మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులకు ఘన స్వాగతం
బిఆర్ఎస్ పార్టీ టేకుమట్ల మండల నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి:
బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అమెరికాలో దిగ్విజయంగా నిర్వహించి అమెరికా పర్యటన ముగించుకొని, నేడు స్వదేశానికి తిరిగి వచ్చిన భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన టేకుమట్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, మాజీ ఎంపీటీసీలు ఆది రఘు, పింగిలి వెంకటేశ్వర్ల రెడ్డి మాజీ సర్పంచులు బిలకంటి ఉమేందర్రావు నల్లబెల్లి రవీందర్, ఉద్దమారి మహేష్ యాదవ్, దేవేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు