజల పట్ల ప్రేమ, సత్యం పట్ల నిబద్ధత, విలువల పట్ల విధేయత, ప్రజాస్వామ్యం అంటే ఎనలేని నమ్మకం, భారత రాజ్యాంగంపై అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు. సమైక్య భారత స్వాప్నికుడు, భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాకూబ్ పాషా,భూక్యా నాగేశ్వరావు, చింతల కోటేష్, కట్ట శ్రీను, కోళ్ల కుమార్ గౌడ్, లెనిన్, జాటోత్ రమేష్,భూక్యా రామ్ సింగ్,ఎం. సురేష్, బోడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

 ఓటీటీలో మాధవన్ మూవీ ఎప్పటి నుండంటే…

 ఓటీటీలో మాధవన్ మూవీ ఎప్పటి నుండంటే…

 

 

 


వైవిధ్యమైన పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చకున్న మాధవన్ చాలా కాలం తర్వాత మరోసారి రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు.

 

ఫాతిమా సనా షేక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

 

ప్రముఖ నటుడు మాధవన్ (Madhava) కు గతంలో రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉండేది.

కానీ కొంతకాలంగా అందుకు భిన్నమైన పాత్రలను చేస్తున్నాడు.

కొన్ని హిందీ సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలు చేయడానికి కూడా మాధవన్ వెనుకాడలేదు.

 

తెలుగులో ఆ మధ్య వచ్చిన అనుష్క ‘నిశ్శబ్దం’ (Nishabdham) లో అలాంటి భిన్నమైన పాత్రనే మాధవన్ చేశాడు.

సైంటిస్ట్ నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రీ’ (Rocketry) తో మాధవన్ దర్శకుడిగానూ మారిపోయాడు.

ఆ బయోపిక్ అతనికి నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

అలానే గత యేడాది మాధవన్ నటించిన ‘సైతాన్’ (Saitaan) కూడా కమర్షియల్ హిట్ అయ్యి, మాధవన్ లోని నటుడిని వెలికి తీసింది.

ఈ యేడాది ఇప్పటికే మాధవన్ నటించిన ‘హిసాబ్ బరాబర్,’ ‘టెస్ట్’ చిత్రాలు వచ్చాయి.

అయితే ఈ రెండు కూడా ఓటీటీలోనే విడుదల కావడం విశేషం.

ఇక అక్షయ్ కుమార్ తో కలిసి మాధవన్ నటించిన కోర్ట్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2’ థియేటర్లలో సందడి చేసింది.

తాజాగా మాధవన్ నటించి మరో చిత్రం ‘ఆప్ జైసా కోయి’ మూవీ సైతం ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాలో మాధవన్ సరసన ఫాతిమా సనా షేక్ నటిస్తోంది.

మాధవన్ ఈ రొమాంటిక్ లవ్ డ్రామాలో సంస్కృతం లెక్చరర్ గా నటిస్తుంటే, సనా ఫ్రెంచ్ టీచర్ పాత్రను పోషిస్తోంది.

రెండు భిన్న ధృవాలకు చెందిన వీరిద్దరూ కలిసి జీవితం సాగించాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే ‘ఆప్ జైసా కోయీ’ సినిమా.

 

ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను వివేక్ సోని డైరెక్ట్ చేశారు.

 

ఇది జూలై 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్- బడం పేట్ మార్గమధ్యలో గల రోడ్డు కోత్తూర్, ఖానాపూర్ సమీపంలో పూర్తిగా పాడైపోయిన కారణంగా ఆసుపత్రి, పాఠశాలకు మండల కేంద్రమైన కోహీర్ కు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థకు గురౌతున్నామని, కోత్తూర్, ఖానాపూర్ గ్రామాలకు చెందిన పలువురు స్థానికులు శనివారం సాయంత్రం విడుదల చేసిన
సంయుక్త పత్రికా ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ షాక్ తో 3 ఆవుల మృతి.

