మినీ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన..

మినీ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి పట్టణం కేంద్రంలోనీ సుభాష్ కాలనీలో గల టి యు ఎఫ్ ఐ డి సి నిధులు 400 లక్షల రూపాయలతో మినీ స్టేడియం నిర్మాణ పనులకు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ ఈ స్టేడియంను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ స్టేడియం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి మరియు సంబంధిత అధికారులకు సూచించారు. రాబోవు రోజుల్లో ఈ స్టేడియంకు సావిత్రి బాయ్ పూలే పేరు పెడతామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఏఈ మానస పట్టణ అధ్యక్షుడు దేవన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు అప్పం కిషన్ బుర్ర కొమురయ్య దాట్ల శ్రీనివాస్ ముంజాల రవీందర్ కురుమిళ్ళ శ్రీనివాస్ రమణ చారి పార్టీ మండల నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version