ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంగళవారం రోజున వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండియర్ లో 90%, ఫస్ట్ ఇయర్లో 62% ఉత్తీర్ణతతో మంచి ప్రదర్శన కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీదేవి తెలియజేశారు.ఎంపీసీ సెకండ్ ఇయర్ లో జి అనిల్ 969/1000, ఎన్ సౌమ్య 924/1000, ఏ నవ్య 900/1000, బైపిసి సెకండియర్ లో ఏం శ్రీవాణి 900/1000, ఎన్ ప్రియాంక 880/1000, బి అజయ్ 880/1000, సీఇసి సెకండ్ ఇయర్ లో ఏ శివ 608/1000, హెచ్ ఈ సి సెకండ్ ఇయర్ లో పి చందు 632/1000, ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఎన్ అంజలి 457/470, జి మానసి 446/470, ఏం అంజలి 432/470, ఏం శరణ్య 427/470, బైపిసి ఫస్ట్ ఇయర్ ఎం హర్షిత 405/440, ఏ వైష్ణవి 393/440, ఫస్ట్ ఇయర్ ఇ రాహుల్ 362/500, ఓ సమత 354/500 మార్కులు సాధించారని ప్రిన్సిపల్ బి శ్రీదేవి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, లెక్చరర్లను ప్రిన్సిపాల్ శ్రీదేవి అభినందించారు.
వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు
Silver Jubilee Celebration
బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే, మాట్లాడుతూ.ఈనెల 27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు తరలిరావాలని ,ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజల భవిష్యత్ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Silver Jubilee Celebration
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,పెంట రెడ్డి, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,బీసీ సెల్ మండల అధ్యక్షులు అమిత్ కుమార్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు హీరు రాథోడ్,మైనార్టీ మండల అధ్యక్షులు వహీద్,మండల పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి,మాజి సర్పంచ్ లు చిన్న రెడ్డి,విజయ్ ,అబ్రహం,మాజి ఎంపీటీసీ లు బస్వరాజు,రాములు,శంకర్,గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్ గారి అదేశాలతో
◆ 6,22,500 సీఎం రిలీఫ్ ఫండ్ ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కుల పంపిణీ
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాలకల్, కోహిర్, జహీరాబాద్ మండలాల గ్రామాల లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, నాయకులు న్యాలకల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు హుగెల్లి రాములు గారు పంపిణీ చేశారు.అనంతరం లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ మంత్రి డా౹౹ఏ. చంద్రశేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.లబ్ధిదారుల వివరాలు మల్లెగారి. అరుణ్ కుమార్ 60,000,జహీరాబాద్ కోహిర్. చంద్రయ్య 60,000 కోహిర్ బంగ్లాదొడ్డి. స్వప్న 60,000 ఆర్య నగర్, జహీరాబాద్ చెంగోలి. పుణ్యమ్మ 22,500 పైడిగుమ్మల్ కంట్టం. నాగరాజు 60,000 జహీరాబాద్ శెట్టి రాథోడ్ 60,000 హుగేల్లి బ్యాతా. శ్రీకాంత్ 60,000 న్యాలకల్ అశ్వక్ 60,000 జహీరాబాద్ బాయిని. క్రాంతి కుమార్ 60,000 వెంకటేశ్వర కాలనీ,జహీరాబాద్ బి.ధనరాజ్ 60,000 అసిఫ్ నగర్ కొన్నదొడ్డి.పద్మ 60,000 రేగోడ్. వీరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
విద్యార్థులు ఇష్టపడి చదవాలి పాఠశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే జీఎస్సార్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో ఈరోజు మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ప్రాథమికొన్నత పాఠశాల, గణపురం మండలంకేంద్రంలోని మోడల్ స్కూల్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన పాఠశాలల వార్షికోత్సవ వేడుకల్లో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు.విద్యార్థుల నృత్యాలు, కోలాటాలు చాలా ఆకర్షించాయి. ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఏడాది పాఠశాలల్లో నిర్వహించే వార్షికోత్సవాలు బడి పట్ల విద్యార్థుల్లో నమ్మకం, విశ్వాసాన్ని నింపుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రులతోడ్పాటు ఉంటే అద్భుతాలను సృష్టిస్తారన్నారు.