విద్యుత్ షాక్ తో 3 ఆవుల మృతి

భూపాలపల్లి నేటిధాత్రి:

 

భూపాలపల్లి రూరల్ మండలం శ్యాంనగర్ గ్రామం లో ఇంచర్ల. కోటయ్య చెందిన 2 ఎడ్లు, 1ఆవు కౌటం.కమలాకర్ చెందిన 1 ఆవు కరెంట్ షాక్ కు గురిఐ మృతి చెందినవి. వీటి విలువ మూడు లక్షల వరకు ఉందని వీరి కుటుంబాలను ఆదుకోవాలని గ్రామమాజీ సర్పంచ్ తిరుపతిరావు, గ్రామకాంగ్రెస్ నాయకులు ఓరుగంటి బాబురావు కోరారు.

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎమ్మెల్యే జిఎస్ఆర్.

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి:

దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
గురువారం ఐడిఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అలింకో వారి సహాయంతో
దివ్యాంగులకు సహాయ ఉపకరణముల పంపిణి
శిభిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిడబ్ల్యూఓ మల్లేశ్వరి ప్రారంభించారు అనంతరం దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాలలో ముందుండాలని దివ్యాంగులకు అద్భుతమైన తెలివి తేటలు, ప్రతిభా పాఠవాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో దివ్యాంగులకు ప్రత్యేక కోట ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా బలపడేందుకు తోడ్పడతామని అన్నారు. జైపాల్ రెడ్డి దివ్యాన్ గుడు అయినప్పటికి సుదీర్ఘ కాలం పాటు రాజకీయ నాయకుడుగా ప్రజలకు సేవలు అందించారని అన్నారు. లోకల్ బాడి ఎన్నికల్లో సైతం దివ్యాంగుల ప్రజాసేవలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.
అలీంకో సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా 204 భూపాలపల్లి నియోజక వర్గంలో 154 దివ్యాంగులకు 21 రకాల వివిధ సహాయ ఉపకరణాలు అందించడం జరుగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ అమృతం పథకం ద్వారా జిల్లాలో 8640 మంది 14 నుండి 18 సంవత్సరాల వయసు గల కిషోర బాలికలను గుర్తించి వారిని రక్త హీనత నుండి కాపాడడి, సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తయారు చేసేందుకు పల్లి పట్టీలు, మిల్లెట్ పట్టీలు, నెలకు రెండుసార్లు అందించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆరోగ్య పరిరక్షణ లి భాగంగా ప్రభుత్వం ఇందిరమ్మ అమృతం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం దివ్యాన్గులకు ఉప కరణాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,
విజయలక్ష్మీ,
డిడబ్ల్యూఓ మల్లేశ్వరి, ఆలిం కో ప్రోస్టేటిక్ అండ్ ఆర్థోటిస్ట్ రష్మీ రాజన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది.

ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది

 

 

 

 

అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతున్న…

 

అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇటీవలే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించింది. ఈ సందర్భంగా రవిశంకర్‌ మాట్లాడుతూ ‘సినిమా విజువల్‌గా చాలా బాగుంది. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది. ఒక అమ్మాయి జీవిత ప్రయాణమే ‘8 వసంతాలు’ సినిమాగా మీ ముందుకొస్తోంది. తప్పకుండా మీకు నచ్చుతుంది’ అన్నారు. ‘ఇది చాలా డిఫరెంట్‌ మూవీ. కథ బాగా నచ్చి మేము చేసిన ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని నవీన్‌ యెర్నేని అన్నారు. ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ ‘మా నిర్మాతలు ఒక మంచి కథతో వస్తే సినిమా తీస్తారు అనే దానికి మా ‘8 వసంతాలు’ చిత్రం ఓ నిదర్శనం. ఈ సినిమాతో ఒక మంచి చిత్రాన్ని నిర్మించారనే పేరు వారికి వస్తుంది. అనంతిక నటన ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణ’ అని అన్నారు. అనంతిక మాట్లాడుతూ ‘మైత్రీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. ఫణీంద్ర గారి వల్ల ఈ సినిమాలో ఒక బలమైన పాత్రను చేశాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం’ అన్నారు.

