ఉద్యమ పార్టీ పోరాటాలకు స్ఫూర్తి.

ఉద్యమ పార్టీ పోరాటాలకు స్ఫూర్తి….. ప్రగతికి సాక్షి…బిఆర్ఎస్ .
చరిత్రలో నిలిచిపోయే సభ విజయోత్సవ సభ
తాజా మాజీ సర్పంచ్ గాలి చంద్రమౌళి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్లపల్లి మండలం అంకుషాపురం గ్రామంలో గురువారం మాజీ సర్పంచ్ గాలి చంద్రమౌళి అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఎలుకతుర్తి ఎక్స్ రోడ్డులో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రచతోత్సవ సభకు గ్రామంలో అధిక సంఖ్యలో హాజరై సభ విజయవంతం అయ్యేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని రానున్న రోజుల్లో బి. ఆర్. ఎస్. అధినేత కేసీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతున్నారని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రజల మద్దతుతో ముందుకు సాగేందుకు రెట్టింపు ఉత్సాహంతో సిద్ధమవుతుందని ఈ సభ కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదని ఇది ఒక విశాల సంకల్పానికి సంకేతమని ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ భవిష్యత్ దిశగా ప్రజలను నడిపించే ప్రయత్నం ఉద్యమం కాలం నుంచి సాధన వరకు మార్గ నిర్దేశ కుడిగా నిలిచిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పుడు భవిష్యత్తు తలుపులు తట్టేందుకు సిద్ధం అవుతున్నాడని తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version