MLA
తల్లిదండ్రులు పిల్లలకు ప్రతీ రోజు కొంత సమయం కేటాయించి, వారితో విద్యాపరమైన సామాజిక అంశాలపై చర్చించడం ద్వారా వారిలో భయం పోతోందన్నారు. చదవుతో పాటు ఆటపాటలు కూడా చాలా అవసరం అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను ఎంచుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరారు.విద్యార్థుల కళా ప్రదర్శన అద్భుతంగా ఉందని అన్నారు.చెల్పూర్ పాఠశాలలో వాష్ రూమ్స్ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు.పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు టెంకాయ కొట్టి ఇట్టి నిర్మాణ పనులను ప్రారంభించాలని చెప్పారు. గణపురం మండలం మోడల్ పాఠశాలలో డైనింగ్ హాల్, సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం పోటీ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉపాధ్యాయులను శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి , జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ , మండల ఎంపిడిఓ ఎల్ భాస్కర్ ,ఉపాధ్యాయులు , విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జమ్మికుంట మండల సిపిఐ నూతన కమిటీ ఎన్నిక జమ్మికుంట :నేటిధాత్రి
అంతరాలు లేని సమ సమాజ స్థాపన కోసం పేదల పక్షాన సిపిఐ నిరంతరం పోరాడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల సిపిఐ పదవ మహాసభ జరిగింది. ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి హాజరై మాట్లాడారు.ఈ సభలోలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పంజాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఉద్యమ పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుటకు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సిపిఐ నిరంతరం కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. .సిపిఐ పార్టీ ఆవిర్బవించి వంద సంవత్సరాలు అవుతుందని, మార్కిసిజం లేనినిజం సిద్ధాంతాలతో సమ సమాజ స్థాపనే లక్ష్యంగా దోపిడీ లేని సమాజం కోసం అంతరాలు లేని వ్యవస్థ కోసం దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ సిపిఐ అన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మిక, కర్షకుల సమస్యలతో పాటు దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం పోరాడుతున్న ఏకైక పార్టీ అని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కేవలం కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు సంపన్న వర్గాలకు అనూకూల నిర్ణయాలు చేస్తూ దేశ సంపదను కోళ్లగొడుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో,రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను వే వేగవంతంగా అమలు చేసి పేదలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని,ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్ష్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేర వేర్చాలని, లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని హేచ్చరించారు. అనంతరం జమ్మికుంట మండల సిపిఐ నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా గజ్జి అయిలయ్య, సహాయ కార్యదర్శిగా గరిగే రాములు, శీలం రాజేందర్, 11 మంది సభ్యులతో కార్యవర్గం ఎన్నుకున్నారు. ఈ సభలో ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కళ్యాణ్, మహిళా సమాఖ్య నాయకురాలు, శారద, ఐల రాజేందర్, శ్రీరాములు, సీపీఐ కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శాయంపేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది.
results
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ మాట్లాడుతూ ఇంటర్ ప్రధమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు అన్నారు ముఖ్యంగా ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కుల గాను భానుశ్రీ 450 మార్కు లతో కాలేజ్ టాపర్ గా, బూర వరుణ్ 444 మార్కులు సాధించారు.
results
అదేవిధంగా బైపిసి రెండవ సంవత్సరం ఇంజపూరి కావ్య శ్రీ 1000మార్కులకు గాను 623, కొమ్ముల కీర్తన 585 మార్కులను సాధించారు. సి ఈ సి రెండవ సంవత్సరం మహమ్మద్ యాశ్రిన్ 723, వంగరి ప్రవళిక 706 మార్కులు సాధించారు.