మహేశ్‌ సినిమా… ఎంతైనా తగ్గేదేలే..

మహేశ్‌ సినిమా… ఎంతైనా తగ్గేదేలే..

 

 

 

 

గుణశేఖర్‌ తర్వాత అలా భారీతనంతో సెట్స్‌ వేయడంలో రాజమౌళి (SS Rajamouli) ఘనాపాటి. అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్య్టా ఎలాంటి సమస్య లేదు. బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు

 

బాలీవుడ్‌లో భారీ కాన్వాస్‌ కథలు, సెట్లు, కళాత్మక పంథాలో చిత్రాలను తెరకెక్కించడం అంటే గుర్తొచ్చే పేరు సంజయ్‌ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali).

దేవదాస్‌ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్‌తో భారీ సెట్‌ నిర్మించారని అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు.

అది తెరపై కనిపించింది.

ఆయన తీసే సినిమా బడ్జెట్‌లో 15 నుంచి 35 కోట్లు సెట్స్‌ కోసం ఖర్చవుతుంది.

బాజీరావు మస్తానీ, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ సాయో, రామ్‌ లీలా, హీరామండి ఇవన్నీ ఆ కోవకు చెందినవే.

అలాగే టాలీవుడ్‌ అలా భారీ సెట్స్‌ వేసే అలవాటు దర్శకుడు గుణశేఖర్‌కు (Guna sekhar) ఉంది.

ఎందుకంటే ఆయన ఎంచుకునే కథల స్పాన్‌ అలా ఉంటుంది.

ఒక్కడు, వరుడు సహా చాలా సినిమాలకు గుణశేఖర్‌ భారీతనంతో నిండిన సెట్స్‌కు కోట్లు ఖర్చు చేశారు.

రుద్రమదేవి లాంటి సినిమా కోసం పూర్తి స్థాయి బడ్జెట్‌ లభించకపోవడంతో ఆ సినిమా అవుట్‌పుట్‌ కాస్త డల్‌గా వచ్చింది.

ఆయన తర్వాత అలా భారీతనంతో సెట్స్‌ వేయడంలో రాజమౌళి (SS Rajamouli) ఘనాపాటి.

అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్య్టా ఎలాంటి సమస్య లేదు.

బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు.

ఇప్పుడు మహేశ్‌ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మిస్తున్నారని తెలిసింది.

ప్రస్తుతం ఆయన మహేష్‌ కథానాయకుడిగా ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB 29) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వారణాసిలో కీలక షెడ్యూల్‌ చేయాలట.

నిజానికి గంగానది ఒడ్డున రియల్‌ లొకేషన్లలో ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాలంటే సవాల్‌తో కూడిన విషయమే!  

పోలీసుల నుంచి అనుమతులు పొందడం అంత సులువు కాదు.

దాంతోపాటు ప్రజలు,  ప్రజల నుంచి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.

అది కష్టంతో కూడిన పని కావడంతో రాజమౌళి వారణాసిని తలపించే భారీ సెట్‌ని నిర్మించాలని ప్లాన్‌ చేసినట్టు తెలిసింది.

వారణాసిలో దేవాలయాలు, ఘాట్‌లతో ఆధ్యాత్మికత నిండిన ప్రాంతంగా ఉంటుంది.

అలాంటి నగరాన్ని నిర్మించాలనే ఆలోచన సవాళ్లతో కూడుకున్నదే! తెరపై ఒరిజినాలిటీ చూపించాలి.

దాని కోసం రాజమౌళి టీమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌తో కసరత్తులు చేస్తున్నారని తెలిసింది.

