కుక్క,పాము,తేలు కాటు మందులను అందుబాటులో ఉంచాలి…

కుక్క,పాము,తేలు కాటు మందులను అందుబాటులో ఉంచాలి…

వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి…

వైద్యులు స్థానికంగా ఉండి వైద్యం అందించాలి…

సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహనా కల్పించాలి…

అన్ని రకాల రక్త పరీక్షలు పి హెచ్ సి లోనిర్వహించాలి…

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…

నేటి ధాత్రి -గార్ల:-

కుక్క,పాము,తేలు కాటు మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని తద్వారా సకాలంలో వైద్యం సహాయం ప్రాణాలను కాపాడుతుందని ప్రగతిశీల యువజన సంఘం పివైయల్ రాష్ట్ర నాయకులు సిహెచ్ గణేష్ అన్నారు.ప్రభుత్వ వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని,సీజనల్ వ్యాధులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ పివైఎల్ ఆధ్వర్యంలో శనివారం ముల్కనూర్ పిహెచ్ సి ఎదుట నిరసన తెలిపారు.అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ కు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు.వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు విష సర్పాల ప్రమాదం పొంచి ఉన్నదని అందుకు అవసరమైన వ్యాక్సిన్ లను అందుబాటులో ఉంచాలని,దోమతెరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వైద్యుల సమక్షంలో హెల్త్ క్యాంపులు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేయాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో పివైఎల్ మండల అధ్యక్ష,కార్యదర్శులు కూసిని బాబురావు, గుడిచుట్టూ శంకర్, కొండల్, రమేష్, కొండల్ రావు, మాన్య, సక్రు తదితరులు పాల్గొన్నారు.

మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..

మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..

 

 

 

 

పవన్‌ కళ్యాణ్ కొత్త కథలు వింటున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఆయనతో హిట్ సినిమా తీసిన  దర్శకుడితో మరోసారి సినిమా చేయబోతున్నాడని  తెల్సింది  

 

పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్ల్లు’ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. ‘ఓజీ’కీ కూడా  కాల్షీటు ఇచ్చారు. త్వరలోనే ఆ చిత్రం కూడా పూర్తికానుందని మేకర్స్‌ వెల్లడించారు. ఇంకో వైపు హరీశ్‌ శంకర్‌ కూడా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్‌ షురూ చేశారు. ఈసినిమా సెట్‌లోనూ పవన్‌ పాల్గొంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్‌ కొత్త కథలు వింటున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఆయనతో ‘బ్రో’ చిత్రం తీసిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని పవన్‌తో మరో సినిమా చేయాలనుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఇటీవల సముద్రఖని పవన్‌కు ఓ కథ చెప్పారట.

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘బ్రో’ సినిమా వచ్చింది. పవన్‌ ఫ్యాన్స్‌ను మెప్పించిన సినిమా అది. అప్పట్లోనే పవన్‌ సముద్రఖనితో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారట. ఇప్పుడు అది పట్టాలెక్కబోతోందని తెలిసింది. పవన్‌కు ఇప్పటికే కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్‌ ఇచ్చారు. ఆయన పార్టీ పనులతో బిజీ కావడం, సినిమాలకు కొంత గ్యాప్‌ ఇవ్వంతో కొందరికి అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేశారు. అందులో కొంత మందికి ఇవ్వాల్సి ఉంది. వారిలో ఓ నిర్మాత కోసం ఇప్పుడీ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. తక్కువ సమయంలో, లిమిటెడ్‌ బడ్జెట్‌ లో ఈ సినిమా ప్లాన్‌ చేశారట. ఇటీవల సముద్రఖని పవన్‌ని కలిసి కథ చెప్పేసినట్టు ఇన్‌ సైడ్‌ వర్గాల టాక్‌. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.

 

Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చోటు

Dhanush: ‘కుబేర’.. టచ్ చేసే పాట

 

Vishwambhara: చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version