results
ఏడాది ఇంతటి అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు సహకరించిన అధ్యాపకులు వారి తల్లిదండ్రు లకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మన్నారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో మరిన్ని గొప్ప ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం సేకరించాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యాసంగి పంట కొనుగోలు లో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రెండు లారీలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 241 కొనుగోలు కేంద్రాలకు గాను 239 కేంద్రాల ప్రారంభం చేసి 198 కొనుగోలు కేంద్రాల నుంచి 16 వేల 22 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమ అయ్యేలా చూడాలని అన్నారు. మిల్లు అలాట్మెంట్ కాని కోనుగోలు కేంద్రాలకు సమీపంలో గల అపెరల్ పార్క్ లో ఇంటర్మీడియట్ గోదాము నందు ధాన్యం భద్రత కోసం బుక్ చేయాలని అన్నారు. రైస్ మిల్లుల సమస్య కారణంగా ఎక్కడా ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి వీలు లేదని అన్నారు. కోనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించి, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని అన్నారు.ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను అందుబాటులో పెట్టాలని, ధాన్యం రవాణా ఎటువంటి ఇబ్బందులు ఉండవద్దనిపేర్కొన్నారు.ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి, డిఏఓ అఫ్జలి బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, పౌర సరఫరాల శాఖ అధికారులు రజిత, వసంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ పార్టీ పోరాటాలకు స్ఫూర్తి….. ప్రగతికి సాక్షి…బిఆర్ఎస్ . చరిత్రలో నిలిచిపోయే సభ విజయోత్సవ సభ తాజా మాజీ సర్పంచ్ గాలి చంద్రమౌళి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండలం అంకుషాపురం గ్రామంలో గురువారం మాజీ సర్పంచ్ గాలి చంద్రమౌళి అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఎలుకతుర్తి ఎక్స్ రోడ్డులో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రచతోత్సవ సభకు గ్రామంలో అధిక సంఖ్యలో హాజరై సభ విజయవంతం అయ్యేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని రానున్న రోజుల్లో బి. ఆర్. ఎస్. అధినేత కేసీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతున్నారని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రజల మద్దతుతో ముందుకు సాగేందుకు రెట్టింపు ఉత్సాహంతో సిద్ధమవుతుందని ఈ సభ కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదని ఇది ఒక విశాల సంకల్పానికి సంకేతమని ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ భవిష్యత్ దిశగా ప్రజలను నడిపించే ప్రయత్నం ఉద్యమం కాలం నుంచి సాధన వరకు మార్గ నిర్దేశ కుడిగా నిలిచిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పుడు భవిష్యత్తు తలుపులు తట్టేందుకు సిద్ధం అవుతున్నాడని తెలిపారు
రైతుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలో మంగళవారం భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ భూవ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, భూవివాదాలను తగ్గించడం, రైతులకు భద్రత కల్పించడం ఈకొత్త చట్టం ప్రధాన లక్ష్యమన్నారు. భూభారతి యాప్ ఉపయోగం, భూమి హక్కులపై పూర్తి సమాచారం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ధరణి వ్యవస్థలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని, రైతులకు న్యాయం జరగలేదని, రైతులు తమ హక్కులను కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురయ్యారని, దీనివల్ల ఆత్మహత్యలు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో సాక్షాత్తు ఓతహసిల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన కూడా జరిగిందన్నారు. కొత్త భూభారతి చట్టం రైతులకు అండగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, బోనస్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ వంటి పునరుద్ధరణ చర్యలు తీసుకువస్తోందని, రాష్ట్రంలో ఎనభై నుండి తోంభై శాతం రైతులు లబ్ధి పొందేందుకు ఇరవై ఒకవేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. సాంకేతిక సమస్యల వల్ల కొందరికి రుణమాఫీ ఆలస్యం అవుతోందని, త్వరలో రెండు లక్షల లోపు రుణాలన్నీ మాఫీ కానున్నాయని పేర్కొన్నారు. కొత్త