  పర్వతాలలో సంజీవని వనమూలికలు వెతకడానికి వెళ్ళిన హనుమంతుడు స్ఫూర్తితో ఈ కథను రూపొందించారని తెలుస్తోంది.

దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో నిర్మాత కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రియాంక చోప్రా కథానాయిక.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన యువ నాయకుడు షేక్ సోహెల్.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన యువ నాయకుడు షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేసిన తుమ్మన్ పల్లి బిఆర్ఎస్ నాయకులు
శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి, ఆదేశాల మేరకు తుమ్మన పల్లి గ్రామానికి చెందిన పక్కిరి బాబు షా గారికి 43500. చెక్కు అందజేయడం జరిగింది.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి,మండల పార్టీ అధ్యక్షునికి,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు వెంకటరెడ్డి యువ నాయకులు షేక్ సోహైల్ రమేష్ మోసిన్ ఆశప్ప తదిపరులు పాల్గొన్నారు.

ప్రతి రోజు యోగా సాధనతో ఆరోగ్యం.

ప్రతి రోజు యోగా సాధనతో ఆరోగ్యం

కలెక్టరేట్ కార్యాలయ అధికారులతో యోగా శిక్షణ

ఐడీఓసీలో దశాబ్ది ఉత్సవాలు

యోగా శిక్షకులు శ్రీనివాస్, స్వప్న

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రభుత్వ అధికారులకు, యోగ శిక్షణలో భాగంగా నిత్యం యోగా సాధనతో ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ.శ్రీనివాస్,టీ.స్వప్న
పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగ దశాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం జిల్లా కలెక్టరేట్ అధికారులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యోగా ఆసనాలు, ప్రాణాయామం ముద్రలు ధ్యానము తదితర అంశాలపై వివరిస్తూ..చేయించారుప్రతి రోజు యోగా చేయడం వలన కలిగే లాభాలు, ఆరోగ్యం ఆనందం ఎలా పొందవచ్చు వంటి వివరాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు , సిబ్బంది, కలెక్టరేట్ కార్యాలయ ఏవో.రామ్ రెడ్డి, ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శశి ప్రభ, డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వరూప ,డాక్టర్ కళ్యాణి, డీపీఎం తిరుపతి ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

సీసీ కెమెరాల ఏర్పాట్లతో తలెత్తని సమస్యలు.

సీసీ కెమెరాల ఏర్పాట్లతో తలెత్తని సమస్యలు…

నర్సంపేట టౌన్ సిఐ లేతాకుల రఘుపతి రెడ్డి

చంద్రయ్యపల్లి గ్రామంలో టౌన్ సీఐ బహిరంగ సమావేశం

నర్సంపేట నేటిధాత్రి:

 

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో ఎలాంటి సమస్యలు తలెత్తవని నర్సంపేట టౌన్ సిఐ లేతాకుల రఘుపతి రెడ్డి అన్నారు. బుధవారం నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో టౌన్ సిఐ రఘుపతిరెడ్డి ఆ గ్రామ పంచాయితీ పరిది ప్రజలతో బహిరంగ సమావేశం నిర్వహించారు. సిఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామాన్ని సందర్శించిన ఆయన ప్రజలతో మాట్లాడారు. గ్రామంలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నాటు సారాయి తయారీ, అమ్మకాల పట్ల అడిగి తెలుసుకోగా గ్రామపంచాయతీ పరిధిలో గుడుంబా తయారీ అమ్మకం ఏరులై పారుతున్నదని సిఐకి గ్రామస్తులు తెలుపగా అవాక్కయ్యారు.

ఎక్సైజ్ శాఖ పోలీసులు మంత్రంగా తనిఖీలు చేసి వెళ్తారని ప్రజల ఆరోపించారు. గుడుంబా అమ్మకాలు తయారీ పట్ల ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా ఫిర్యాదు చేస్తే వెంకటేష్ స్పందించి చర్యలు తీసుకుంటామని సిఐ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.యువత మత్తుపదార్థాలకులోనై బంగారు భవిష్యత్తును పడుచేసుకోవద్దన్నారు. పిల్లలు,విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు తో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు.గ్రామ ప్రజలందరి సహకారంతో మరో రెండువారాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా సీఐ రఘుపతిరెడ్డి తెలియజేశారు.ముందుగా గ్రామస్తులు వనభోజనాలకు వెళ్తున్న తరుణంలో సీఐ గ్రామానికి చేరుకోగా మహిళలు బొట్టుపెట్టి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ ఖాజంఆలీ,గ్రామస్తులు పెద్ది తిరుపతి రెడ్డి, బాషబోయిన శ్రీను, వరంగంటి ప్రవీణ్ రెడ్డి,ఉప్పుల రాజు,మాటేటి రాంబాబు, వంగ పురుషోత్తం, కోమాల్ రెడ్డి, చేరాలు,మల్లయ్య,జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇండ్లనుండి బయటకు వెళ్ళేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇండ్లనుండి బయటకు వెళ్ళేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి.

దుగ్గొండి ఎస్సై రణధీర్.

నర్సంపేట దుగ్గొండి నేటిధాత్రి:

 

వివిధ పనుల నిమిత్తం ఇండ్ల నుండి బయటకు వెళ్ళేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దుగ్గొండి ఎస్సై రణధీర్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ
మీ మీ బంధువుల ఇండ్లకు గాని, తీర్థయాత్రలు గాని, ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్లినప్పుడు మీ ఇండ్లకు తాళాలు వేసి పోయేటప్పుడు తలుపులకు సెంట్రల్ లాకింగ్ ఉండే విధంగా జాగ్రత్తలు పడాలని మండల ప్రజలకు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇండ్లలో చొరబడి అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే ఇంట్లో ఉండే విలువైన వస్తువులను తమతో పాటు తీసుకెళ్ళాలని లేనిపక్షంలో ఇంట్లో ఒకరు ఉండే విధంగా చూసుకోవలని ఎస్సై రణధీర్ తెలియజేశారు.

జూలై 9న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి.

జూలై 9న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా జూలై 9 వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ జహీరాబాద్ డివిజన్ కన్వీనర్ మహిపాల్ కోరారు. జహీరాబాద్ లో గురువారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా సమ్మెలో పాల్గొనాలని కోరారు.     

చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్.

చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్

 

 

 

 

 

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా గురించి వార్తలు విశేషంగా వినిపిస్తున్నాయి- కానీ, ఆ మూవీ రిలీజ్ డేట్ మాత్రం తెలియడం లేదు.. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కు భీమ్స్ ట్యూన్స్ అందిస్తూ ఉండడం ఇప్పుడు విశేషంగా మారింది.

 

మొదటి నుంచీ ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహిస్తూ సాగుతున్నారు చిరంజీవి…

ఆయన రీ ఎంట్రీ తరువాత ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ మినహాయిస్తే మిగిలిన నాలుగు సినిమాలు అంతగా అలరించలేకపోయాయి…

‘భోళాశంకర్’ పరాజయం చిరంజీవి ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది…

దాంతో ‘విశ్వంభర’ ద్వారా అభిమానులకు ఆనందం పంచే దిశగా సాగుతున్నారు చిరంజీవి.

యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసే చిరంజీవి ఈ సినిమాలో డైరెక్టర్ మల్లిడి వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చారు…

అతను కూడా శక్తివంచన లేకుండా ‘విశ్వంభర’ను రూపొందించారు…

ఓ పాట మినహా ‘విశ్వంభర’ పూర్తయింది…

ఈ సాంగ్ ఐటమ్ నంబర్ గా రూపొందనుంది… .

ఇందులో చిరంజీవితో చిందేసే ముద్దుగుమ్మ కోసం అన్వేషణ సాగుతోంది…

ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు…

ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమా రీ-రికార్డింగ్ లో బిజీగా ఉన్నారు…

అందువల్ల ఈ ఐటమ్ నంబర్ కు మాత్రం భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ ఎంచుకున్నారట…

ఈ యేడాది బంపర్ హిట్ గా నిలచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కు భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ భలేగా పనిచేశాయి…

ఈ చిత్రంలోని పాటలు మాస్, క్లాస్ అన్న తేడాలేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయి…

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రానికి కూడా భీమ్స్ స్వరకల్పన చేస్తున్నారు…

ఈ నేపథ్యంలోనే ‘విశ్వంభర’ చిత్రంలోని ఐటమ్ నంబర్ కు భీమ్స్ బాణీలు ఉపయోగించుకోవాలని చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ నిర్ణయించారు…

చిరంజీవి సినిమాలో ఐటమ్ నంబర్ అంటే ఇరగదీసేలా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు…

మరి వారి అంచనాలకు తగ్గట్టుగానే భీమ్స్ బాణీలు ఉంటాయని టాక్!

అప్పుడలా… ఇప్పుడిలా…

దాదాపు 21 సంవత్సరాల క్రితం చిరంజీవి ‘అంజి’ సినిమా అప్పట్లో జనాల్లో విశేషమైన క్రేజ్ క్రియేట్ చేసింది…

ఆ సినిమాకు ముందు శ్రీ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు…

ఓ పాటను కూడా చిత్రీకరించారు…

తరువాత పలు మార్పులు జరిగి, మణిశర్మ బాణీలతోనే ‘అంజి’ రిలీజయింది…

అప్పట్లో గ్రాఫిక్స్ తో ‘అంజి’ అలరించే ప్రయత్నం చేసింది…

ఇప్పుడు ‘విశ్వంభర’లోనూ జీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంది…

అంతేకాదు, ‘విశ్వంభర’ విడుదలలోనూ జాప్యం జరుగుతోంది…

అయితే అప్పుడు శ్రీ స్థానంలో మణిశర్మ వచ్చి ఒక పాట మినహా అన్నీ పూర్తి చేశారు…

ఇప్పుడు కీరవాణి బిజీ వల్ల భీమ్స్ వచ్చి ఓ పాటకు ట్యూన్స్ కడుతున్నారు…

ఏది ఏమైనా చివరగా మిగిలిన పాట పూర్తయితే ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.

మరి కీరవాణికి బదులుగా ఓ పాటకు బాణీలు కడుతున్న భీమ్స్ ఈ ఐటమ్ నంబర్ ను ఎలా రూపొందిస్తారో చూడాలి.

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన.

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని

#పార్టీలకు అతీతంగా ఆరోగ్య పరంగా అండగా ఉంటానని భరోసా…

#63 మంది లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

హనుమకొండ, నేటిధాత్రి:

 

 

 

 

 

ప్రజల ఆరోగ్యం కోసం పతాకంగా నిలిచిన సీఎం సహాయనిధి చెక్కులను పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం రోజున బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు రూ 28,48,600/- విలువైన చెక్కులు ,వరంగల్ మండలానికి చెందిన 5 మందికి రూ.5,00,580/-ల విలువగల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఎవరికి అయినా ఊహించకుండా వస్తాయి. అటువంటి సమయంలో ప్రభుత్వ మద్దతు అనేది ప్రజలకు వెన్నంటే నిలిచి అండగా ఉంటుంది అని అన్నారు.
ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు పార్టీలు, కులాలు, మతాలు అనే భేదాలు ఉండవు. ఒక్క మనిషిగా చూస్తూ, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటం కోసం నేనెప్పుడూ అండగా ఉంటాను అని తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం
ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడేలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో చికిత్స కోసం ఆర్థిక సాయాన్ని అందజేస్తూ వేలాది కుటుంబాలను ఆదుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికార యంత్రాంగం  పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version