చట్టం అమలైనందున రైతుల ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో అనేక సంక్షేమ పథకాలు రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుందని తెలిపారు. ఈసదస్సులో అధికారులు, గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని చట్టంపై సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఈ అవగాహన సదస్సులో మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్ కిరణ్, తహశీల్దార్ వెంకటలక్ష్మి, గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మెరవేని తిరుమల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్, ఎంపీడీవో రాజేశ్వరి, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలంలోని మైలారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహి స్తున్నారు. మంగళవారం హెడ్మాస్టర్ నాగ సుభాషిని ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగారు. బడి ఈడు పిల్లల తల్లిదండ్రులను కలిసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందు తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ర్థులకు ఉచితంగా దుస్తులు, నోట్ పుస్తకాలతో పాటు మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు లు సంధ్యారాణి, రమేష్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
మాజి సీఎం కె.సి.ఆర్ పిలుపుతో ప్రజల నుండి అనూహ్య స్పందన
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి మండలం కాశీం నగర్ గ్రామరజతోత్సవ సన్నాహక సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఒక ప్రకటన లో విలేకరుల కు తెలిపారు ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు సమాయత్తం చేయడం కొరకు పర్యటన చేస్తున్నానాని శ్రీదర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజతోత్సవ సభకు ప్రజలు నాయకులు కార్యకర్తలు వస్తున్నారని భారత రాజకీయ చరిత్రలో ఈ సభ చారిత్రాత్మక అవుతుంది అన్నారు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి డబ్బుల సంచులు డిల్లీకి తరలించడం పనిగా పెట్టుకున్నారు అని శ్రీదర్ ఆవేదన వ్యక్తంచేశారు ప్రజాసంక్షేమం గాలికి వదిలేసి ప్రజలను గోసా పడుతున్నారని స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీధర్ అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో వనపర్తి నియోజకవర్గ ప్రజలు భా రీ ఎత్తున పాల్గొని తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కు అండగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో పెద్దగూడెం మాణిక్యం రాము వెంకటయ్య నీలేష్ బీసం వెంకటయ్య నరసింహా లక్ష్మణ్ గౌడ్ రామన్ గౌడ్ బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రజలు పోల్గొన్నారని వాకిటి శ్రీదర్ తెలిపారు
అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ… – తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి.. – రామాయంపేట ఏప్రిల్ 22
నేటిధాత్రి (మెదక్)
మీడియా భవిష్యత్ కు ప్రశ్నార్థకంగా సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, దీనిపై త్వరలో హైదరాబాదులో జాతీయస్థాయి వర్క్ షాప్ ను నిర్వహిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలో రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ అధ్యక్షతన జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ మూలంగా భవిష్యత్తులో మీడియా రంగంలో మ్యాన్ పవర్ లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కల్పితాలతో ఏఐ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం పొంచి ఉందని, దీనిపై జర్నలిస్టులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సోషల్ మీడియా విప్లవం భావ ప్రకటన స్వేచ్ఛకు మంచి వేదిక అయినప్పటికీ దానిని అడ్డుపెట్టుకొని కొన్ని శక్తులు అలజడి సృష్టించడం సహించరానిది అన్నారు. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించిందే కానీ ఇతరుల స్వేచ్ఛను హరించే హక్కు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం రూపొందించిన అక్రిడిటేషన్ జీవో అప్రజాస్వామికంగా ఉందని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ జీవను రద్దు చేస్తూ గదా అక్టోబర్ మాసంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో కొత్త మార్గదర్శకాలు రూపొందించేందుకు కమిటీ వేశామని , అంతేకాకుండా ఆ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందన్నారు. త్వరలో దీనికి సంబంధించిన జీవో విడుదల కాను ఉందని ఆయన స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని, ఈ విషయమై ఎవరు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు అవుతాయని ఆయన తెలిపారు. అక్రిడిటేషన్ కమిటీలను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం ఉద్యమాలతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఐజేయు స్టీరింగ్ కమిటీ మెంబర్ దేవులపల్లి అమర్ అన్నారు. ప్రభుత్వాలు ఏవైనా జర్నలిస్టుల పక్షపాతిగా, జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 65 ఏళ్లుగా పోరాడుతున్న చరిత్ర తమ సంఘానికే ఉందని అన్నారు. సంఘ నాయకులకు ప్రభుత్వ పదవులు వచ్చినంత మాత్రాన, సంఘ ప్రయోజనాల కోసం కాదని ఆ పదవుల బాధ్యతలు వేరుగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే ఐజేయు ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి అనుకూలం కాదు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి అనుకూలం కాదని, జర్నలిస్టుల సంక్షేమమే ఏకైక లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ స్పష్టం చేశారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఇండ్లు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు, ఉచిత విద్య తదితర సమస్యలపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తమ సంఘం వినతి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికవర్ ఆసుపత్రుల్లో ఉండే ఆర్థోపెడిక్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు హెల్త్ కార్డులపై చికిత్స చేసేందుకు ఆసుపత్రి యాజమాన్యం నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. గత కార్యవర్గ సమావేశం అనంతరం చేపట్టిన కార్యకలాపాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామనారాయణ నివేదిక సమర్పించారు. ఈ సమావేశంలో ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కే రాములు, ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ గౌడ్, గాడిపల్లి మధు గౌడ్, పైసల్ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శులు గుండ్రాతి మధుగౌడ్, వరకాల యాదగిరి, కే శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి మోతే వెంకటరెడ్డి తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూతురు రాజిరెడ్డి, డి.జి.శ్రీనివాస శర్మ రవీందర్, సురేందర్ తో పాటు ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన నాగర్ కర్నూల్ జిల్లా శాఖను రాష్ట్ర కార్యవర్గం అభినందించింది.
తీర్మానాలు —————— జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మంత్రులందరికీ యుద్ధ ప్రాతిపదికన వినతి పత్రాలు అందించాలని సమావేశం తీర్మానించింది. సంఘ సంస్థాగత కార్యకలాపాలను మరింత పటిష్టం చేయడానికి రాష్ట్ర బాధ్యులను జిల్లా ఇన్చార్జిలుగా నియమించాలని కార్యవర్గం నిర్ణయించింది. టీయూడబ్ల్యూజే (ఐజేయు)కు అనుబంధంగా ఉన్న ప్రెస్ క్లబ్ ల కార్యకలాపాలను పరిశీలించేందుకు గాను ఆరుగురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని కార్యవర్గం నిర్ణయించింది. ఆర్టీసీ బస్సుల్లో జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది.
రెవెన్యూ అధికారులు “బోర్డు”లు పాతిన ఫలితం శూన్యం..?
ఐ….య్యామ్ డోంట్ కేర్ అంటున్న కబ్జాదారుడు
అన్ని సక్రమమే అయితే, అధికారులు ప్రభుత్వ భూమి అని బోర్డు ఎందుకు పాతిండ్లు?
“ఐలయ్య”… ఇదేందయ్యా “బోర్డు” అంటున్న ప్రజలు?
దేశాయిపేట శివారు, జర్నలిస్ట్ కాలనీ డబల్ బెడ్ రూమ్ ల పక్కన గల సర్వే నంబర్ 81లో గల ప్రభుత్వ భూమిని, “ఓ అయ్య” కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి..
తప్పుడు భూరికార్డులతో యథేచ్ఛగా దేవాదాయ శాఖ భూమి “అక్రమ రిజిస్ట్రేషన్”.
“అయ్య”కు అండగా దేవాదాయ శాఖ భూములను రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి ఓ “సబ్ రిజిస్ట్రార్”?
“ఆక్రమించిన” ప్రభుత్వ భూమిలో, “అక్రమంగా అమ్మకాలు” జరిపిన ఘనుడు.?
కబ్జా చేసిన ప్రభుత్వ భూముల్లో, కొనుగోలు చేసి “అక్రమ నిర్మాణం చేపట్టిన ఓ వైద్యురాలు?”
“మున్సిపల్ పర్మిషన్” లేకుండానే నిర్మాణం చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం..
దేవాదాయ భూముల్లో “బొక్క” లు ఏరుకుంటున్న ఓ మధ్యవర్తి?
అక్రమంగా వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు
ఈ తతంగం వెనక లక్షల రూపాయలు చేతులు మారినట్లు వినికిడి..?
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
పేదోళ్లు గూడు కోసం, అసైన్డ్ భూముల్లో గుడిసెలు వేస్తే అధికారులు నానా హంగామా చేసి వాటిని తొలగించి కేసులు పెట్టి జైలుకు పంపుతారు. అలాంటిది రూ.5 కోట్లకు పైగా విలువ చేసే రెండు ఎకరాల దేవాదాయ శాఖ ప్రభుత్వ భూమిని ఒకరు కబ్జా చేసి, అమ్మకాలు జరిపి, యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు మొదలు పెట్టడం చూస్తే, మున్సిపల్ శాఖ అధికారులు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు అని ఆరోపణ.
Government
వివరాల్లోకి వెళితే దేశాయిపేట శివారు, లక్ష్మి మెగా టౌన్షిప్ ఆనుకొని, నూతనంగా ఏర్పాటు అయిన జర్నలిస్ట్ కాలనీ డబల్ బెడ్ రూమ్ ల పక్కన గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 81లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తి కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ముందు వైపు ఒక వ్యక్తి మాత్రమే లోపలికి వెళ్ళేంతా ఎంట్రెన్స్ పెట్టిన తీరు చూస్తే ఆశ్చర్యానికి గురిగాక తప్పదు.
Government
కబ్జా విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ స్థలం ప్రభుత్వ భూమి అని గుర్తించి, అందులో బోర్డు పాతి, ఆక్రమించిన వారిపై క్రిమినల్ చర్యలకు పిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే విషయంపై అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులు బోర్డు పాతిన స్థలం ఎక్కడ అని అక్కడే ఉన్న ఓ వ్యక్తిని అడిగితే ఇందులో కాదు, వేరే దగ్గర అంటూ చెప్పిన తీరు, తీరా కనుక్కుంటే ఆ వ్యక్తి సైతం “అయ్య”కు అనుచరుడు అని తెలిసింది.
Government
కబ్జా విషయం బయటకు రాకుండా, జాగ్రత్త పడుతున్న కబ్జాదారుడు అతని అనుచరులు.. బోర్డును పాతిన ప్రభుత్వ భూమిని, ఓ “పెద్దయ్య” 2017లో తప్పుడు పత్రాలతో అప్పటి ఓ “సబ్ రిజిస్ట్రార్” అండతో సర్వే నంబర్ 81లో గల రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం, అందులో కొంత అమ్మకాలు జరిపి యదేచ్చగా నిర్మాణాలు సైతం చేపట్టడం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది అని రెవెన్యూ అధికారులకు సమాచారం రాగానే, విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ఆ భూమి ప్రభుత్వ భూమి అని బోర్డు పాతి, ఆక్రమించిన వారికి చర్యలు తప్పవు అని బోర్డు పాతి వెళ్ళారు.
Government
అయినా కానీ అందులో నిర్మాణం ఆపకుండానే పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా మున్సిపల్ పర్మిషన్ లేకుండా నిర్మాణం చేపడుతుంటే మున్సిపల్ అధికారులు చోద్యం చూడటం వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన ఘనుడు ఎవరు? ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయడంలో ఆ అధికారి దిట్ట అనే చెప్పొచ్చు. అప్పట్లో పహాని కాపీలతో సైతం రిజిస్ట్రేషన్ చేసి, చేసి, ఆ సబ్ రిజిస్ట్రార్ పేరు మారుమోగింది. అయితే ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వ్యక్తి, ఓ రాజకీయ నాయకుడు పేరు చెప్పడం, సదరు నాయకుడికి సైతం ఈ విషయం తెలువకపోవడం గమనార్హం. ఇదేంది “అయ్య” అని అన్నట్లు సమాచారం. రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.. “అయ్య”గారీ ఆక్రమణలు అనేకం ఉన్నట్లు తెలుస్తోంది?. సదరు అయ్య కబ్జాలపై ప్రత్యేక విచారణ చేయాల్సిందిగా టాస్క్ఫోర్స్ పోలీసులకు నగర ప్రజల విజ్ఞప్తి.
Government
తప్పుడు రికార్డులతో కబ్జా?
మునిసిపాలిటీలు, మండల కేంద్రాల పరిధిలో ఉన్న భూముల ధరల రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం వీటి విలువ వందల కోట్ల రూపాయాల్లో ఉంటుంది. పట్టణాలు, గ్రామాల విస్తరణతో ఈ భూములపై అక్రమార్కులు కన్నేస్తున్నారు. కొన్ని భూముల్లో ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. మరికొన్ని చోట్ల దాతల పేరుతో ఉండడంతో వారు అమ్మినట్లు భూముల రికార్డులను సృష్టించి ఆ భూములను దొడ్దిదారిని ఆక్రమించుకుంటున్నారు. భూములు ధరలు గణనీయంగా పెరగడంతో కొన్ని చోట్ల దానంగా ఇచ్చిన భూముల అసలు వారసులు రంగ ప్రవేశం చేసి ఆవి మావేనని కోర్టుల్లో కేసులు వేశారు. అవి ప్రస్తుతం దేవాదాయ శాఖ ట్రిబ్యునల్, కోర్టుల్లో ఆ కేసులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి.
ఇదేందయ్యా “మసి”…?
రెండు ఎకరాలు దర్జాగా కబ్జా.. దేవాదాయ శాఖ భూములపై “మసి” మరక?
కాసులు ఇస్తే కాదేది రిజిస్ట్రేషన్.. పహాని కాపీలతో సైతం రిజిస్ట్రేషన్ చేసిన ఘనుడు ఆ “సబ్ రిజిస్టర్”..
ఒక్కో ఫ్లాట్ “ఇద్దరికీ” సైతం రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర కలిగిన “సబ్ రిజిస్ట్రార్”..?
ఏదైనా భూమి కానీయి, రిజిస్ట్రేషన్ చేయడం ఆయనకు “వెన్నతో పెట్టిన విద్య” ఆ సబ్ రిజిస్టర్ కే సొంతం..?
ఎవరా “సబ్ రిజిస్ట్రార్”? ఎవరా “అయ్యా”?
పూర్తి వివరాలు “నేటిధాత్రి ప్రత్యేక కథనం” త్వరలో..
గోపాల్ పెట్ లో భూ బారతి అవగాహన కార్యక్రమంలోలో ఎమ్మెల్యే తూడి వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో భూ భారతి చట్టం పై ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నరని వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డీ నేటర్ వెంకటేష్ ఒక ప్రకటన లోతెలిపారు
గోపాల్ పెట్ లో భూ బారతి అవగాహన కార్యక్రమంలోలో ఎమ్మెల్యే తూడి వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో భూ భారతి చట్టం పై ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నరని వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డీ నేటర్ వెంకటేష్ ఒక ప్రకటన లోతెలిపారు
రోడ్డు వెడల్పు విషయంలో అంబేద్కర్ విగ్రహాలు తొలగించడం సమంజసం కాదు
నిజాంపేట: నేటి ధాత్రి
మెదక్, సిద్దిపేట నేషనల్ హైరోడ్డు వెడల్పు విషయంలో అంబేద్కర్ విగ్రహాలు తొలగించడం సమంజసం కాదు
నిజాంపేట: నేటి ధాత్రి
మెదక్, సిద్దిపేట నేషనల్ హైవే రోడ్డు పనుల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహాలను తొలగించడం విషయమై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తొలగించిన విగ్రహాలను యధావిధిగా ప్రతిష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఏంఆర్పిఎస్టిఎస్ అధ్యక్షులు గరువుల శ్రీనివాస్, నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు సల్లూరి శ్రీనివాస్, ఆందోల్ దళిత నాయకుడు మాసన్నపల్లి నాగరాజు ,పిఎస్ టీఎస్ నిజాంపేట మండల అధ్యక్షుడు జనగామ స్వామి మెదక్ కాంగ్రెస్ యువ నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు వే రోడ్డు పనుల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహాలను తొలగించడం విషయమై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తొలగించిన విగ్రహాలను యధావిధిగా ప్రతిష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఏంఆర్పిఎస్టిఎస్ అధ్యక్షులు గరువుల శ్రీనివాస్, నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు సల్లూరి శ్రీనివాస్, ఆందోల్ దళిత నాయకుడు మాసన్నపల్లి నాగరాజు ,పిఎస్ టీఎస్ నిజాంపేట మండల అధ్యక్షుడు జనగామ స్వామి మెదక్ కాంగ్రెస్ యువ నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు
భూక్య తిరుపతి నాయక్ ను పరామర్శించిన బోయినపల్లి వినోద్ కుమార్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్ ఇటీవలే ప్రమాదవశాత్తు కాలికి గాయపడిన విషయం తెలుసుకొని శాంతినగర్ లోని వారి స్వగృహంలో కలిసి పరామర్శించిన మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్, మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బోయినిపల్లి వినోద్ కుమార్. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జక్కుల నాగరాజు, చాంద్ పాషా, గుర్రాల జయప్రకాశ్ రెడ్డి, రేణిగుంట రాజు, రవి నాయక్, తిరుపతి నాయక్, సలీం, సంపత్, వాజిత్ శశి, తదితరులున్నారు.
వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇచ్చి ఆదుకుందన్నారు, అలాగే సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ఏ అన్నారు, ధరణి వల్ల రైతులు తమ భూములకు హక్కుదారులుగా కోల్పోయినరని రైతులు ఆవేదన చెందారు, భూ యాజమాన్య హక్కులను కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతిని తీసుకొచ్చిందన్నారు రానున్న కాలంలో రైతులకు అనేక సంక్షేమ ఫలాలు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీ చిలకల రాయ కొమురు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మాజీ ఎంపిటిసి దబ్బేట అనిల్, కాంగ్రెస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులతో నాకున్న వ్యక్తిగత అనుబంధంతో సందర్శించాను
ఈ దీక్షను రాజకీయం చేయదలుచు కోలేదు.
జర్నలిస్టుల కోసమే ఈ డబుల్ బెడ్రూమ్స్ నిర్మాణం జరిగింది
ఇండ్లులేని పేద జర్నలిస్టులకు న్యాయం జరగాలి ….మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
వరంగల్ తూర్పు,నేటిధాత్రి
వరంగల్ తూర్పు నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న దీక్షను మంగళవారం మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన జర్నలిస్టులతో తొమ్మిది రోజులుగా జరిగిన దీక్షల సమీకరణలను అడిగి తెలుసుకున్నారు.
journalists’ initiation camp
అనంతరం అయన మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులతో వ్యక్తిగత సంబంధం ఉంది. ఆ అభిమానంతోనే జర్నలిస్టుల శిభిరాన్ని వ్యక్తిగతంగ సందర్శించినట్లు తెలిపారు. దీక్షలు, నిరసనలు శాంతియుతంగా చేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. జర్నలిస్టుల న్యాయం కోసం తన వంతు సహాయ సహకారాలు చేస్తానని ఈ సందర్బంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఎక్సైజ్ & టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, దేవరకద్ర మంగళవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ధరణి వంటి చట్టాలు వారికి చుట్టాలు అయ్యాయి కానీ..
Dharani Act
జనానికి మాత్రం ధరణి దరిద్రంగా మారిందని, ధరణితో అధికారులకి.. అధికారాలు లేకుండా పోయాయన్నారు. ధరణి వల్ల ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలకు భూభారతి చట్టం ద్వారా మోక్షం లభిస్తుందని, కొత్త చట్టంలో సమస్యలపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతిని తీసుకొచ్చారన్నారు. భూ భారతి చట్టం ప్రకారం.. భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని, సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా గతంలో మాదిరిగా రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు తహసీల్దార్ రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్కు అధికారాలు కల్పించామని తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు. ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా ప్రస్తుత చట్టంలో సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం అధికారం కోసం తహతహలాడుతోందన్నారు. ధరణిని తెచ్చి వాళ్లు మాత్రం లబ్దిపొంది.. ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని కేసీఆర్ కుటుంబం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.